బొండా ఉమా పేరు చెప్పాలంటూ.. ఒత్తిడి చేశారు
‘మీ నాయకులు కానీ బొండా ఉమా కానీ.. సీఎం జగన్పై రాయి వేయించమన్నారా అని పోలీసులు నన్ను విచారణలో పదే పదే ప్రశ్నించారు. అసలు ఆ ఘటనతో నాకు సంబంధమే లేనప్పుడు.. వారు చేయమన్నారని ఎలా చెప్పేదని గట్టిగా ప్రశ్నించా.. దీనికి పోలీసులు నాపై రెండు దెబ్బలేశారు.
సతీష్ను పోలీసులు భయపెట్టి రాయి వేసినట్లు తనతో చెప్పించారు
నన్నూ భయపెట్టాలని చూశారు.. గట్టిగా నిలబడ్డా
పోలీసులు, స్థానిక వైకాపా నేతల నుంచి నాకు ఇబ్బందే
‘ఈనాడు’తో తెదేపా నాయకుడు వేముల దుర్గారావు
ఈనాడు, అమరావతి: ‘మీ నాయకులు కానీ బొండా ఉమా కానీ.. సీఎం జగన్పై రాయి వేయించమన్నారా అని పోలీసులు నన్ను విచారణలో పదే పదే ప్రశ్నించారు. అసలు ఆ ఘటనతో నాకు సంబంధమే లేనప్పుడు.. వారు చేయమన్నారని ఎలా చెప్పేదని గట్టిగా ప్రశ్నించా.. దీనికి పోలీసులు నాపై రెండు దెబ్బలేశారు. చేయని నేరానికి నేను నాలుగు రోజులు పోలీసు కస్టడీలో ఉండాల్సి వచ్చింది. రోజుకు అయిదు గంటల పాటు నన్ను విచారించారు. నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టే.. పోలీసులు నన్ను విడిచిపెట్టారు. నేను వారికి భయపడి ఉంటే.. నన్ను ఈపాటికి జైల్లో పెట్టేవారు’ అని పోలీసుల చెర నుంచి శనివారం రాత్రి విముక్తుడైన తెదేపా నాయకుడు వేముల దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన, తన కుటుంబ సభ్యులతో కలసి న్యాయవాది సలీం కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా.. పోలీసు కస్టడీలో తన అనుభవాలను దుర్గారావు ‘ఈనాడు’తో పంచుకున్నారు.
రాయి వేయించినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి
‘నన్ను గత వారం సింగ్నగర్ నుంచి వన్టౌన్లోని సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్)కు తీసుకెళ్లారు. రోడ్షోలో సీఎం జగన్పైకి రాయి ఎందుకు వేశావని ప్రశ్నించారు. నువ్వే రాయి వేయించావటగా అని గద్దించి అడిగారు. ఆ సమయంలో నేను అక్కడ లేను. నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నేనే చేయించానని చెప్పడానికి రుజువు చూపించమని అడిగా. దీనికి పోలీసు అధికారులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నువ్వు మర్యాదగా అంగీకరిస్తే శిక్ష తగ్గే మార్గం చూస్తాం. లేదంటే నీ ఇష్టం అని బెదిరించారు. చేయని నేరాన్ని అంగీకరించేది లేదని బలంగా నిలబడ్డా. నువ్వు ఒప్పుకోవాల్సిందే. దానికి సాక్ష్యం మా దగ్గర ఉందని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఘటన జరిగిన సమయంలో నేను అక్కడ లేను. స్థానిక తెదేపా కార్యాలయంలో ఉన్నా.. ఇదే విషయాన్ని పోలీసులకు వివరించాను’ అని దుర్గారావు తెలిపారు.
మానసికంగా ఇబ్బంది పెట్టారు
‘విజయవాడ సీసీఎస్ నుంచి 18వ తేదీన నన్ను మైలవరం సర్కిల్ కార్యాలయానికి తరలించారు. ఏంటి ఇక్కడికి తెచ్చారని ప్రశ్నించే సరికి.. సాయంత్రానికి పంపిస్తాములే అని పోలీసులు చెప్పారు. అక్కడ అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు విచారణ సాగింది. రెండుసార్లు కొట్టారు. దీని కంటే మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు. నువ్వు చెప్పాల్సిందే... లేకపోతే రేపటికైనా తెలుస్తుందని బెదిరించారు. మా సామాజికవర్గం వారినే ఏడుగురిని తీసుకెళ్లి.. నన్ను ఇరికిద్దామని పెద్ద ప్లాన్ చేశారు’ అని వివరించారు.
ఖాళీ కాగితాలపై సంతకాలు
‘నాకు మున్ముందు పోలీసులు, స్థానిక వైకాపా నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. నేను తెదేపాలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందున నన్ను లక్ష్యంగా చేసుకుంటారు. శనివారం (20వ తేదీ) మధ్యాహ్నం 3 గంటల సమయంలో నన్ను మైలవరం సీఐ కార్యాలయం నుంచి మళ్లీ విజయవాడ వన్టౌన్లోని సీసీఎస్కు తీసుకొచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో నార్త్ ఏసీపీ, సింగ్నగర్ సీఐ నా వద్దకు వచ్చి.. నీ పాత్ర ఏమీ లేదు.. నిన్ను వదిలేస్తున్నామని చెప్పి.. కొన్ని ఖాళీ కాగితాలు ఇచ్చి సంతకాలు చేయమన్నారు. ఎటూ ఇంటికి వెళుతున్నానులే అని సంతకాలు చేశా. తర్వాత 160 సీఆర్పీసీ నోటీసులపై సంతకాలు తీసుకుని.. మా ఇంటి వద్ద రాత్రి పొద్దుపోయాక వదిలిపెట్టారు. వాటిపై పోలీసులు ఏమి రాసుకుని భవిష్యత్తులో నన్ను ఎక్కడ ఇబ్బంది పెడతారోనని భయంగా ఉంది’ అని తెదేపా నాయకుడు వేముల దుర్గారావు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎదురుతిరిగే సరికి పోలీసులు కొట్టారు
‘నన్ను అదుపులోకి తీసుకున్న రోజు తెల్లవారుజామున మా కాలనీ నుంచి అదుపులోకి తీసుకున్న సతీష్ను పక్క గది నుంచి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టారు. ఆ యువకుడిని బెదిరించి.. నేను చెప్పిన మీదటే రాయి వేసినట్లు చెప్పించారు. నేను నిన్ను ఎప్పుడు కలిశాను? రాయి వేయమని ఎప్పుడు చెప్పాను అని సతీష్ను అడిగాను. ఏం మాట్లాడకుండా బిక్క మొహం వేసి చూస్తుండిపోయాడు. అతడిని భయపెట్టి చెప్పించారని నాకు అర్థమైంది. మీరు నన్నెందుకు ఈ కేసులో ఇరికిస్తున్నారని పోలీసులతో వాదనకు దిగాను. దీంతో వారు ఆగ్రహంతో నాపై రెండు దెబ్బలేశారు. నీ వెనుక ఎవరున్నారో..? వాళ్ల పేర్లు చెప్పు.. అని నన్ను వెనక్కి తోశారు. సతీష్ మా కాలనీకి చెందిన వ్యక్తే. కాకపోతే నాకు పరిచయం లేదన్నాను. బొండా ఉమా నీ వెనుక ఉండడంతో నువ్వే చేయించావటకదా అని పోలీసు అధికారులు నన్ను అడిగారు. నేను చేయనప్పుడు ఆయన నా వెనుక ఎందుకు ఉంటారని గట్టిగా సమాధానమిచ్చాను’ అని దుర్గారావు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