జగనన్న ‘గూడు’పుఠాణీ
జగనన్న కాలనీలన్నారు... వాటిల్లో పేదలకు స్థలాలన్నారు... కట్టుకునేందుకు సాయమూ చేస్తామన్నారు... దీనికోసం బడుగులు, రైతుల భూములను సేకరించారు.. పథకం ప్రారంభించి నాలుగేళ్లు గడిచింది.. భూములిచ్చిన వైకాపా నేతలకేమో సొమ్ము చెల్లించేశారు..
ప్రభుత్వ ఆస్తులు అమ్మి మరీ అస్మదీయులకు చెల్లింపులు
ఇళ్ల స్థలాలకు భూములిచ్చిన రైతులకు మాత్రం మొండిచేయి
రూ.1,150 కోట్లు బకాయి పడిన జగన్ సర్కారు
నాలుగేళ్లుగా కాళ్లరిగేలా తిప్పించుకుంటున్న వైనం
ఈనాడు, అమరావతి
జగనన్న కాలనీలన్నారు... వాటిల్లో పేదలకు స్థలాలన్నారు... కట్టుకునేందుకు సాయమూ చేస్తామన్నారు... దీనికోసం బడుగులు, రైతుల భూములను సేకరించారు.. పథకం ప్రారంభించి నాలుగేళ్లు గడిచింది.. భూములిచ్చిన వైకాపా నేతలకేమో సొమ్ము చెల్లించేశారు.. కానీ, పేదలకు మాత్రం బకాయి పెట్టారు.. సాగు చేసే భూములను పోగొట్టుకొని.. పరిహారమూ రాకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. కలెక్టర్లకు, స్థానిక అధికారులకు విన్నవిస్తున్నా.. గోడు వినేవాళ్లే లేరంటూ ఘొల్లుమంటున్నారు!
పెద్దాపురం మండలం కట్టమూరుకు చెందిన ఓ మహిళ పేరిట 29 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. దీన్ని నాలుగేళ్ల క్రితం బ్రహ్మానందపురం జగనన్న లేఅవుట్ కోసం అధికారులు సేకరించారు. ఆమెకు సుమారు రూ.16 లక్షలు చెల్లించాల్సి ఉన్నా... ఇప్పటికీ మంజూరు చేయలేదు. ‘స్పందన’ కార్యక్రమంలో పలు దఫాలు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. బిల్లు అప్లోడ్ చేసినట్లు చూపుతున్నారే తప్ప.. డబ్బులు మాత్రం జమ కావడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.
కాకినాడ గ్రామీణ మండలం పండూరులో 0.57 ఎకరాలకు సంబంధించి ముగ్గురు రైతులకు సుమారు రూ.18 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇదే మండలం తిమ్మాపురంలో మరో ముగ్గురు రైతులకు సంబంధించి 1.40 ఎకరాలకు దాదాపు రూ.76 లక్షలు చెల్లించాల్సి ఉంది. నేమాంలోనూ ముగ్గురు రైతులకు సంబంధించి 1.38 ఎకరాలకు రూ.48 లక్షల బకాయి ఉంది.
రాష్ట్రంలో ‘జగనన్న ఇళ్ల కాలనీ’ల పథకం ప్రహసనంగా మారింది. స్థలాల సేకరణ నుంచి లబ్ధిదారులకు అందజేత.. ఆ తర్వాత నిర్మాణం, బిల్లుల చెల్లింపు వరకూ పేద ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఆయా కాలనీల్లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం నిరుపేద రైతులు, దళితుల నుంచి సేకరించిన భూములకు జగన్ సర్కారు సొమ్ములు చెల్లించడం లేదు. అలాగని ఎవరికీ ఇవ్వడం లేదా అంటే.. కాదు. వైకాపా నేతలు, అనుచరవర్గానికి, బడా గుత్తేదారులకు మాత్రం పక్కాగా బిల్లులు ఇచ్చేస్తున్నారు. ఎన్నికల కోడ్ మరో 10 రోజుల్లో అమల్లోకి వస్తుందనగా.. ప్రభుత్వ ఆస్తులను అమ్మి మరీ తమకు కావాల్సిన వారికి చెల్లించడం గమనార్హం. అదే నిరుపేదల నుంచి సేకరించిన భూములకు రూ.1,150 కోట్ల మేర బకాయి పెట్టారు. నాలుగేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. వారిని పట్టించుకున్న పాపాన పోలేదు.
ఆ జిల్లాలో రూ.430 కోట్లు పెండింగ్..
బిల్లుల చెల్లింపు పరంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా రూ.430 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక్కడ వైకాపా ఎంపీ భరత్ ప్రోద్బలంతో ఆయన అనుచరులకు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేందుకు వారం రోజుల ముందు కూడా అధికారులు బిల్లులు చెల్లించినట్టు తెలుస్తోంది. రాజమహేంద్రవరం, అనపర్తి, రాజానగరం పరిధిలో ఎక్కువగా బడా నేతలకు బిల్లులు చెల్లించారు. ప్రకాశం జిల్లాలో ఏకంగా రూ.170 కోట్ల మేర బిల్లుల్ని వైకాపా నేతలు, అనుచరులకు ఇచ్చేశారు. ఇంకా ఈ జిల్లా పరిధిలో రూ.50 కోట్ల మేర చెల్లించాలి. చిత్తూరు జిల్లాలోనూ రూ.100 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా వైయస్సార్లో మాత్రం దాదాపు బకాయిలు లేకుండా చూసుకున్నారు. ఇక్కడ కేవలం రూ.6 కోట్ల వరకు మాత్రమే చెల్లించాల్సి ఉంది. వీరందరూ పేదలే కావడంతో జగన్ సర్కారు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది.
స్వగృహ భూములమ్మి మరీ..
వైకాపా నేతలకు బిల్లులు చెల్లించేందుకు జగన్ ఏకంగా ప్రభుత్వ ఆస్తుల్నే అమ్మేశారు. విశాఖలోని ఎండాడ పరిధిలో ఉన్న స్వగృహ భూముల్ని విక్రయించి రూ.35 కోట్ల బకాయిలు సర్దుబాటు చేశారు. ఈ మొత్తాన్ని వైకాపా ఎంపీ భరత్ సూచించిన వారితోపాటు ప్రకాశం జిల్లాలో కొంతమంది వైకాపా నేతలకు సంబంధించిన చెల్లింపులకు వినియోగించారు.
పరిహారం అడిగిన రైతులపై దాడి
జగన్ ఏలుబడిలో వైకాపా నేతలు చెప్పిందే వేదం. ఎదురు తిరిగితే దాడి చేయడమే వారి నైజం. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోనూ ఇదే జరిగింది. బొడ్డపాడు రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 76లోని డీ-పట్టా భూమిని సుమారు 40 ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్నారు. అక్కడ బొడ్డపాడు, మామిడిపల్లి గ్రామాలకు చెందిన 36 మందికి 2020లో జగనన్న కాలనీ కింద ఇళ్ల స్థలాలు కేటాయించారు. రైతులకు పరిహారం ఇవ్వకుండానే నిర్మాణాలు చేపట్టారు. దీనిపై నెలల తరబడి పోరాడిన అన్నదాతలు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. న్యాయస్థానాలంటే వైకాపా నేతలకు లెక్కే ఉండదు కదా? అందుకే స్థానిక వైకాపా నేతలు కొందరు అనుచరుల సాయంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై దాడికి తెగబడ్డారు. చివరకు ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి.
దళితుల భూమి అయితే.. లాక్కోవడమే..
దళితుల భూమి కనిపిస్తే చాలు.. జగన్కు పండగే. ఏళ్లుగా వారు సాగు చేసుకుంటున్నా సరే.. ఏదో ఒక సాకు చూపించి బలవంతంగా లాగేసుకోవడం ఆయనకో సరదా. జగనన్న కాలనీల్లో భూ సేకరణలో ఎక్కువగా నష్టపోయింది దళితులే. తోట్లవల్లూరులో 21 మంది రైతులు 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 9.47 ఎకరాల భూమిపై వైకాపా నేతల కన్నుపడింది. ఇంకేముంది.. ఇళ్ల స్థలాల పంపిణీ కోసమంటూ అధికారులు వారి వద్ద నుంచి బలవంతంగా భూములను సేకరించారు. అప్పటికే సాగులో ఉన్న పంటను దున్నించి మరీ స్వాధీనం చేసుకున్నారు. స్థలాన్ని చదును చేసి 430 ప్లాట్లుగా మార్చారు. దాంతో మరో మార్గం లేక దళితులు కోర్టును ఆశ్రయించగా.. స్టే వచ్చింది. ఆ తర్వాత అప్పటికే అక్కడ గుర్తించిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మరో దగ్గర 10 ఎకరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించినా.. జగన్ దాన్ని అటకెక్కించారు.
భారీగా వెనకేసుకున్నారు..
రాష్ట్రవ్యాప్తంగా 30.76 లక్షల మందికి ఇళ్ల స్థలాలను అందించినట్టు వైకాపా ప్రభుత్వం చెబుతోంది. ఇందులో జగనన్న కాలనీల కోసం రూ.11 వేల కోట్లు వెచ్చించి ప్రైవేటు స్థలాలను సర్కారు కొనుగోలు చేసింది. ఇందులోనూ వైకాపా నేతల చేతివాటం చూపించారు. కాలనీల ఏర్పాటుపై సమాచారమున్న కొందరు అధికార పార్టీ నేతలు.. వారి భూములకు సమీపంలోనే అవి వచ్చేలా మంత్రాంగం నడిపారు. మరికొందరు మాత్రం కాలనీలు రాబోయే చోట భూములున్న పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఆ తర్వాత ప్రభుత్వానికి ఎక్కువకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఎకరం రూ.10 లక్షలు కూడా చేయని భూముల్ని.. రూ.40 లక్షలకు సర్కారుకు కట్టబెట్టిన ఉదంతాలూ ఉన్నాయి. మొత్తంగా భూముల సేకరణలో రూ.వందల కోట్ల కుంభకోణం జరిగినట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అంతేకాదు.. ఇళ్ల స్థలాల చదును పేరుతోనూ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
రైతుల్ని రెచ్చగొట్టి.. నిలువునా ముంచి..
వైకాపా నేతలు ఓట్ల కోసం ఎన్ని కుయుక్తులైనా పన్నుతారనేందుకు ధర్మవరం మండలం పోతులనాగేపల్లిలో ఇళ్ల స్థలాల కేటాయింపే నిదర్శనం. ఇక్కడ తెదేపా హయాంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసమని 90 మంది నుంచి 210 ఎకరాలు సేకరించారు. ఎకరాకు రూ.5 లక్షల పరిహారం, ప్రతి పాసుపుస్తకానికి రూ.5 లక్షలతోపాటు లేఅవుట్లో ఒక్కొక్కరికి 5 సెంట్ల స్థలం ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీన్ని అడ్డుకునేందుకు కుట్ర పన్నిన వైకాపా నేత ఒకరు.. రూ.20 లక్షల పరిహారమివ్వాలని అప్పట్లో రైతులను రెచ్చగొట్టారు. దీంతో 52 మంది తెదేపా ప్రభుత్వమిచ్చిన పరిహారం తీసుకోకుండా కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం స్టే ఇవ్వడంతో మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చింది. మరి ఆ నేత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులతో డిమాండ్ చేయించిన విధంగా రూ.20 లక్షలు ఇవ్వాలి కదా? కానీ, అదే నోటితో ఎకరాకు రూ.5 లక్షలకు మించి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. పైగా లేఅవుట్లో స్థలాలు ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించబోవని స్పష్టం చేశారు. ఇంతకంటే నమ్మకద్రోహం ఉంటుందా? ఇటీవల న్యాయస్థానం స్టే ఎత్తేయడంతో ఆ భూముల్లోనే జగనన్న కాలనీ ఏర్పాటుకు నిర్ణయించి, తెదేపా ఇచ్చిన పట్టాలను రద్దు చేసి కొత్తవారికి కేటాయించారు. రైతులకు పైసా పరిహారం చెల్లించకుండానే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్