ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు ఘోరం
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిస్థితి దారుణంగా తయారైంది. సర్కారీ కాలేజీల్లో చదువుకున్న వారిలో ప్రథమ సంవత్సరంలో 62%, ద్వితీయ సంవత్సరంలో 42% మంది విద్యార్థులు ఫెయిలయ్యారు.
మొదటి ఏడాదిలో 62% విద్యార్థులు ఫెయిల్
ద్వితీయ సంవత్సరంలోనూ 42% అనుత్తీర్ణులు
ఉన్నత చదువులకు దూరమైన పేదింటి బిడ్డలు
జగన్ సర్కారు తిరోగమన నిర్ణయాల పర్యవసానం
ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిస్థితి దారుణంగా తయారైంది. సర్కారీ కాలేజీల్లో చదువుకున్న వారిలో ప్రథమ సంవత్సరంలో 62%, ద్వితీయ సంవత్సరంలో 42% మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. రాష్ట్రవ్యాప్త సగటు ఉత్తీర్ణత 67% కాగా, ప్రభుత్వ కాలేజీల్లో అంతకంటే 29% తక్కువగా అంటే.. కేవలం 38% ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో కలిపి 46,549 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరైతే 17,789 (38%) మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోనూ పెద్ద మార్పేమీ లేదు. రెండో ఏడాది పరీక్షలకు 46,549 మంది హాజరుకాగా, 21,382 (58%) మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర సగటు 78%తో పోల్చితే ఇది 20% తక్కువ. ప్రభుత్వ కళాశాలల్లో ఓ పక్క ప్రవేశాలు తగ్గిపోతుండగా, చేరిన వారిలోనూ పాస్ అవుతున్న వారి సంఖ్య దారుణంగా పడిపోతోంది. ఇక్కడ చదివే వారిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదవర్గాల పిల్లలే. వారికి నాణ్యమైన విద్యనందించి, పై చదువులకు పంపించాల్సిన సర్కారు.. ఇంటర్తోనే సరిపెడుతోంది. ‘ప్రభుత్వ కళాశాలల్లో టోఫెల్ నేర్పిస్తాం. అంతర్జాతీయ స్థాయి విద్యార్థులుగా తీర్చిదిద్దుతాం. మన విద్యార్థులు పోటీ పడేది జాతీయ స్థాయిలో కాదు, ప్రపంచంతో’ అని గొప్పలు చెప్పిన జగన్.. ఇంటర్లో కనీస ఫలితాలు సాధించేందుకూ చర్యలు తీసుకోలేదు. ప్రతి సభలోనూ పేద వర్గాలపై ప్రేమ నటించడమే కానీ, వారి పిల్లల ఉన్నత చదువులకు ప్రోత్సాహమేది అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది.
గురువుల్లేని గుడ్డి విద్య
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పాఠాలు చెప్పేవారే కరవయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 84 కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేకుండానే ఒప్పంద, అతిథి అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. అన్ని కళాశాలల్లో కలిపి 6,116 పోస్టులుండగా, వీటిల్లో పనిచేస్తున్న రెగ్యులర్ అధ్యాపకులు 2,010 మంది మాత్రమే. రెగ్యులర్ అధ్యాపక పోస్టులు లేని కళాశాలలకు పోస్టులు మంజూరు చేయాలని ఎన్ని ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చాలాచోట్ల సబ్జెక్టుల బోధనను కూడా అతిథి అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. ఇంటర్ విద్యా మండలి వద్దనున్న పిల్లల ఫీజుల డబ్బులు, అనుబంధ కళాశాలలు చెల్లించే ఫీజులు రూ.100 కోట్ల నిధులను ‘నాడు-నేడు’ పనులకు మళ్లించారు.
ఉచిత పుస్తకాలకు స్వస్తి
‘పిల్లల చదువుల కోసం ప్రభుత్వం పెట్టే ఏ ఖర్చైనా సరే, దాన్ని ఖర్చుగా భావించబోను. అది పిల్లలకిచ్చే ఆస్తిగా భావిస్తా. గొప్పగా చదవండి. మీ చదువులకు నాది పూచీ’ అంటూ గొప్పలు చెప్పిన సీఎం జగన్.. ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీకి స్వస్తి పలికారు. పాఠ్యపుస్తకాలు లేకుండా పేద పిల్లలు ఎలా చదువుకుంటారని ఆలోచించలేదు. వీటికి కేవలం రూ.15 కోట్లు ఇవ్వలేకపోయారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు మండల, జిల్లా కేంద్రాల్లో చదువుకునేందుకు నిత్యం వచ్చి పోతుంటారు. వీరు ఉదయమే వచ్చి, సాయంత్రం ఇళ్లకు చేరేవరకు ఆకలితో అలమటించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజనం పథకాన్ని తీసుకొచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక దీన్ని ఎత్తేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన