ఇదేనా బైబిల్కిచ్చే గౌరవం?
మ్యానిఫెస్టో అత్యంత పవిత్రమైంది... మాకది బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో సమానం! ఇందులో ఇస్తున్న ప్రతి హామీని నెరవేర్చి తీరుతా... అమలు చేయలేని హామీని ఇవ్వను... ఇచ్చిన వాటిని మరెవ్వరికీ సాధ్యం కానట్లుగా అమలు చేస్తా... 2019 ఎన్నికలప్పుడు జగన్ ఊరూరా ఊదరగొట్టిన మాటలివి!!
నాడు సీపీఎస్ రద్దు చేస్తానని మ్యానిఫెస్టోలో ప్రకటన
హామీలను విస్మరించే నాయకులు ఇంటికి వెళ్లిపోవాలని వ్యాఖ్యలు
అధికారంలోకి వచ్చాక మాట మార్చేసిన వైనం
మ్యానిఫెస్టో అత్యంత పవిత్రమైంది... మాకది బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో సమానం!
ఇందులో ఇస్తున్న ప్రతి హామీని నెరవేర్చి తీరుతా...
అమలు చేయలేని హామీని ఇవ్వను...
ఇచ్చిన వాటిని మరెవ్వరికీ సాధ్యం కానట్లుగా అమలు చేస్తా...
2019 ఎన్నికలప్పుడు జగన్ ఊరూరా ఊదరగొట్టిన మాటలివి!!
గెలిచాక ఓటర్ల నమ్మకాన్ని బలిచేశారు...
పవిత్ర గ్రంథాలపై ప్రమాణాన్ని అపహాస్యం చేశారు!!
జగన్, ఆయన వందిమాగధుల స్వరం మారిందిలా...
ఎన్నికల ముందు.. రద్దుకు మాటిచ్చారు
‘‘జగన్ అనే నేను అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తానని చెబుతున్నా. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మాట ఇస్తున్నా’’ అంటూ ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు.
సీఎం అయ్యాక.. ఆర్థిక భారాన్ని సాకుగా చూపారు
సీఎంగా సీపీఎస్ రద్దు చేయాలంటే నిమిషం పని. మరి ఎందుకింత ఆలోచిస్తున్నాం? పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలైతే ఖజానాపై మోయలేని భారం పడుతుంది’’ అంటూ 2022 ఏప్రిల్ 29న సీఎం జగన్ మాట మార్చారు.
తెలియకుండానే హామీ ఇచ్చాం
‘‘పదవీ విరమణ తర్వాత సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి ఏంటనే అంశంపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చామే తప్ప ఇందులో టెక్నికల్ సబ్జెక్టు మాకూ తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం బడ్జెట్ సరిపోయేలా లేదు’’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు.
మేం తొందరపడి చెప్పాం...
‘‘సీపీఎస్ రద్దుపై తొందరపడి హామీ ఇచ్చాం. సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేయడం సాధ్యం కాదు. ఓపీఎస్ ముగిసిన అధ్యాయం. ఉద్యోగులు ఆందోళన చేస్తే మేమేం చేయలేం’’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తమ అసలు రంగును కుండబద్దలు కొట్టారు.
‘‘ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేస్తుంది. అందులోని ప్రతి మాటను రాజకీయ పార్టీ నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోలేకపోతే ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలి’’ అని ప్రతిపక్ష నేతగా జగన్ ప్రతి సభలోనూ పదేపదే ప్రస్తావించారు. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. తన మ్యానిఫెస్టోలో పొందుపరచిన ‘వారం రోజుల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దు’ హామీని నెరవేర్చలేదు. ఉద్యోగులు ఎన్నిసార్లు గుర్తు చేసినా... సాకులు చెబుతూ సాగదీస్తూ ఐదేళ్లు ముగించేశారు. మరి, మాట తప్పిన రాజకీయ నాయకుడిగా రాజీనామా చేసి, ఎందుకు ఇంటికి వెళ్లిపోలేదు? పైగా వారి డబ్బునే దారి మళ్లించేసి, ఉద్యోగులకు ఆర్థికంగా తీవ్ర నష్టం మిగిల్చారు.
ఎన్నో వ్యథలు.. ఎన్నెన్నో ఆందోళనలు
రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ప్రదేశ్లాంటి రాష్ట్రాలు ఓపీఎస్ అమలుకు చర్యలు చేపట్టాయి. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్లో మాత్రం చలనం రాలేదు. ఉద్యోగులు ఎంత ఆవేదన వ్యక్తం చేసినా వారిని స్వయంగా పిలిచి మాట్లాడలేదు. తమ గళం వినిపించడానికి సీపీఎస్ ఉద్యోగులు ఐదేళ్లలో ఎన్నో ఆందోళనలు, నిరసనలు నిర్వహించారు. కొందరు గుండు గీయించుకున్నారు. మరికొందరు జగన్కు ఓటేసినందుకు చెప్పులతో తమనుతాము కొట్టుకున్నారు. ఇంకొందరు భిక్షాటన చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కానీ, జగన్ గుండె కరగలేదు. పైగా 2023 అక్టోబరు 20న గ్యారంటీడ్ పెన్షన్ స్కీం (జీపీఎస్) ఇస్తామంటూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. ఓపీఎస్ హామీకి సమాధి కట్టారు.
నిరసనలపై సీఎం ఉక్కుపాదం
సీపీఎస్ రద్దు హామీ అమలు చేయకపోవడంపై ప్రశ్నించిన ఉద్యోగులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిరసనలు, ఆందోళనలు, సమావేశాలు పెట్టుకునేందుకు అనుమతులు ఇవ్వలేదు. నిరసనలపై ప్రకటన చేస్తే చాలు నిర్బంధం విధించింది. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు రాకుండా కట్టడి చేసింది. వారిళ్లకు పోలీసులను పంపించి, కుటుంబ సభ్యులను సైతం భయపెట్టింది. ఉద్యోగుల కార్యాలయాలు, పాఠశాలలకు వెళ్లి పోలీసులతో నోటీసులు ఇప్పించింది. రాత్రికిరాత్రి ఇళ్ల తలుపులు పగలగొట్టి ముందస్తు అరెస్టులు చేయించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే, పదేపదే దొంగతనాలకు, నేరాలకు పాల్పడే వారి మాదిరిగా ఉద్యోగులపై బైండోవర్ కేసులు పెట్టింది. సత్ప్రవర్తన కలిగి ఉంటామంటూ ఒక్కో ఉద్యోగి నుంచి ఆరు నెలల కాలానికి రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు పూచీకత్తు తీసుకుంది.
నిఘా అధికారి పచ్చి మోసం
సీపీఎస్ ఉద్యమాన్ని నడిపిస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులను పక్కదారి పట్టించేందుకు నిఘా విభాగంలోని కీలక అధికారి తన పోలీస్ బుర్రను వినియోగించారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఆయా సంఘాల నాయకులను అనధికారికంగా ఐదు రోజులపాటు పంపించారు. వారి వెంట డీఎస్పీ, సీఐ, ఎస్సైలతో కూడిన బృందాన్ని పంపారు. విమాన టికెట్లు, నాయకుల ఖర్చులను భరించారు. అక్కడ ఓపీఎస్ అమలుపై అధ్యయనం చేయాలని సూచించారు. తర్వాత వారు సమర్పించిన నివేదికను మూలకు పడేశారు. పైగా ప్రభుత్వంతో తెగే వరకు లాగొద్దంటూ వారిని భయభ్రాంతులకు గురిచేశారు. సర్కారుతో చర్చలు ఏర్పాటు చేయిస్తానని నమ్మించి మోసగించారు.
రూ.1,500 కోట్ల బకాయి
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏలకు సంబంధించిన బకాయిలను సీపీఎస్ ఉద్యోగులకు 90% నగదు రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా వీరికి ప్రభుత్వం చెల్లించాల్సిన డీఏ బకాయిలు రూ.1,500 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. 2022 జులైలో డీఏ మంజూరు ఉత్తర్వులిచ్చినా ఇంతవరకు ఆ ప్రయోజనాలు అందలేదు.
పొదుపు డబ్బులనూ మింగేశారు
మరోవైపు ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన 10% వాటాను సీపీఎస్ ప్రాన్ ఖాతాలకు జమ చేయలేదు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు ఉద్యోగి వాటాతోపాటు ప్రభుత్వ వాటాను కలిపి జమ చేయాల్సి ఉండగా.. కొందరికి 2023 జూన్ వరకు, మరికొందరికి 2023 నవంబరు వరకు మాత్రమే జమ చేశారు. చివరికి వాళ్ల డబ్బులు రూ.933 కోట్లు మింగేశారు.
అసలు విధానం ఏమిటి?
కాంట్రిబ్యూటరీ పింఛను పథకం 2004 సెప్టెంబరు నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ఉద్యోగి ప్రతినెలా తన మూల వేతనం నుంచి 10% పింఛను నిధికి జమ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వమూ ప్రతినెలా తన వాటా కింద 10% జమ చేయాలి. కేంద్రం తాజాగా ఈ మొత్తాన్ని 14 శాతంగా మార్పు చేసినా జగన్ సర్కారు పది శాతమే చెల్లిస్తోంది. పదవీ విరమణ సమయంలో ఈ నిధి నుంచి ఉద్యోగి 60% తిరిగి తీసుకోవచ్చు. మిగిలిన 40% మొత్తం యాన్యుటీ పింఛను పథకంలో పెట్టుబడి పెడతారు. ఆ సమయంలో ఉద్యోగి ఎంచుకునే పింఛను విధానాన్ని బట్టి ప్రతినెలా కొంత మొత్తం పింఛనుగా చెల్లిస్తారు. ఇది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీనికి గ్యారెంటీ లేదు. పైగా దీనికి డీఆర్ ఉండదు. పీఆర్సీ వల్ల కలిగే ప్రయోజనాలు దక్కవు. ఈ స్కీంలో అందే పింఛనుతో ప్రభుత్వానికి, ఖజానాకు సంబంధం ఉండదు. ఆరోగ్య పథకం కింద దక్కే ప్రయోజనాలు ఉండవు.
పదవీ విరమణ తర్వాత పింఛన్ భద్రత లేకపోవడం, పీఆర్సీ ప్రయోజనాలు లభించకపోవడం, ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రయోజనం కూడా లేకపోవడంతో ఉద్యోగులు దీన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన