YS Jagan: తాలిబన్ పాలనను తలదన్నేవారు జగన్కు సౌమ్యులట
వినేవాడు ఉంటే ‘టంగుటూరి మిరియాలు తాటికాయంత ఉంటాయన్నారంట’ వెనుకటి ఒకరు.. అలా ఉంది సీఎం జగన్ పరిస్థితి. వినే జనాలు ఉంటే అబద్ధాన్ని సైతం నిజమనుకునేలా అలవోకగా చెప్పేస్తారు.
దాడులు, భయాందోళనలు సృష్టించేవారు మంచివారట
అన్నమయ్య జిల్లా అభ్యర్థుల పరిచయంలో అలవోకగా జగన్ అబద్ధాలు
ఈనాడు, అమరావతి, కడప: వినేవాడు ఉంటే ‘టంగుటూరి మిరియాలు తాటికాయంత ఉంటాయన్నారంట’ వెనుకటి ఒకరు.. అలా ఉంది సీఎం జగన్ పరిస్థితి. వినే జనాలు ఉంటే అబద్ధాన్ని సైతం నిజమనుకునేలా అలవోకగా చెప్పేస్తారు. సభకు వచ్చిన జనాలు.. టీవీల్లో చూసే వారికి ఏమి తెలియదనుకుంటారో ఏమో.. లేదంటే అక్రమ సంపాదన, అరాచకాల్లో ఆయన కంటే తన అభ్యర్థులు తక్కువ చేస్తున్నారని భావిస్తున్నారో ఏమోగాని వారిని మంచివారు, సౌమ్యులంటూ చెబుతున్నారు. ఇది విన్న, చూసిన జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. అరాచకం.. ప్రకృతి సంపద దోపిడీ.. భయాన వాతావరణం.. వాక్ స్వాతంత్య్రాన్ని కాలరాసేవారు జగన్ దృష్టిలో సౌమ్యులేనేమో.! ఇప్పటికే కర్నూలు జిల్లాలో వైకాపా తరపున పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థులందరూ పేదవారంటూ చెప్పిన జగన్.. మదనపల్లెలో మంగళవారం జరిగిన బస్సు యాత్ర సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్రెడ్డి, కుమారుడు మిథున్రెడ్డిలు మంచివాళ్లు, సౌమ్యులంటూ చెప్పడాన్ని చూపి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మానవహక్కులను కాలరాస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు సౌమ్యులంట.
సౌమ్యుడు 1
పుంగనూరు నుంచి రామచంద్రారెడ్డి అన్న నిలబడుతున్నాడు. నాకు పితృ సమానుడు. మీ అందరికి పరిచయస్తుడు. మంచివాడు. సౌమ్యుడు - జగన్
- పుంగనూరు నియోజకవర్గం తాలిబన్ల పాలనను తలదన్నేలా ఉందనే విమర్శలున్నాయి. ఇక్కడ ప్రతిపక్ష నేతలపై ఆయన అనుచరులు దాడులు చేస్తారు. వారే పోలీసులతో కేసులు పెట్టిస్తారు. విద్యుత్తు ప్రాజెక్టులైనా.. గనుల తవ్వకాలైనా.. పోటీ లేకుండా ఆయన కాళ్ల దగ్గరకు వస్తాయనే ఆరోపణలున్నాయి.
- సోమల మండలం బండకాడ ఎస్సీ కాలనీకి చెందిన దళిత యువకుడు ప్రభుత్వ మద్యం విధానంపై విమర్శించిన రెండు రోజులకే ఓం ప్రతాప్ అనుమానాస్పద స్థితిలో మరణించారు.
- మార్లపల్లెకు చెందిన వృద్ధుడు అంజిరెడ్డి తెదేపా తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్లగా ఆయనపై దాడికి యత్నించిన ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది.
- పులిచెర్ల మండలం చల్లావారిపల్లెకు చెందిన తెదేపా కార్యకర్త శివకుమార్ ఇసుక దోపిడీపై గళమెత్తడంతో 2022 జులైలో వైకాపా నాయకులు దాడి చేశారు. చేతులు విరగొట్టి రోడ్డు పక్కన పడేశారు.
