మీ స్మార్ట్ మీటర్లు మాకొద్దు
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామంలో వ్యవసాయ మోటార్లకు జగనన్న స్మార్ట్ మీటర్ల ఏర్పాటును రైతులు అడ్డుకున్నారు.
అనంతపురం జిల్లాలో అడ్డుకున్న రైతులు
ఉరవకొండ, వజ్రకరూరు, న్యూస్టుడే: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామంలో వ్యవసాయ మోటార్లకు జగనన్న స్మార్ట్ మీటర్ల ఏర్పాటును రైతులు అడ్డుకున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా శుక్రవారం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టారు. విషయం తెలుసుకున్న రైతులు పొలాలకు చేరుకొని మీటర్ల ఏర్పాటును అడ్డుకున్నారు. బిగించిన కొన్ని మీటర్లను తీయించేశారు. ఈ విధానాన్ని దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినా, ఇక్కడ మాత్రం వైకాపా ప్రభుత్వం అమలు చేయడం దారుణమని రైతులు వాపోయారు. రైతుల నుంచి విద్యుత్తు బిల్లులు వసూలు చేయాలన్నదే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వారు ఆరోపించారు. 20 ఏళ్లుగా మీటర్లు లేకుండానే ఆయా ప్రభుత్వాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందిస్తే వైకాపా ప్రభుత్వం దానికి తూట్లు పొడిచేలా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎటువంటి షరతులు, స్మార్ట్ మీటర్లు లేకుండానే వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్తు అందించాలని వారు డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం
వరదలతో కోస్తా జిల్లాల్లో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నష్టాల తీవ్రతపై అవసరమైతే నిబంధనలు సడలించి అయినా అదనపు సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?