అంజి ‘అని’ తలిస్తే చాలు..
ఆయన.. ‘ముఖ్య’నేతకు సోదరుడు. ఆ నాయకుడి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుక చోరుడిగా అవతారమెత్తారు. ఈ అడ్డగోలు దందాను చక్కబెట్టేందుకు అక్రమ సొమ్మును చుట్టచుట్టేందుకు ప్రత్యేకంగా ఓ వ్యక్తిని నియమించుకున్నారు.
‘ముఖ్య’నేత సోదరుడి కనుసన్నల్లో అక్రమ దందా
అన్నీ తానై నడిపిస్తున్న అంజిరెడ్డి
అనుమతులు లేకుండా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు
అడ్డుకోని ఉన్నతాధికారులు
తనిఖీలకు వెళ్లే సిబ్బందికి సీఎంవో నుంచే ఫోన్లు
ఈనాడు, అమరావతి
ఆయన.. ‘ముఖ్య’నేతకు సోదరుడు. ఆ నాయకుడి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుక చోరుడిగా అవతారమెత్తారు. ఈ అడ్డగోలు దందాను చక్కబెట్టేందుకు అక్రమ సొమ్మును చుట్టచుట్టేందుకు ప్రత్యేకంగా ఓ వ్యక్తిని నియమించుకున్నారు. ఆ వ్యక్తి ఇక్కడ కాదు.. అక్కడ కాదు.. ఏకంగా సీఎంవోలోనే తిష్ఠ వేశారు. ఆ కార్యాలయం నుంచే చక్రం తిప్పుతూ గనుల శాఖ అధికారులను గడగడలాడిస్తున్నారు. ఎంతలా అంటే.. రీచ్ల తనిఖీలకు వెళ్లిన అధికారులు, సిబ్బంది సైతం ఏమీ చేయలేక వెనక్కి రావాల్సిందే. ఉన్నతాధికారులతో చీవాట్లు తినాల్సిందే.
- రాష్ట్రంలో ఎన్నో ఇసుక రీచ్లకు పర్యావరణ అనుమతులు లేవు. అయినా ఆ రీచ్ల్లో ఒక్కరోజు కూడా తవ్వకాలు ఆగలేదు.
- కేవలం కూలీలతోనే(మాన్యువల్గా) ఇసుక తవ్వకాలు జరిపేలా రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ(సియా) గత నెల ఇసుక రీచ్లకు అనుమతి ఇచ్చింది. ఇసుకాసురులు దాన్ని పట్టించుకోకుండా భారీ యంత్రాలతో అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు.
- పలు రీచ్ల్లో పాత అనుమతులతో జరుగుతున్న ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపేయాలని, కొత్తగా అనుమతులు తీసుకోవాలని ఏడాది క్రితం జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. అక్రమ ఇసుక తవ్వకాలపై హైకోర్టు పలుమార్లు చీవాట్లు కూడా పెట్టింది. ఇసుక అక్రమ తవ్వకందారులకు మాత్రం చీమకుట్టినట్లయినా లేదు.
ఇసుకాసురులకు ఇంత ధైర్యం ఎక్కడిది..?
ఎవరినీ ఖాతరు చేయకుండా ఇసుకను ఎలా తవ్వి తీసుకెళ్తున్నారు..?
అధికారులు ఎందుకు అడ్డుకునే సాహసం చేయలేకపోతున్నారు..?
ఈ ప్రశ్నలన్నింటికీ వినిపించే ఒకే ఒక సమాధానం.. అంజిరెడ్డి
ఇసుక అక్రమ వ్యాపారంలో ఆయన మాటే శాసనం. ఆయన చెప్పారంటే జరిగి తీరాల్సిందే. లేదంటే నాశనమవ్వాల్సిందే..! ఆయనను ప్రసన్నం చేసుకుంటే అనుమతులు, నిబంధనలు అన్న గొడవే ఉండదు! కోర్టు ఆదేశాలు, ఆంక్షలు ఉన్నా.. పట్టించుకోనక్కరలేదు. ‘‘ఎక్కడైనా ఇసుక తవ్వుకోండి.. ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకోండి.. ఎవరూ అడ్డుకోరు.. ఎవరైనా ఆపితే నా పేరు చెప్పండి’’ అని అభయం ఇస్తారు. ఇంతలా పెత్తనం చెలాయిస్తున్న ఆయన.. ప్రజాప్రతినిధో, ఇసుక గుత్తేదారో, బడా సంస్థ ప్రతినిధో కాదు. అయినా ఇసుక వ్యాపారాన్నంతటిని తన గుప్పిట పెట్టుకున్నారు. ఆయన పేరే.. అంజిరెడ్డి. రాష్ట్రంలో ఇసుక దందా, అందులో భారీ దోపిడీకి ‘ముఖ్య’నేత సోదరుడు తెర వెనుక స్కెచ్ వేస్తే.. అంజిరెడ్డి తెర ముందుండి నడిపిస్తారు.
పేరుకే సంస్థలు.. పెత్తనమంతా ఆయనదే..
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను 2021 మే నుంచి జేపీ సంస్థ పేరిట నిర్వహించగా.. చెన్నై మైనింగ్ వ్యాపారికి చెందిన టర్న్కీ సంస్థ ఉపగుత్తేదారుగా వ్యవహరించింది. అది ప్రభుత్వ పెద్దలకు భారీగా కప్పం కడుతూ అడ్డగోలుగా దోచేసింది. ఈ క్రమంలో ఇసుక నుంచి భారీగా డబ్బులు పిండుకోవాలని ‘ముఖ్య’నేత సోదరుడు పన్నాగం పన్నాడు. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టి దాని ద్వారా వచ్చే అక్రమ సొమ్మును దండుకోవడానికి ప్రత్యేకంగా అంజిరెడ్డి అనే వ్యక్తిని నియమించుకున్నాడు. రాష్ట్రంలోని ఇసుక వ్యాపారులు అంతా ఆయన చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. వాస్తవానికి 2023 మే నెలతోనే జేపీ సంస్థ టెండరు ముగిసింది. అయినా.. నవంబరు వరకు దాని పేరిటనే బిల్లులు జారీ చేస్తూ వచ్చారు. అయితే గత డిసెంబరు నుంచి వేరే రెండు సంస్థలు ఇసుక టెండరును దక్కించుకున్నట్లు రికార్డుల్లో చూపారు. కానీ కప్పమంతా వెళ్లేది ‘ముఖ్య’నేత సోదరుడి చెంతకే. ఆయన సూచనలతో అంజిరెడ్డి ఈ అక్రమ వ్యవహారాన్ని అంతా తానై చూసుకుంటున్నాడు.
ఎవరీ అంజిరెడ్డి?
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ మాజీ ఎంపీ వద్ద చాలాకాలం పనిచేశారు. తర్వాత ఏపీలోని ఓ ప్రముఖ కార్పొరేట్ గ్రూప్లో అసోసియేట్ జనరల్ మేనేజరుగా కొనసాగారు. ఆ గ్రూప్కి జగన్ ప్రభుత్వం మన రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు కట్టబెట్టింది. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఓ మేనేజర్, ఒక్కో రీజియన్కు ఒక్కో రీజియన్ మేనేజర్ చొప్పున కార్పొరేట్ స్థాయిలో నియమించుకొని అంజిరెడ్డి ఇసుక వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఇలా ఇసుక అక్రమ దందాలో ‘ముఖ్య’నాయకుడు.. అంజిరెడ్డిని అడ్డుపెట్టుకుని ప్రతి నెలా రూ. కోట్లు సంపాదిస్తూ సహజ వనరులను విధ్వంసం చేస్తున్నారు.
సీఎంవోలోనే మకాం..
అంజిరెడ్డి నిత్యం ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లోనే ఉంటూ హల్చల్ చేస్తుంటాడు. సీఎం క్యాంపు కార్యాలయంలోని ఓ కీలక అధికారితో ఆయన భేటీ అయ్యాడంటే చాలు.. మిగిలిన వారు ఎంతసేపైనా బయట వేచి ఉండాల్సిందే. జిల్లాల్లో ఇసుక తవ్వకాలపై ఎవరైనా ప్రశ్నించినా, పర్యావరణ అనుమతుల గురించి అడిగినా.. వెంటనే సీఎంవో నుంచి నేరుగా సంబంధిత అధికారులకు ఫోన్లు వెళ్తాయి.
అనుమతులతో పనిలేదు..
అంజిరెడ్డి ఈ వ్యవహారం చూస్తున్న రోజు నుంచి.. అనుమతులు లేకపోయినా రాష్ట్రవ్యాప్తంగా ఇష్టానుసారంగా ఇసుక అక్రమ తవ్వకాలు మొదలయ్యాయి. ఈ తవ్వకాలపై మరోసారి సమీక్ష జరపాలని, కొత్తగా పర్యావరణ అనుమతులు జారీ చేయాలంటూ ఎన్జీటీ గతేడాది మార్చిలో ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. రాష్ట్రంలోని 110 రీచ్ల్లో తక్షణమే ఇసుక తవ్వకాలు ఆపేయాలంటూ గతేడాది ఏప్రిల్లో రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ(సియా).. ఇసుక గుత్తేదారు జేపీ సంస్థకు, గనుల శాఖకు ఆదేశాలిచ్చింది. అయినా.. అంజిరెడ్డి ఎక్కడా తవ్వకాలు ఆపలేదు. సియా అటువంటి ఆదేశాలు ఇచ్చినట్లు కూడా బయటకు పొక్కకుండా చూశాడు. సుప్రీంకోర్టు సైతం సియా ఆదేశాలనే పాటించాలని ఆదేశించింది. తర్వాత కూడా తవ్వకాలను నిలిపేయకపోగా.. యథేచ్ఛగా కొనసాగించారు. కేవలం కూలీలతోనే ఇసుకను తవ్వాలన్న సియా నిబంధనలను సైతం తుంగలో తొక్కారు. పొక్లెయిన్లతో ఇసుకను తవ్వి లారీల్లో లోడ్చేస్తూ వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తెలిసినా కిమ్మనని అధికారులు
కలెక్టర్లు సహా గనుల శాఖ, రెవెన్యూ, ప్రత్యేక కార్యదళం (ఎస్ఈబీ), కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అధికారులకు ఈ అక్రమాల గురించి తెలిసినా అడ్డుకునే ప్రయత్నం చేయడంలేదు. అంజిరెడ్డి నేరుగా సీఎంవో నుంచి ఫోన్ చేయించి ఒత్తిడి తీసుకొస్తారన్న గుబులుతోనే అధికారులు చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు.
- కృష్ణా జిల్లా రొయ్యూరు ఇసుక రీచ్లో కొందరు ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వుతున్నారన్న సమాచారం మేరకు జిల్లా గనుల శాఖ అధికారులు కొన్ని నెలల క్రితం తనిఖీలకు వెళ్లారు. అక్కడే ఉన్న వైకాపా ఇసుకాసురులు వారిపై బెదిరింపులకు దిగారు. ‘ఇక్కడికి ఎందుకు వచ్చారు? తనిఖీ చేయమని ఎవరు చెప్పారు? మీరు వస్తున్నారన్న విషయం మీ శాఖ సంచాలకునికి తెలుసా? ఈ రీచ్లు ఎవరివి అనుకుంటున్నారు?’ అంటూ వారిపై దాడికి పాల్పడినంత పనిచేశారు.
- పల్నాడు జిల్లాలోని ఓ ఇసుక రీచ్లో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని తెలియడంతో కొన్ని నెలల క్రితం ఎస్ఈబీ ఎస్సై, కానిస్టేబుళ్లు అడ్డుకునేందుకు వెళ్లారు. వెంటనే వారికి ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వచ్చాయి. దీంతో వారు చేతులుముడుచుకుని వెళ్లిపోక తప్పలేదు.
- గతేడాది జూన్, జులై నెలల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని గనుల శాఖ అధికారులు జొన్నాడ, ఓబుల్లంక రీచ్ల్లో తనిఖీలు చేసేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న ఆ శాఖ ఉన్నతాధికారి ఆ అధికారులకు ఫోన్ చేసి వెంటనే వెనక్కి వచ్చేయాలంటూ ఒత్తిడి చేశారు.
- కొన్ని నెలల క్రితం ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా దర్జాగా ఇసుక తవ్వకాలు సాగాయి. ఇసుకను అక్రమంగా ఎందుకు తవ్వుతున్నారంటూ స్థానికులు ప్రశ్నిస్తే.. తాము సీఎంవోకు చెందినవారమంటూ బెదిరిస్తూ తమ దందాను యథేచ్ఛగా కొనసాగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్