మొదటిరోజు సజావుగా ముగిసిన టెట్
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) మొదటిరోజు సజావుగా ముగిసిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) మొదటిరోజు సజావుగా ముగిసిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. పేపర్-1 పరీక్షకు ఉదయం 86.37 శాతం, మధ్యాహ్నం 87.54 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు మంగళవారం ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల పేరు, వివరాలు తప్పుగా నమోదైతే ఒరిజినల్ ధ్రువపత్రాలతో జిల్లా విద్యాశాఖాధికారిని సంప్రదించాలి. వివరాలు సరైనవని అధికారులు నిర్ధారిస్తే అభ్యర్థులు రాష్ట్రస్థాయిలోని కమాండ్ కంట్రోల్ రూముకి తెలియజేయాలి. మరో సెషన్లో పరీక్షకు హాజరయ్యేలా బఫర్ హాల్టికెట్ అందిస్తాం. కోర్టు ఉత్తర్వుల వల్ల పరీక్ష రాయలేని అభ్యర్థులకు ఫీజు తిరిగి చెల్లిస్తాం’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!