- పచ్చార్లమాకులపల్లెకు చెందిన రాజారెడ్డి తెదేపాలో క్రియాశీలకంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక 2022 ఏప్రిల్లో కొందరు కిడ్నాప్ చేసి కాళ్లు విరిచేశారు.
- భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్ర యాదవ్ ఇంటిపై వైకాపా కార్యకర్తలు దాడి చేసి కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
- మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెదేపా కార్యకర్తలు చేపట్టిన సైకిల్ యాత్రను పుంగనూరులో అడ్డుకున్నారు. పసుపు రంగు దుస్తుల్ని బలవంతంగా విప్పించేశారు.
సౌమ్యుడు-2
తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి ద్వారకానాథ్ నిలబడుతున్నారు. ద్వారకా అన్న కూడా సౌమ్యుడు, మంచివాడు - జగన్
తంబళ్లపల్లెలోనూ గత ఐదేళ్లుగా తాలిబన్ తరహా రాజ్యం నడుస్తోందనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్ని కొందరు ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. భూమి యజమానులు లేకుండానే బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు విమర్శలున్నాయి. తన ఇంటికి, పొలాలకు అవసరమైన రహదారుల నిర్మాణానికి ప్రైవేటు భూముల్ని ఆక్రమించుకున్నారనే విమర్శలున్నాయి.
- ఎలాంటి అనుమతులు లేకుండా అత్యంత ఖరీదైన ఒ గ్రానైట్ క్వారీని నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ములకలచెరువు, బి.కొత్తకోట, కురబలకోట, అంగళ్లు, హార్సిలీ హిల్స్ కింద భూముల్ని బినామీల పేరిట కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి.
- ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినట్లు, ఆయన అనుచరులు పలువురిపై దాడులకు పాల్పడి ఆస్తుల్ని స్వాహా చేసినట్లు ప్రచారం ఉంది.
సౌమ్యుడు-3
రాజంపేట నుంచి అమరన్న నిలబడుతున్నారు. అమరన్నను ఎవ్వరు కలిసినా కూడా సౌమ్యుడు అనే మాట వాళ్ల పెదాలపై ఉంటుంది. - జగన్
రాజంపేట మండలం మందపల్లె రెవెన్యూ గ్రామం నారమరాజుపల్లె గ్రామానికి సమీపంలో ప్రభుత్వ భూముల్లో ఎస్టేట్ను నిర్మించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఎస్టేట్లోకి జిల్లా పరిషత్ నిధులతో రోడ్లు నిర్మాణం చేపట్టినట్లు విమర్శలున్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన తరుణంలో నిర్మించిన రహదారులకు ఆయన అనుచరులు రూ. 3 కోట్ల జడ్పీ నిధులతో అక్రమంగా బిల్లులు చేయించుకున్నారనే ఆరోపణలున్నాయి.
మంచివాడు-5
ఎంపీ అభ్యర్థిగా మిథున్ నిలబడుతున్నారు. యువకుడు ఉత్సాహవంతుడు. పరిచయస్తుడు. మంచివాడు -జగన్
తిరుపతి, కడప మార్గాల్లోని జాతీయ రహదారుల వెంబడి రూ. 400 కోట్ల విలువైన భూముల్ని ఆయన అనుచరులు, అనుయాయులు ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. 282 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు ప్రభుత్వ విచారణలో తేలింది. ఇద్దరు తహసీల్దార్లు, 8 మంది వీఆర్వోలు, 4 ఆర్ఐలపై ప్రభుత్వం వేటు వేసింది. భూములు మాత్రం ఆక్రమణదారుల చెర నుంచి వెనక్కిరాలేదు.
మంచి స్నేహితుడు-4
రాయచోటి నుంచి శ్రీకాంత్ నిలబడుతున్నారు. ఎమ్మెల్యే కంటే కూడా నాకు మంచి స్నేహితుడని చెప్పవచ్చు -జగన్
రాయచోటిలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కేటాయించిన రూ. 120 కోట్ల విలువైన భూమిని ఆయన అనుచరులు ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ పత్రాలతో భూమిని రిజిస్ట్రేషన్ చేయించినట్లు విమర్శలున్నాయి. ఏడుగురు వైకాపా నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM