జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు.
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర పేరిట వాహనదారులపై యుద్ధం
చెన్నై- కోల్కతా హైవేపై నిత్యం నరకమే
ప్రతిచోటా ఐదారు గంటలు ట్రాఫిక్ నిలిపేస్తున్న పోలీసులు
ఈనాడు - అమరావతి: నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. తన ఇడుపులపాయ ఎస్టేట్లో తిరిగినట్లుగా జాతీయ రహదారిపై ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. వేల మంది వాహనదారులు, ప్రయాణికులు గంటల తరబడి నరకం చూస్తున్నా సరే.. రోజుల తరబడి ఆ హైవేపై బస్సు యాత్ర చేస్తూ.. మధ్యలో బహిరంగ సభల్లో పాల్గొంటూ అందరికీ చుక్కలు చూపిస్తున్నారు. వాహనదారులు ఎలా పోతే నాకేంటి అంటూ తాపీగా బస్సు యాత్ర చేస్తున్నారు. హైవేపై సీఎం బస్సు యాత్ర షెడ్యూల్ను కేవలం ఒకటి, రెండు రోజుల ముందు వైకాపా ఖరారు చేస్తుంటే.. పోలీసులు వెనువెంటనే అనుమతులిచ్చేస్తున్నారు. అప్పటికప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. కేంద్ర పరిధిలో ఉండే ఈ హైవేపై సైతం సీఎం బస్ వెళ్లేందుకు వీలుగా ఎక్కడికక్కడ అడ్డదిడ్డంగా తవ్వేస్తున్నారు. ఇలా సీఎం హాయిగా ఏసీ బస్సులో యాత్ర చేస్తుంటే.. మండుటెండలో వాహనదారులు హైవేపై ఐదారు గంటలు నరకయాతన పడుతున్నారు.
15 కి.మీ. ముందే నిలిపేస్తూ..
చెన్నై- కోల్కతా జాతీయ రహదారి నిత్యం సగటున 60-70 వేల వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలు, బిహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి దక్షిణాదిన ఉన్న ఏపీ, తమిళనాడు, కేరళలకు రాకపోకలు సాగించేందుకు ఇదే అత్యంత కీలకమైన హైవే. దీనిపై పది నిమిషాలు అంతరాయం కలిగినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుంది. జగన్ బస్సు యాత్ర ఈ హైవేపైకి చేరినప్పటి నుంచి నిత్యం అయిదారు గంటలు ట్రాఫిక్ నిలిపేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎక్కడా వాహనాలు ఆగకూడదు. అత్యవసర పరిస్థితిలో ట్రాఫిక్ నిలపాల్సి వస్తే వాహనాలు మళ్లించేందుకు పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. కానీ జగన్ బస్సు యాత్రలో అటువంటిదేమీ ఉండటం లేదు. హైవే పైనే అయిదారు గంటలు ట్రాఫిక్ ఆపేస్తున్నారు. ఆయన బస్సు 15 కి.మీ. దూరంలో ఉండగానే ఇరువైపులా వాహనాలు నిలిపేస్తున్నారు. ఈ హైవే నెల్లూరు నుంచి తాడేపల్లి వారధి వరకు ఆరు వరుసలుగా ఉంది. గన్నవరం నుంచి దెందులూరు వరకు కూడా ఆరు వరుసలే. వీటికి సర్వీసు రోడ్లు కూడా ఉన్నాయి. సీఎం ఒకవైపు వెళ్తుంటే, మరొకవైపు ట్రాఫిక్ను వదలొచ్చు. అయినా ఏ వాహనాన్ని వెళ్లనివ్వకుండా పోలీసులు అష్టదిగ్బంధం చేస్తున్నారు.
నరకం చూపిస్తున్న జగన్
తన బస్సు యాత్రతో వాహనదారులు, ప్రయాణికులకు జగన్ నరకం చూపిస్తున్నారు. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రయాణికులు ఎండ వేడికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. జగన్ ప్రయాణిస్తున్న బస్సు, కాన్వాయ్ రాకపోకల కోసం హైవేలో అనేకచోట్ల అడ్డదిడ్డంగా తవ్వేస్తున్నారు. నెల్లూరు వైపు నుంచి బస్సు యాత్ర వస్తున్నప్పుడు కావలి వద్ద కుడివైపు బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. సీఎం బస్, కాన్వాయ్ అక్కడికి వెళ్లడానికి హైవేపై డివైడర్ను తవ్వేశారు. గుంటూరు శివారులోని ఏటుకూరు వద్ద కూడా ఇదే పరిస్థితి. అయినా సరే అధికారులు వీటిపై చర్యలు తీసుకోవడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్.!
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది. -
ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థతో పాటు రాజాం, తణుకు, గుడివాడ, బాపట్ల, గూడూరు (తిరుపతి జిల్లా), భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పురపాలక సంఘాలు, నగర పంచాయతీల ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు.