727 ఎకరాలు మింగేసే కుట్ర!
అన్నమయ్య జిల్లాలో ఓ మఠం భూములపై ప్రభుత్వంలో నంబరు 2గా ఉన్న ‘పెద్దాయన’ కన్ను పడింది. వాటిని ఎలాగైనా కొట్టేసేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లాలోని వ్యాసరాయ మఠం భూములపై ‘పెద్దాయన’ కన్ను
మఠం దేవాదాయశాఖ పరిధిలోకి రావడంతో భూములు నిషేధిత జాబితాలోకి..
వాటిని జాబితా నుంచి తొలగించాలని అధికార పార్టీ నేత ద్వారా అర్జీ..
వేగంగా కదులుతున్న దస్త్రం
కుదరదంటూ దేవాదాయశాఖ, ఏజీ అభిప్రాయపడినా.. పట్టించుకోని వైనం
ఈనాడు - అమరావతి
అన్నమయ్య జిల్లాలో ఓ మఠం భూములపై ప్రభుత్వంలో నంబరు 2గా ఉన్న ‘పెద్దాయన’ కన్ను పడింది. వాటిని ఎలాగైనా కొట్టేసేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కుదరదని దేవాదాయశాఖ అధికారులు, న్యాయ నిపుణులు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. ఆ భూములను సొంతం చేసుకునేందుకు పెద్ద మంత్రాంగమే నడుపుతున్నారు. దీంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ దస్త్రం కదులుతూనే ఉంది. దేవాదాయశాఖలో కీలకాధికారి దీనిపై సమీక్షకు సిద్ధమవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కర్ణాటకలోని మైసూరుకు సమీపంలో ఉన్న సొసాలే కేంద్రంగా ఉన్న వ్యాసరాయ మఠానికి అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం పట్టెంవాండ్లపల్లెలోని సర్వే నంబరు 1లో 727.43 ఎకరాల భూమి ఉంది. 1బి రిజిస్టర్లో వ్యాసరాయ మఠం భూమి అని, దీనికి ఖాతా నంబరు 1017 కూడా కేటాయించారు.
ఇది కర్ణాటకకు చెందిన మఠం అయినప్పటికీ ఏపీ దేవాదాయ చట్టం 1987 ప్రకారం దీనిని దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే మఠంగా గుర్తించారు. 1997లో ఈ భూమంతా ఆ మఠానికి చెందినదంటూ అప్పటి తహసీల్దార్ పట్టా జారీ చేశారు. కర్ణాటక ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆ భూముల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం 2013లో చిత్తూరు కలెక్టర్కు ఆదేశాలు జారీచేసింది. 2016లో రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయశాఖకు చెందిన ఆలయాలు, సత్రాలు, మఠాలు, దేవాదాయ సంస్థల భూములు గుర్తించి, వాటిని ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీల్లేకుండా నిషేధిత జాబితాలో చేర్చారు. వ్యాసరాయ మఠానికి చెందిన 727.43 ఎకరాలు సైతం ఆ జాబితాలోకి ఎక్కాయి.
జీపీఏ ఉందంటూ విక్రయాలు
ఈ భూముల్లో చాలాకాలంగా కొందరు రైతులు సాగు చేస్తున్నారు. వీరిలో కొందరు గతంలో ప్రభుత్వం నుంచి పట్టాలు కూడా పొందారు. కొందరు రైతులు ఈ భూములను ఇతరులకు విక్రయించారు. మరోవైపు కర్ణాటకలోని మఠాధిపతి తమకు జీపీఏ ఇచ్చారంటూ పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన ఓ అధికార పార్టీ నేత, కర్ణాటకకు చెందిన ఇద్దరు, తమిళనాడుకు చెందిన మరొకరు ఈ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరుకు చెందిన ఓ నేత ఈ భూములన్నీ తనవేనంటూ హడావుడి చేస్తున్నారు. స్థానికంగా మధ్యవర్తులను పెట్టుకొని ఆ భూములు సాగు చేసుకుంటున్నవారికి కొంత మొత్తం ఇచ్చి, తన ఆధీనంలోకి తీసుకునేందుకు చూస్తున్నారు. ఈ భూములకు సంబంధించి మఠాధిపతి ఇచ్చిన జీపీఏలన్నింటినీ రద్దు చేస్తూ 2012 మే 31న ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయినప్పటికీ ఆయా వ్యక్తులు జీపీఏ ఉందంటూ దందాలు చేస్తున్నారు. ఈ భూముల టైటిల్ విషయంలో హైకోర్టులోనూ, మదనపల్లె కోర్టులోనూ కేసులు కూడా కొనసాగుతున్నాయి.
కుదరదంటూ అంతా నివేదికలు
వైకాపా నేత అర్జీపై ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయశాఖ గత ఏడాది ఓ కమిటీని వేసింది. ప్రాంతీయ సంయుక్త కమిషనర్, దేవాదాయ భూపరిరక్షణ డిప్యూటీ కలెక్టర్, రాయలసీమ జిల్లాల ఉప కమిషనర్, అన్నమయ్య జిల్లా దేవాదాయశాఖ అధికారులతో కూడిన కమిటీ దీనిపై నివేదిక ఇవ్వాలని కోరింది. వీరిలో రాయలసీమ జిల్లాల ఉప కమిషనర్ మాత్రం అధికార పార్టీ నేతలకు అనుకూలంగా కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది. ఆయన చాలాకాలం అధికార పార్టీ కీలక నేతల సహకారంతో ఇన్ఛార్జ్ హోదాలో ఆ పదవిలో కొనసాగారు. మిగిలిన అధికారులు మాత్రం.. అన్ని ప్రభుత్వ రికార్డుల్లో ఇవి మఠం భూములని స్పష్టంగా ఉన్నాయంటూ నివేదిక ఇచ్చారు. దేవాదాయశాఖ న్యాయసలహాదారు సైతం.. ఈ భూములు నిషేధిత జాబితాలో ఉండటం సరైనదేనని, దీని ప్రధాన మఠం ఎక్కడున్నా, ఆ భూములు దేవాదాయశాఖ కిందే ఉంటాయని స్పష్టం చేశారు. చివరకు అడ్వకేట్ జనరల్ కూడా.. ఈ భూముల కేసులు కోర్టుల్లో ఉన్నందున వాటి తీర్పులు వచ్చేవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించారు. నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటే దేవాదాయ ట్రైబ్యునల్లో విచారణ తప్పనిసరని చెప్పారు. ఇదంతా జరిగి ఏడెనిమిది నెలలయింది.
మళ్లీ కదులుతున్న దస్త్రం
ఈ భూముల దస్త్రం ఇప్పుడు మళ్లీ కదులుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ, ఫలితాలు వెలువడే నాటికి దీనిని కొలిక్కి తీసుకురావాలంటూ ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది. అందుకే దేవాదాయశాఖ కీలక అధికారి ఈ భూములపై ఈ నెల 16న సచివాలయంలో సమీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ భూముల రికార్డులు, ఇతర వివరాలన్నీ ఈ నెల 14లోపు దేవాదాయ కమిషనరేట్కు పంపాలంటూ అన్నమయ్య జిల్లాతోపాటు రాయలసీమ స్థాయి దేవాదాయశాఖ అధికారులకు ఆదేశాలు వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది.
రంగంలోకి ‘పెద్దాయన’
కొంతకాలంగా ఈ భూములపై ‘పెద్దాయన’ కన్నుపడినట్లు తెలిసింది. ఎలాగైనా 727.43 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు పావులు కదపటం మొదలుపెట్టారు. జీపీఏ ఉందని చెప్పే.. పెద్దతిప్పసముద్రం మండలంలోని వైకాపా నేత పేరిట ప్రభుత్వానికి గతంలో అర్జీ పెట్టించారు. ఈ భూములకు చెందిన మఠం కర్ణాటకలో ఉందని, ఇక్కడి దేవాదాయశాఖకు దీనితో సంబంధం లేదని, అవేమీ పట్టించుకోకుండా నిషేధిత జాబితాలో పెట్టారని అందులో పేర్కొన్నారు. వెంటనే నిషేధిత జాబితా నుంచి ఈ భూములను తొలగించాలని కోరారు. తమకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలంటూ ఈ అర్జీపై ఆ ‘పెద్దాయన’ ద్వారా దేవాదాయశాఖపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి