Margadarsi: మార్గదర్శి ఆస్తుల జప్తు చెల్లదు
మార్గదర్శి చిట్ఫండ్ ఆస్తులను జప్తు చేయడం ద్వారా సంస్థ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్న రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ యత్నాలకు సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి వైపు న్యాయం ఉందని మరోసారి రుజువైంది.
రూ. 1,050 కోట్ల ఆస్తుల జప్తు ఖరారుకు తిరస్కరణ
సొమ్ము చెల్లించడంలో సంస్థ విఫలమైందని సీఐడీ రుజువు చేయలేకపోయింది
జప్తు నిమిత్తం ప్రభుత్వం జారీచేసిన జీవోలు చెల్లుబాటుకావు
సీఐడీ పిటిషన్లను కొట్టివేస్తూ గుంటూరు పీడీజే కోర్టు కీలక తీర్పు
మార్గదర్శి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్న ప్రభుత్వ కుట్రకు బ్రేక్
ఈనాడు, అమరావతి, గుంటూరులీగల్, న్యూస్టుడే: మార్గదర్శి చిట్ఫండ్ ఆస్తులను జప్తు చేయడం ద్వారా సంస్థ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్న రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ యత్నాలకు సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి వైపు న్యాయం ఉందని మరోసారి రుజువైంది. మార్గదర్శికి చెందిన రూ. 1,050 కోట్ల చరాస్తుల మధ్యంతర జప్తును (ఎటాచ్మెంట్) ఖరారు చేయాలన్న సీఐడీ విన్నపాన్ని గుంటూరు పీడీజే (జిల్లా ప్రధాన న్యాయమూర్తి) కోర్టు తోసిపుచ్చింది. సీఐడీ అదనపు డీజీ (కాంపిటెంట్ అథార్టీ) దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. చందాదారులకు, ప్రైజ్డ్ సబ్స్క్రైబర్లకు సొమ్ము చెల్లించడంలో మార్గదర్శి విఫలమైనట్లుగా సీఐడీ రుజువు చేయలేకపోయిందని తేల్చిచెప్పింది. రూ 1,050 కోట్ల సొమ్ము జప్తు నిమిత్తం రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది మే 29న జారీచేసిన జీవో 104, జూన్ 15న జారీచేసిన జీవో 116, జులై 27న జారీచేసిన జీవో 134 చెల్లవంటూ తేల్చి చెప్పింది.
జప్తును ఖరారు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన మూడు వేర్వేరు పిటిషన్లను కొట్టివేస్తూ గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్బీజీ పార్థసారథి సోమవారం కీలక తీర్పు వెలువరించారు. మార్గదర్శి చిట్ ఫండ్ కీర్తిప్రతిష్ఠలు, చందాదారుల్లో సంస్థ విశ్వసనీయతను దెబ్బతీయాలనే లక్ష్యంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ శతవిధాలా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మార్గదర్శికి చెందిన రూ. 1,050 (793+242+15) కోట్ల విలువచేసే చరాస్తుల మధ్యంతర జప్తు (యాడ్ ఇంటీరియం) చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు తేదీల్లో మూడు జీవోలు జారీచేసింది. జీవోల ద్వారా చేసిన మధ్యంతర జప్తును ఖరారు చేయాలని కోరుతూ సీఐడీ అదనపు డీజీ కాంపిటెంట్ అథారిటీ హోదాలో గుంటూరు పీడీజే కోర్టులో పిటిషన్లు/దరఖాస్తులు దాఖలు చేశారు. వాటిపై న్యాయస్థానం సుదీర్ఘ విచారణ చేపట్టింది.
ఎవరికి సొమ్ము చెల్లించాలో సీఐడీ చెప్పలేకపోతోంది: మార్గదర్శి
మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది పి రాజారావు వాదనలు వినిపించారు. సంస్థ ఆస్తులను జప్తు చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. సొమ్ము చెల్లించలేదని ఏ ఒక్క చందాదారూ ఫిర్యాదు చేయలేదన్నారు. చందాదారుల రక్షణ అనే ముసుగులో మార్గదర్శి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం, సీఐడీ తెరలేపిందన్నారు. చిట్ఫండ్ నిబంధనలకు లోబడి మార్గదర్శి వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. చిట్స్ నిర్వహణలో ఏమైనా లోటుపాట్లుంటే చిట్ఫండ్ చట్ట నిబంధనల మేరకు వ్యవహరించాలన్నారు. అందుకు భిన్నంగా ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని (ఏపీ డిపాజిటర్ల చట్టం-1999) వినియోగించి ఆస్తులను జప్తు చేయాలని సీఐడీ అభ్యర్థిస్తోందన్నారు.
సంస్థ సొమ్ము చెల్లించడంలో విఫలమైందనే ఆరోపణ లేనప్పటికీ ఆస్తులను జప్తు చేస్తే అంతిమంగా నష్టపోయేది చందాదారులేనని వివరించారు. నాలుగు రాష్ట్రాల్లో మార్గదర్శి వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోందన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలోనే ఆరోపణలు చేయడం వెనుక దురుద్దేశం ఉందని పేర్కొన్నారు. మార్గదర్శి తమకు సొమ్ము చెల్లించలేదన్న చందాదారులు ఎంతమంది, వారి పేర్లేంటి, వారికి చెల్లించాల్సిన సొమ్ము ఎంత తదితర వివరాలను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించినప్పటికీ ఆ సమాచారాన్ని సీఐడీ.. కోర్టు ముందు ఉంచలేదన్నారు. చందాదారులకు సొమ్ము చెల్లించడంలో మార్గదర్శి విఫలమైందని నిరూపించే సాక్ష్యాధారాలను సీఐడీ.. కోర్టు ముందు ఉంచలేకపోయిందన్నారు. సరైన కారణాలు లేకుండా ప్రతీకారంతో జప్తు ఉత్తర్వులు జారీచేయడానికి వీల్లేదని తెలిపారు.
జప్తుపై ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలు ఉండవన్నారు. ఆస్తుల జప్తును ఖరారు చేయాలంటూ సీఐడీ చేసిన విన్నపాన్ని తోసిపుచ్చాలని కోరారు. సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ చందాదారుల ప్రయోజనాల రక్షణకే ఈ జప్తు చేశామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి చందాదారులకు సొమ్ము చెల్లించడంలో మార్గదర్శి విఫలమైందంటూ సీఐడీ నిరూపించలేకపోయిందని పేర్కొన్నారు. ఈ కారణంగా మార్గదర్శి చరాస్తుల మధ్యంతర జప్తునకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 104, 1116, 134 చెల్లవని తేల్చి చెప్పారు. చరాస్తుల మధ్యంతర జప్తును ఖరారు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్