జగన్.. ఇదేనా మీ ప్రా‘ధాన్యం’!
కత్తులు దూసే ప్రకృతి విపత్తులను ఎలాగోలా ఎదుర్కొంటున్న రైతన్న.. నమ్మిస్తూ నట్టేట ముంచుతున్న జగన్ దొంగదెబ్బలకు మాత్రం కకావికలమవుతున్నాడు.
ఏటికేడు సేకరణ తగ్గించుకుంటున్న జగన్ సర్కారు
ఆర్బీకేల పేరుతో చేసేది హడావుడే
దక్కని మద్దతు ధర.. తేమ పేరుతో కొర్రీలు
కత్తులు దూసే ప్రకృతి విపత్తులను ఎలాగోలా ఎదుర్కొంటున్న రైతన్న.. నమ్మిస్తూ నట్టేట ముంచుతున్న జగన్ దొంగదెబ్బలకు మాత్రం కకావికలమవుతున్నాడు. మద్దతు ధర దక్కక.. పెట్టుబడీ పొందక.. బక్క రైతు బిక్కచచ్చిపోతున్నాడు.. చెమటోడ్చి పండించిన పంటను.. రైతు భరోసా కేంద్రాల్లో అమ్మలేక... అక్కడ వేసే కొర్రీలతో వేగలేక... దళారుల దాష్టీకానికి బలవుతున్నాడు... ఆంధ్రప్రదేశ్ను.. అన్నపూర్ణగా.. దక్షిణ భారత ధాన్యాగారంగా నిలిపిన అన్నదాతల పరిస్థితి జగన్ పాలనలో తలకిందులైంది!
ధాన్యం రైతులతో.. వైకాపా ప్రభుత్వం చెలగాటమాడుతోంది. కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర దక్కడం లేదు. కొనుగోలుకూ.. రకరకాల కొర్రీలు పెడుతోంది. ఎకరాకు రూ.40వేలకు పైగా పెట్టుబడి పెట్టే రైతులకు.. నష్టాలే మిగులుతున్నాయి. నాణ్యమైన ధాన్యం అయినా క్వింటాల్కు రూ.100 కోత తప్పడం లేదు. తడిస్తే మరిన్ని వెతలే. మొత్తంగా ఎకరాకు సగటున రూ.10వేలకు పైనే నష్టపోతున్నారు. గత కొన్నేళ్లుగా పరిశీలిస్తే.. సేకరణ మావల్ల కాదంటూ, జగన్ సర్కారు ధాన్యం సేకరణను క్రమంగా తగ్గించుకుంటోంది. అదీ లక్షల టన్నుల్లో! 2019-20లో 83 లక్షల టన్నులు సేకరిస్తే.. 2022-23 నాటికి 49లక్షల టన్నులకే పరిమితం చేసింది. రైతు భరోసా కేంద్రా(ఆర్బీకే)ల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని, మిల్లర్ల పాత్ర లేకుండా చేశామని గొప్పలు చెప్పే సర్కారు.. అక్కడికి వచ్చే రైతుల్ని పెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ-క్రాప్, ఈ కేవైసీ మొదలు.. పంట నమోదు, తేమ శాతం, ట్రక్షీట్ జారీ వరకూ రకరకాలుగా వేధిస్తోంది. ఇంత చేసినా మిల్లరు అంగీకరిస్తేనే ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి.
వరి రైతుకు.. ఉరి వేస్తున్న సర్కారు
వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరి రైతుల్ని కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఏడాదికి రెండుమూడు సార్లు మునక (నారు మళ్ల దశ నుంచి నాట్లు పూర్తయిన నెల వరకు) తప్పడం లేదు. ఆపైన పంట చేతికొచ్చే సమయానికి తుపాన్లు విరుచుకుపడుతున్నాయి. తడిసిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొన్నిచోట్ల గింజ కూడా చేతికి రాని పరిస్థితులున్నాయి. 2023 మిగ్జాం తీవ్ర తుపాను ధాటికి కోతకు కొచ్చిన పంట నేల వాలడంతో.. కొన్ని జిల్లాల్లో రైతులు దమ్ము తొక్కించాల్సి వచ్చింది. గతేడాది అంబేడ్కర్ కోనసీమ, ఉమ్మడి పశ్చిమ గోదావరి, గుంటూరు, కడప జిల్లాల్లోనూ కొన్నిచోట్ల పంట విరామం ప్రకటించాల్సిన దుస్థితి. ఏటా ముంపు బారిన పడుతుండటంతో ఖరీఫ్ పంట సాగు చేయలేదు. అయినా జగన్ ప్రభుత్వం మొద్దునిద్రలో జోగుతోంది.
సొమ్ము జమ చేయడానికీ.. సతాయింపులే
కూలీలకు చెల్లింపులతోపాటు, అప్పు తీర్చుకోవాలని రైతులు పంట అమ్ముతారు. అయితే వైకాపా ప్రభుత్వం మాత్రం ధాన్యం అమ్మిన.. 21 రోజులకు డబ్బు ఇస్తామంటోంది. గతంలో ధాన్యం సేకరించిన 24 గంటల్లో చెల్లింపుల విధానం ఉండేది. కొన్ని దఫాలు ఆలస్యమైనా.. అధికశాతం రైతులకు నిర్ణీత గడువులోగా డబ్బు జమ అయ్యేది. నాలుగున్నరేళ్లుగా.. ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఈ రోజు ధాన్యం కొంటే.. ట్రక్షీట్ తయారు చేసే సరికి 10-15 రోజులపైనే అవుతోంది. అంటే అమ్మిన తర్వాత 15 రోజులకు లెక్కలో రాస్తారు. అప్పటినుంచి 21 రోజులు లెక్క వేస్తారు. అధిక సందర్భాల్లో ఆ గడవూ దాటి రెండు, మూడు నెలలు అవుతోంది.
ధాన్యం సేకరణకూ ‘ఏకీకృతం’?
జగన్ అధికారం చేపట్టాక.. ఏకీకృత విధానం అమలు చేస్తున్నారు. ఇసుక అమ్మకాలను ఒకే సంస్థకు కట్టబెట్టి.. భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. మద్యం సరఫరా విధానం కూడా ఏకీకృతం చేసి.. సొంత బ్రాండ్ల మద్యం అమ్మకాలతోపాటు.. అంతా నగదు రూపంలోనే వసూలు చేస్తున్నారు. 2022 రబీలోనే.. ధాన్యం సేకరణ బాధ్యతల్ని జిల్లాకు ఒక మిల్లరుకు అప్పగించాలని ప్రభుత్వం ఆలోచించింది. దీనికి అనుగుణంగా టెండర్లు కూడా పిలిచింది. అంటే జిల్లాలో ధాన్యం సేకరణను గుత్తాధిపత్యం చేస్తూ.. ఎంపిక చేసిన మిల్లరుకు అప్పగిస్తారు. ఇప్పటికే మద్దతు ధర అందక పోవడం, తడిసిన ధాన్యం కొనుగోలుకు ఎదురు సొమ్ములు, కిలోల లెక్కన కోత, రుసుములు అందకపోవడం తదితర సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏకీకృత విధానం అమల్లోకి వస్తే.. మిల్లరు చెప్పినట్లు తలూపాల్సిందే.
ఏటికేడు కుదించడమే.. వైకాపా సర్కారు ఘనత
ధాన్యం సేకరణను కూడా ప్రభుత్వం భారంగా భావిస్తోంది. ఏటికేడు కొనుగోలు చేసే ధాన్యం పరిమాణం తగ్గుతుండటమే దీనికి నిదర్శనం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 85 లక్షల టన్నులను సేకరించగా.. 2022-23 నాటికి అది 49 లక్షల టన్నులకు తగ్గింది. ఉత్పత్తిలో తగ్గుదల 4లక్షల టన్నులే అయినా.. సేకరణలో మాత్రం 35లక్షల టన్నుల మేర కోత పెట్టారు. పోనీ రైతులకు ఏమైనా అధిక ధరలు దక్కి.. బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారా? అంటే అదీ లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సేకరించేది దొడ్డు రకాల ధాన్యమే. సన్న రకాలను ఎలాగూ బహిరంగ మార్కెట్లోనే అమ్ముకుంటారు. వాటికి మంచి ధరలు కూడా దక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి నాణ్యమైన ‘జయ’ రకం బియ్యాన్ని సరఫరా చేస్తే తీసుకుంటామని గతేడాది కేరళ ప్రభుత్వం కోరింది. తర్వాత పర్యటనలైతే చేశారు, సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు, కానీ.. బియ్యం మాత్రం పంపలేదు. ‘జయ’ రకం వేస్తే, వాటిని కొంటారనే ఆశతో సాగు చేసిన రైతులు.. చివరకు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చింది. అవి మిల్లర్లకు చేరాక ధర పెరిగింది. ఏపీ నుంచి సరఫరా లేకపోవడంతో.. ఈ ఏడాది తెలంగాణ నుంచి సేకరించేందుకు కేరళ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.
కౌలు రైతు.. గొగ్గోలు!
కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా దక్కడం లేదు. కౌలు కార్డుల్లేవంటూ పంటనష్టానికి పెట్టుబడి రాయితీ రాదు. బీమా అందదు. ఇతర రాయితీలూ ఉండవు. కూలీనాలీ చేసి కూడబెట్టిన సొమ్మును.. ఎకరా, రెండెకరాలు కౌలుకు తీసుకుని పెట్టుబడిగా పెడుతున్నారు. చిల్లిగవ్వా దక్కక.. సాగు మానుకుంటున్నారు.
2023-24లో వరి సాధారణ విస్తీర్ణం 57.88లక్షల ఎకరాలు కాగా.. 44.88 లక్షల ఎకరాల్లోనే అంటే 77.53% విస్తీర్ణంలోనే నాట్లు పడ్డాయి. ఇందులో ఒక్క రబీ పంట చూస్తే.. ఫిబ్రవరి మొదటి వారానికి 64% విస్తీర్ణంలోనే నాట్లు వేశారు. సాధారణం కంటే సుమారు 7 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. కరవు కారణంగా చాలా ప్రాంతాల్లో వరి ఎండిపోయింది. కృష్ణా డెల్టాలో నీరందక రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి. పంట కోత సమయంలో.. మిగ్జాం వచ్చి ముంచేసింది. అయినా ఇటీవల విడుదలైన రెండో ముందస్తు అంచనాల్లో ఎకరాకు సగటు దిగుబడి ఖరీఫ్లో 22 క్వింటాళ్లు, రబీలో 28.50 క్వింటాళ్లుగా ప్రభుత్వం అంచనా వేసింది.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!