సీఎం జగన్పై రాయి విసిరిన ఘటనలో వేగంగా దర్యాప్తు
ముఖ్యమంత్రి జగన్పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే- విజయవాడ నేరవార్తలు: ముఖ్యమంత్రి జగన్పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయవాడ నగరంలో ‘మేమంతా సిద్ధం’ రోడ్షో నిర్వహిస్తుండగా శనివారం రాత్రి సింగ్నగర్ డాబా కొట్ల రోడ్డులో రాయి తగిలి సీఎం నుదుటిపై గాయమైన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు కోసం పశ్చిమ డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో 20 మందితో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఇందులో ఆరు బృందాలు పనిచేస్తున్నాయి. లా అండ్ ఆర్డర్, సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసులు సభ్యులుగా ఉన్న ఈ బృందాలు ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించాయి. ముందుగా ఘటనా ప్రాంతంలో కేంద్ర బలగాలను మోహరించారు. ఘటన అనంతరం అర్ధరాత్రి దాటాక నగర సీపీ కాంతిరాణా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసు అధికారులతో కలిసి పరిసరాలను నిశితంగా గమనించారు. ఎటు వైపు నుంచి దాడి జరిగి ఉండవచ్చన్నది పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న జనం ఎవరైనా సెల్ఫోన్లతో చిత్రీకరించి ఉన్నారేమే అని ఆరా తీయాలని ఆదేశించారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు, ఒకటి, రెండు రోజుల్లో కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసు కమిషనర్ చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో ఒక రౌడీషీటర్ కూడా ఉన్నట్లు తెలిసింది.
సీసీ కెమెరాల దృశ్యాల వడపోత...
డాబాకొట్ల రోడ్డులో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను సేకరించి పరిశీలిస్తున్నారు. ఆ మార్గంలో రెండు చోట్ల మినహా ఎక్కడా సీసీ కెమెరాలు లేవు. ఓ స్తంభానికి ఉన్న మూడు ప్రైవేటు సీసీ కెమెరాలు, పోలీసు శాఖకు చెందిన పీటీజడ్ కెమెరాలోని ఫుటేజీని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో నిక్షిప్తమైన దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. అనుమానితులు, అసాంఘిక శక్తుల కదలికలను పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో విద్యుత్తు సరఫరా ఆపేయడంతో అంతా చీకటిగా ఉండి దర్యాప్తునకు అడ్డంకిగా మారింది. ఘటనా స్థలికి పక్కనే ఉన్న ప్రైవేటు పాఠశాల వైపు నుంచి వచ్చిన రాయి తొలుత సీఎం జగన్కు, తర్వాత మాజీ మంత్రి వెలంపల్లికి తగిలిందని పోలీసులు చెబుతున్నారు. ఆ పాఠశాలపై ఓ కానిస్టేబుల్ను రూఫ్టాప్ సెక్యూరిటీగా ఉంచారు. అయినా చీకటి కారణంగా ఎవరు రాయి విసిరారో కనిపెట్టలేని పరిస్థితి. ఆ పాఠశాలలోకి ఆగంతకులు వెళ్లి ఉంటారనే అనుమానంతో పోలీసులు పాఠశాలకు చెందిన రెండు సీసీ కెమెరాల్లో దృశ్యాలు పరిశీలిస్తున్నారు. పాఠశాలకు, రామాలయానికీ మధ్య ఉన్న ప్రాంతం నుంచి రాయి విసిరినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వెనుక ఉన్న స్టేడియం నుంచి కూడా పాఠశాలలోకి ప్రవేశించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జగన్పై దాడిలో విసిరినది రాయా? లేక ఎయిర్గన్ ఉపయోగించారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. పక్షులను కొట్టే క్యాట్బాల్ను వాడారా అన్నదానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.కదులుతున్న వ్యక్తిని క్యాట్బాల్తో కొట్టడం సాధారణ వ్యక్తికి సాధ్యమా అని కూడా అనుమానిస్తున్నారు. ఎయిర్గన్ వినియోగించి ఉండొచ్చని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన సమీప ప్రాంతంలో కొందరి నుంచి పోలీసులు ఆదివారం వివరాలు సేకరించారు.
టవర్ డంప్ విశ్లేషణ..
డాబాకొట్ల రోడ్డు ప్రాంతంలోని సెల్ టవర్ల నుంచి పోలీసులు డంప్ తీసుకుని విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. ఆ ప్రాంతంలోని ఇన్కమింగ్, ఔట్గోయింగ్ కాల్స్ వివరాలను తెప్పించి, వాటిని వడపోస్తున్నారు. అనుమానాస్పదంగా ఉండే కాల్స్ను పరిశీలిస్తున్నారు. ఒకే నంబరు నుంచి ఎక్కువసార్లు వెళ్లిన ఫోన్లపై దృష్టి పెట్టారు. గ్రూప్ కాల్స్పైనా కన్నేసి ఉంచారు. ఇద్దరు, ముగ్గురు కలిసి కాన్ఫరెన్స్కాల్లో మాట్లాడుకునే అవకాశం కూడా ఉండవచ్చనే కోణంలో పరిశీలిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లిన దర్యాప్తు అధికారులు ఘటన జరిగిన తీరును తెలుసుకునేందుకు అక్కడ సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు. రాయి తగిలిన ప్రాంతానికి వచ్చిన తర్వాత.. సీఎం ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయి ఎటు నుంచి వచ్చి తగిలింది? నిందితులు ఎక్కడ ఉండి దాడి చేసి ఉండొచ్చు అన్న అంశాలను పరిశీలించారు.
ఈసీకి నివేదిక...
ముఖ్యమంత్రి జగన్పై రాయి విసిరిన ఘటనకు సంబంధించి నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా నుంచి ఎన్నికల సంఘం నివేదిక కోరింది. ఈ మేరకు ఏం జరిగింది? ఘటన ఎలా జరిగింది అన్న అంశాలతో పోలీసు కమిషనర్ తన నివేదికను ఎన్నికల సంఘానికి పంపించారు. విద్యుత్తు తీగలు తగిలే అవకాశం ఉందన్న కారణంగా సీఎం జగన్ రోడ్షో సందర్భంగా మార్గంలో విద్యుత్తును నిలిపివేసినట్లు పేర్కొన్నారు. డాబాకొట్ల రోడ్డులో శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి విసిరిన రాయి కారణంగా జగన్కు నుదుటిపై గాయం అయిందనీ, దర్యాప్తును వేగవంతం చేశామనీ, నిందితులను పట్టుకునే పనిలో ఉన్నామని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్