పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించాననిమరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్!
ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసిన సీఎం
వైకాపా ఐదేళ్ల పాలనలో అటకెక్కిన అభివృద్ధి
చేయాల్సిన ప్రగతి పనులను పక్కన పెట్టిన వైనం
తెదేపా హయాంలో ప్రారంభించిన వాటికీ పాతర
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా...
తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా...
ఇరుకు రోడ్లను విస్తరించకున్నా...
తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా...
లేశమాత్రమైనా జంకు లేకుండా...
పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని
మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్!
వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయి. పట్టణాల్లో వృద్ధి చెందుతున్న జనాభాకు అనుగుణంగా వారి అవసరాలు సైతం అంతకంతకూ పెరుగుతున్నా మౌలిక వసతుల కల్పనలో జగన్ సర్కారు శ్రద్ధ చూపలేదు. సీఎం స్వయంగా ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటీ అమలు కాలేదు. అదే సమయంలో తెదేపా హయాంలో ప్రారంభించిన ప్రగతి పనులకు నిధులివ్వకుండా పూర్తిగా పక్కన పెట్టేసి... రాజకీయ పైశాచిక ఆనందం పొందారు. తాను అధికారంలోకి వచ్చాక... ప్రారంభించిన అరకొర పనులకూ బిల్లులివ్వకుండా పట్టణాభివృద్ధికి పాడెకట్టారు. ఇంతకంటే బాధ్యతారాహిత్యం ఇంకేం ఉంటుంది? పైగా అభివృద్ధి నమూనాకు ఆద్యుడినంటూ ఇప్పుడు వాడవాడకు డప్పుకొంటుకుంటున్నారు. నగరాలు, పట్టణాల్లో అసంపూర్తిగా నిలిచిన పనులు, వీటితో ప్రజలు పడుతున్న అవస్థలు జగన్కు కనిపించడం లేదు. అస్మదీయులకు పదవులు కట్టబెట్టడంలో, సొంత మనుషులైన గుత్తేదారులకు అడ్డగోలుగా బిల్లులు చెల్లించడంలో చూపించిన శ్రద్ధలో పది శాతం కనబరిచినా పట్టణాల్లో పెండింగ్ పనులు పూర్తయ్యేవి. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వచ్చేవి. ఆయన ఉదాసీనత కారణంగా ప్రజలు అల్లాడుతున్నారు.
ఇవిగో హామీలు... ఏవీ నిధులు..?
- గుంటూరులో యూజీడీ పనుల పూర్తికి రూ.200 కోట్లు ఇస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీ నీటి మీద రాతగా మిగిలిపోయింది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు అప్పట్లోనే 60% పూర్తయ్యాయి. వైకాపా సర్కారు వచ్చాక మిగిలిన పనులను పూర్తి చేయాలని స్థానిక వైకాపా ఎమ్మెల్యేలు విన్నవించగా... నిధులిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చి మాట తప్పారు. అంతేకాకుండా నగరంలోని శంకర్ విలాస్ వంతెన విస్తరణ, శ్యామలానగర్-నంది వెలుగు రోడ్డులో, రైలు మార్గంపై వంతెనల పనులు నిలిచిపోయాయి. ఐదేళ్లలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో నగరాభివృద్ధిపై సమీక్ష నిర్వహించినా ఫలితం శూన్యం. వర్షాకాలంలో మూడు వంతెనల కింద మురుగునీరు, వర్షపు నీరు కలిసి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దాంతో వాహనాలన్నీ శంకర్ విలాస్ వంతెన మీదుగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది.
- విజయవాడ పరిధిలోని నియోజకవర్గాల్లో సిమెంట్ రోడ్లు, రిటైనింగ్ కాలువలు, భూగర్భ మురుగు నీటి వ్యవస్థ(యూజీడీ)లతో కలిపి మొత్తం 152 పనులను చేపట్టడానికి స్థానిక ఎమ్మెల్యేలు నిధులు ఇవ్వాలని సీఎం జగన్కు విన్నవించారు. దాంతో 2021 సంవత్సరంలో ఒకసారి రూ.100కోట్లు, మరోసారి రూ.50.96 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కానీ, చేసిన పనులకు రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారు. ఫలితంగా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరిగి, చాలావరకు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొన్నింటికి తప్పనిసరి పరిస్థితుల్లో కార్పొరేషన్ సాధారణ నిధుల పద్దు నుంచి రూ.20 కోట్ల వరకు విడుదల చేశారు. బిల్లులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో మిగిలిన పనులను ప్రారంభించేందుకు గుత్తేదారులు సాహసించలేదు.
- కర్నూలు జిల్లా ఆదోనిలోని బంగారు బజార్ రోడ్డు, పండిట్ నెహ్రూ రోడ్డు, తానాజీ రోడ్డు, మున్సిపల్ రోడ్డు వంటి పది ప్రధాన రహదారుల విస్తరణకు అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు 2022లో విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ రూ.50 కోట్లు ఇస్తామని ప్రకటించారు. తర్వాత షరామామూలుగా వదిలేశారు. వాటిని చేపట్టడానికి తాజా అంచనాల ప్రకారం రూ.150 కోట్లు అవసరమవుతాయి.
