శిరోముండనం చేయించి.. కనుబొమలు తీయించి
ఎన్నికల్లో రిగ్గింగ్పై ప్రశ్నించడమే ఆ దళిత యువకుల పాలిట శాపమైంది. మమ్మల్నే ప్రశ్నించే అంతటివారా? అంటూ అరాచక నేతలు ఆగ్రహించారు.. పంచాయితీకి పిలిపించారు.
ఆనాడు జరిగిన అమానుషమిది..
ఎన్నికల్లో రిగ్గింగ్పై ప్రశ్నించారని దళితులపై దాష్టీకం
పంచాయితీకి పిలిపించి.. పశువుల కొట్టంలో హింస
ప్రధాన నిందితుడు నేటి వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
నిందితులంతా ఆయన బంధువులు, అనుచరులే
ఈనాడు, కాకినాడ-న్యూస్టుడే, రామచంద్రపురం: ఎన్నికల్లో రిగ్గింగ్పై ప్రశ్నించడమే ఆ దళిత యువకుల పాలిట శాపమైంది. మమ్మల్నే ప్రశ్నించే అంతటివారా? అంటూ అరాచక నేతలు ఆగ్రహించారు.. పంచాయితీకి పిలిపించారు. నోటికొచ్చినట్లు దూషించారు. కొట్టారు.. హింసించారు. పశువుల కొట్టంలో బంధించారు. అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తూ.. వారికి శిరోముండనం చేయించారు. అయినా కసి తీరక వారి కనుబొమలూ తీయించేశారు. సభ్యసమాజం తలదించుకునే రీతిలో ఇంతటి అమానవీయ చర్యలకు పాల్పడింది ప్రస్తుత వైకాపా ఎమ్మెల్సీ, మండపేట అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి తోట త్రిమూర్తులు, ఆయన అనుచరులే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో 1996 డిసెంబరు 29న చోటుచేసుకున్న ఈ దారుణం అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వైకాపా అధికారంలోకి వచ్చాక.. 2019 నుంచి వారిపై వేధింపులు కొనసాగాయి. 1994 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తోట త్రిమూర్తులు వర్గం రిగ్గింగ్కు పాల్పడుతుండగా అడ్డుకున్నందుకే తమపై కక్షపూరితంగా వ్యవహరించారనేది బాధిత యువకుల ఆవేదన. సొంత ఊళ్లో వారి ఆధిపత్యానికి అడ్డు తగులుతున్నారని ఆగ్రహించిన త్రిమూర్తులుతోపాటు మరికొందరు తమపై అమానుష రీతిలో దాడి చేసి హింసించారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో కోటి చినరాజు, దడాల వెంకటరత్నం, కనికెళ్ల గణపతి, చల్లపూడి పట్టాభిరామయ్య, పువ్వల వెంకటరమణ (చనిపోయారు) అనే అయిదుగురిపై దాడి చేయగా.. వారిలో చినరాజు, వెంకటరత్నంలకు శిరోముండనం చేసి, కనుబొమలు సైతం తీయించేసినట్లు అప్పట్లో కేసు నమోదైంది. అయితే వారు ఈవ్ టీజింగ్కు పాల్పడ్డారని, గ్రామ ప్రధాన కూడలి వద్ద అమ్మాయిలపై అసభ్యకరమైన రాతలు రాశారంటూ ఆ ఇద్దరిపై ఈవ్ టీజింగ్ కేసు పెట్టించారు. మిగిలిన వారిపై కంచె స్తంభాలను ధ్వంసం చేశారని కేసు పెట్టారు.
క్షురకుడు మినహా.. మిగిలిన వారంతా త్రిమూర్తులు బంధువులు, అనుచరులే
దళిత యువకులపై అకృత్యానికి పాల్పడిన నిందితుల్లో క్షురకుడు మినహా మిగిలినవారంతా తోట త్రిమూర్తులు బంధుగణం, అనుచరులు కావడం గమనార్హం. 1994లో స్వతంత్ర అభ్యర్థిగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి త్రిమూర్తులు గెలిచారు. 1996 డిసెంబరు 29న ఆయన నివాసం దగ్గరే శిరోముండనం ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో మొత్తం 24 మంది సాక్షులుగా ఉండగా వయసు మీరడం, అనారోగ్య కారణాలతో 11 మంది మృతిచెందారు. 13మంది మిగిలారు. ప్రధాన సాక్షి కోటి రాజు(58) ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. అయిదుగురు బాధితుల్లో ఒకరు చనిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
భూ హక్కు చట్టంపై ధర్మాన ద్వంద్వ వైఖరి
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి. -
వివేకా హత్యలో సునీల్
మాజీమంత్రి వివేకా హత్యలో సునీల్ యాదవ్ పాల్గొన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది.