పేద తల్లిదండ్రులపై ఫీజుల భారం
ప్రభుత్వం ఇచ్చిన ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 2023-24 విద్యా సంవత్సరం డిగ్రీ, బీటెక్ మొదటి ఏడాది తరగతులు గతేడాది ఆగస్టులో ప్రారంభమయ్యాయి.
ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడంతో తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్న యాజమాన్యాలు
త్వరలో ముగియనున్న 2023-24 విద్యా సంవత్సరం
ఒక త్రైమాసికం ఫీజులను నేడు విడుదల చేయనున్న సీఎం జగన్
గొప్పలు..
కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజులను ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నాం.
వాస్తవం..
ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం బీటెక్ నాలుగో ఏడాది విద్యార్థులకు ఏప్రిల్ 29తో చదువు పూర్తవుతుంది. కానీ.. ఈ విద్యాసంవత్సరంలో ఒక త్రైమాసికం ఫీజునే ప్రభుత్వం శుక్రవారం విడుదల చేస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే సీఎం జగన్ మాత్రం ఎప్పటి ఫీజులను అప్పుడే చెల్లిస్తున్నామంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
అప్పులు చేసి కడుతున్నాం
విద్యాదీవెన కింద రాష్ట్రప్రభుత్వం 2023-24 విద్యాసంవత్సరానికి సకాలంలో ఫీజులు విడుదల చేయలేదు. అయినా కళాశాలలు కట్టాలని చెప్పడంతో అప్పులు చేసి చెల్లిస్తున్నాం. ఇప్పటికే కళాశాలలకు సగానికిపైగా ఫీజులు చెల్లించాం.
విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదన
ఈనాడు, అమరావతి: ప్రభుత్వం ఇచ్చిన ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 2023-24 విద్యా సంవత్సరం డిగ్రీ, బీటెక్ మొదటి ఏడాది తరగతులు గతేడాది ఆగస్టులో ప్రారంభమయ్యాయి. బీటెక్ మూడు, నాలుగో సంవత్సరం వారికి డిసెంబరు, జనవరి నెలల్లోనే మొదటి సెమిస్టర్ పరీక్షలూ ముగిశాయి. అంటే వారి సగం విద్యాసంవత్సరం ముగిసినట్లే. మరో రెండు, మూడు నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ కళాశాలైనా ఫీజు అడగకుండా ఉంటుందా? కళాశాలలు ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు అప్పోసొప్పో చేసి ఫీజులు కడుతున్నారు. కానీ, జగన్ సర్కారుకు ఇవేమీ కనిపించవు. ఏ త్రైమాసికం ఫీజులను ఆ త్రైమాసికంలోనే ఇచ్చేస్తున్నామంటూ ప్రతి సభలోనూ సీఎం జగన్.. అలవోకగా అబద్ధాలు చెప్పేస్తున్నారు. వసతిదీవెనను 2022-23 సంవత్సరంలో ఒక్కవిడతే ఇచ్చారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ.10వేలే వచ్చాయి. మిగతా రూ.10వేలపై ఇంతవరకు స్పష్టత లేదు.
ఇప్పటికి ఒక్క విడతా?
విద్యా సంవత్సరం ముగింపునకు వస్తున్న సమయంలో సీఎం జగన్ ఒకవిడత విద్యాదీవెన విడుదలకు శుక్రవారం బటన్ నొక్కబోతున్నారు. నిజానికి ఏడాదికి నాలుగు విడతల్లో మొత్తం ఫీజు డబ్బులను ప్రభుత్వం చెల్లించాలి. త్వరలో ఎన్నికల షెడ్యూలు వస్తుంది. అలాంటప్పుడు ఈ ఏడాది పూర్తిఫీజులు పేద పిల్లలకు అందుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో త్రైమాసికానికి రూ.708 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన మూడు త్రైమాసికాలకు కలిపి రూ.2124 కోట్లు జమకావాలి.
పూర్తిగా భరిస్తానంటూ..
పేదపిల్లల చదువుకయ్యే ఖర్చును భరిస్తామని, ప్రతి పేద విద్యార్థినీ చదివిస్తానంటూ ఎన్నికల ముందు హామీనిచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక పీజీ కోర్సులకు ప్రైవేటులో బోధన రుసుము చెల్లింపును నిలిపేశారు. ప్రభుత్వ కళాశాలలు, వర్సిటీల్లో చదివేవారికే బోధన రుసుములను అందిస్తున్నారు. ప్రైవేటు కళాశాలల్లో కొత్త కోర్సులు, ఉపాధి లభించేవి ఉండడంతో ఎక్కువమంది వాటిల్లో చేరతారు. అలా చేరే బడుగులూ సొంతంగా ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. పీజీ కోర్సులకు చెల్లించాల్సిన పాత బకాయిలు రూ.450 కోట్లు ఇంతవరకూ ఇవ్వలేదు. ఫీజుల డబ్బులు రానందున విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్