అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది.
ఈవెంట్ల మాదిరి జగన్ ఎన్నికల ప్రచార బస్సు యాత్ర
ఎవర్ని కలవాలో.. ఏం మాట్లాడాలో ముందే స్క్రిప్టు సిద్ధం
ఇన్నేళ్లూ ప్యాలెస్కే పరిమితమై.. ఎన్నికల వేళ ప్రేమ ఒలకబోస్తున్న వైనం
మహా నటులూ ముక్కున వేలేసుకునేలా సీఎం నటనా కౌశలం
ప్రీప్లాన్డ్ సన్నివేశాలపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్, ట్రోల్స్
ఈనాడు, అమరావతి
ప్రతిపక్షంలో ఒకలా.. సీఎంగా మరోలా..
ఇప్పుడు ఇంకోలా..
‘మస్తు షేడ్స్ ఉన్నాయి సార్ మీలో..’
అనిపించే నటనా చాతుర్యం ఆయనది.
సినిమా రంగంలోకి వెళ్లలేదు కానీ..
తలలు, బుగ్గలు నిమురుతూ..
ముద్దులు పెడుతూ..
ఆస్కారూ చిన్నబోయే కౌశలం ఆయనది..
అయిదేళ్లూ తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమై..
అయినవారికే మేళ్లు చేసి..
ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచి...
ఇప్పుడు ఎన్నికల ముంగిట..
తూ.చ. తప్పకుండా.. మడమ తిప్పకుండా..
ఐప్యాక్ స్క్రిప్ట్ ప్రకారం..
రకరకాల హవభావాలను ప్రదర్శిస్తూ..
‘ఇంత టాలెంటెడ్గా ఉన్నారేంటి సార్..’
అనేలా కరుణ రసాన్ని పారిస్తూ..
డ్రామాలు చేస్తున్న నట సౌధమే జగన్!
జగన్ కాన్వాయ్ ఝుమ్మంటూ వెళ్తుంటే.. తెల్ల చొక్కాలు వేసుకుని నలుగురు యువకులు రోడ్డు పక్కన మోకాళ్లపై నిలబడి, రెండు చేతులు పైకెత్తి.. నువ్వే మా దేవుడివి అన్నట్టుగా మొక్కుతుంటారు.
జగన్ బస్సు వస్తుంటే... ఎదురుగా మండుటెండలో వైకాపా జెండాతో ఒక మహిళ. ఆమెను చూడగానే బస్సు ఆగుతుంది. జగన్ ఆ బస్సు మెట్లపై కూర్చుని ఆమెతో మాట్లాడతారు.
ఇవన్నీ ‘మేమంతా సిద్ధం’ పేరిట జగన్ సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. ఈ సన్నివేశాలపై సామాజిక మాధ్యమాల్లోనూ మీమ్స్ హోరెత్తుతున్నాయి. రోడ్డు పక్కన మోకాళ్లపై నిలబడి, రెండు చేతులు పైకెత్తి.. నువ్వే మా దేవుడివనే సన్నివేశం తెలంగాణ ఎన్నికల సమయంలోనూ చోటుచేసుకుందని నెటిజన్లు వెతికి మరీ గుర్తుచేస్తున్నారు. ఆ రెండు ఫొటోల్నీ పక్కపక్కనే పెట్టి.. జగన్వన్నీ డ్రామాలేననీ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
అపరిచితుడు 1: మీరా పేదల పక్షపాతి?
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కాన్వాయ్ వస్తుంటుంది.. అత్యాధునిక వసతులన్నీ ఉన్న, బుల్లెట్ ప్రూఫ్ ఏసీ బస్సులో ముఖ్యమంత్రి ముందు సీటులో కూర్చుని ఉంటారు.. ఇంతలో ఒక యువకుడు భద్రతా వలయాన్ని ఛేదించుకొని మరీ... వీరాభిమానంతో ఆ బస్సుకు పక్కనే పరిగెడుతుంటాడు.. సీఎం జగన్ యథాలాపంగా అటుగా చూస్తారు.. మండుటెండలో తనకోసం పరుగెత్తుకు వస్తున్న ఆ యువకుడు కనిపించగానే ఆయన మనసు చలిస్తుంది.. ఒక్క కనుసైగతో బస్సు ఆగిపోతుంది.. సీఎం లేచి, వాహనం మెట్లు సగం వరకు దిగుతారు.. ఆ మెట్లపైనే కూర్చుంటారు.. ఆ యువకుడిని దగ్గరకు పిలిచి, ఆప్యాయంగా మాట్లాడతారు.. చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీ దిగుతారు... ఇది ఇప్పుడు జగన్ పండిస్తున్న పేదల పక్షపాతి పాత్ర!
ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు.. ఐప్యాక్ స్క్రిప్ట్ వేరుగా ఉండేది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని, వైద్యసాయం అవసరమైన కొందర్ని ముందే ఎంపిక చేసి.. సీఎం దగ్గరకు తీసుకెళ్లేవారు. ఆయన వారితో మాట్లాడి భరోసా ఇచ్చేవారు. సాయంత్రానికి ఆ జిల్లా కలెక్టర్ వారికి చెక్కులు అందజేసేవారు. పక్కా వ్యూహం ప్రకారం నలుగురైదుగురికి సాయం చేసి.. జగన్ది ఎంత సున్నిత హృదయమో చూడండంటూ ఊదరగొట్టేవారు. కష్టాల్లో ఉన్నవారికి కచ్చితంగా ప్రభుత్వ భరోసా అందాల్సిందే. కానీ అలాంటి అభాగ్యులు సమాజంలో చాలా మంది ఉన్నప్పుడు.. కొందర్ని మాత్రమే ఎంపిక చేసి, సాయమందించి దాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవడం కేవలం ప్రజల్ని మభ్యపెట్టడమే! అలాంటి వారిని ఆదుకోవడానికి ప్రత్యేకమైన వ్యవస్థ, యంత్రాంగం నిరంతరం పనిచేయాలి. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి కొన్ని వేల మందికి ఆర్థికసాయం అందేది. వైకాపా అధికారంలోకి వచ్చాక.. అన్ని రోగాలకూ ఒకటే మందన్నట్లుగా ఆరోగ్యశ్రీని చూపిస్తూ, సీఎంఆర్ఎఫ్ను పూర్తిగా నీరుగార్చేశారు. తాజాగా ఎన్నికల సమయం కావడంతో సీఎం జిల్లాలకు వెళ్లినప్పుడు ఆయన దగ్గరకు కొందర్ని తీసుకొచ్చి, సాయమందించే వ్యూహాన్ని ఐప్యాక్ తెరపైకి తెచ్చింది.
అపరిచితుడు 2: ఉన్నానన్నారు.. గజినీలా మరచిపోయారు
సీఎం బస్సు పక్కనే పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనం! వారిలో స్కూల్ యూనిఫాం వేసుకున్న ఒక బాలికను కొందరు భుజాలపైకి ఎత్తుకుంటారు. ‘జగన్ మామా..’ అని పిలుస్తూ ఆ చిన్నారి చేయి ముందుకు చాచగానే... బస్సులోని జగన్కు వినిపించి బస్సు మెట్లపై నుంచి ముందుకి వంగి ఆమెతో కరచాలనం చేస్తారు.
ఎండకు కమిలిపోయిన ముఖం.. చెరిగిన జుత్తు.. నెరసిన గడ్డం. ఇదీ 2019 ఎన్నికల ముందు పాదయాత్రలో, ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ జగన్ కనిపించిన తీరు ఇది. జనంలో ఒకరిగా తిరిగారు.. భుజంపై చెయ్యేసి నడిచారు.. పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడారు. పేదలు పెట్టిన పెరుగన్నం తిన్నారు. కొబ్బరి బొండాం ఇస్తే తాగారు.. చిక్కటి చిరునవ్వులు చిందించారు.. ఫొటోలు, సెల్ఫీలు దిగారు.. వినతిపత్రాలు స్వీకరించారు.. హామీలూ ఇచ్చారు.. ఒకే ఒక్క ఛాన్స్ ఇమ్మన్నారు.. ప్రజల జీవితాల్నే మార్చేస్తానన్నారు.. నేను ఉన్నాను.. నేను విన్నానంటూ ఊదరగొట్టారు. జనం అది నిజమని నమ్మారు. ‘దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే.. ఆ మనిషి ఏం చేయాలి? ఈ రోజు ఎంత డబ్బు సంపాదించాం? రేపు ఎంత సంపాదించాలనే దిక్కుమాలిన ఆలోచనతో పనిచేయాలా? లేక దేవుడు ఇలాంటి అవకాశమిచ్చినప్పుడు అసలు రేపు అన్నదే లేదన్నట్టుగా కష్టపడి ప్రజల జీవితాల్లో మార్పు తేవాలా? మనం చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనే కాంక్ష ఉండాలి. ముఖ్యమంత్రి పదవి అంటే అదీ..’ అంటూ టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలిచ్చారు. ఆ తర్వాత ఐదేళ్లూ గజినీలా చెప్పినవన్నీ మరచిపోయారు. అదంతా నటన అనీ, ఆయనకు అవకాశం ఇస్తే.. జరిగేది విధ్వంసమేననీ ప్రజలు గ్రహించలేకపోయారు. జనాన్ని అంతగా మంత్రముగ్ధుల్ని చేసేలా నమ్మించాడు.. జగన్లోని అపరిచితుడు!
అపరిచితుడు 3: పరదాల చాటు.. గడప దాటితే ఒట్టు
సీఎం దగ్గరకు వచ్చేవారిని భద్రతా సిబ్బంది అడ్డుకుంటుంటారు. వెంటనే జగన్ వారిని ముందుకు రానివ్వండంటూ పిలుస్తారు. వారితో ఆప్యాయంగా మాట్లాడతారు. ఆ సమయంలో ఆయన విన్యాసాలు, హావభావాలు.. నభూతో అనే స్థాయిలో ఉంటాయి.
2019 ఎన్నికల్లోనూ జగన్ ఇలాంటి నటనతోనే రక్తికట్టించారు. అధికారంలోకి రాగానే తనలోని అపరిచితుడు బయటికొచ్చాడు. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను..’ పక్కన ‘నేను మరచిపోయాను’ అన్న పదం చేరింది. అధికార పగ్గాలు చేపట్టింది మొదలు.. ‘నేను తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు రాను.. ఎవరి గోడూ వినను’ అన్నది తన విధానంగా మార్చుకున్నారు. రాజభవనం వంటి తాడేపల్లి ప్యాలెస్కి కనీవినీ ఎరగని రీతిలో రక్షణ ఏర్పాట్లు చేశారు. దగ్గర్లో ఉన్న పేదల గుడిసెల్ని ఖాళీ చేయించారు. సామాన్యులెవర్నీ దరిదాపులకు రానివ్వలేదు. అలాగని సీఎం వారి దగ్గరకు వెళ్లారా? అంటే అదీ లేదు. మంత్రులు, వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలకే ఆయన దర్శనం దుర్లభం. సీఎం కలవాలనుకున్న వారికే లోపలికి అనుమతించేవారు. ఏదైనా పథకానికి బటన్ నొక్కేందుకు జిల్లాలకు వెళ్లినా.. సీఎం కాన్వాయ్కి అల్లంత దూరంలోనే ప్రజల్ని ఆపేసేవారు. సీఎంకి ఎవరూ కనిపించకుండా పరదాలు కట్టేవారు. దగ్గరకు రాకుండా బారికేడ్లు పెట్టేవారు. సీఎం ఎక్కడికి వెళితే అక్కడ దుకాణాలు, వ్యాపార సంస్థలన్నీ మూసేయించేవారు. విద్యా సంస్థలకు సెలవులిచ్చేసేవారు. చెట్లనూ కొట్టేసేవారు. ఇంతా చేసి.. వాహనంలోంచి నమస్కారంతో సరిపెట్టి పలాయనం చిత్తగించేవారు. పోనీ సచివాలయానికైనా వెళ్లేవారా అంటే.. అదీ లేదు. మూడు నాలుగు నెలలకోసారి మంత్రివర్గ సమావేశానికి హాజరై, అది ముగిసిన వెంటనే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్లిపోయేవారు. ప్రజల్ని కలవడం, వారి బాధలు వినడం, వినతులు స్వీకరించడం ఉండవు.
అంత జరుగుతున్నా స్పందించలేదు..
జగన్ తండ్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సహా గతంలో ముఖ్యమంత్రులంతా వారి వెసులుబాటుని బట్టి ప్రజల్ని నేరుగా కలిసేందుకు, వారి సమస్యలను వినేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించేవారు. ప్రజాదర్బార్లు నిర్వహించేవారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి అప్పటికప్పుడు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం ప్రకటించేవారు. సచివాలయమైనా, సీఎం క్యాంప్ కార్యాలయమైనా ఫలానా సమయానికి అక్కడికి వెళితే.. ముఖ్యమంత్రి గానీ, అధికారులు గానీ తమ గోడు వింటారన్న భరోసా ప్రజల్లో ఉండేది. ప్రజల వినతుల్ని పర్యవేక్షించి, పరిష్కరించే విధానం ఉండేది. జగన్ పాలనలో ప్రజల నుంచి వినతులు స్వీకరించడం ఒక ప్రహసనంలా మారింది. ఈ ఐదేళ్లు సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద వినతులు స్వీకరించే ప్రక్రియ అత్యంత మొక్కుబడిగా సాగింది. సమస్యలతో వచ్చిన వారిని పోలీసులు సవాలక్ష ప్రశ్నలు వేశాకే.. క్యాంప్ ఆఫీసు దగ్గరకు పంపేవారు. అక్కడో అధికారి ఆ వినతులు తీసుకునేవారు. నడవలేని స్థితిలో ఉన్న కుమార్తె వైద్యానికి సాయం కోసం కాకినాడ జిల్లాకు చెందిన ఓ మహిళ క్యాంప్ ఆఫీస్ దగ్గరే ఆత్మహత్యకు యత్నించినా... సీఎం స్పందించలేదు. ఇది.. ఎన్నికల ముందు జనంతో మమేకమై జగన్ పండిస్తున్న ‘పేదల పక్షపాతి’ పాత్రకు పూర్తి భిన్నమైన.. పెత్తందారు పాత్ర. జగన్ నిజ స్వరూపం, ఆయన నైజానికి అద్దం పట్టే సిసలైన పాత్ర ఇదే..!
పేదలపై ప్రేమ ఇదేనా?
ప్రస్తుతం జగన్ చూపుతున్న కరుణామయ హృదయం ఈ అయిదేళ్లు ఏమైందో.. పేదల కష్టాలు ఎందుకు పట్టలేదో.. ఇన్నాళ్లూ పరదాల చాటున ప్రజల్లోకి వెళ్లిన సీఎంకి, వారిని కలవడానికే ఇష్టపడని వ్యక్తికి.. ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ గుర్తొచ్చారా? అందుకే ఇంత ప్రేమను ఒలకబోస్తున్నారా? అనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. జగన్ చిక్కటి చిరునవ్వులు నిజమైనవే అయితే.. ఎన్నికల ప్రచార సభల పేరుతో ప్రజల్ని ఎందుకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ప్రశ్నలు వేస్తున్నారు. ఇటీవల గుంటూరులో జరిగిన సభకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ ఒక్క గుంటూరు డిపో నుంచే 200 బస్సులు కేటాయించింది. బస్సుల్లేక వృద్ధులు, రోగులు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఒకవైపు ప్రజలను అష్టకష్టాలు పెడుతూ.. మరోవైపు వారిపై ఎక్కడలేని ప్రేమ కురిపించడం జగన్ ద్వంద్వ మనస్తత్వానికి అద్దంపడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
-
సినీ నటుడు వెంకటేశ్ కూతురి ప్రచారం
-
హైదరాబాద్లో అభ్యర్థులకు ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయింపు
-
నీ పేరు పెట్టావ్.. ఒట్టు తీసి గట్టున పెట్టావ్
-
సన్ పిక్చర్స్కు ఇళయరాజా నోటీసు
-
ఏమైనా ఇచ్చేస్తాం.. ఎంతైనా కొనేస్తాం!.. ఓట్ల కొనుగోలుకు బరితెగించిన వైకాపా