మూడు రాజధానులు ఏర్పాటు చేశాం
‘మొట్టమొదటిసారిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేశాం’ నంద్యాల ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాట ఇది.. ఉన్న రాజధాని అమరావతినే చంపేసిన ఆయన.. మూడు రాజధానులు ఏర్పాటు చేశానని చెబుతున్నారు.
99 శాతం హామీలు అమలు చేశాం
యువతకు ఉద్యోగాలిచ్చాం
నంద్యాల సభలో అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిన సీఎం
ఈనాడు- కర్నూలు, న్యూస్టుడే- నంద్యాల బృందం: ‘మొట్టమొదటిసారిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేశాం’ నంద్యాల ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాట ఇది.. ఉన్న రాజధాని అమరావతినే చంపేసిన ఆయన.. మూడు రాజధానులు ఏర్పాటు చేశానని చెబుతున్నారు. ఆ మూడు రాజధానులు ఎక్కడున్నాయి? జనం అమాయకులు, తానేం చెప్పినా చెల్లుబాటు అవుతుందనుకున్నారో ఏమో కానీ జగన్ చాలా అలవోకగా ఇలాంటి అబద్ధాలను వల్లె వేశారు. ‘ఎప్పుడూ చూడని విధంగా అభివృద్ధి చేశాం.. గొప్ప మార్పు తీసుకువచ్చాం.. ఇది దేశ చరిత్రలో గొప్ప అధ్యాయంగా నిలిచిపోతుంది’ అంటూ తనకు తానే కితాబిచ్చుకున్నారు. ఆయన ప్రసంగం ఆద్యంతం.. ఆత్మస్తుతి, పరనింద తరహాలో సాగింది. ‘99 శాతం హామీలను అమలు చేశాం. ఉద్యోగాలిచ్చాం, రాష్ట్రంలో అవినీతి లేకుండా చేశాం’ అని కూడా ప్రకటించారు.వివిధ పథకాల కింద ఎంత మంది లబ్ధి పొందారు అని లెక్కలు చెప్పుకొచ్చారు.
ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం జగన్ సభ జరుగుతున్న అదే నంద్యాలకు గతంలో ఏం హామీలిచ్చారు? వాటిలో ఎన్ని పూర్తి చేశారనేది చెప్పకపోవడం గమనార్హం. తనను ఓడించేందుకు నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారని..వారికి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకరిస్తోందని విమర్శించారు. ‘వీరంతా కలిసి ప్రజల రాజ్యాన్ని, రైతుల రాజ్యాన్ని, సంక్షేమ రాజ్యాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు కూటమిని ప్రజలు ఓడించాలి. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలి.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు కలిపి డబుల్ సెంచరీ స్థానాల్లో వైకాపాను గెలిపించేందుకు మీరు సిద్ధమేనా’ అని సభకు హాజరైనవారిని అడిగారు. ‘ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకోవడానికి మాత్రమే కాదు. ప్రజలు తమ తలరాతను మార్చుకునేందుకు కూడా’ అని వ్యాఖ్యానించారు. సొంత మీడియా సంస్థతోపాటు సామాజిక మాధ్యమాల్లో అన్ని వేదికలనూ విపరీతంగా వాడుకుంటూనే.. తనకు మీడియా మద్దతు లేదంటూ జనాన్ని నమ్మించేందుకు సీఎం మరోమారు ప్రయత్నించారు.
సీఎం ప్రసంగం ప్రారంభవక ముందే జనం తిరుగు ముఖం
వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఉమ్మడి జిల్లా నుంచి ఈ సభకు భారీగా జన సమీకరణ చేశారు. జిల్లాలోని నంద్యాల, శ్రీశైలం, పాణ్యం, బనగానపల్లి, నందికొట్కూరు నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున జనాన్ని వందల బస్సుల్లో తరలించారు. ఇంత చేసినా సభాప్రాంగణం వెలవెలబోయింది. నంద్యాలలోని 30 ఎకరాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని సభ కోసం తీర్చిదిద్దారు. వేదికముందు భాగంలో ప్రత్యక్ష ప్రసారానికి, మధ్యలో సీఎం ర్యాంప్ వాక్కు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు ఘనంగా ఉన్నా జనం మాత్రం సభపై పెద్దగా ఆసక్తి చూపలేదు. సాయంత్రం 5.22 గంటలకు జగన్ బస్సు సభా ప్రాంగణంలోకి వచ్చింది. అప్పటికీ మైదానం నిండలేదు. ఇదే సమయంలో వందల మంది తిరుగుప్రయాణం కావడం గమనార్హం. ‘మధ్యాహ్నం 3 గంటలకు సీఎం వస్తారని చెప్పి రూ.400 కూలి ఇచ్చి తీసుకొచ్చారు. ఎండ తగ్గుముఖం పట్టాక సీఎం వచ్చారు. రాత్రి మమ్మల్ని ఇళ్లకు ఎవరు చేరుస్తారు. భోజనం మాటేంటి’ అని పలువురు కార్యకర్తలు నాయకులను నిలదీస్తూ కనిపించారు.
మద్యం ప్రవాహం
మద్యం సీసాలు, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేసి జనాన్ని బస్సుల్లో సభకు తరలించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల్లో మద్యాన్ని భారీగా తీసుకొచ్చారు. ఒక్కో కార్యకర్తకు మద్యంతో పాటు రూ.300 నుంచి రూ.500 ఇచ్చినట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో వైకాపా నాయకులు పథకాలు అందిన వాళ్లందరూ సభకు రావాలని, లేదంటే పథకాలు రద్దు చేయిస్తామని బెదిరించి బలవంతంగా తీసుకొచ్చారు. పట్టణంలోని చామకాల్వ మద్యం దుకాణం వద్ద వైకాపా జెండాలు, కండువాలతో కార్యకర్తలు రహదారిపైనే మద్యం తాగారు. బహిరంగ ప్రదేశాల్లో యథేచ్ఛగా మద్యం తాగుతున్నా పోలీసులు చూస్తుండిపోవడం విమర్శలకు దారి తీసింది.
అలిపిరి బస్సులనూ వదల్లేదు
తిరుమలకు వెళ్లే అలిపిరి బస్సులను కూడా వైకాపా నాయకులు వదల్లేదు. వైకాపా సభలకు వెళ్లొచ్చిన అలిపిరి డిపో బస్సుల్లో మాంసం ముక్కలు కనిపించడం కొద్దిరోజుల కిందట వివాదాస్పదంగా మారింది. గురువారం కూడా అలిపిరి డిపో బస్సుల్లో యథేచ్ఛగా మద్యం తాగి, మాంసం తింటున్న దృశ్యాలు కనిపించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