జేఈఈ మెయిన్స్‌లో తెలుగోళ్ల సత్తా

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్‌ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్‌ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్‌టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది.

Updated : 25 Apr 2024 07:12 IST

జాతీయ స్థాయిలో 22 మందికి 100 పర్సంటైల్‌
ఏపీ విద్యార్థులకు 9, 14, 20, 21 ర్యాంకులు
తుది ఫలితాల విడుదల

ఈనాడు, అమరావతి: జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్‌ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్‌ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్‌టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్‌ సైతం ప్రకటించింది. 100 పర్సంటైల్‌ సాధించినవారిలో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు ఉన్నారు. ఫలితాలతోపాటు జాతీయ ర్యాంకులు, రాష్ట్రాల వారీగా టాపర్లు, కటాఫ్‌ను వెల్లడించింది. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌ను జనవరి, ఏప్రిల్‌ నెలల్లో రెండు విడతలుగా నిర్వహించారు. రెండు సెషన్లలో పాల్గొన్న అభ్యర్థుల ఉత్తమ స్కోరును తుది మెరిట్‌ జాబితాకు పరిగణనలోకి తీసుకుంటారు. రెండు సెషన్లకు కలిపి 9,24,636 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. 8,22,899 మంది పరీక్షలకు హాజరయ్యారు. జేఈఈ మెయిన్స్‌లో విశాఖపట్నానికి చెందిన రెడ్డి అనిల్‌కు జాతీయస్థాయిలో 9వ ర్యాంకు లభించగా, కర్నూలుకు చెందిన కేశం చెన్న బసవారెడ్డికి జాతీయస్థాయిలో 14, ఈడబ్ల్యుఎస్‌లో మొదటి ర్యాంకు వచ్చాయి. వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన అన్నారెడ్డి వెంకట తనీష్‌రెడ్డికి జాతీయస్థాయిలో 20వ ర్యాంకు, ఈడబ్ల్యుఎస్‌లో మూడో ర్యాంకు లభించాయి. ఇదే జిల్లాకు చెందిన తోటంశెట్టి నిఖిలేష్‌కు జాతీయస్థాయిలో 21వ ర్యాంకు లభించింది.

100 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులు..

1 హందేకర్‌ విదిత్‌ (తెలంగాణ), 2 ముత్తవరపు అనూప్‌ (తెలంగాణ),  3 వెంకటసాయి తేజ మదినేని (తెలంగాణ),  4 రెడ్డి అనిల్‌ (తెలంగాణ),  5 రోహన్‌సాయి పబ్బ (తెలంగాణ), 6 శ్రీయాశస్‌ మోహన్‌ కల్లూరి (తెలంగాణ), 7 కేసం చెన్నబసవరెడ్డి (తెలంగాణ), 8 మురికినటి సాయి దివ్యతేజరెడ్డి (తెలంగాణ), 9 రిషి శేఖర్‌ శుక్లా(తెలంగాణ), 10 తవ్వ దినేశ్‌రెడ్డి (తెలంగాణ),  11 గంగ శ్రేయాస్‌ (తెలంగాణ), 12 పొలిశెట్టి రితీశ్‌ బాలాజీ (తెలంగాణ), 13 తమటం జయదేవ్‌రెడ్డి (తెలంగాణ), 14 మరువు జస్విత్‌ (తెలంగాణ), 15 దొరిసాల శ్రీనివాస్‌రెడ్డి (తెలంగాణ), 16 చింటు సతీశ్‌ కుమార్‌ (ఆంధ్రప్రదేశ్‌), 17 షేక్‌ సూరజ్‌ (ఆంధ్రప్రదేశ్‌), 18 తోటంశెట్టి నిఖిలేశ్‌ (ఆంధ్రప్రదేశ్‌), 19 తోట సాయికార్తిక్‌ (ఆంధ్రప్రదేశ్‌), 20 మురసని సాయి యశ్వంత్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్‌), 21 మాకినేని జిష్ణుసాయి (ఆంధ్రప్రదేశ్‌), 22 అన్నారెడ్డి వెంకట తనీష్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్‌)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు