మూడు రాజధానులు ఏర్పాటు చేశాం
‘మొట్టమొదటిసారిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేశాం’ నంద్యాల ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాట ఇది.. ఉన్న రాజధాని అమరావతినే చంపేసిన ఆయన.. మూడు రాజధానులు ఏర్పాటు చేశానని చెబుతున్నారు.
99 శాతం హామీలు అమలు చేశాం
యువతకు ఉద్యోగాలిచ్చాం
నంద్యాల సభలో అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిన సీఎం
ఈనాడు- కర్నూలు, న్యూస్టుడే- నంద్యాల బృందం: ‘మొట్టమొదటిసారిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేశాం’ నంద్యాల ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాట ఇది.. ఉన్న రాజధాని అమరావతినే చంపేసిన ఆయన.. మూడు రాజధానులు ఏర్పాటు చేశానని చెబుతున్నారు. ఆ మూడు రాజధానులు ఎక్కడున్నాయి? జనం అమాయకులు, తానేం చెప్పినా చెల్లుబాటు అవుతుందనుకున్నారో ఏమో కానీ జగన్ చాలా అలవోకగా ఇలాంటి అబద్ధాలను వల్లె వేశారు. ‘ఎప్పుడూ చూడని విధంగా అభివృద్ధి చేశాం.. గొప్ప మార్పు తీసుకువచ్చాం.. ఇది దేశ చరిత్రలో గొప్ప అధ్యాయంగా నిలిచిపోతుంది’ అంటూ తనకు తానే కితాబిచ్చుకున్నారు. ఆయన ప్రసంగం ఆద్యంతం.. ఆత్మస్తుతి, పరనింద తరహాలో సాగింది. ‘99 శాతం హామీలను అమలు చేశాం. ఉద్యోగాలిచ్చాం, రాష్ట్రంలో అవినీతి లేకుండా చేశాం’ అని కూడా ప్రకటించారు.వివిధ పథకాల కింద ఎంత మంది లబ్ధి పొందారు అని లెక్కలు చెప్పుకొచ్చారు.
ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం జగన్ సభ జరుగుతున్న అదే నంద్యాలకు గతంలో ఏం హామీలిచ్చారు? వాటిలో ఎన్ని పూర్తి చేశారనేది చెప్పకపోవడం గమనార్హం. తనను ఓడించేందుకు నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారని..వారికి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకరిస్తోందని విమర్శించారు. ‘వీరంతా కలిసి ప్రజల రాజ్యాన్ని, రైతుల రాజ్యాన్ని, సంక్షేమ రాజ్యాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు కూటమిని ప్రజలు ఓడించాలి. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలి.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు కలిపి డబుల్ సెంచరీ స్థానాల్లో వైకాపాను గెలిపించేందుకు మీరు సిద్ధమేనా’ అని సభకు హాజరైనవారిని అడిగారు. ‘ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకోవడానికి మాత్రమే కాదు. ప్రజలు తమ తలరాతను మార్చుకునేందుకు కూడా’ అని వ్యాఖ్యానించారు. సొంత మీడియా సంస్థతోపాటు సామాజిక మాధ్యమాల్లో అన్ని వేదికలనూ విపరీతంగా వాడుకుంటూనే.. తనకు మీడియా మద్దతు లేదంటూ జనాన్ని నమ్మించేందుకు సీఎం మరోమారు ప్రయత్నించారు.
సీఎం ప్రసంగం ప్రారంభవక ముందే జనం తిరుగు ముఖం
వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఉమ్మడి జిల్లా నుంచి ఈ సభకు భారీగా జన సమీకరణ చేశారు. జిల్లాలోని నంద్యాల, శ్రీశైలం, పాణ్యం, బనగానపల్లి, నందికొట్కూరు నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున జనాన్ని వందల బస్సుల్లో తరలించారు. ఇంత చేసినా సభాప్రాంగణం వెలవెలబోయింది. నంద్యాలలోని 30 ఎకరాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని సభ కోసం తీర్చిదిద్దారు. వేదికముందు భాగంలో ప్రత్యక్ష ప్రసారానికి, మధ్యలో సీఎం ర్యాంప్ వాక్కు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు ఘనంగా ఉన్నా జనం మాత్రం సభపై పెద్దగా ఆసక్తి చూపలేదు. సాయంత్రం 5.22 గంటలకు జగన్ బస్సు సభా ప్రాంగణంలోకి వచ్చింది. అప్పటికీ మైదానం నిండలేదు. ఇదే సమయంలో వందల మంది తిరుగుప్రయాణం కావడం గమనార్హం. ‘మధ్యాహ్నం 3 గంటలకు సీఎం వస్తారని చెప్పి రూ.400 కూలి ఇచ్చి తీసుకొచ్చారు. ఎండ తగ్గుముఖం పట్టాక సీఎం వచ్చారు. రాత్రి మమ్మల్ని ఇళ్లకు ఎవరు చేరుస్తారు. భోజనం మాటేంటి’ అని పలువురు కార్యకర్తలు నాయకులను నిలదీస్తూ కనిపించారు.
మద్యం ప్రవాహం
మద్యం సీసాలు, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేసి జనాన్ని బస్సుల్లో సభకు తరలించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల్లో మద్యాన్ని భారీగా తీసుకొచ్చారు. ఒక్కో కార్యకర్తకు మద్యంతో పాటు రూ.300 నుంచి రూ.500 ఇచ్చినట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో వైకాపా నాయకులు పథకాలు అందిన వాళ్లందరూ సభకు రావాలని, లేదంటే పథకాలు రద్దు చేయిస్తామని బెదిరించి బలవంతంగా తీసుకొచ్చారు. పట్టణంలోని చామకాల్వ మద్యం దుకాణం వద్ద వైకాపా జెండాలు, కండువాలతో కార్యకర్తలు రహదారిపైనే మద్యం తాగారు. బహిరంగ ప్రదేశాల్లో యథేచ్ఛగా మద్యం తాగుతున్నా పోలీసులు చూస్తుండిపోవడం విమర్శలకు దారి తీసింది.
అలిపిరి బస్సులనూ వదల్లేదు
తిరుమలకు వెళ్లే అలిపిరి బస్సులను కూడా వైకాపా నాయకులు వదల్లేదు. వైకాపా సభలకు వెళ్లొచ్చిన అలిపిరి డిపో బస్సుల్లో మాంసం ముక్కలు కనిపించడం కొద్దిరోజుల కిందట వివాదాస్పదంగా మారింది. గురువారం కూడా అలిపిరి డిపో బస్సుల్లో యథేచ్ఛగా మద్యం తాగి, మాంసం తింటున్న దృశ్యాలు కనిపించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం