అదానీకి అర్పితం.. ఉక్కు ఫ్యాక్టరీకి కష్టకాలం
గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటాను కారుచౌకగా అదానీ సంస్థకు కట్టబెట్టి స్టీలుప్లాంటు గొంతునొక్కారు. ప్రైవేటీకరణపై కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించక పోగా, సీఎం జగనే విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ఊపిరి తీశారు.
గంగవరం పోర్టులో రాష్ట్రవాటా 11% అప్పనంగా కట్టబెట్టిన జగన్
అప్పటి నుంచి స్టీలుప్లాంట్కు చుక్కలు చూపిస్తున్న పోర్టు యాజమాన్యం
ఈనాడు-విశాఖపట్నం: గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటాను కారుచౌకగా అదానీ సంస్థకు కట్టబెట్టి స్టీలుప్లాంటు గొంతునొక్కారు. ప్రైవేటీకరణపై కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించక పోగా, సీఎం జగనే విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ఊపిరి తీశారు. అదానీకి అనుకూలంగా వ్యవహరించి స్టీలుప్లాంటును కష్టాల్లోకి నెట్టేశారు. జగన్ అధికారంలోకి రాగానే గంగవరం పోర్టులోని రాష్ట్ర వాటా 11శాతాన్ని అదానీకి అప్పగించేశారు. రూ.3 వేల కోట్ల విలువైన వాటాను కేవలం రూ.600 కోట్లకు కట్టబెట్టడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సీఎం జగన్ లెక్క చేయలేదు. అప్పటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్కు కష్టాలు మొదలయ్యాయి. వాస్తవానికి స్టీల్ప్లాంటుకు వచ్చే ముడిసరకును విశాఖ పోర్టు నుంచి 60శాతం, గంగవరం పోర్టు నుంచి 40శాతం దిగుమతి చేసుకోవాలనే ఒప్పందం ఉండేది. అదానీ వచ్చాక వంద శాతం గంగవరం పోర్టు నుంచే దిగుమతి చేసుకోవాలన్న నిబంధన పెట్టినట్లు సమాచారం. అంతకుముందు ప్లాంటుకు గంగవరం పోర్టులో ఒక ప్రత్యేక బెర్తు ఉండేది. ముడిసరకుతో నౌకలు ఎప్పుడు వచ్చినా వెంటనే దిగుమతి చేసేలా ఒప్పందాలు ఉండేవి. పోర్టు అదానీ చేతుల్లోకి వెళ్లాక పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు బెర్త్ను ప్రత్యేకంగా కేటాయించడం లేదు. పోర్టుకు ఎప్పుడు ఓడ వచ్చినా డంపింగ్ యార్డు ఉండేది. ప్రస్తుతం ట్రాఫిక్ పెరిగి స్టాకు యార్డులకు స్థలం లేక, స్టీలు ప్లాంటుకు కేటాయించిన యార్డులో వేరే ముడిసరకులు నిల్వ చేస్తున్నారు.
ధరలు పెంచి ముక్కుపిండి వసూళ్లు చేస్తూ: స్టీలు ప్లాంటుకు అవసరమైన కోకింగ్ కోల్ ఆస్ట్రేలియా నుంచి, ఎస్ఎంఎస్ గ్రేడ్ లైమ్ స్టోన్ దుబాయి నుంచి గంగవరం పోర్టుకు వస్తుంది. ఇలా గంగవరం పోర్టు నుంచి ప్రతిరోజూ 10-15వేల టన్నుల ముడిసరకు చేరుతుంది. ఓడలో వచ్చిన సరకును కన్వేయర్ ద్వారా పంపడానికి టన్నుకు రేటు గతంలో రూ.250 ఉండగా, అదానీ సంస్థ దానిని రూ.325కు పెంచింది. ఫలితంగా ప్రతి నెలా హ్యాండ్లింగ్ ఛార్జీల భారం రూ.1.65 కోట్ల నుంచి రూ.2.47 కోట్ల వరకు అదనంగా పడుతోంది. గంగవరం పోర్టు అదానీ చేతుల్లోకి వెళ్లకముందు స్టీలు ప్లాంటుకు సంబంధించి ఎప్పుడూ రూ.50 కోట్ల మార్జిన్ (డ్యూ) ఉంచి, మిగిలిన సొమ్ము చెల్లిస్తూ నౌకల్లో వచ్చిన ముడిసరకు దిగుమతి చేసుకునేవారు. పాత బకాయిలు చెల్లిస్తేనే ఓడల్లోని సరకు దింపుతామంటూ అదానీ సంస్థ పేచీ పెట్టడంతో డెమరేజ్ ఛార్జీలను సైతం ప్లాంటుపైనే పడుతున్నాయి. గతేడాది జులైలో మూడు నౌకల్లో సరకు రాగా... బకాయిల సాకు చూపి అన్లోడ్ చేయకపోవడంతో చిన్న ఓడలకు రోజుకు రూ.12 లక్షలు, పెద్ద ఓడలకు రూ.36 లక్షల చొప్పున చెల్లించిన డెమరేజ్ ఛార్జీలను స్టీల్ప్లాంటు భరించాల్సి వచ్చింది.
రెండు రోజులకే నిల్వలు: ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న స్టీలు ప్లాంటుపై గంగవరం పోర్టులో కార్మికుల చేస్తున్న సమ్మె ప్రభావం పడింది. జీతాలు పెంచాలని అయిదు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో ప్లాంటు కోసం ఆస్ట్రేలియా నుంచి కోల్తో నౌకల వచ్చినా సరకు దిగుమతి కాలేదు. 15-20వేల టన్నుల బొగ్గు నిల్వలు పోర్టు యార్డులో ఉన్నాయి. కన్వేయర్లను నిలిపి వేయడంతో ప్లాంటుకు ఈ నిల్వలు చేరలేదు. ప్రస్తుతం కర్మాగారంలో ఉన్న నిల్వలు రెండు రోజులకు సరిపోతాయి. కార్మికులు సమ్మె విరమించకపోతే...ప్లాంటులోని కోక్ ఓవెన్లు ఒక్కొక్కటిగా మూసివేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆదివారం రాత్రికి బొగ్గు నిల్వలను రోడ్డుమార్గం ద్వారానైనా స్టీల్ప్లాంటుకు చేర్చే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ఒకవేళ ముడిసరకు ప్లాంటుకు చేరక ఉత్పత్తికి నష్టం వాటిల్లితే అది పోర్టు యాజమాన్యమే భరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?