అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది.
ఆర్థిక ఇబ్బందుల్లో ఏపీ జెన్కో
ఆర్ఈసీ నుంచి రూ.500 కోట్ల రుణం
ప్రభుత్వం రాయితీ మొత్తం చెల్లించకపోవడమే కారణం
ఈనాడు-అమరావతి: అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. ఆ సంస్థకు బొగ్గు కొనుగోలుకు అవసరమైన నిధుల్ని సర్దుబాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకావడం లేదు. దీంతో జెన్కో ప్రస్తుత వేసవిలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు కొనుగోలు చేయడానికి రుణం కోసం గ్రామీణ విద్యుత్ సంస్థ (ఆర్ఈసీ) తలుపులు తట్టింది. ఆర్ఈసీ అప్పు మొత్తాన్ని జెన్కోకు జమ చేయకుండా, రూ.500 కోట్లను నేరుగా ఎంసీఎల్ ఖాతాకు చెల్లించింది. ఇదీ మన విద్యుత్ సంస్థలపై కేంద్రానికి ఉన్న నమ్మకం. రాష్ట్ర ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని చెల్లించకపోవడంతో జెన్కోకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక సంవత్సరం మరో మూడు రోజుల్లో ముగియనుండటంతో.. ఇప్పటికీ నిధుల విడుదలకు ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి.
ఆర్ఈసీ అప్పు ఇచ్చి గట్టెక్కించింది
ఆర్ఈసీ ఈ నెల అప్పు ఇచ్చి ఆదుకుంది.. వచ్చే నెల పరిస్థితి ఏంటి..? ప్రతి నెలా జెన్కో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు ప్రస్తుత పరిస్థితి నిదర్శనం. ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్ల నిర్వహణ కోసం ఏటా సుమారు 30 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం. అందులో ఎంసీఎల్ నుంచి 22 మిలియన్ టన్నులు, సింగరేణి నుంచి 8 మిలియన్ టన్నులను తీసుకుంటోంది. గత నెల ఎంసీఎల్ నుంచి తీసుకున్న బొగ్గుకు సుమారు రూ.500 కోట్లు బకాయి పడింది. ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయకుంటే బొగ్గు సరఫరాపై ప్రభావం పడుతుంది. ఎన్నికల ఏడాది కావడంతో అంతరాయం లేకుండా విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా, ఆ మేరకు నిధులను మాత్రం విడుదల చేయడం లేదు. బొగ్గు సరఫరా సంస్థలకు బకాయిలు చెల్లించడం జెన్కోకు సాధ్యం కావడం లేదు. ప్రతినెలా రూ.500 కోట్లు బిల్ డిస్కౌంట్ కింద సింగరేణికి చెల్లించి, ఆ మొత్తాన్ని నిర్దేశిత వ్యవధిలో బ్యాంకులకు జెన్కో చెల్లిస్తోంది. ప్రభుత్వం నుంచి రాయితీ మొత్తం అందితే ఇబ్బంది ఉండదు. అలా కాకపోవడంతో ప్రతినెలా ఉద్యోగుల జీతాలు, ఇతర చెల్లింపుల్ని విద్యుత్ బిల్లులు వసూలయ్యే వరకు సర్దుబాటు చేయలేని పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది.
విదేశీ బొగ్గు వద్దు.. ఉన్న దాంతో సర్దుకుందాం
ఏపీ జెన్కో 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కొనుగోలు చేయాలన్న తాజా ప్రతిపాదననూ పక్కన పెట్టింది. కృష్ణపట్నం థర్మల్ కేంద్రానికి అవసరమైన దానిలో కనీసం 10 శాతం విదేశీ బొగ్గు కలిపి వినియోగించాలని జెన్కో భావించింది. అందులో వినియోగించిన సాంకేతికత దృష్ట్యా కనీసం 30 శాతం విదేశీ బొగ్గు అవసరం. కానీ, విదేశీ బొగ్గు ధర టన్ను సుమారు రూ.12 వేల వరకు ఉండటంతో.. దాన్ని కొనుగోలు చేయటం వల్ల ఆర్థికభారం మరింత పెరుగుతుందని జెన్కో భావిస్తోంది. దీంతో ఎంసీఎల్ నుంచి తీసుకున్న బొగ్గుతోనే ఎలాగోలా కృష్ణపట్నం యూనిట్లను నడుపుతోంది. గతంలో అదాని నుంచి 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కొనుగోలుకు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇంకా 1.3 లక్షల టన్నులు తీసుకోవాలి. అధిక ధరల దృష్ట్యా ఇప్పట్లో తీసుకోవడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వీటీపీఎస్లో 1.70 లక్షల టన్నులు, ఆర్టీపీపీలో 1.35 లక్షలు, కృష్ణపట్నంలో లక్ష టన్నుల బొగ్గు అందుబాటులో ఉంది. అవి 5 నుంచి 6 రోజుల ఉత్పత్తికి సరిపోనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్