ఇదీ జగన్ క్రమ‘బద్ధకీ’కరణ
మేం అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు, విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుంటాం.
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని వంచన
నాలుగేళ్లు నిద్రపోయి.. ఇప్పుడు కోడ్ పేరిట తప్పించుకుంటున్న వైనం
దాదాపు 50 వేలల్లో 3,350 మందికే మోక్షం..
ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల్లో ఒక్కరికీ అర్హత లేదట..
ఒప్పంద ఉద్యోగులను ఒగ్గేసిన వైకాపా సర్కారు
మేం అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు, విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుంటాం. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇస్తున్నా.
గత ఎన్నికలకు ముందు జగన్ వ్యాఖ్యలివి.
ఐదేళ్ల కిందట ఊరించారు.. ఓట్లు వేయించుకొని గెలిచారు.. పీఠమెక్కాక రేపోమాపంటూ సాగదీశారు.. ఎన్నికలకు ముందు నిబంధనల కత్తి బయటకు తీశారు.. అర్హులను వీలైనంత తగ్గించే ప్రయత్నం చేశారు.. ఇప్పుడు కోడ్ పేరిట హామీని అటకెక్కించారు.. ఆఖరికి.. అన్ని వర్గాల మాదిరే.. ఒప్పంద ఉద్యోగులనూ ఉసూరుమనిపించారు. కొలువు క్రమబద్ధీకరణ అవుతుందేమోనని ఆశపడిన వారంతా.. ఇక నిన్ను నమ్మం జగన్ అంటున్నారు!
మాటలతో మాయ చేయడంలో తనను మించిన ఘనులు లేరని సీఎం జగన్ పదేపదే నిరూపించుకుంటున్నారు. ఎన్నికల ముందు హామీలతో నమ్మించి అధికారంలోకి వచ్చాక వంచించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. 2019 ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీతో వారిలో ఆశలు కల్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక నిబంధనల సాకుతో సాగదీసి, కొంతమందికి మాత్రమే చేసి చేతులెత్తేశారు. ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీ సంగతి.. మళ్లీ ఎన్నికలు దగ్గరకు వచ్చే వరకు ఆయనకు గుర్తుకు రాలేదు. కోడ్ వస్తుందని తెలిసి.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంటూ హడావుడి చేశారు. అలాగైనా మాట నిలబెట్టుకున్నారా అంటే.. అదీ లేదు. అన్ని శాఖల్లో కలిపి 50వేలకుపైగా ఒప్పంద ఉద్యోగులు ఉంటే.. వారిలో కేవలం 10,117 మంది మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హులని వైకాపా సర్కారు ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేనాటికి కేవలం 3,350 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేసింది.
ఒకటీ రెండూ కాదు..
అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు, విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుని, వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తానని గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా ప్రతి సభలోనూ జగన్ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక మొదటి నాలుగేళ్లు దీని గురించే పట్టించుకోలేదు. గతేడాది తీరిగ్గా ఈ అంశంపై కసరత్తు చేపట్టిన ప్రభుత్వం.. అర్హుల సంఖ్యను భారీగా కుదించాలనే ఉద్దేశంతో 2014 జూన్ 2 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకొని ఉండాలనే నిబంధనను తీసుకొచ్చింది. దీనిపై ఒప్పంద ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో ఐదేళ్ల నిబంధనను తొలగించింది.
- ఒప్పంద ఉద్యోగి పని చేస్తున్న పోస్టు ప్రభుత్వం మంజూరు చేసిందై ఉండాలనీ.. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటికీ మంజూరు పోస్టులోనే పని చేస్తూ ఉండాలనే నిబంధన విధించింది.
- ఉద్యోగ నియామకానికి ప్రకటన ఇచ్చి ఉండాలనీ.. ఆ పోస్టుకు రిజర్వేషన్ రోస్టర్ అమలు చేసి ఉండాలని ఇంకో నియమం పెట్టింది.
- సబ్జెక్టు సైతం క్లియర్ వెకెన్సీ ఉండాలని, ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి నోటిఫై చేసిన పోస్టు కాకుండా ఉండాలని పేర్కొంది.
- ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, ప్రాజెక్టుల్లో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగులను పరిగణనలోకి తీసుకోలేదు. ఇలా అనేక వడపోతలతో ఒప్పంద ఉద్యోగుల సంఖ్యను బాగా తగ్గించేసింది. చివరికి 10,117 మందిని చేస్తామని చెప్పి, వారినీ చేయకుండానే జాప్యం చేసింది. ఎన్నికల కోడ్ వచ్చేవరకు వారిలో దాదాపు మూడోవంతు మందిని కూడా రెగ్యులరైజ్ చేయలేదు.
ఇంటర్మీడియట్లో చేతులెత్తేశారు..
ఇంటర్మీడియట్ విద్యలో 2014 ముందు నుంచి ఒప్పంద ప్రాతిపదికన పని చేస్తున్న వారు 3,593 మంది ఉన్నారు. వీరిలో ఒక్కర్ని కూడా క్రమబద్ధీకరించలేదు. ఏవేవో కారణాలు చూపుతూ ఎన్నికల కోడ్ వచ్చే వరకు సాగదీశారు. తీరా ఇప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా కుదరడం లేదంటూ ప్రభుత్వం తప్పించుకుంది. 2000 నుంచి 2007 మధ్యలో నియమితులైన వారు 1,514 మంది ఉన్నారు. వీరి నియామకాలను ప్రభుత్వమే చేసినా.. రిజర్వేషన్ రోస్టర్ పాటించలేదు. లెక్చరర్ పోస్టు జోనల్ స్థాయి కాగా.. స్థానికంగా ప్రిన్సిపాళ్లే ప్రకటనలు ఇచ్చి నియామకాలు పూర్తి చేశారు. ఇలాంటి వాటిని పరిశీలిస్తున్నామంటూ ఎన్నికల కోడ్ వచ్చే వరకు సాగదీసిన ప్రభుత్వం చివరికి చేతులెత్తేసింది.
- రాష్ట్రంలో 82 జూనియర్ కళాశాలలకు అసలు మంజూరు పోస్టులే లేవు. ఇక్కడ ఒప్పంద లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్నారు. వీరిని క్రమబద్ధీకరించాలనుకుంటే పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది.
- 2021లో ఏపీపీఎస్సీ ద్వారా 180 మంది నియామకమైతే.. వారి కోసం అప్పటికే మంజూరు పోస్టుల్లో పని చేస్తున్న 175 మంది ఒప్పంద ఉద్యోగులను నాన్-సాంక్షన్డ్ పోస్టులోకి మార్చేశారు. ఇది ప్రభుత్వం చేసిన మార్పే అయినా.. దాని ఫలితం మాత్రం ఒప్పంద ఉద్యోగులు అనుభవించాల్సి వస్తోంది.
సాంకేతిక విద్యలో అన్యాయం
రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న అర్హులైన ఒప్పంద ఉద్యోగులు 309 మంది ఉండగా.. ఇద్దర్ని మాత్రమే రెగ్యులరైజ్ చేశారు. వర్క్షాపు అటెండర్లలో అర్హులైన వారు 140 మంది ఉండగా.. 22 మందినే చేశారు. 24 పాలిటెక్నిక్లకు అసలు పోస్టుల మంజూరే లేదు. వీటికి మొత్తం 235 మంది అవసరం. ఈ పోస్టులను మంజూరు చేస్తే.. ఇప్పటికే అక్కడ పని చేస్తున్న వారిని క్రమబద్ధీకరించవచ్చు. డిగ్రీ కళాశాలల్లో అర్హులైన వారు 650మంది ఉండగా.. వీరిలో ఒక్కర్నీ చేయలేదు.
వైద్య ఆరోగ్యశాఖదో దారి..
2014 జూన్ 2కు ముందు విధుల్లో చేరిన వారిలో సుమారు వెయ్యి మంది ఒప్పంద ఉద్యోగులను కోర్టు కేసులు సాకుగా చూపుతూ వైద్య ఆరోగ్య శాఖ పక్కన పెట్టింది. ఈ శాఖలో ఒప్పంద విధానంలో పని చేస్తున్న వారిలో 3,821 మందికి క్రమబద్ధీకరణ అర్హత ఉందని గుర్తించారు. వీరిలో మల్టీపర్సస్ హెల్త్ అసిస్టెంట్లు (పురుషులు) వెయ్యి మంది వరకు ఉన్నారు. 2002లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం పరీక్ష రాసి, రోస్టర్ పాయింట్ల ప్రకారం 2003లో పోస్టింగులు పొందారు. అర్హతలపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావడంతో కొందర్ని విధుల నుంచి తప్పించారు. తుది తీర్పు వచ్చాక వారిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నా.. క్రమబద్ధీకరణకు మాత్రం నోచుకోలేదు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం సీఎం జగన్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అక్కడి అవసరాల కోసం రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ వాహనాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. -
జగన్ పన్నాగం పారలేదు
జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది. -
ఈసీ అనుమతి లేదు
ప్రభుత్వ పథకాల నిధుల పంపిణీ విషయంలో ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది. -
ఆ దేవతే లేకపోతే..
ఈ ఐదేళ్ల పాలనలో జగన్ విధ్వంసకర నిర్ణయాలకు, అడ్డగోలు పనులకు హైకోర్టు కర్రుకాల్చి వాతపెట్టిన సందర్భాలు అనేకం. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలే చాలాసార్లు బాధితులకు రక్షణగా నిలిచాయి. -
బీరాలు పలికి.. బేరానికొచ్చి!
వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు ‘ప్రత్యేక హోదా’పై జగన్ చెలరేగిపోయారు. కేంద్రంపై రంకెలు వేశారు. ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఊగిపోయారు. వైకాపా నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టి బంద్లు చేయించారు. -
ఆ‘పైవాడూ’ కాపాడలేడు!
..కానీ ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022’ దేవుళ్ల భూములకే ఎసరు పెట్టనుంది! వైకాపా సర్కారు రూపొందించిన అనాలోచిత చట్టంతో దేవాదాయ, వక్ఫ్, క్రైస్తవ మిషనరీలకు చెందిన భూములు ప్రమాదంలో పడుతున్నాయి. -
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
గతంలో ఏ ఎన్నికల్లోనూ కనిపించనంత కసి, ఉత్సాహం రాష్ట్ర ఓటర్లలో కనిపిస్తోంది. విదేశాలు, ఇతర నగరాల్లో ఉండే ఓటర్లు భారీ సంఖ్యలో ఏపీకి తరలివస్తున్నారు. -
‘భూ’చాళ్ల చట్టానికి బలయ్యేది బడుగులే
జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బారిన పడేవారిలో అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.. బడుగు బలహీనవర్గాలే. కొత్త చట్టంతో బలయ్యేది సెంటు, అరసెంటు స్థలాలు.. అరెకరా, ఎకరా భూమినే నమ్ముకున్నవారే. వారికి పలుకుబడి ఉండదు. -
ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం
ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వైకాపా ప్రభుత్వం రూపొందించిందని హైకోర్టు న్యాయవాది పదిరి రవితేజ విమర్శించారు. -
పన్నుల భారం రూ.1.38 లక్షల కోట్లు
‘అల్లమంటే నాకు తెలీదా! బెల్లంలా పుల్లగా ఉంటుంది’ అన్నాడంట వెనకటికొకడు! మంచి పాలన అంటే దౌర్జాన్యాలు, దోపీడీలు, అక్రమాలు, దమనకాండలు అనుకునే ముఖ్యమంత్రి జగన్ తీరు ఇప్పుడు అలానే ఉంది. -
భయాలను పెంచేలా.. ‘నోరు నొక్కేసేలా..!’
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై సీఎం జగన్, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలే రైతులు, వివిధ వర్గాల ప్రజల్లో భయాలను మరింత పెంచేలా ఉంటున్నాయి. -
విచారణ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయి
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ప్రకియ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయని, అందువల్ల ఈ కేసును మరో రోజు ప్రత్యేకంగా వింటామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. -
ఈసీ తీరును నిరసిస్తున్నాం: బొత్స సత్యనారాయణ
కేంద్ర ఎన్నికల సంఘం తీరును వైకాపా నిరసిస్తోందని, ఆక్షేపిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
జగన్ పాలనలో ఆర్యవైశ్యులకు అన్యాయం
జగన్ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ఎటువంటి న్యాయమూ జరగలేదని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు విమర్శించారు. -
మేం వైకాపాకు మద్దతు ఇవ్వలేదు
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్... వైకాపాకు మద్దతు ప్రకటించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటనను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది బషీర్ అహ్మద్ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. -
మార్గదర్శి నగదు, చెక్కులు సక్రమమే
విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. -
సింహాచలంలో వైభవోపేతంగా చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారు శుక్రవారం నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
తల్లితో కలిసి నేడు పిఠాపురానికి రామ్చరణ్
అగ్ర నటుడు చిరంజీవి తనయుడు, సినీ నటుడు రామ్చరణ్ శనివారం పిఠాపురం రానున్నారు. -
‘మూడు కోట్ల ఎకరాలకు’ బీమా ఎగ్గొట్టారు
పంట వేస్తే చాలు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని నమ్మిన రైతుల్ని జగన్ నిలువెల్లా మోసం చేశారు. -
ఆసుపత్రులు ఆగం.. తగ్గేదెలా రోగం?
పదే పదే ప్రచారం చేసి లేనిది ఉన్నట్లు నమ్మించే గోబెల్స్ ప్రచారంలో జగన్ ముందుంటారు. ఏమీ చేయకున్నా చేసినట్లు చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో ఆయన దిట్ట.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ
-
జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటం: శ్రీనివాసానంద సరస్వతి
-
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
-
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
-
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్