Dharmana: మీకు ఇవ్వడానికే డబ్బు సరిపోవట్లేదు..రహదారి పనులు ఇప్పట్లో పూర్తిచేయలేం

శ్రీకాకుళం-ఆమదాలవలస రహదారి పనులు ఇప్పట్లో పూర్తి చేయలేమని, అంతవరకు కష్టాన్ని భరించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజలకు సూచించారు.

Updated : 06 Jan 2024 07:19 IST

మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం (కలెక్టరేట్), న్యూస్‌టుడే: శ్రీకాకుళం-ఆమదాలవలస రహదారి పనులు ఇప్పట్లో పూర్తి చేయలేమని, అంతవరకు కష్టాన్ని భరించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజలకు సూచించారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు గ్రామంలో నిర్మించిన రెండు నూతన సచివాలయ భవనాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మీరు రోడ్డెక్కగానే నన్ను తిడతారు. శ్రీకాకుళం-ఆమదాలవలస రహదారి నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేశాం. గుత్తేదారు కొంత పనిచేసి చెల్లింపులు చేయాలని అడుగుతున్నారు. ఇప్పుడు మీకు ఇవ్వడానికే డబ్బు సరిపోవడం లేదు. మీరు ఓటు వేసినా, వేయకపోయినా ఆ నిర్మాణం పూర్తవుతుంది. అది ఎన్నికల ముందో.. తరువాతో గానీ మొత్తమ్మీద పని జరుగుతుంది. ఈలోగా చిన్నచిన్న మరమ్మతులు చేయిద్దాం. నియోజకవర్గంలో చాలా పనులు చేశాం. ఈ రోడ్డు వేయలేమా.. కాకపోతే పూర్తికావడానికి కొంత సమయం పడుతుంది’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని