అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు.
రాష్ట్రంలో జె-ట్యాక్స్.. అదనంగా ఇక్కడ కె-ట్యాక్స్
వందల ఎకరాల ఆక్రమణ
ఆరోగ్యశ్రీలోనూ కమీషన్లు దండుకున్న వైనం
అక్రమాలకు ప్రమోషన్గా ఆ నేతకు స్థానచలనం
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు.
అందరిలోకెల్లా ఓ ప్రజాప్రతినిధిది మాత్రం మొదటి వరస... దేవుడి భూములనీ.. శ్మశాన స్థలాలనే పట్టింపులేం ఉండవు..
జెండా పాతేయడమే ఎజెండాగా.. సోదర సమేతంగా బరితెగించిన భూబకాసురుడీ నేత!
కాడెద్దులు, బండెడు అన్నం తినే బకాసురుడి కథ వినే ఉంటాం. వైకాపా సర్కారులో భూబకాసురుడంటే గుర్తొచ్చేది మాత్రం ఆ ప్రజాప్రతినిధే. ఆ నేతతోపాటు ఆయన సోదరుడి పేరు వింటే చాలు పశ్చిమ ప్రకాశం వణికిపోతోంది. వందల ఎకరాలను కబ్జా చేసి.. ఇంకా ఆకలి తీరలేదన్నట్లు ఊళ్ల మీద పడుతున్నారు. కాదూ కూడదంటే ఆయన సోదరుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. దోచుకోవడంలో అన్నదమ్ములిద్దరిదీ ఒకేమాట, ఒకే బాట. కాకపోతే.. అన్న క్లాస్.. తమ్ముడు మాస్. మిగతాదంతా సేమ్ టు సేమ్. అక్కడ ఏ పని చేయాలన్నా కె-ట్యాక్స్ కట్టాల్సిందే. నకిలీ పత్రాలు సృష్టించి కొండలనూ కొట్టేయగల సిద్ధహస్తులు. ఆఖరికి ఆరోగ్యశ్రీలోనూ కమీషన్లు లాగేసేంత కక్కుర్తి. అయినా ఆ ప్రజాప్రతినిధి ఎంతో గొప్ప నాయకుడని.. వారి పార్టీ అధినేతే మురిసిపోతారు. ప్రజాసేవ కోసమే అమెరికా నుంచి తిరిగొచ్చారని ప్రశంసిస్తారు. మరి.. అంత గొప్ప నాయకుడైతే, ప్రజలకు అంత సేవ చేసి ఉంటే.. 2019లో గెలిచిన స్థానం నుంచి కాకుండా, మరో చోటకు బదిలీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పడానికి మాత్రం ఆయన దగ్గర సమాధానం లేదు.
మట్టి తవ్వాలన్నా.. ఇసుక అమ్మాలన్నా..
ఈయన ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతంలో చెరువులు, కొండలు, కుంటలు, ప్రభుత్వ భూముల నుంచి తట్ట మట్టి తీయాలన్నా, వాగుల్లో ఇసుక తవ్వాలన్నా... కప్పం కట్టాల్సిందే. వారికి తెలియకుండా ఎవరైనా మట్టిని తీస్తే.. భూగర్భ గనుల శాఖ అధికారులు వెంటనే అక్కడ వాలిపోతారు. ఈ ప్రజాప్రతినిధికి కప్పం కట్టమంటారు. కడితే సరి... లేదంటే రూ.లక్షల్లో జరిమానా విధిస్తారు. అయిదేళ్ల పాలనలో అక్రమ వసూళ్ల కోసం మండలానికి ఇద్దరు గుత్తేదారుల్ని నియమించారంటేనే దందా ఏస్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
వెంచర్కు 2 శాతం కప్పం
తన సామ్రాజ్యంలోని 4 మండలాల్లో ఎవరైనా వెంచర్ వేయాలంటే.. ఈ ప్రజాప్రతినిధికి 2 శాతం కె-ట్యాక్స్ వెళ్లాలి. లేదంటే అధికారులు తనిఖీల పేరుతో కొర్రీలు పెడతారు. మేతన్నకు పన్ను జమయ్యేదాకా అనుమతులే రావు.
సెటిల్మెంట్లు.. కబ్జాలే నిత్యకృత్యంగా..
దేవుడి భూములని చూడరు.. దళితులకు కేటాయించిన శ్మశానాలనూ వదలరు. ప్రైవేటైనా, ప్రభుత్వ భూములైనా.. అనుచరుల ద్వారా ఆక్రమించడం, బినామీల పేర్లతో ఆన్లైన్లో మార్చుకోవడంలో సోదరులిద్దరూ దిట్టలే. వివాదాస్పద, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న వాటితోపాటు కుటుంబ తగాదాల్లో ఉన్న భూములనూ వీరు అవకాశంగా మలుచుకుంటారు. అవసరమైతే వాటికి మరిన్ని చిక్కులు సృష్టిస్తారు. తర్వాత తామే పంచాయితీ చేసి.. బినామీ పేర్లతో రాయించుకుంటారు. ఇలా కొట్టేసిన భూములు వందల ఎకరాల్లోనే ఉన్నాయి. వీరికి రెవెన్యూ అధికారులూ యథాశక్తి సహకరిస్తుంటారు.
- మార్కాపురంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానానికి చెందిన సుమారు రూ.10 కోట్ల విలువైన భూమిని తాము కొనుగోలు చేశామంటూ.. అనుచరులతో రాత్రికి రాత్రే కంచె వేయించారు.
- మార్కాపురం రాజ్యలక్ష్మీనగర్ సమీపంలో దళితులకు చెందిన శ్మశానాన్నీ వదల్లేదు. నకిలీ పత్రాలు సృష్టించి 4 ఎకరాలు కబ్జా చేశారు. కళాశాల రహదారిలోని ఎస్సీలకు చెందిన శ్మశానాన్ని సైతం ఆక్రమించి కంచె వేశారు.
- ఈ ప్రజాప్రతినిధుల అనుచరుడైన ఒక వైకాపా కౌన్సిలర్.. గోగులదిన్నెలో రైతులకు చెందిన భూమిని దొంగ పత్రాలతో ఆక్రమించేశారు.
- యర్రగొండపాలెం కేంద్రంగా ఈ ప్రజాప్రతినిధి సోదరుల అనుచరులు భూకబ్జాలకు తెరతీశారు. మార్కాపురం నుంచి కంభం రహదారిలో ఉన్న ఓ విలువైన స్థలానికి నకిలీ పత్రాలను సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బాధితుడు సిట్కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన అధికారులు, బాధ్యులపై కేసులు నమోదు చేశారు. ఇదే ప్రాంతంలో ఓ నిరుపేదకు చెందిన ఎకరా భూమికి.. దొంగ పత్రాలు సృష్టించి ఆక్రమించారు.
- మార్కాపురం పట్టణంలో వాసవీ కన్యకా పరమేశ్వరి డిగ్రీ కళాశాలకు ఎదురుగా ఆర్అండ్బీ రహదారికి పక్కన 70 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న వారికి నామమాత్రంగా ఎంతోకొంత ఇచ్చి బలవంతంగా ఖాళీ చేయించారు. అక్కడ అనుచరులతో పెద్ద పెద్ద భవంతులు నిర్మించారు.
- 2021లో మార్కాపురంలో 350 ఎకరాల ప్రభుత్వ, ఎసైన్డ్ భూములను వైకాపా నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల పేర్లతో ఆన్లైన్ చేశారు. ఈ అక్రమాల్లో విశ్రాంత తహసీల్దారును అరెస్టు చేయడంతోపాటు 17 మంది రెవెన్యూ ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏడాది తర్వాత వారందరికీ వివిధ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. అయినా భూముల చెర ఇంకా వీడలేదు.
- మార్కాపురం మండలం రాయవరంలో వైద్య కళాశాలకు సమీపంలో 80 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజాప్రతినిధే తమ అనుచరుల పేర్ల మీద
- అక్రమంగా ఆన్లైన్ చేయించారు. ఆ తర్వాత బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ ప్రాంతంలోనే ఉద్యోగులకు పట్టాలు ఇవ్వడానికి ‘జగనన్న స్మార్ట్ సిటీ’కి కేటాయించిన 10.22 ఎకరాల భూమికి వైకాపా నాయకుడొకరు కంచె వేసి కబ్జా చేశారు.
- మార్కాపురం శివారు డ్రైవర్స్ కాలనీలో రూ.కోట్ల విలువ చేసే భూమిని వైకాపా కౌన్సిలర్ ఆక్రమించి, చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారు.
- తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడులో ప్రజాప్రతినిధుల పేర్లతో వైకాపా నాయకులు సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నారు. జాతీయ రహదారికి సమీపంలో 50 ఎకరాలను రెవెన్యూ అధికారుల ద్వారా ఆన్లైన్లో తమ పేర్లపైకి మార్చుకున్నారు.
- కొనకనమిట్ల మండలం కాట్రకుంటలో 80 ఎకరాల పశువుల మేత భూమినీ కొందరు ఆక్రమిస్తే వారికి తమవంతు అండదండలు అందించారీ సోదరులు.
- తర్లుపాడు మండలం మంగలకుంటలో వైకాపా నాయకులు ఎర్రమట్టిని అక్రమంగా రవాణా చేసి రూ.లక్షల్లో ఆర్జించారని స్థానికుడొకరు అధికారులకు ఫిర్యాదు చేస్తే, ఆయనపై దాడికి తెగబడ్డారు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం సీఎం జగన్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అక్కడి అవసరాల కోసం రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ వాహనాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. -
జగన్ పన్నాగం పారలేదు
జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది. -
ఈసీ అనుమతి లేదు
ప్రభుత్వ పథకాల నిధుల పంపిణీ విషయంలో ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది. -
ఆ దేవతే లేకపోతే..
ఈ ఐదేళ్ల పాలనలో జగన్ విధ్వంసకర నిర్ణయాలకు, అడ్డగోలు పనులకు హైకోర్టు కర్రుకాల్చి వాతపెట్టిన సందర్భాలు అనేకం. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలే చాలాసార్లు బాధితులకు రక్షణగా నిలిచాయి. -
బీరాలు పలికి.. బేరానికొచ్చి!
వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు ‘ప్రత్యేక హోదా’పై జగన్ చెలరేగిపోయారు. కేంద్రంపై రంకెలు వేశారు. ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఊగిపోయారు. వైకాపా నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టి బంద్లు చేయించారు. -
ఆ‘పైవాడూ’ కాపాడలేడు!
..కానీ ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022’ దేవుళ్ల భూములకే ఎసరు పెట్టనుంది! వైకాపా సర్కారు రూపొందించిన అనాలోచిత చట్టంతో దేవాదాయ, వక్ఫ్, క్రైస్తవ మిషనరీలకు చెందిన భూములు ప్రమాదంలో పడుతున్నాయి. -
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
గతంలో ఏ ఎన్నికల్లోనూ కనిపించనంత కసి, ఉత్సాహం రాష్ట్ర ఓటర్లలో కనిపిస్తోంది. విదేశాలు, ఇతర నగరాల్లో ఉండే ఓటర్లు భారీ సంఖ్యలో ఏపీకి తరలివస్తున్నారు. -
‘భూ’చాళ్ల చట్టానికి బలయ్యేది బడుగులే
జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బారిన పడేవారిలో అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.. బడుగు బలహీనవర్గాలే. కొత్త చట్టంతో బలయ్యేది సెంటు, అరసెంటు స్థలాలు.. అరెకరా, ఎకరా భూమినే నమ్ముకున్నవారే. వారికి పలుకుబడి ఉండదు. -
ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం
ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వైకాపా ప్రభుత్వం రూపొందించిందని హైకోర్టు న్యాయవాది పదిరి రవితేజ విమర్శించారు. -
పన్నుల భారం రూ.1.38 లక్షల కోట్లు
‘అల్లమంటే నాకు తెలీదా! బెల్లంలా పుల్లగా ఉంటుంది’ అన్నాడంట వెనకటికొకడు! మంచి పాలన అంటే దౌర్జాన్యాలు, దోపీడీలు, అక్రమాలు, దమనకాండలు అనుకునే ముఖ్యమంత్రి జగన్ తీరు ఇప్పుడు అలానే ఉంది. -
భయాలను పెంచేలా.. ‘నోరు నొక్కేసేలా..!’
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై సీఎం జగన్, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలే రైతులు, వివిధ వర్గాల ప్రజల్లో భయాలను మరింత పెంచేలా ఉంటున్నాయి. -
విచారణ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయి
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ప్రకియ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయని, అందువల్ల ఈ కేసును మరో రోజు ప్రత్యేకంగా వింటామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. -
ఈసీ తీరును నిరసిస్తున్నాం: బొత్స సత్యనారాయణ
కేంద్ర ఎన్నికల సంఘం తీరును వైకాపా నిరసిస్తోందని, ఆక్షేపిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
జగన్ పాలనలో ఆర్యవైశ్యులకు అన్యాయం
జగన్ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ఎటువంటి న్యాయమూ జరగలేదని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు విమర్శించారు. -
మేం వైకాపాకు మద్దతు ఇవ్వలేదు
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్... వైకాపాకు మద్దతు ప్రకటించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటనను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది బషీర్ అహ్మద్ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. -
మార్గదర్శి నగదు, చెక్కులు సక్రమమే
విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. -
సింహాచలంలో వైభవోపేతంగా చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారు శుక్రవారం నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
తల్లితో కలిసి నేడు పిఠాపురానికి రామ్చరణ్
అగ్ర నటుడు చిరంజీవి తనయుడు, సినీ నటుడు రామ్చరణ్ శనివారం పిఠాపురం రానున్నారు. -
‘మూడు కోట్ల ఎకరాలకు’ బీమా ఎగ్గొట్టారు
పంట వేస్తే చాలు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని నమ్మిన రైతుల్ని జగన్ నిలువెల్లా మోసం చేశారు. -
ఆసుపత్రులు ఆగం.. తగ్గేదెలా రోగం?
పదే పదే ప్రచారం చేసి లేనిది ఉన్నట్లు నమ్మించే గోబెల్స్ ప్రచారంలో జగన్ ముందుంటారు. ఏమీ చేయకున్నా చేసినట్లు చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో ఆయన దిట్ట.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్
-
పాసు పుస్తకాలపై జగన్ బొమ్మా? వీధుల్లోకి వచ్చి నకళ్లను తగులబెట్టండి: చంద్రబాబు పిలుపు
-
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
-
మీ ఐఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? యాపిల్ చెప్పిన టిప్స్ ఇవే..
-
‘ఒక్క ఓటు’ పవర్ తెలిస్తే.. ఓటేయకుండా ఉండరు!
-
అందుకే పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చేయలేనన్నారు.. కానీ!