- కాకినాడలో వివిధ సామాజిక వర్గాల కోసం తెదేపా హయాంలో ప్రారంభించిన భవనాలు జగన్ నిధులివ్వని కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. డెయిరీ ఫాంలో పీఎంపీల అసోసియేషన్ భవనం పనులు శ్లాబ్ వరకు వచ్చాక ఆగిపోయాయి. నాయీ బ్రాహ్మణుల భవన నిర్మాణం పునాదుల దశలో నిలిచిపోయింది. కన్నయ్యకాపునగర్లో బ్రాహ్మణ సామాజిక భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. గౌడ వర్గానికి రెవెన్యూ కాలనీలో స్థలం కేటాయించి శంకు స్థాపన చేసినా పనులు మొదలవలేదు.
- అనంతపురం జిల్లా గుంతకల్లులో తెదేపా హయాంలో దళితుల కోసం రూ.63 లక్షల అంచనాతో అంబేడ్కర్ సామాజిక భవన నిర్మాణం ప్రారంభించారు. రూ.28 లక్షలు ఖర్చయ్యాక... వైకాపా అధికారంలోకి వచ్చింది. వివాహ వేదిక, తాగునీరు, ఇతర సదుపాయాల కల్పనకు మరో రూ.35 లక్షలు ఖర్చు చేస్తే భవనం పూర్తయ్యేది. కానీ, జగన్ బిల్లులను పెండింగ్లో పెట్టడంతో పనులు నిలిచిపోయాయి. ఇదే పట్టణంలోని ఎస్సీ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో 2018లో రూ.2 కోట్లతో ప్రారంభించిన ఇండోర్ స్టేడియం పనులు పైకప్పు దశలో నిలిచిపోయాయి. ప్రభుత్వం నిధులివ్వకపోవడమే దీనికి కారణం.
- బాపట్లలోని రాజీవ్గాంధీ హిందూ శ్మశానవాటికలో తెదేపా హయాంలో రూ.1.50 కోట్లతో ప్రారంభించిన గ్యాస్ ఆధారిత దహన వాటిక పనులు జగన్ నిర్లక్ష్యంతో అసంపూర్తిగా ఆగాయి. గత ప్రభుత్వంలోనే రూ.60 లక్షలకుపైగా వెచ్చించారు. వైకాపా సర్కారు వచ్చాక పెండింగ్ బిల్లులు చెల్లించని కారణంగా గుత్తేదారులు పనులు నిలిపేశారు. పట్టణంలోని ఉప్పరపాలెంలో ఓవర్హెడ్ ట్యాంకు పనులు గత ప్రభుత్వ హయాంలోనే 80% పూర్తయినా నీటిని నింపే పైపులు అనుసంధానించలేదు. చీలురోడ్డు నుంచి ఏబీఎం కాంపౌండ్ వరకు రహదారి విస్తరణ పనులు వైకాపా ప్రభుత్వమే ప్రారంభించినా... నిధులివ్వకుండా అసంపూర్తిగా నిలిపేసింది.
పనులంటే గుత్తేదారుల్లో వణుకు
- చిత్తూరులో రోజూ పది మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసే ప్లాంటుకు రూ.35 లక్షలతో మరమ్మతు చేసేందుకు అనేకసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారుల నుంచి స్పందన లేదు. ఇదే నగరంలోని కొండమిట్టలో 1,100 లీటర్ల నీటి సామర్థ్యమున్న ట్యాంకుకు రూ.26లక్షలతో మరమ్మతులకు ఏకంగా తొమ్మిదిసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారుల్లో ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రాలేదు.
- తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఆర్టీసీ బస్టాండు ఎదురు మలుపు నుంచి ఓవర్ బ్రిడ్జి వరకు ప్రధాన కాలువ పనులకు రూ.కోటితో టెండర్లు పిలిచినా పనులు ప్రారంభం కాలేదు. జాతీయ రహదారుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో రూ.75 లక్షలతో కల్వర్టు నిర్మించినా.. ప్రధాన కాలువ సరిగా లేకపోవడంతో మురుగు ముందుకు పారడంలేదు. చదలవాడ కృష్ణమూర్తి దుకాణ సముదాయం ఎదుట మరో ప్రధాన మురుగు కాలువ పనులకు రూ.35 లక్షలతో టెండర్లు పిలిచినా ఇప్పటికీ మొదలు కాలేదు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో పనులు చేయడానికి గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు.
- విజయనగరం జిల్లా బొబ్బిలిలో భైరవసాగరం గట్టు వద్ద ఆరు వార్డులకు సంబంధించిన శ్మశానవాటిక అభివృద్ధి పనులను అసంపూర్తిగా నిలిపివేశారు. రాణిమల్లమ్మదేవి పార్కు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణాన్ని బిల్లులు అందని కారణంగా గుత్తేదారులు మధ్యలోనే ఆపేశారు.
- పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పైవంతెన సమీపంలో శిథిలావస్థకు చేరిన తాగునీటి రిజర్వాయర్ స్థానంలో కొత్తది నిర్మించడానికి మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేసినా పనులు పునాదుల దశను దాటలేదు. దీని నిర్మాణానికి మొదట 13వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి రూ.1.50 కోట్లు కేటాయించినా సాంకేతిక సమస్యలతో పనులు ప్రారంభం కాలేదు. తర్వాత సాధారణ నిధుల నుంచి రూ.3.20 కోట్లు ఖర్చు చేయాలన్న పాలకవర్గం తీర్మానం మేరకు పనులకు శంకుస్థాపన చేయగా... మూడేళ్ల నుంచి 15% కూడా పూర్తి కాలేదు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. -
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి.. అప్పుడలా..ఇప్పుడిలా..
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి.
తాజా వార్తలు (Latest News)
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..
-
చివరి అరగంటలో అమ్మేశారు.. సూచీలకు నష్టాలు