ఆ విద్యుత్ మొత్తం అదానీదే!
భారత సౌర విద్యుత్ సంస్థ (సెకి) ముసుగు తొలగింది. జగన్ ప్రభుత్వం తీసుకునే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ మొత్తం అదానీదేనని తేలింది.
ఆర్పీపీఓకు మించి పునరుత్పాదక విద్యుత్ తీసుకునేలా అనుమతి
అజూర్ పవర్నూ పక్కకు నెట్టేసిన జగన్ ప్రభుత్వం
భవిష్యత్తులో ప్రజలపై ఛార్జీల భారం!
ఈ పరిణామాలను ఉత్తర్వుల్లో ప్రస్తావించని ఏపీఈఆర్సీ
ఈనాడు-అమరావతి: భారత సౌర విద్యుత్ సంస్థ (సెకి) ముసుగు తొలగింది. జగన్ ప్రభుత్వం తీసుకునే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ మొత్తం అదానీదేనని తేలింది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నిబంధనల మేరకు రెన్యువబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్ (ఆర్పీపీఓ) అవసరం లేకున్నా సంప్రదింపుల ద్వారా సెకి నుంచి విద్యుత్ను తీసుకుంటోంది. ఆర్పీపీఓకు మించి విద్యుత్ కొనాలంటే కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా మాత్రమే విద్యుత్ సంస్థలు తీసుకోవాలి. ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ తీసుకోవడానికి అనుమతిస్తూ.. ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరపకుండానే ఏపీఈఆర్సీ తైప్రాక్షిక ఒప్పందం అమలుకు ఎన్నికల ముందు హడావుడిగా ఉత్తర్వులిచ్చింది. సెకి నుంచి తీసుకునే విద్యుత్ వల్ల డిస్కంలపై ఏదైనా రూపేణా ఆర్థిక భారం పడితే దాన్ని ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేయాలనే విషయాన్ని ఉత్తర్వుల్లో కనీసం ప్రస్తావించలేదు.
ఆర్పీపీఓ కంటే 50 శాతం అదనపు విద్యుత్?
ఆర్పీపీఓ అవసరం లేకుండా సంప్రదింపుల ద్వారా డిస్కంలు 7 వేల మెగావాట్ల విద్యుత్ను సెకి నుంచి తీసుకుంటున్నాయి. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో పునరుత్పాదక విద్యుత్ వాటా 17 శాతం ఆర్పీపీఓ కింద ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిమితికి మించి పునరుత్పాదక విద్యుత్ సుమారు 25 శాతం వరకు ఉంది. ఈ పరిస్థితుల్లో సంప్రదింపుల ద్వారా డిస్కంలు ఎందుకు విద్యుత్ తీసుకుంటున్నాయి? ఏపీఈఆర్సీ అంచనాల ప్రకారం 2026-27లో ఆర్పీపీఓకు మించి సుమారు 50 శాతం అదనంగా పునరుత్పాదక విద్యుత్ ఉండబోతోంది.
ప్రజలపై భారం పడితే.. ఎలా సర్దుబాటు చేస్తుంది?
- సెకి నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల డిస్కంలపై ఆర్థిక భారం పడితే.. ఎలా సర్దుబాటు చేయాలనే విషయాన్ని ఏపీఈఆర్సీ ఉత్తర్వుల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. సెకి విద్యుత్ వల్ల తలెత్తే పరిణామాలు, కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులివ్వడం వల్ల తలెత్తే పరిణామాలతో డిస్కంలపై పడే ఆర్థిక భారం గురించీ ప్రస్తావన లేదు.
- వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ కోసం డిస్కంలు ఇప్పటికే వివిధ విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సెకి విద్యుత్ను వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తే.. తద్వారా ఏటా మిగిలే సుమారు 8 వేల మిలియన్ యూనిట్ (ఎంయూ)లను ఏం చేయాలి?
- ఏపీ జెన్కో 960 మెగావాట్ల పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు, 1,350 మెగావాట్ల పీఎస్పీ ప్రాజెక్టు, ఎగువ సీలేరులో 230 మెగావాట్ల అదనపు యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. అవి పూర్తయిన తర్వాత వాటితో పీపీఏలు కుదుర్చుకోవాల్సి ఉంది. ఇప్పటికే వేసవిలో తప్ప.. మిగిలిన సమయంలో డిమాండ్ తక్కువగా ఉండటంతో జెన్కో థర్మల్ యూనిట్లను బ్యాక్డౌన్ చేసే పరిస్థితి ఉంది.
- ఏపీ జెన్కో, నేషనల్ హైడ్రో వపర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీఎల్) భాగస్వామ్యంతో 6 వేల మెగావాట్ల పీఎస్పీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నాయి. వాటి నుంచి వచ్చే విద్యుత్ను ఏం చేయాలి?
- రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఎగుమతి విధానం, పీఎస్పీ పాలసీ కింద సుమారు 57 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు వస్తాయని.. అందులో కొన్నింటితో ఇప్పటికే ఎంవోయూలు కుదుర్చుకుంది. ఆ సంస్థలు ఉత్పత్తి ప్రారంభిస్తే ఓపెన్ యాక్సెస్ కింద పరిశ్రమలకు నేరుగా విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందాలు చేసుకుంటాయి. ఆ మేరకు డిస్కంల నుంచి తీసుకునే విద్యుత్ తగ్గిపోతుంది. అలాగే ఆర్పీపీఓ కూడా తగ్గుతుంది.
- ఈ విషయాలపై స్పష్టత ఇవ్వకుండా సెకి నుంచి తీసుకునే విద్యుత్కు అనుమతించడం ద్వారా భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉందని.. ఆ భారం వినియోగదారులపై పడబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవేవీ లేక ముందే జగన్ ప్రభుత్వం అయిదేళ్లలో వివిధ పేర్లతో ప్రజలపై రూ.18,817 కోట్ల అదనపు విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రూఅప్ ఛార్జీలు రూ.7,200 కోట్లు, ఏపీ జెన్కో ట్రూఅప్ రూ.1,148 కోట్లు కలిపి రూ.8,348 కోట్ల భారాన్ని ప్రజలపై వేయడానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే.. ప్రజలకు విద్యుత్ ఛార్జీల బాదుడు తప్పదు.
అదానీకి మేలు కోసమే జగన్ తపన?
2021 డిసెంబరు 1న సెకితో ప్రభుత్వం, డిస్కంలు కుదుర్చుకున్న విద్యుత్ విక్రయ ఒప్పందం (పవర్ సేల్ అగ్రిమెంట్- పీఎస్ఏ) ప్రకారం అదానీ రెన్యువబుల్ ఎనర్జీ నుంచి 4,667 మెగావాట్లు, మిగిలిన 2,333 మెగావాట్లు అజూర్ పవర్ ఇండియా లిమిటెడ్ నుంచి సరఫరా కావాల్సి ఉంది. ఒప్పందం అమలు సమయానికి అజూర్ పవర్ను పూర్తిగా పక్కకు తప్పించి, ఆ సంస్థ సరఫరా చేయాల్సిన విద్యుత్ను కూడా అదానీ ప్రాజెక్టుల నుంచే తీసుకునేలా పీఎస్ఏ ఒప్పందాన్ని గత ఏడాది డిసెంబరు 29న సెకి సవరించింది. దానిపై మరోసారి డిస్కంలు, ప్రభుత్వం సంతకాలు చేసి సమాచారాన్ని గుట్టుగా ఉంచాల్సిన అవసరమేంటి?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి