ఎట్టకేలకు దుర్గారావు విడుదల
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయితో దాడి కేసులో శనివారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తమ అదుపులో ఉన్న తెదేపా నాయకుడు వేముల దుర్గారావును ఎట్టకేలకు పోలీసులు విడిచిపెట్టారు.
గులకరాయి కేసులో నాలుగు రోజులుగా పోలీసుల నిర్బంధంలో
హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడానికి సిద్ధమవడంతో శనివారం రాత్రి విముక్తి
ఈనాడు - అమరావతి, న్యూస్టుడే - విజయవాడ నేరవార్తలు: ముఖ్యమంత్రి జగన్పై గులకరాయితో దాడి కేసులో శనివారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తమ అదుపులో ఉన్న తెదేపా నాయకుడు వేముల దుర్గారావును ఎట్టకేలకు పోలీసులు విడిచిపెట్టారు. ఆయన ఆచూకీ చెప్పాలంటూ నాలుగు రోజులుగా పోలీసు అధికారులను వేడుకుంటున్నా కనికరించకపోవడంతో సోమవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలుకు న్యాయవాది సలీం ప్రయత్నాలు ప్రారంభించారు. దుర్గారావు కుటుంబ సభ్యులు, వడ్డెరకాలనీ వాసులు శనివారం ఉదయం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ‘ఎన్నిసార్లు వేడుకున్నా కనికరంలేదా.. నా భర్త ఎక్కడ ఉన్నాడో చూపించండి’ అంటూ దుర్గారావు భార్య శాంతి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.
చివరకు శనివారం రాత్రి విజయవాడ నార్త్ ఏసీపీ కార్యాలయంలో దుర్గారావును కుటుంబ సభ్యులకు అప్పగించారు. 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చి.. మళ్లీ అవసరమైతే స్టేషన్కు పిలుస్తామని చెప్పి సంతకాలు తీసుకున్నారు.
సీపీ కార్యాలయం వద్ద మహిళలు కన్నీటి పర్యంతం
దుర్గారావు ఆచూకీ విషయమై శనివారం ఉదయం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కమిషనర్ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు దాదాపు 60 మంది వడ్డెర కులస్థులు సీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. టాస్క్ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరి నేతృత్వంలో మహిళా పోలీసులు వారిని చుట్టుముట్టారు. రోడ్డుపై నిరసనలకు వీల్లేదంటూ భయపెట్టేందుకు ప్రయత్నించారు. మీడియాతో మాట్లాడుతున్న మహిళలను, సంఘ పెద్దలను పోలీసులు ఉక్కిరిబిక్కిరి చేశారు. నాలుగు రోజులుగా దుర్గారావును ఎక్కడ దాచి ఉంచారని మహిళలు ప్రశ్నించారు. కష్టపడి పనిచేసుకుని బతికే తమను రోడ్డు పైకి ఈడ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధం లేని కేసుల్లో వడ్డెరలను ఇరికిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. మహిళలను, వడ్డెర నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమైనా పరిస్థితి సంక్లిష్టంగా మారడంతో వెనక్కి తగ్గారు. ‘నా భర్త ఎక్కడ ఉన్నాడో చూపించండి’ అంటూ వేముల దుర్గారావు భార్య శాంతి, ఇతర మహిళలతో కలిసి భీష్మించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని బలవంతంగా ఆటోల్లో డీసీపీ కార్యాలయానికి తరలించారు. అనంతరం వారు టాస్క్ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరికి వినతిపత్రం అందించారు.
నీ వెనుక ఎవరున్నారని నిలదీశారు
విడుదలైన అనంతరం దుర్గారావు ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. ‘ఈనెల 16వ తేదీన.. సింగ్ నగర్ డాబాకొట్ల రోడ్డులోని టీకొట్టు వద్ద టీ తాగుతున్నా.. అంతలోనే పోలీసులు వచ్చి మాట్లాడాల్సిన పని ఉందంటూ వాహనం ఎక్కించారు. ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. నేను ఏ తప్పూ చేయలేదన్నాను. నీ వెనుక ఎవరైనా ఉన్నారా? అని అడిగారు. అసలు నేను ఆ పని చేయనప్పుడు ఎవరుంటారని గట్టిగా జవాబిచ్చాను. సీసీఎస్లో నన్ను, సతీష్ను పక్కపక్క గదుల్లో ఉంచి విచారణ చేశారు. పోలీసులు నా వద్దకు వచ్చి.. జగన్పై రాయి వేస్తే రూ. వెయ్యి ఇస్తానన్నావట కదా అని అడిగారు. సతీష్ నాకు పరిచయం లేదని చెప్పాను. దీంతో ఇద్దరినీ కలిపి విచారించారు. నేను నిర్దోషినని పోలీసులకు అర్థమైంది. అందుకే నన్ను వదిలిపెట్టారు..’ అని దుర్గారావు వివరించారు. తొలుత నన్ను.. విజయవాడ సీసీఎస్ స్టేషన్కు తీసుకెళ్లారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంచారు. తర్వాత మైలవరంలోని సీఐ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2 వరకు ఉంచారు. అక్కడి నుంచి మళ్లీ విజయవాడ సీసీఎస్ స్టేషన్కు తెచ్చారు. రాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు’ అని తెలిపారు.
22న మేజిస్ట్రేట్ ఎదుట సతీష్ వాంగ్మూలం రికార్డు!
మరోవైపు ఈ కేసులో నిందితుడు సతీష్ను తమ కస్టడీలోకి తీసుకునేందుకు పిటిషన్ సిద్ధం చేసినా పోలీసులు దానిని పక్కనపెట్టి.. మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం నమోదుకే మొగ్గు చూపుతున్నారు. ఈ ఘటనలో నిందితుడు రాయి విసిరిన సమయంలో చూసిన వారు ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో సీఆర్పీసీ 164 కింద సతీష్ను న్యాయాధికారి వద్దకు తీసుకెళ్లి అతని స్టేట్మెంట్ను రికార్డు చేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది సోమవారం కావచ్చని తెలిసింది.
తుపాకీతో బెదిరించారట
‘జైలులో సతీష్ను కలసి మాట్లాడాం. ఏం జరిగిందని అడిగితే.. పోలీసులు తనను చీకట్లోకి తీసుకెళ్లి నేరం ఒప్పుకోమని తుపాకీ చూపించి బెదిరించారని చెప్పాడు. అందుకే అలా చెప్పానని ఏడుస్తున్నాడు. తానేం చేయలేదు. తనకు ఏ సంబంధం లేదని అంటున్నాడు.’
నిందితుడు సతీష్ తండ్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది