ఎంతైనా తీసుకోండి.. ఓట్లు వేయించండి
పట్టణ పొదుపు సంఘాల నిర్వహణలో క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించే రిసోర్స్ పర్సన్ల(ఆర్పీ)ను వైకాపా నేతలు ప్రలోభపెడుతున్నారు. మహిళల ఓట్లు తమకే వేయించాలని వారికి ప్యాకేజీలిస్తున్నారు.
రిసోర్స్ పర్సన్లకు వైకాపా ఎర
ప్యాకేజీలకు తలొగ్గిన కొందరు ఆర్పీలు
మహిళా సంఘాలతో రహస్య భేటీలు
విశాఖ, విజయవాడ, కాకినాడ, గుంటూరుల్లో ఇప్పటికే తాయిలాల పంపిణీ
ఈనాడు - అమరావతి
పట్టణ పొదుపు సంఘాల నిర్వహణలో క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించే రిసోర్స్ పర్సన్ల(ఆర్పీ)ను వైకాపా నేతలు ప్రలోభపెడుతున్నారు. మహిళల ఓట్లు తమకే వేయించాలని వారికి ప్యాకేజీలిస్తున్నారు. అనేకచోట్ల ఆర్పీలు అంగీకరించడంతో వారికి భారీగా సొమ్ములు ఇస్తున్నారు. రిసోర్స్ పర్సన్లను నియంత్రించాల్సిన పుర, నగరపాలక సంస్థల అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అక్రమ ఆర్థిక వ్యవహారాలపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల కమిషన్ కూడా చోద్యం చూస్తోంది. ఎన్నికల్లో గెలుపునకు వైకాపా నేతలు ఇప్పటికే అనేక అడ్డదార్లు తొక్కుతున్నారు. ఈ క్రమంలో పట్టణ మహిళలకు పొదుపు పట్ల అవగాహన కల్పిస్తూ, బ్యాంకు రుణాల సద్వినియోగాన్ని పర్యవేక్షించే ఆర్పీల ద్వారా మంత్రాంగం నడుపుతున్నారు. ఆర్పీలకు ప్రభుత్వం ప్రతినెలా రూ.7 వేల గౌరవ వేతనం చెల్లిస్తుంది. ఒక్కో ఆర్పీ పరిధిలో 25 సంఘాలు ఉండగా, ఒక్కో సంఘంలో పది మంది సభ్యుల చొప్పున మొత్తం 250 మంది ఉంటారు. ఒక్కో నియోజకవర్గంలో 30 వేల నుంచి 40 వేల మంది సభ్యులు ఉంటారని అంచనా.
ఏ నగరం చూసినా.. అదే తీరు
- విశాఖ నగరంలోని రెండు నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు ఒక్కో ఆర్పీకి ఇప్పటికే రూ.25 వేల చొప్పున నజరానాలు అందించారు. వీరు తమ పరిధిలోని మహిళా సభ్యులకు తాయిలాలు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పొదుపు సంఘాలను సమన్వయం చేసే కొందరు కో-ఆర్డినేటర్లు అభ్యర్థులకు బాహాటంగానే సహకరిస్తున్నారు.
- కాకినాడ నగర పరిధిలోని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే ముందే ఆర్పీలతో సమావేశమై మహిళల మద్దతు తనకే లభించేలా చూడాలని కోరారు. ఇటీవలే కొందరు ఆర్పీలకు రూ.20 వేల చొప్పున నగదు పంచారు. వీరి ద్వారా కానుకలు సభ్యులకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
- విజయవాడ నగరంలోని ఓ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఆర్పీలతో పాటు పొదుపు సంఘాల్లో చురుగ్గా ఉండే మహిళా సభ్యులతో ఇప్పటికే రెండుసార్లు సమావేశమయ్యారు. ‘ఏం కావాలో, ఎంత కావాలో తీసుకెళ్లండి. సభ్యుల ఓట్లు నాకే పడాలి’ అని ఆఫర్ ఇచ్చారు. దీనికి అంగీకరించిన కొందరు ఇప్పటికే రంగంలో దిగారు.
- గుంటూరు జిల్లాలో ఓ అభ్యర్థిని ఆర్పీల ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలతో డివిజన్ల వారీగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆమె అనుచరులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. సభ్యులకు చీరలు, ఇతర బహుమతులు అందిస్తూ ఎర వేస్తున్నారు.
- తిరుపతి జిల్లాలోని వైకాపా అభ్యర్థి ఒకరు నాలుగు రోజుల క్రితం నగరానికి దూరంగా ఆర్పీలతో రహస్యంగా సమావేశమయ్యారు. మహిళలకు తాయిలాలు అందించే బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఒక్కో ఆర్పీకి రూ.25 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు.
- ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి కోడ్ అమల్లోకి వచ్చే ముందే ఆర్పీలతో భేటీ అయ్యి, ప్యాకేజీలు నిర్ణయించారు. పొదుపు సంఘాల సభ్యుల ఓట్లు తనకే పడాలని, ఇందుకు ఏం చేయడానికైనాసిద్ధమేనని ప్రకటించారు. ఆయన తరఫున మహిళలతో ఆర్పీలుమంత్రాంగం నడుపుతున్నారు.
‘మహా’ అధికారి అరాచకం
పొదుపు సంఘాల మహిళల మద్దతు వైకాపాకే లభించేలా కొన్నిచోట్ల నగరపాలక సంస్థల అధికారులు బాహాటంగానే పని చేస్తున్నారు. మహిళా సంఘాల కార్యకలాపాల పర్యవేక్షణకు విశాఖ, విజయవాడ కార్పొరేషన్లలో ప్రత్యేకంగా పట్టణ సామాజికాభివృద్ధి విభాగాలు (యూసీడీ) ఉన్నాయి. మిగతా నగరపాలక సంస్థల్లో ప్రాజెక్టు అధికారులు పని చేస్తున్నారు. విశాఖలో ఓ అధికారి వైకాపా అభ్యర్థులకు మద్దతుగా పని చేస్తున్నట్లు తీవ్ర విమర్శలున్నాయి. మహిళలు వైకాపాకు అండగా నిలిచేలా ఆర్పీలు, కో-ఆర్డినేటర్ల ద్వారా తెర వెనుక వ్యవహారాలు నడుపుతున్నారు. కాకినాడలో ఓ అధికారిపై ఇలాంటి ఫిర్యాదులు రాగా, ఇటీవల ఉన్నతాధికారులు ఆ బాధ్యతల నుంచి తప్పించారు. మరోపక్క, వైకాపా నేతల ఒత్తిడి తట్టుకోలేక విజయవాడలోని యూసీడీ అధికారి ఒకరు బాధ్యతల నుంచి కొద్ది రోజుల క్రితం వైదొలిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్