వడ్డీ లేదని బాకా.. గెలిచాక ధోకా!
ముస్లిం సోదరుల్లారా మీకేం కావాలో చెప్పండి... ఎంత మొత్తంలో కావాలో చెప్పండి... మీ కోసం ప్రత్యేకంగా ఇస్లాం బ్యాంకు పెడతా... మీరడిగిన దానికంటే ఎక్కువే ఇస్తా... వడ్డీ లేకుండానే అప్పులిప్పిస్తా... అయితే, ఒకే ఒక్క షరతు... నన్ను ఒక్కసారి ఎన్నుకోండి...
మాయమాటలతో మైనారిటీలకు జగన్ దగా
ఇస్లాం బ్యాంకుపై దారుణంగా మోసం
మసీదులన్నింటికీ గౌరవ వేతనంపై కల్లబొల్లి కబుర్లు
ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక నాలుక మడత
తెదేపా ప్రభుత్వమిచ్చిన రాయితీ రుణాలకూ పాతర
ఈనాడు, అమరావతి
ముస్లిం సోదరుల్లారా మీకేం కావాలో చెప్పండి... ఎంత మొత్తంలో కావాలో చెప్పండి... మీ కోసం ప్రత్యేకంగా ఇస్లాం బ్యాంకు పెడతా... మీరడిగిన దానికంటే ఎక్కువే ఇస్తా... వడ్డీ లేకుండానే అప్పులిప్పిస్తా... అయితే, ఒకే ఒక్క షరతు... నన్ను ఒక్కసారి ఎన్నుకోండి... ఇలా... అన్నదెవరో తెలుస్తోంది కదా? అవును... ఆయనే జగనన్న..!! పీఠమెక్కాక అన్నీ మరచిపోయారు!
‘‘ఏదైతే చేయగలుగుతానో... అది వేరే వాళ్లెవరూ చేయని విధంగా నాలుగు అడుగులు ముందుకేసి మరీ చేస్తా. కానీ మోసం చేయడం, అబద్ధాలు ఆడటం నాకు చేత కాదు. చేయగలిగిందే చెబుతా. చెప్పింది మాత్రం కచ్చితంగా చేసి చూపిస్తా...’’ ఇలాంటి మాటలు చెప్పడంలో జగన్ తర్వాతే ఎవరైనా. ప్రజల్ని ఆయన సులభంగా నమ్మించగలరు. అధికారం చేజిక్కించుకోవడమే పరమావధిగా ఎంతకైనా దిగజారుతారు. ఇదే కోవలో 2019 ఎన్నికల ముందు ముస్లింలపై అన్ని అస్త్రాలనూ ప్రయోగించారు. అధికారంలోకి రాగానే చాకచక్యంగా నాలుక మడతేశారు. ప్రతిపక్ష నేతగా ఇస్లాం బ్యాంకుపై ఆయన చెప్పిన మాటలు విని... తమని పేదరికం నుంచి బయటపడేసేందుకు జగన్ తోడ్పాటు అందిస్తారని ముస్లింలు కలలుగన్నారు. అదే ఆశతో ఐదేళ్లపాటు ఎదురుచూశారు. ఏటా వచ్చిన బడ్జెట్లు వచ్చినట్టే వెళ్లిపోయాయి. ఒక్కరికంటే ఒక్కరికీ వడ్డీ లేకుండా రుణాలిచ్చిన పాపాన పోలేదు. ఒక్క కుటుంబాన్నీ ఆదుకోలేదు. ఈ మోసం కళ్లదుటే కనిపిస్తున్నా... మళ్లీ నాలుగు సినిమా డైలాగులు రాసుకుని ఎన్నికల వేళ ప్రజల ముందుకు వస్తున్నారు. చేసిన నమ్మకద్రోహం చిట్టా చాంతాడంత ఉన్నా ‘చెప్పాడంటే... చేస్తాడంతే’ అంటూ అదే పాత పాటను మళ్లీ వాయించేందుకు ‘సిద్ధ’మవుతున్నారు.
ఇదీ వైకాపా ఘనకార్యం...
అధికారం చేపట్టిన తొలి ఏడాది(2019-20) జగన్ మైనారిటీల స్వయం ఉపాధి రుణాల కోసమని రాష్ట్ర బడ్జెట్లో రూ.84.84 కోట్లను కేటాయించారు. ఎలా అమలు చేయాలనే దానిపై కార్యాచరణ ప్రణాళికనూ సిద్ధం చేశారు. వ్యవసాయ, అనుబంధ రంగాలు, రవాణా వాహనాల కొనుగోలుకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. తర్వాత వీరికి రుణాలు ఎందుకివ్వాలని అనుకున్నారో... ఏమోగానీ మొత్తం పక్కన పెట్టారు. ఆ ఏడాది కేటాయించిన రూ.84.84 కోట్లను ఇతర పథకాలకు మళ్లించేశారు. ముస్లిం మైనారిటీలపై జగన్ ఎంత కర్కశంగా వ్యవహరించారో అర్థం చేసుకోవడానికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా?
రాయితీ రుణాలకూ పాతర
వైకాపా ఆవిర్భావం నుంచి ముస్లింలలో మెజారిటీ ఓటర్లు జగన్కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కానీ, వారిపై కృతజ్ఞత అనేదే లేకుండా జగన్ వ్యవహరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం విభజిత రాష్ట్రంలో 43.46 లక్షల మంది మైనారిటీలు ఉన్నారు. వారిలో ముస్లింలు 36.18 లక్షలు. వీరిలో అత్యధికులకు చిరు వ్యాపారాలు, చిన్నచిన్న పనులే జీవనాధారం. ఇలాంటి వారికి స్వయం ఉపాధి రాయితీ రుణాలు పెట్టనికోట వంటివి. జీవితంలో నిలదొక్కుకోడానికి, కుటుంబాన్ని పోషించుకోడానికి అవి దన్నుగా నిలుస్తాయి. కొన్ని దశాబ్దాల నుంచి వడ్డీలేని ఈ రుణాలను పొంది పేదరికం నుంచి బయట పడిన ముస్లిం కుటుంబాలెన్నో ఉన్నాయి. బహుశా ముస్లింలు అభివృద్ధి చెందితే తన మాయమాటలు నమ్మబోరనే భయం జగన్కు ఉండొచ్చు.అందుకే వడ్డీలేని రుణాలిస్తానని ఎన్నికల ముందు మాటిచ్చిన వ్యక్తే... చివరికి రాయితీ రుణాలకూ పాతరేశారు.
తెదేపా హయాంలో 45,244 మందికి రూ.248 కోట్ల రుణాలు
ముస్లింల అభివృద్ధికి తెదేపా ప్రభుత్వం ఎప్పుడూ అధిక ప్రాధాన్యమిచ్చింది. ఇతర వర్గాలకు అందే బోధనా రుసుంలు, పింఛన్లు, ఉపకార వేతనాలు, విదేశీవిద్య, పెళ్లికానుక పథకాలతోపాటు వారి అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంది. 2014-19 మధ్య స్వయం ఉపాధికి 50% రాయితీతో రుణాలిచ్చింది. సాధారణ వృత్తులు చేసుకునేందుకు రూ.2.50 లక్షలు, ఆటో, ట్యాక్సీ కారు తదితర రవాణా వాహనాల కొనుగోలుకు రూ.3 లక్షలను రుణంగా అందించింది. ఈ పథకానికి 2014-15 నుంచి 2018-19 వరకు ఏటా బడ్జెట్ కేటాయింపులు పెంచింది. 2014-15లో రూ.20 కోట్లుగా ఉన్న బడ్జెట్ 2018-19 నాటికి రూ.126 కోట్లకు చేరింది. ఐదేళ్లలో ఏకంగా 45,244 మందికి రాయితీ రుణాలిచ్చింది. ఇందుకోసం రూ.248 కోట్లు ఖర్చు చేసింది. ఈ సాయం ఇతర పథకాల ద్వారా అందే లబ్ధికి అదనం. అదే తెదేపా ప్రభుత్వం 2019-24 మధ్య కొనసాగి ఉంటే ఎక్కువ మంది ముస్లింలకు స్వయం ఉపాధి రాయితీ రుణాలు అందేవి. అంటే వారంతా పేదరికం నుంచి బయటపడేవారు. పోనీ, తెదేపా తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ఏమైనా అమలు చేశారా? అంటే అదీ లేదు. రాయితీ రుణాలకు మించి వడ్డీ లేని రుణాలిస్తామని మాయమాటలు చెప్పారు. గెలిచాక ఆ హామీని అమలు చేయకుండా దగా చేశారు. రాష్ట్రంలో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వేల మంది ముస్లింలు ప్రైవేటుగా వ్యాపారుల నుంచి రూ.5 వడ్డీతో రుణాలు తెచ్చుకుని అప్పులపాలై అల్లాడుతున్నారు.
ఇమామ్లు, మౌజమ్లకు వెన్నుపోటే...
మసీదుల్లో ఉండే ఇమామ్లు, మౌజమ్లకు ఆర్థిక సాయాన్ని అందించాలని మొదట నిర్ణయించింది తెదేపా ప్రభుత్వమే. రాష్ట్ర విభజన తర్వాత అప్పట్లో ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా రాష్ట్రవ్యాప్తంగా 5,000 మసీదుల్లోని ఇమామ్లు, మౌజమ్లకు సాయం అందించే పథకాన్ని వర్తింపచేసింది. ప్రతినెలా ఇమామ్లకు రూ.5 వేలు, మౌజమ్లకు రూ.3 వేల చొప్పున అందించింది. ఉమ్మడి అనంతపురం జిల్లా ముదిగుబ్బలో 2017 డిసెంబరు 11న నిర్వహించిన పాదయాత్రలో జగన్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని మసీదులకు పథకాన్ని విస్తరిస్తామని, గౌరవ వేతనాన్ని ఇమామ్లకు రూ.10 వేలు, మౌజమ్లకు రూ.5 వేల చొప్పున పెంచుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో దాదాపు 15 వేల మసీదులుంటే తెదేపా ప్రభుత్వం అమలు చేసిన ఐదు వేల మసీదులకే వర్తింపజేశారు. ఆదాయంలేని మరో రెండు వేల మసీదుల్లోని ఇమామ్లు, మౌజమ్లకు గౌరవవేతనాన్ని అమలు చేయాలని అధికారులు ఏడాదిన్నర క్రితమే నివేదించినా పట్టించుకోలేదు. కనీసం, గౌరవ వేతనాన్ని సక్రమంగా అందిస్తున్నారా? అంటే అదీ లేదు. ఎప్పుడూ మూడు, నాలుగు నెలలు పెండింగే. గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటివరకు 6 నెలల వేతనాలను వారికి ఇవ్వలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన