ఎయిర్కార్గో సేవలకు మోక్షం ఎప్పుడు?
వైకాపా ప్రభుత్వం ఎయిర్కార్గో సేవలను మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పారిశ్రామిక హబ్గా పేరొందిన విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏడాది కిందటే ఎయిర్కార్గో సేవలు నిలిచిపోయాయి.
ఏడాదిగా వాయుమార్గంలో నిలిచిన ఎగుమతులు
రోడ్డు మార్గం ద్వారా సరకు తరలింపు
వాణిజ్య హబ్గా పేరొందిన విశాఖలో ఇదీ దుస్థితి
విశాఖ విమానాశ్రయంలో గతంలో సరకు లోడింగ్
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: వైకాపా ప్రభుత్వం ఎయిర్కార్గో సేవలను మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పారిశ్రామిక హబ్గా పేరొందిన విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏడాది కిందటే ఎయిర్కార్గో సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా ఫార్మా, ఆహార ఉత్పత్తులు, రొయ్యలను రోడ్డు మార్గంలో తరలించడంతో సంబంధిత సంస్థలు నష్టాలు చవిచూస్తున్నాయి. ఇవన్నీ తెలిసినా.. ప్రభుత్వంలో చలనం లేదు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) నిబంధనల ప్రకారం కార్గో నిర్వహణకు ఇప్పటికీ అధీకృత ఏజెన్సీని నియమించలేదు. ఈ అంశంపై దృష్టిసారించి నియమించాలని రాష్ట్రప్రభుత్వం నుంచి వినతులు వెళ్లకపోవడం గమనార్హం. గతంలో ఇక్కడ దేశీయ, అంతర్జాతీయ కార్గో బాధ్యతలను ఓ సంస్థ నిర్వహించేది. కొవిడ్ సమయంలో అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోవడంతో సరకు రవాణాపై అది ప్రభావం చూపింది. నెలకు రూ.7లక్షల చొప్పున 17 నెలల కాలానికి అద్దె చెల్లించాల్సిందేనని అధికారులు ఆదేశించారు. మినహాయింపు ఇవ్వాలని సంస్థ యజమాని కోరినా.. పట్టించుకోకుండా వెళ్లిపోయేలా చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.
వారంలో వంద ట్రక్కులు రోడ్డు మార్గంలోనే
విశాఖలో స్పెషల్ ఎకనమిక్ జోన్, ఫార్మా సిటీ (వందకు పైగా కంపెనీలు), అచ్యుతాపురంలో బ్రాండిక్స్, ఇతర ఇంజినీరింగ్ పరిశ్రమలున్నాయి. ఫార్మాసిటీ నుంచి పెద్ద ఎత్తున ఔషధాలు.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఆహార ఉత్పత్తులు, ఇతర జిల్లాల నుంచి సముద్ర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎయిర్కార్గో నిలిచిపోవడంతో ఆయా ఉత్పత్తులను రోడ్డు మార్గంలోనే హైదరాబాద్, చెన్నై, కోల్కతా తరలించి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలా వారానికి సుమారు 100కు పైగా ట్రక్కులు వెళ్తున్నట్లు సమాచారం. ఫార్మా సంస్థల నుంచి నెలకు కనీసం 20 టన్నులు, బ్రాండిక్స్ నుంచి 3 టన్నుల ఉత్పత్తులు విదేశాలకు వెళ్తున్నాయి. రోడ్డు మార్గంలో వీటిని తరలించడం ద్వారా.. సమయం వృథా, ఖర్చు పెరగడంతోపాటు నాణ్యత లేమితో నష్టాలు వస్తున్నాయని సంబంధిత యజమానులు ఆందోళన చెందుతున్నారు.
సూరత్ విమానం నిలిచిపోవడంతో
విశాఖ నుంచి ఏడాదికి కనీసం 2.6 లక్షల టన్నుల రొయ్యలు పొరుగు ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటికి సూరత్, కోల్కతాలో మంచి గిరాకీ ఉంది. దీంతో రైతులు మంచి లాభాల కోసం అక్కడికి ఎగుమతి చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. 2020లో విశాఖ విమానాశ్రయం నుంచి స్పైస్ జెట్ కార్గో విమాన సర్వీసు ప్రారంభం కాగా.. కొవిడ్ సమయంలో అది నిలిచిపోయింది. రాష్ట్రం నుంచి సూరత్కు రోడ్డు మార్గం ద్వారా రొయ్య పిల్లలు తీసుకెళ్లాలంటే కనీసం 18 నుంచి 24 గంటల సమయం పడుతుంది. దీంతో రొయ్య పిల్లలకు సరిపడా ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్నాయి.
కావాల్సిన సౌకర్యాలు
విశాఖ విమానాశ్రయంలో పేరుకు తగ్గట్టుగా.. కార్గో నిర్వహణకు అంతర్జాతీయస్థాయి సౌకర్యాలు లేవు. కస్టమ్స్ అధికారులు నిత్యం అందుబాటులో ఉండట్లేదు. వివిధ ఔషధాలు, ఆహార ఉత్పత్తులను వేర్వేరు ఉష్ణోగ్రతల్లో నిల్వచేసేందుకు మల్టిపుల్ టెంపరేచర్ కంట్రోల్డ్ స్టోరేజ్ కావాలి. ప్యాకింగ్, ఉత్పత్తులు లోడ్ చేసేందుకు సెక్యూరిటీ స్క్రీనింగ్ సామగ్రి, సిబ్బంది కొరత వేధిస్తోంది.
ఏఏఐ ముందుగానే సమాచారమిచ్చినా
గతంలో విమానయాన సంస్థలే కార్గో తనిఖీలు, స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టేవి. 2023 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. బీసీఏఎస్ నిబంధనల ప్రకారం ఏఏఐ ఆధ్వర్యంలోనే ఈ తనిఖీలు జరగాలని కేంద్రం ఆదేశించింది. దీనిపై ముందుగానే ఏఏఐ సమాచారమిచ్చినా.. విశాఖ విమానాశ్రయంలో తగిన ఏర్పాట్లు చేయలేదు. దీంతో గతేడాది అంతర్జాతీయ, దేశీయ కార్గో సేవలు నాలుగు నెలలపాటు పూర్తిగా నిలిచిపోయాయి. స్థానిక ఎంపీల కోరిక మేరకు కొత్త ఏజెంట్ను నియమించేవరకు ఇండిగో సంస్థకు అనుమతులిచ్చారు. ఆయా సర్వీసుల్లో దేశీయంగా చాలా తక్కువ మొత్తంలోనే సరకు తరలిస్తున్నారు. అంతర్జాతీయ కార్గో కాంప్లెక్స్ పూర్తిగా మూతపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!