వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు.
సీఎస్, డీజీపీలను బదిలీ చేయాలన్న విపక్షాలను పట్టించుకోని ఈసీ
తితిదే ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగించాలన్న సీఎం లేఖకు కేంద్రం సానుకూల స్పందన
ఆరు వారాల పాటు డిప్యుటేషన్ పొడిగిస్తూ రక్షణ శాఖ ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. కానీ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ (ఐడీఈఎస్)కు చెందిన ఏవీ ధర్మారెడ్డి అనే అధికారి తిరుమల తిరుపతి దేవస్థానం (తితేదే) కార్యనిర్వహణాధికారిగా లేకపోతే వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైపోతుందని, భక్తులకు దర్శనాలు చేయించడమే కష్టమవుతుందని సీఎం జగన్ ఒక లేఖ రాసిందే తడవు.. మరోమాటే లేకుండా డిప్యూటేషన్ గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసేసింది. ధర్మారెడ్డి డిప్యుటేషన్ మే 14తో ముగుస్తుండగా, ఈ ఏడాది జూన్ 30న ఆయన పదవీ విరమణ చేసేంత వరకు తితిదే ఈవోగా కొనసాగేలా ఆరు వారాలపాటు గడువు పొడిగించింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఈ పరిణామం అద్దం పడుతోంది.
రాష్ట్రంలో పదుల సంఖ్యలో సీనియర్ ఐఏఎస్ అధికారులుండగా, వారందరినీ కాదని.. డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్కు చెందిన ఒక అధికారిని డిప్యుటేషన్పై తీసుకొచ్చి.. అత్యంత కీలకమైన తితిదే ఈవో పోస్టు కట్టబెట్టడమే ఆభ్యంతరకరమైతే, ఆయన లేకపోతే అసలు తిరుమల స్తంభించిపోతుందన్నట్టుగా డిప్యుటేషన్ను పొడిగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తితిదే ఈవో (ఎఫ్ఏసీ)గా, తితిదే పరిధిలోని పలు సంస్థలకు డైరెక్టర్గా ఏకకాలంలో వివిధ పోస్టులు నిర్వహిస్తూ.. సర్వాధికారాలూ తన చేతిలో పెట్టుకొని చక్రం తిప్పుతున్న ధర్మారెడ్డి సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు. జగన్కు ధర్మారెడ్డి నమ్మిన బంటని, ఆయన దిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో పనులు చేసి పెడతారని, కేంద్ర ఎన్నికల సంఘం వంటి సంస్థల్లోనూ పలుకుబడి ఉపయోగిస్తారని.. ‘అతి సున్నితమైన’ వ్యవహారాల్ని కూడా సీఎం కోసం సునాయాసంగా చక్కబెడతారని పేరుంది! ధర్మారెడ్డి తితిదే ఈవోగా కొనసాగితే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందని, ఆయన్ను తక్షణం బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఇటీవల ఫిర్యాదు చేశారు. కానీ కేంద్ర రక్షణ శాఖ మాత్రం ఆయన డిప్యుటేషన్ను పొడిగించి, ఈఓగా కొనసాగేందుకు వెసులుబాటు కల్పించింది.
డిప్యుటేషన్ పొడిగింపు రెండోసారి
ధర్మారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఇది వరకే పొడిగించిన రెండేళ్ల డిప్యుటేషన్ గడువు వచ్చే నెల 14తో ముగుస్తోంది. ఈ ఏడాది జూన్ 30కి ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. లెక్క ప్రకారం ఆయన మే 14న కేంద్ర సర్వీసుకు తిరిగి వెళ్లిపోవాలి. కానీ తన ఆత్మబంధువులాంటి ధర్మారెడ్డిని వదులుకోవడానికి సిద్ధంగా లేని జగన్.. జూన్ 30న ఆయన పదవీ విరమణ చేసేంత వరకు, డిప్యుటేషన్ను పొడిగించాలంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్కు మార్చి 12న లేఖ రాశారు. తిరుమలలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని.. మే, జూన్ నెలల్లో సర్వదర్శనానికి 30 గంటల కంటే ఎక్కువ సమయం కూడా పడుతుందని అందులో పేర్కొన్నారు. అన్ని గంటలపాటు వేచి ఉండాల్సి రావడంతో భక్తులు తీవ్ర అసహనానికి గురవుతారు కాబట్టి.. వారికి ఆహారం, వసతి, రవాణా, వైద్య సదుపాయాలు కల్పించడంలో చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుందని సీఎం ఆ లేఖలో వెల్లడించారు. ధర్మారెడ్డి అయితేనే ఆ పనులు సజావుగా, సమర్థంగా చేయగలరని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయాలని తపన.. బస్సుల్లేక నరకయాతన
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. కీలకమైన ఎన్నికల్లో ఓట్లు వేయడం కోసం మైళ్ల దూరం దాటి మరీ సొంతూళ్లకు చేరడానికి సిద్ధమైన ఓటర్లకు ఆర్టీసీ నరకం చూపిస్తోంది. -
వైకాపా వీరవిధేయ పోలీసులపై క్రమశిక్షణ చర్యలు
ఎన్నికలు ముంచుకొచ్చినా తరుణంలోనూ వైకాపాకు కొమ్ముకాస్తూ, ఆ పార్టీ ప్రయోజనాల కోసం పరితపించిన నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్రెడ్డి, నంద్యాల డీఎస్పీ ఎన్.రవీంద్రనాథరెడ్డి, నంద్యాల రెండో పట్టణ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ కె.రాజారెడ్డిలపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. -
ఏ వ్యవస్థనూ ‘వదల్లేదు!’
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రతి రాజ్యాంగబద్ధ వ్యవస్థపైనా జగన్ దాడికి దిగారు. తన అనుయాయుల్ని, అనుచరగణాన్ని ఉసిగొల్పారు. న్యాయవ్యవస్థపైనా దాడి చేయించారు. రాష్ట్ర ఎన్నికల సంఘంపై దాడికి దిగారు. కార్యనిర్వాహక వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకుని, అధికారుల్ని భయభ్రాంతుల్ని చేసి చెప్పినట్టల్లా ఆడించారు. -
ఇతర సిరాలను వేళ్లకు పూస్తే చర్యలు తీసుకుంటాం
ఇతర సిరాలను వేళ్లకు పూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా హెచ్చరించారు. ఈ సిరా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) దగ్గర మాత్రమే ఉంటుందని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు. -
ఎన్నికల సిబ్బందికి అరకొర ఏర్పాట్లు
రాష్ట్రంలో ఆదివారం ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. చాలా చోట్ల అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతల మధ్యన భోజనం కోసం క్యూ లైన్లలో వేచి చూడాల్సి వచ్చింది. -
‘వివేకం’ సినిమాకు 2.15 కోట్లకు పైగా వీక్షణలు
సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఉదంతం ఆధారంగా తెరకెక్కించిన ‘వివేకం’ సినిమాకు ఆదివారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.15 కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయి. -
డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అపోలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సునీత నర్రెడ్డి ప్రతిష్ఠాత్మక ఇన్ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎస్ఏ) ఫెలోషిప్నకు ఎన్నికయ్యారు. -
బోటు వెళ్తేనే ఓటు..
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరింగ పంచాయతీ పరిధిలోని హోప్ఐలాండ్.. కాకినాడ నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఉంటుంది. అక్కడ వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులు ఉంటారు. -
ఎన్నికల కోసం ప్రత్యేక పోలీసు అధికారులు
పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు తావివ్వకుండా ఉండేందుకు.. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమించినట్లు డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఓ ప్రకటనలో వెల్లడించారు. -
వైకాపా వీరభక్త ఇన్స్పెక్టర్లపై వేటు
అధికార పార్టీకి కొమ్ముకాస్తూ పేట్రేగిపోయిన వైకాపా వీరభక్త ఇన్స్పెక్టర్లు పలువురిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరొందిన తిరుపతి డీటీసీ ఇన్స్పెక్టర్ జగన్మోహన్రెడ్డి, డీటీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజూ యాదవ్, -
దేవుడిచ్చిన అనిర్వచనీయమైన కానుక అమ్మ
‘దేవుడు నాకిచ్చిన అనిర్వచనీయమైన కానుక అమ్మ’ అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ‘అమ్మ....చీకటిలో వెలుగు రేఖై...బాధల్లో బలానివై...అలసటలో ఆలనవై.. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడుగా మారింది
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం రైతులకు ఉరితాడుగా మారిందని.. దీనిని రద్దు చేయాలని బాధిత రైతాంగ పోరాట వేదిక కన్వీనర్ తన్నీరు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. -
ఇలా అయితే ఇండియా అభివృద్ధి చెందదు
ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారానే భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని నెదర్లాండ్స్కు చెందిన ప్రముఖ రాజనీతి మానవీయ శాస్త్ర ప్రొఫెసర్ వార్ బైరన్ స్కాట్ అన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి.నరేందర్, జస్టిస్ మన్మథరావు, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. -
రాష్ట్రంలో భిన్న వాతావరణం.. పలు జిల్లాల్లో వర్షాలకు అవకాశం
రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. -
ఓటేసేందుకు వైఎస్ భాస్కరరెడ్డికి అనుమతి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఏడో నిందితుడైన వై.ఎస్.భాస్కరరెడ్డి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. 13న వెళ్లి అదే రోజు తిరిగి హైదరాబాద్ రావాలని స్పష్టం చేసింది. -
ఆరు పోలింగ్ కేంద్రాల్లో నిలిచిన విద్యుత్తు సరఫరా
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని ఆరు పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి వరకు పునరుద్ధరించలేదు. -
రూ.4 వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐ తలుపు తట్టిన ఏపీ సర్కార్
పదవీ కాలం ముగుస్తున్న దశలోనూ సొంతవారికి బిల్లుల చెల్లింపు కోసం వైకాపా ప్రభుత్వం ఎడాపెడా రుణాలు తీసుకుంటోంది. ఏప్రిల్ 1 నుంచి మే 14 వరకు ఈ 44 రోజుల్లో రూ. 17 వేల కోట్ల రుణం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. -
ఇదీ సంగతి!
-
కార్టూన్లు
కార్టూన్లు -
పెద్దల మాట
పెద్దల మాట