ఈసీలు లేకుండా రిజిస్ట్రేషన్లు ఎలా?
రిజిస్ట్రేషన్ శాఖ నిర్వాకంతో రాష్ట్రంలో గత పది రోజుల నుంచి ఈసీల జారీ నిలిచిపోవడంతో ఆస్తుల క్రయవిక్రయదారులు అవస్థలు పడుతున్నారు.
సాంకేతిక కారణాలతో 10 రోజుల నుంచి ఆన్లైన్లో నిలిచిన జారీ
ప్రైమ్-2.0 అమల్లోకి వచ్చినప్పటి నుంచి సమస్యలే
రిజిస్ట్రేషన్ శాఖ నిర్వాకంపై ప్రజల మండిపాటు
ఈనాడు, అమరావతి: రిజిస్ట్రేషన్ శాఖ నిర్వాకంతో రాష్ట్రంలో గత పది రోజుల నుంచి ఈసీల జారీ నిలిచిపోవడంతో ఆస్తుల క్రయవిక్రయదారులు అవస్థలు పడుతున్నారు. కేంద్రం ఉచితంగా అందజేసే సాఫ్ట్వేర్ వద్దని రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముతో కొని, వినియోగంలోకి తెచ్చిన ప్రైవేట్ సాఫ్ట్వేర్ (ప్రైమ్-2.0) వల్ల తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ సర్వర్లో సమస్య తలెత్తడంతో పది రోజుల నుంచి ఆన్లైన్లో ఈసీలు పొందలేకపోతున్నారు. నిర్దేశిత ఆస్తి వివరాలు సమర్పించి, ఫీజులు చెల్లిస్తే మీసేవ ద్వారా సంబంధిత రిజిస్ట్రార్ కార్యాలయానికి సమాచారం వెళ్తుంది. అక్కడ ‘అప్రూవ్’ కాగానే తిరిగి మీసేవ ద్వారా కాపీ అందుకోవచ్చు. సాంకేతిక సమస్యలతో ఈ విధానానికి ప్రస్తుతం గండిపడింది. ఎనీవేర్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిన ఆస్తుల వివరాలకు సంబంధించిన ఈసీలు పొందడంలోనూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి నేరుగా దరఖాస్తు చేస్తే ఒకటి, రెండు రోజుల ఆలస్యంగా ఈసీలు ఇస్తున్నారు. ఇళ్లు, స్థలాలు, పొలాలు, ఫ్లాట్లు కొనుక్కునేవారు ఈసీ తప్పనిసరిగా తీసుకుంటారు. కొనుగోలు చేయదలచుకున్న ఆస్తులకు సంబంధించి గతంలో జరిగిన క్రయవిక్రయాల వివరాలు, ఆస్తి తనఖాలో ఉందా? రుణాలు తీసుకున్నారా? వంటి సమాచారం ఈసీ ద్వారానే తెలుస్తుంది. ఇలాంటి ప్రాధాన్యమున్న ఈసీలు రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా పొందే అవకాశం లేకపోవడంతో ఆస్తుల కొనుగోళ్లపై కొనుగోలుదారులు వెంటనే నిర్ణయానికి రాలేకపోతున్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుంచి సర్టిఫైడ్ కాపీలు కూడా డౌన్లోడ్ కావడం లేదు. అపార్టుమెంట్లు, వెంచర్లకు సంబంధించి ప్లాట్లు, ఫ్లాట్ల వారీగా వివరాలు (లిస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్), నిషిద్ధ భూముల వివరాలు కూడా ఒక్కోసారి వెబ్సైట్లో కనిపించడం లేదు. ఈ వివరాలు తెలుసుకోవడానికి క్రయవిక్రయదారులు ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో