గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
అడ్డదారుల్లో గెలుపు కోసం అధికార పార్టీ నేతల ‘మద్య’ మార్గం
గోవాలో నాసిరకం సరకు తయారుచేయించి, రాష్ట్రానికి రప్పిస్తున్న వైనం
మూడు రాష్ట్రాలు దాటి ఎలా వస్తుందో విచారించని అధికారులు
ఈనాడు - అమరావతి
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అడ్డదారుల్లో గెలిచేందుకు ‘మద్య’ మార్గం పట్టిన కొందరు నాయకులు భారీ కుట్రకు తెరతీశారు. ప్రతి నియోజకవర్గంలోనూ లక్షల మంది ఓటర్లకు మద్యం పంపిణీ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే గోవాలో మద్యం అక్రమంగా తయారు చేసే డిస్టిలరీల్లో నామమాత్రపు ఖర్చుతో నకిలీ మద్యాన్ని తయారు చేయిస్తున్నారు. ఉదాహరణకు ఏపీలో క్వార్టర్ మద్యం సీసా కొనాలంటే రూ.150 నుంచి రూ.200 వరకూ ఖర్చవుతుంది. అదే గోవాలో నకిలీ మద్యం తయారు చేయిస్తే క్వార్టర్కు రూ.20- రూ.30 వెచ్చిస్తే చాలు. దీంతో అక్కడ నకిలీ మద్యాన్ని తయారు చేయించి వాటిని సీసాల్లో నింపి అచ్చం అసలైనదేనని నమ్మించేలా నకిలీ లేబుళ్లు, హాలోగ్రామ్లు అతికించి, సీళ్లు వేయిస్తున్నారు. వాటిని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. ఈ మద్యం అత్యంత నాసిరకమైనది. దీన్ని తాగితే ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తుంది. అయితే కొంతమంది వైకాపా నాయకులు మాత్రం పోయేది ప్రజలే కదా! మనకేం నష్టం అన్నట్లుగా ప్రజల ప్రాణాల్నే పణంగా పెడుతున్నారు. నకిలీ, హానికరమైన మద్యాన్ని రాష్ట్రాలు దాటించి తీసుకొస్తుంటే పోలీసులు, సెబ్ అధికారులు మొద్దునిద్ర పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
‘పెద్ద’ల ఆదేశాలతో గ్రీన్ ఛానల్?
ఈ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు వారి రహస్య స్థావరాలు, డంప్ల్లో నిల్వ చేసిన మద్యంలో ప్రస్తుతం పట్టుకున్నది, పట్టుబడింది కనీసం ఒక్క శాతమైనా ఉండదు. వందల కోట్ల విలువైన మద్యాన్ని వారు ఇప్పటికే నిల్వ చేసుకున్నారు. ఇంకా తెచ్చుకుంటున్నారు. ఇంత భారీ మొత్తంలో గోవా మద్యం వారికి ఎలా చేరుతోంది? దాదాపు మూడు రాష్ట్రాలు.. దారి పొడవునా పదుల సంఖ్యలో చెక్పోస్టులను దాటుకుని మరీ రాష్ట్రంలోకి ఈ మద్యం ఎలా వస్తోంది? ఎక్కడా తనిఖీల్లో ఎందుకు పట్టుకోలేదు? సరకు వైకాపా నాయకులదని వదిలేశారా? లేకుంటే అడ్డుకోవద్దని పెద్దల ఆదేశాలతో ప్రత్యేకంగా ఆ మద్యం తీసుకొచ్చే వాహనాలను ఎవరూ ఆపకుండా ‘గ్రీన్ ఛానల్’ ఏమైనా ఏర్పాటు చేశారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దుల్లో చెక్పోస్టుల ఏర్పాటు, తనిఖీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులతో మద్యం సరఫరా కాకుండా నిలువరించాలని, తెలంగాణ- ఆంధ్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు, తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం డిసెంబరు, జనవరి నెలల్లోనే ఆదేశించింది. వైకాపాతో అంటకాగిన అధికారులు మొదట్లో తనిఖీ కేంద్రాలే ఏర్పాటు చేయలేదు. తర్వాత పెట్టినా మొక్కుబడి తనిఖీలే.
మిథున్రెడ్డిని ఎందుకు విచారించరు?
ఊరూరా వైకాపా నాయకులు మద్యం నిల్వ చేసినా.. సెబ్, పోలీసు అధికారులు, తనిఖీ బృందాలు వారికి నిర్దిష్టంగా సమాచారం, ఫిర్యాదులు అందితేనే దాడులు చేస్తున్నాయి. కేసు పెట్టేసి మమ అనిపించేస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన్ను ఓడించాలని అధికార వైకాపా తొక్కని అడ్డదారులు లేవు. తాజాగా వైకాపా నాయకుల ఇళ్లల్లోనే 48,720 మద్యం సీసాలు పట్టుబడినా సూత్రధారులెవరో పోలీసులు తేల్చట్లేదు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే గోవా మద్యం ఏపీలోకి తీసుకొచ్చి, ఓటర్లకు పంచుతున్నారని ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేస్తున్నాయి. అలాంటప్పుడు ఆయనకు నోటీసులిచ్చి ఎందుకు విచారించట్లేదు? వైకాపా అభ్యర్థి తరఫున పంపిణీకే ఈ మద్యం నిల్వ చేసుకున్నప్పుడు వైకాపా అభ్యర్థి వంగా గీతపై ఎందుకు కేసు నమోదు చేయట్లేదు?
- 2014 ఎన్నికల సమయంలోనూ వైకాపా నాయకులు గోవాలో నకిలీ మద్యం తయారు చేయించి.. సీసాలపై నకిలీ లేబుళ్లు వేసి ఓటర్లకు పంచారు. ఆ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు అనారోగ్యం బారిన పడ్డారు. ఈ వ్యవహారంలో ప్రస్తుత సర్వేపల్లి, కావలి వైకాపా అభ్యర్థులు కాకాణి గోవర్ధన్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, పలువురు వైకాపా నేతలపై అప్పట్లో కేసులు నమోదయ్యాయి.
ఊరూరా గోవా మద్యమే
ఒక్క పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని నలుగురు వైకాపా నాయకులు, కార్యకర్తల ఇళ్లలో తనిఖీ చేస్తే 48,720 సీసాల మద్యం పట్టుబడింది. ఇదంతా గోవా సరకే. విలువ రూ.80 లక్షల పైమాటే. నందిగామ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహన్రావు నామినేషన్ సందర్భంగా దాదాపు 20 వేలకు పైగా క్వార్టర్ సీసాలను పంపిణీ చేశారు. ఇవన్నీ గోవా బ్రాండ్లే. తాజాగా డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో మండపేట నియోజకవర్గ వైకాపా ఎన్నికల పరిశీలకుడు సీహెచ్ ప్రభాకర్రావుకు చెందిన ఇటుకల బట్టీలో పట్టుబడిన 6,240 మద్యం సీసాలూ గోవా నుంచి తెచ్చినవే. ఇప్పటి వరకూ పట్టుబడ్డ గోవా మద్యమంతా వైకాపా నాయకుల వద్దే దొరికింది. అందువల్లే పోలీసులు, సెబ్ అధికారులు వాటి గుట్టు తేల్చే దిశగా దర్యాప్తుపై దృష్టిసారించట్లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం సీఎం జగన్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అక్కడి అవసరాల కోసం రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ వాహనాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. -
జగన్ పన్నాగం పారలేదు
జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది. -
ఈసీ అనుమతి లేదు
ప్రభుత్వ పథకాల నిధుల పంపిణీ విషయంలో ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది. -
ఆ దేవతే లేకపోతే..
ఈ ఐదేళ్ల పాలనలో జగన్ విధ్వంసకర నిర్ణయాలకు, అడ్డగోలు పనులకు హైకోర్టు కర్రుకాల్చి వాతపెట్టిన సందర్భాలు అనేకం. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలే చాలాసార్లు బాధితులకు రక్షణగా నిలిచాయి. -
బీరాలు పలికి.. బేరానికొచ్చి!
వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు ‘ప్రత్యేక హోదా’పై జగన్ చెలరేగిపోయారు. కేంద్రంపై రంకెలు వేశారు. ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఊగిపోయారు. వైకాపా నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టి బంద్లు చేయించారు. -
ఆ‘పైవాడూ’ కాపాడలేడు!
..కానీ ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022’ దేవుళ్ల భూములకే ఎసరు పెట్టనుంది! వైకాపా సర్కారు రూపొందించిన అనాలోచిత చట్టంతో దేవాదాయ, వక్ఫ్, క్రైస్తవ మిషనరీలకు చెందిన భూములు ప్రమాదంలో పడుతున్నాయి. -
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
గతంలో ఏ ఎన్నికల్లోనూ కనిపించనంత కసి, ఉత్సాహం రాష్ట్ర ఓటర్లలో కనిపిస్తోంది. విదేశాలు, ఇతర నగరాల్లో ఉండే ఓటర్లు భారీ సంఖ్యలో ఏపీకి తరలివస్తున్నారు. -
‘భూ’చాళ్ల చట్టానికి బలయ్యేది బడుగులే
జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బారిన పడేవారిలో అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.. బడుగు బలహీనవర్గాలే. కొత్త చట్టంతో బలయ్యేది సెంటు, అరసెంటు స్థలాలు.. అరెకరా, ఎకరా భూమినే నమ్ముకున్నవారే. వారికి పలుకుబడి ఉండదు. -
ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం
ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వైకాపా ప్రభుత్వం రూపొందించిందని హైకోర్టు న్యాయవాది పదిరి రవితేజ విమర్శించారు. -
పన్నుల భారం రూ.1.38 లక్షల కోట్లు
‘అల్లమంటే నాకు తెలీదా! బెల్లంలా పుల్లగా ఉంటుంది’ అన్నాడంట వెనకటికొకడు! మంచి పాలన అంటే దౌర్జాన్యాలు, దోపీడీలు, అక్రమాలు, దమనకాండలు అనుకునే ముఖ్యమంత్రి జగన్ తీరు ఇప్పుడు అలానే ఉంది. -
భయాలను పెంచేలా.. ‘నోరు నొక్కేసేలా..!’
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై సీఎం జగన్, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలే రైతులు, వివిధ వర్గాల ప్రజల్లో భయాలను మరింత పెంచేలా ఉంటున్నాయి. -
విచారణ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయి
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ప్రకియ జరగాల్సిన తీరులో జరగట్లేదన్న ఆరోపణలున్నాయని, అందువల్ల ఈ కేసును మరో రోజు ప్రత్యేకంగా వింటామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. -
ఈసీ తీరును నిరసిస్తున్నాం: బొత్స సత్యనారాయణ
కేంద్ర ఎన్నికల సంఘం తీరును వైకాపా నిరసిస్తోందని, ఆక్షేపిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
జగన్ పాలనలో ఆర్యవైశ్యులకు అన్యాయం
జగన్ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు ఎటువంటి న్యాయమూ జరగలేదని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు విమర్శించారు. -
మేం వైకాపాకు మద్దతు ఇవ్వలేదు
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్... వైకాపాకు మద్దతు ప్రకటించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటనను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది బషీర్ అహ్మద్ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. -
మార్గదర్శి నగదు, చెక్కులు సక్రమమే
విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. -
సింహాచలంలో వైభవోపేతంగా చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారు శుక్రవారం నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
తల్లితో కలిసి నేడు పిఠాపురానికి రామ్చరణ్
అగ్ర నటుడు చిరంజీవి తనయుడు, సినీ నటుడు రామ్చరణ్ శనివారం పిఠాపురం రానున్నారు. -
‘మూడు కోట్ల ఎకరాలకు’ బీమా ఎగ్గొట్టారు
పంట వేస్తే చాలు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని నమ్మిన రైతుల్ని జగన్ నిలువెల్లా మోసం చేశారు. -
ఆసుపత్రులు ఆగం.. తగ్గేదెలా రోగం?
పదే పదే ప్రచారం చేసి లేనిది ఉన్నట్లు నమ్మించే గోబెల్స్ ప్రచారంలో జగన్ ముందుంటారు. ఏమీ చేయకున్నా చేసినట్లు చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో ఆయన దిట్ట.
తాజా వార్తలు (Latest News)
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
-
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
-
హైవేపై తుపాకితో రీల్..వివాదంలో యూట్యూబర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు..! ఇక ఐఫోన్లో చాట్జీపీటీ?