పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!!
ఆరోగ్యశ్రీ పై ప్రచార ఆర్భాటం
ఉచిత వైద్యమంటూ పేదోళ్లకు జగన్ వంచన
పథకానికి అస్వస్థత... రోగులకు అవస్థ
నెట్వర్క్ ఆసుపత్రుల్లోనూ అదనపు వసూళ్లు
ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ విధానంలోనే చికిత్స
గొప్పలు చెప్పడంలో మాత్రం ముందున్న సీఎం
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! బీమా కార్డు తీసుకెళితే ధీమా దక్కడంలేదు! అయినా గొప్పలు చెప్పుకోవడంలో జగన్ తగ్గేదేలేదు!!
ముఖ్యమంత్రి జగన్... ఆరోగ్యశ్రీని అస్వస్థతకు గురిచేసి, అనారోగ్య పీడితుల్ని వంచిస్తున్నారు. నవరత్నాల్లో పేర్కొన్న ప్రకారం ఈ పథకం సేవలను ఉద్ధరించేసినట్లు తన భుజాలను తానే చరుచుకుంటున్న సీఎం తీరు విస్తుగొలుపుతోంది. చికిత్స చేసే వ్యాధుల సంఖ్యను, ఖర్చు చేసే డబ్బుల పరిధినీ పెంచామని ప్రచారం చేసుకుంటున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఎక్కడికి వెళ్లినా ఉచిత చికిత్స దొరుకుతుందని ఊదరగొడుతున్నారు. గ్రీన్ఛానెల్ ద్వారా ట్రస్టు కార్యకలాపాలకు నిధుల కొరత రాకుండా ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నామనీ బాకాలు ఊదుతున్నారు. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆసుపత్రులకు రూ.800 కోట్ల వరకు బిల్లుల బకాయిలు ఉండటమే ఇందుకు తార్కాణం. ట్రస్టుకు ప్రతినెలా రూ.300 చెల్లించే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వైద్యం సక్రమంగా అందడంలేదు. సొంతంగా ఖర్చులు భరించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు శస్త్రచికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు చాలడంలేదని ప్రైవేటు ఆస్పత్రులు గగ్గోలు పెడుతున్నా పట్టింపే లేదు. సేవలు నిలిపేస్తామని ఆసుపత్రులు అల్టిమేటం ఇవ్వడం, చివరి నిమిషంలో ప్రభుత్వం ఎంతోకొంత సర్దుబాటు చేయడం... ఐదేళ్లుగా ఒక ఆనవాయితీగా మారిందంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. అత్యవసరంగా, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లిన రోగులకు ఆరోగ్యశ్రీ కింద తక్షణమే చికిత్స అందడం లేదు. రోగుల వివరాలను ట్రస్టుకు పంపి, అక్కడి నుంచి ప్రీ-ఆథరైజేషన్ వచ్చే వరకు వేచి చూస్తున్నారు. అప్పటివరకు చేసిన చికిత్సకు ఫీజులు వసూలు చేస్తుండటం గమనార్హం.
వ్యాధి నిర్ధారణ పేరిట అదనపు వసూళ్లు
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేరిన వారికి ఉచితంగా చికిత్స, శస్త్రచికిత్సలు చేయాలంటే వారికి అంతకుముందు జరిగిన వ్యాధి నిర్ధారణ పరీక్షలకు కూడా ఫీజులు వసూలు చేయకూడదు. అయితే... ఆసుపత్రుల వారు రోగులకు రూ.10-30 వేల విలువైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తూ డబ్బులు తీసుకుంటున్నారు. వారం తర్వాత రావాలని పంపిస్తూ... అప్పుడు మాత్రమే ఆరోగ్యశ్రీ కింద చేర్చుకుంటున్నట్లు రికార్డులు తయారు చేస్తున్నారు. ఆపరేషన్ జరిగి, ఇళ్లకు వెళ్లిన అనంతరం ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఫాలోఅప్ కింద రూ.10 వేల విలువైన వైద్యసేవలను ఉచితంగా పొందే అవకాశముంది. ఈ అవకాశాన్ని ప్రతి వంద మందిలో 10% మందే ఉపయోగించుకుంటున్నా అధికారులు దృష్టి పెట్టడంలేదు.
వాటా చెల్లించే ఉద్యోగులకూ చుక్కలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘ఉద్యోగస్తుల ఆరోగ్య పథకం’ కింద ఇచ్చిన కార్డులను ప్రైవేట్ ఆసుపత్రుల వారు గౌరవించడంలేదు. ఉద్యోగులంతా కలిసి ప్రభుత్వానికి ప్రతినెలా రూ.225, రూ.300 చొప్పున మొత్తం రూ.218 కోట్లు చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వాలి. రాష్ట్రంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పెన్షనర్లు కలిపి 22 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో అనారోగ్యానికి గురైన వారు బీమా కార్డులతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే... చికిత్స అందించేందుకు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు త్వరగా రావడంలేదని, రీయింబర్స్మెంట్ కింద మాత్రమే చికిత్స అందిస్తామని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు సొంత డబ్బులు చెల్లించి, చికిత్స పొందుతున్నారు.
సగం కోత... అదీ ఆరు నెలల తర్వాతే చెల్లింపు
పొందిన చికిత్సకు తగ్గట్లు ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వానికి రీయింబర్స్మెంట్ కింద దరఖాస్తు చేసుకోవడం, పరిశీలన పూర్తవడం, తిరిగి చెల్లింపులు జరగడానికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతోంది. చికిత్స/శస్త్రచికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రుల వారు రూ.2 లక్షల వరకు వసూలు చేస్తే... ప్రభుత్వం 50% కోత విధిస్తోంది.
ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో విశ్రాంత, ఒప్పంద ఉద్యోగుల ఇష్టారాజ్యం నడుస్తోంది. దీనిపై సీఎంవో ప్రభావం ఎక్కువగా ఉంది. ట్రస్టు తరఫున ఆసుపత్రుల ఎంపిక, వాటిపై వచ్చే ఆరోపణలు, ఫిర్యాదుల మీద జరిగే విచారణలు, జరిమానాల విధింపుల్లో... రాజకీయ జోక్యం, వసూళ్ల దందా భారీగా ఉంటోందనే ఆరోపణలున్నాయి.
చికిత్సలపై ప్యాకేజీ ధరల ప్రభావం
చాలా చికిత్సలకు ప్రభుత్వం ఇస్తున్న ఛార్జీలు గిట్టుబాటు కావడం లేదని, పెంచాలని ఆరోగ్యశ్రీ నెట్వర్క్లోని ఆస్పత్రులు చాన్నాళ్లుగా కోరుతున్నాయి. స్పందన లేకపోవడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు రకరకాల దారులు వెతుక్కుంటున్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరిట అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. కొన్నిసార్లు శస్త్రచికిత్స పరికరాలను ఒకరికంటే ఎక్కువ మందికి వాడుతున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. ‘ఆరోగ్యశ్రీ’ కింద గుండెకు బైపాస్ సర్జరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,18,881 ఇస్తోంది. అదే ఆపరేషన్కి ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం రూ.1,84,500 ఇస్తోంది. ఇదేకాకుండా పెద్దలు, పిల్లల్లో హృద్రోగ సమస్యల్ని సరిదిద్దేందుకు చేసే వందకుపైగా శస్త్రచికిత్సలకు...కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం తక్కువ డబ్బులివ్వడం పేదలపాలిట శాపంగా మారింది. ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరలను ప్రతి ఏడాది సమీక్షిస్తేనే తమకు కార్డుతో చికిత్స అందుతుందని, లేదంటే నెలనెలా వాటా చెల్లిస్తున్న నష్టపోతున్నామని ఉద్యోగుల సంఘం నేత ఒకరు వాపోయారు.
నగరాల్లో పరిమితంగా సేవలు
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్సల సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా ప్రయోజనం పొందే వారు తక్కువగా ఉన్నారు. పైగా బిల్లుల చెల్లింపులు సక్రమంగా లేనందున చాలా ఆసుపత్రులు అత్యవసర కేసులకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తున్నాయి. హైదరాబాద్ నిమ్స్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందకపోవడంతో రోగులు తీవ్రంగా నష్టపోతున్నారు.
క్లెయిమ్లు పంపక... ‘ఆసరా’ రాక..!
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం జరిగిన వారికి ఆసరా కింద రూ.5 వేల వరకు అందాలి. వీరి వివరాలను ఆసుపత్రుల వారు ఆరోగ్యశ్రీ కింద క్లెయిమ్ చేయకపోవడంతో అర్హతలున్న వారికి కూడా ఆర్థిక సాయం అందడంలేదు. దాంతో వారంతా నష్టపోతున్నారు.
గుండె సమస్యలతో ఏటా 6వేల మంది జననం
రాష్ట్రంలో గుండె సంబంధిత సమస్యలతో ప్రతి ఏడాది 6వేల మంది శిశువులు జన్మిస్తుంటారని అంచనా. వీరిలో 80% మందికి ఆపరేషన్లు చేయాల్సిందే. బాధితుల్లో అత్యధికులు పేదలే. ముఖ్యంగా పిల్లల గుండెల్లో రంధ్రం పూడ్చడానికి ఖర్చులనే పరిగణనలోకి తీసుకున్నా ఒక్కొక్కరికి రూ.95 వేల నుంచి రూ.లక్ష వరకు అవుతుందని, ప్రభుత్వం రూ.87 వేలు మాత్రమే ఇస్తోందని ఆసుపత్రుల ప్రతినిధులు తెలిపారు. పిల్లల గుండె శస్త్రచికిత్సలకు వాడే వైద్య పరికరాలకు పెద్దవారితో పోలిస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని వెల్లడించారు. ఇలాంటి ఆపరేషన్లు చేస్తున్న ఆసుపత్రులు ప్రస్తుతం తిరుపతి (ప్రభుత్వ)లో ఒకటి, విజయవాడ (ప్రైవేటు)లో మరోటి ఉన్నాయి. విజయవాడ, విశాఖలో ప్రత్యేకంగా రెండు ఆసుపత్రులను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు అతీగతీ లేదు.
కాగ్ హెచ్చరించినా బేఖాతర్
నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులను వేగంగా చెల్లించకుంటే... దాని ప్రభావం రోగులకు అందించే వైద్యంపై పడుతుందని కాగ్ హెచ్చరించినా జగన్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. క్లెయిమ్ పంపిన 60 రోజుల్లో జరగాల్సిన చెల్లింపులకు కొన్నిసార్లు 400 రోజుల సమయం పడుతుండటం గమనార్హం. ఈ ఆసుపత్రుల్లో అందిన చికిత్సలపై థర్డ్ పార్టీ ద్వారా క్లినికల్, మెడికల్, డెత్ ఆడిట్లు చేయించడం లేదనీ కాగ్ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి