అక్రమాల ‘కిరణం’!
అవినీతి, అరాచకం కలగలిసిన అక్రమాల ‘కిరణం’ ఆయన. కొండల్ని కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు.. ఇసుకలో దోచేశారు.. రియల్ ఎస్టేట్ దందాల్లో ఆరితేరారు.. ఒకప్పుడు రోజువారీ ఖర్చులకూ కటకటలాడిన ఆయన.. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్లకు పడగలెత్తారు.
శ్రీకాకుళం జిల్లాలో వైకాపా ప్రజాప్రతినిధి దందాలు
పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు స్వాహా
కప్పం కడితేనే వ్యాపారాలకు అనుమతి
ఈనాడు, అమరావతి
జిల్లా వెనకబడినా.. ఆయన మాత్రం అవినీతిలో ముందే ఉన్నారు..
ఉదయాన సూర్య కిరణాలు ఆరోగ్యకరం..
కానీ, ఈ ప్రజాప్రతినిధి అనే ‘కిరణం’ మాత్రం హానికరం.
అధికారాన్ని బూచీగా చూపిస్తూ..
సామాన్యులనే సమిధలుగా చేస్తూ..
కొండలను కరిగిస్తూ..
వ్యాపారులను పిప్పి చేస్తూ..
ఇసుకను తోడేస్తూ..
కొలువుల పేరిట నిరుద్యోగులను దోచేస్తూ..
హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ..
పైసా లేని స్థితి నుంచి..
ధనరాశులతో తులతూగే స్థాయికి ఎదిగారు.
అవినీతి, అరాచకం కలగలిసిన అక్రమాల ‘కిరణం’ ఆయన. కొండల్ని కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు.. ఇసుకలో దోచేశారు.. రియల్ ఎస్టేట్ దందాల్లో ఆరితేరారు.. ఒకప్పుడు రోజువారీ ఖర్చులకూ కటకటలాడిన ఆయన.. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్లకు పడగలెత్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన చేయని అక్రమం లేదు. తన అరాచకాలకు అడ్డు లేకుండా.. నియోజకవర్గ వ్యాప్తంగా రౌడీ మూకల్ని ఏర్పాటు చేసుకుని బెదిరింపులకు తెగబడ్డారు. ఎదురుచెప్పిన వారిని భయాందోళనకు గురిచేశారు. అధికార యంత్రాంగం సాయంతో అక్రమ వసూళ్లకు తెగబడ్డారు. భారీగా భూములు, బంగారం కూడబెట్టారు. విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన ఆస్తులు కొనుగోలు చేశారు. ఆయన స్వగ్రామంలోనూ రూ.కోట్లు వెచ్చించి ఇల్లు కట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గానికి చెందిన వైకాపా ప్రజాప్రతినిధి దందా ఇదీ..
వెంచర్ వేయాలంటే కప్పం కట్టాల్సిందే..
ఈ ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నగరాలకు అందుబాటు దూరంలో ఉంటుంది. దీంతో ఇక్కడ భూముల ధరల మాదిరే స్థిరాస్తి లావాదేవీలూ విపరీతంగా పెరిగాయి. ఈ ప్రాంతంలో ఎవరైనా వెంచర్ వేయాలంటే ఆ ప్రజాప్రతినిధి అడిగినంత కప్పం కట్టాల్సిందే. అందుకు అంగీకరించని వారిని అధికారుల సాయంతో ఇబ్బంది పెడుతుంటారు. సొమ్ములు చెల్లించిన తర్వాతే వెంచర్ కార్యకలాపాలు జరిగేది. విద్యాసంస్థలకు కేంద్రమైన ఓ ప్రాంతంలో ఎవరు కొత్తగా ఇల్లు కట్టుకున్నా, వెంచర్ వేసినా, అపార్ట్మెంట్ నిర్మించినా అందులో ఏదో ఒక కారణం చూపి వసూళ్లు చేశారు. ఆ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడే ఈ దందాలు నిర్వహిస్తున్నారు.
పేదలు బాగు చేసుకున్న భూములు లాక్కొని..
నియోజకవర్గంలోని ఓ గ్రామం పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. తెదేపా హయాంలో ఆ గ్రామస్థులు చందాలు వసూలు చేసుకుని ఓ 50 ఎకరాలు బాగు చేసుకున్నారు. దాన్ని భూమి లేని పేదలంతా సాగు చేసుకోవాలనుకున్నారు. ఈ ప్రజాప్రతినిధి గెలిచిన వెంటనే ఆ భూమిని ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వేసి తన ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అందులో కొబ్బరి సాగు చేస్తున్నారు. మండల పరిషత్ నిధులతో ఆ తోటకు కంకర రహదారి నిర్మించుకున్నారు. కుటుంబ సభ్యులకు చెందిన భూమిని కూడా అందరికీ పంచకుండా, అధికార బలంతో ఆయనొక్కరే నొక్కేశారు.
క్రమబద్ధీకరణ పేరిట భారీ దోపిడీ
కొన్నాళ్ల కిందట ప్రభుత్వం 246 ఎకరాల భూములకు సంబంధించి డీ పట్టాలు పంపిణీ చేసింది. ఆ లబ్ధిదారుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారీ నేత. ఆ భూముల క్రమబద్ధీకరణలోనూ పెద్ద ఎత్తున దండుకున్నారు. జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ఒక నాయకుడికి చెందిన భూమి విక్రయం విషయంలో సుమారు రూ.20 కోట్లు ఆర్జించారు. చెరువు గట్లను పూడ్చేసి ఈ భూమికి రహదారిగా చూపారు. ఉపాధి హామీ పథకం కింద రూ.31 లక్షలతో రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టించి మంజూరు చేయించుకున్నారు. ఈ రోడ్డు నిర్మిస్తే చిక్కులు వస్తాయని అధికారులు వెనకడుగు వేయడంతో పనులు ప్రారంభం కాలేదు.
ఓ పత్రిక కార్యాలయం పక్కన మూడేళ్ల కిందట కొంతమంది వ్యాపారులు కలిసి 42 ఎకరాల్లో వెంచర్ వేశారు. అందులో డీ పట్టా భూమి ఉందంటూ ఆ యజమానులను బెదిరించి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు గుంజేశారు. సెటిల్మెంట్లలోనూ ఆయన తీరు భిన్నంగా ఉంటుందని చెబుతుంటారు.
కొండలు పిండి చేసిన ఘనులు
నియోజకవర్గంలోని కొండలన్నింటినీ ఈ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులు పిండిచేసేశారు. కంకర, మట్టి పెద్దఎత్తున తరలించి రూ.లక్షలు ఆర్జించారు. ఓ కొండను మేనల్లుడు తీసుకున్న అనుమతికి మించి తవ్వేసి సొమ్ము చేసుకున్నారు. ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే ఇసుక ర్యాంపు ప్రారంభించి విజయనగరం, విశాఖ నగరాలకు అక్రమంగా తరలించారు. మధ్యలో కొంత సమయం ఆగినా.. ఇటీవల మళ్లీ అక్కడి నుంచే రవాణా సాగిస్తున్నారు.
సొమ్ములిస్తేనే ఉద్యోగం
- విద్యుత్తు షిఫ్టు ఆపరేటర్ల పోస్టులు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల చొప్పున వసూలు చేశారీ నేత. కొందరికి ఇప్పించినా.. చాలామందికి మొండిచేయి చూపారు. వారికి డబ్బులూ తిరిగివ్వకపోవటంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు.
- అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.5- రూ.8 లక్షలు వసూలు చేశారు. ఆశా కార్యకర్తల నియామకాల్లోనూ డబ్బులు వసూలు చేశారు.
- స్థానిక పరిశ్రమల్లో ఈయన సోదరుడికి కాంట్రాక్టులు ఇప్పించారు. ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే అందుకయ్యే ఖర్చులను కూడా ఆయా పరిశ్రమల
- నుంచే వసూలు చేస్తున్నారు.
హత్యాయత్నంలో ప్రమేయం!
- గతేడాది ఓ పత్రిక విలేకరి బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది. దీనికి ఆ ప్రజాప్రతినిధి, ఆయన ప్రధాన అనుచరుడే కారణమని.. వారిపై చర్యలు తీసుకోవాలని లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నారు.
- నియోజకవర్గ పరిధిలోని ఓ మండల స్థాయి ప్రజాప్రతినిధిపై కొన్నాళ్ల కిందట హత్యాయత్నం జరిగింది. ఇందులో ప్రజాప్రతినిధి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బాధితులు ఆందోళన నిర్వహించారు.
- అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలోని పలువురు మహిళల్ని ఈ ప్రజాప్రతినిధి వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆయన అనుచరుడొకరు ఓ మహిళకు ఫోన్ చేసి.. ‘సార్ మీ ఫొటో చూసి ఇంట్రస్ట్గా మాట్లాడారు’ అని చెప్పిన ఓ ఆడియో క్లిప్ వైరల్గా మారడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు