బొండా ఉమా పేరు చెప్పాలంటూ.. ఒత్తిడి చేశారు
‘మీ నాయకులు కానీ బొండా ఉమా కానీ.. సీఎం జగన్పై రాయి వేయించమన్నారా అని పోలీసులు నన్ను విచారణలో పదే పదే ప్రశ్నించారు. అసలు ఆ ఘటనతో నాకు సంబంధమే లేనప్పుడు.. వారు చేయమన్నారని ఎలా చెప్పేదని గట్టిగా ప్రశ్నించా.. దీనికి పోలీసులు నాపై రెండు దెబ్బలేశారు.
సతీష్ను పోలీసులు భయపెట్టి రాయి వేసినట్లు తనతో చెప్పించారు
నన్నూ భయపెట్టాలని చూశారు.. గట్టిగా నిలబడ్డా
పోలీసులు, స్థానిక వైకాపా నేతల నుంచి నాకు ఇబ్బందే
‘ఈనాడు’తో తెదేపా నాయకుడు వేముల దుర్గారావు
ఈనాడు, అమరావతి: ‘మీ నాయకులు కానీ బొండా ఉమా కానీ.. సీఎం జగన్పై రాయి వేయించమన్నారా అని పోలీసులు నన్ను విచారణలో పదే పదే ప్రశ్నించారు. అసలు ఆ ఘటనతో నాకు సంబంధమే లేనప్పుడు.. వారు చేయమన్నారని ఎలా చెప్పేదని గట్టిగా ప్రశ్నించా.. దీనికి పోలీసులు నాపై రెండు దెబ్బలేశారు. చేయని నేరానికి నేను నాలుగు రోజులు పోలీసు కస్టడీలో ఉండాల్సి వచ్చింది. రోజుకు అయిదు గంటల పాటు నన్ను విచారించారు. నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టే.. పోలీసులు నన్ను విడిచిపెట్టారు. నేను వారికి భయపడి ఉంటే.. నన్ను ఈపాటికి జైల్లో పెట్టేవారు’ అని పోలీసుల చెర నుంచి శనివారం రాత్రి విముక్తుడైన తెదేపా నాయకుడు వేముల దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన, తన కుటుంబ సభ్యులతో కలసి న్యాయవాది సలీం కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా.. పోలీసు కస్టడీలో తన అనుభవాలను దుర్గారావు ‘ఈనాడు’తో పంచుకున్నారు.
రాయి వేయించినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి
‘నన్ను గత వారం సింగ్నగర్ నుంచి వన్టౌన్లోని సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్)కు తీసుకెళ్లారు. రోడ్షోలో సీఎం జగన్పైకి రాయి ఎందుకు వేశావని ప్రశ్నించారు. నువ్వే రాయి వేయించావటగా అని గద్దించి అడిగారు. ఆ సమయంలో నేను అక్కడ లేను. నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నేనే చేయించానని చెప్పడానికి రుజువు చూపించమని అడిగా. దీనికి పోలీసు అధికారులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నువ్వు మర్యాదగా అంగీకరిస్తే శిక్ష తగ్గే మార్గం చూస్తాం. లేదంటే నీ ఇష్టం అని బెదిరించారు. చేయని నేరాన్ని అంగీకరించేది లేదని బలంగా నిలబడ్డా. నువ్వు ఒప్పుకోవాల్సిందే. దానికి సాక్ష్యం మా దగ్గర ఉందని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఘటన జరిగిన సమయంలో నేను అక్కడ లేను. స్థానిక తెదేపా కార్యాలయంలో ఉన్నా.. ఇదే విషయాన్ని పోలీసులకు వివరించాను’ అని దుర్గారావు తెలిపారు.
మానసికంగా ఇబ్బంది పెట్టారు
‘విజయవాడ సీసీఎస్ నుంచి 18వ తేదీన నన్ను మైలవరం సర్కిల్ కార్యాలయానికి తరలించారు. ఏంటి ఇక్కడికి తెచ్చారని ప్రశ్నించే సరికి.. సాయంత్రానికి పంపిస్తాములే అని పోలీసులు చెప్పారు. అక్కడ అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు విచారణ సాగింది. రెండుసార్లు కొట్టారు. దీని కంటే మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు. నువ్వు చెప్పాల్సిందే... లేకపోతే రేపటికైనా తెలుస్తుందని బెదిరించారు. మా సామాజికవర్గం వారినే ఏడుగురిని తీసుకెళ్లి.. నన్ను ఇరికిద్దామని పెద్ద ప్లాన్ చేశారు’ అని వివరించారు.
ఖాళీ కాగితాలపై సంతకాలు
‘నాకు మున్ముందు పోలీసులు, స్థానిక వైకాపా నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. నేను తెదేపాలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందున నన్ను లక్ష్యంగా చేసుకుంటారు. శనివారం (20వ తేదీ) మధ్యాహ్నం 3 గంటల సమయంలో నన్ను మైలవరం సీఐ కార్యాలయం నుంచి మళ్లీ విజయవాడ వన్టౌన్లోని సీసీఎస్కు తీసుకొచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో నార్త్ ఏసీపీ, సింగ్నగర్ సీఐ నా వద్దకు వచ్చి.. నీ పాత్ర ఏమీ లేదు.. నిన్ను వదిలేస్తున్నామని చెప్పి.. కొన్ని ఖాళీ కాగితాలు ఇచ్చి సంతకాలు చేయమన్నారు. ఎటూ ఇంటికి వెళుతున్నానులే అని సంతకాలు చేశా. తర్వాత 160 సీఆర్పీసీ నోటీసులపై సంతకాలు తీసుకుని.. మా ఇంటి వద్ద రాత్రి పొద్దుపోయాక వదిలిపెట్టారు. వాటిపై పోలీసులు ఏమి రాసుకుని భవిష్యత్తులో నన్ను ఎక్కడ ఇబ్బంది పెడతారోనని భయంగా ఉంది’ అని తెదేపా నాయకుడు వేముల దుర్గారావు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎదురుతిరిగే సరికి పోలీసులు కొట్టారు
‘నన్ను అదుపులోకి తీసుకున్న రోజు తెల్లవారుజామున మా కాలనీ నుంచి అదుపులోకి తీసుకున్న సతీష్ను పక్క గది నుంచి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టారు. ఆ యువకుడిని బెదిరించి.. నేను చెప్పిన మీదటే రాయి వేసినట్లు చెప్పించారు. నేను నిన్ను ఎప్పుడు కలిశాను? రాయి వేయమని ఎప్పుడు చెప్పాను అని సతీష్ను అడిగాను. ఏం మాట్లాడకుండా బిక్క మొహం వేసి చూస్తుండిపోయాడు. అతడిని భయపెట్టి చెప్పించారని నాకు అర్థమైంది. మీరు నన్నెందుకు ఈ కేసులో ఇరికిస్తున్నారని పోలీసులతో వాదనకు దిగాను. దీంతో వారు ఆగ్రహంతో నాపై రెండు దెబ్బలేశారు. నీ వెనుక ఎవరున్నారో..? వాళ్ల పేర్లు చెప్పు.. అని నన్ను వెనక్కి తోశారు. సతీష్ మా కాలనీకి చెందిన వ్యక్తే. కాకపోతే నాకు పరిచయం లేదన్నాను. బొండా ఉమా నీ వెనుక ఉండడంతో నువ్వే చేయించావటకదా అని పోలీసు అధికారులు నన్ను అడిగారు. నేను చేయనప్పుడు ఆయన నా వెనుక ఎందుకు ఉంటారని గట్టిగా సమాధానమిచ్చాను’ అని దుర్గారావు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
తాజా వార్తలు (Latest News)
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం