ఎయిర్కార్గో సేవలకు మోక్షం ఎప్పుడు?
వైకాపా ప్రభుత్వం ఎయిర్కార్గో సేవలను మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పారిశ్రామిక హబ్గా పేరొందిన విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏడాది కిందటే ఎయిర్కార్గో సేవలు నిలిచిపోయాయి.
ఏడాదిగా వాయుమార్గంలో నిలిచిన ఎగుమతులు
రోడ్డు మార్గం ద్వారా సరకు తరలింపు
వాణిజ్య హబ్గా పేరొందిన విశాఖలో ఇదీ దుస్థితి
విశాఖ విమానాశ్రయంలో గతంలో సరకు లోడింగ్
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: వైకాపా ప్రభుత్వం ఎయిర్కార్గో సేవలను మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పారిశ్రామిక హబ్గా పేరొందిన విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏడాది కిందటే ఎయిర్కార్గో సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా ఫార్మా, ఆహార ఉత్పత్తులు, రొయ్యలను రోడ్డు మార్గంలో తరలించడంతో సంబంధిత సంస్థలు నష్టాలు చవిచూస్తున్నాయి. ఇవన్నీ తెలిసినా.. ప్రభుత్వంలో చలనం లేదు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) నిబంధనల ప్రకారం కార్గో నిర్వహణకు ఇప్పటికీ అధీకృత ఏజెన్సీని నియమించలేదు. ఈ అంశంపై దృష్టిసారించి నియమించాలని రాష్ట్రప్రభుత్వం నుంచి వినతులు వెళ్లకపోవడం గమనార్హం. గతంలో ఇక్కడ దేశీయ, అంతర్జాతీయ కార్గో బాధ్యతలను ఓ సంస్థ నిర్వహించేది. కొవిడ్ సమయంలో అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోవడంతో సరకు రవాణాపై అది ప్రభావం చూపింది. నెలకు రూ.7లక్షల చొప్పున 17 నెలల కాలానికి అద్దె చెల్లించాల్సిందేనని అధికారులు ఆదేశించారు. మినహాయింపు ఇవ్వాలని సంస్థ యజమాని కోరినా.. పట్టించుకోకుండా వెళ్లిపోయేలా చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.
వారంలో వంద ట్రక్కులు రోడ్డు మార్గంలోనే
విశాఖలో స్పెషల్ ఎకనమిక్ జోన్, ఫార్మా సిటీ (వందకు పైగా కంపెనీలు), అచ్యుతాపురంలో బ్రాండిక్స్, ఇతర ఇంజినీరింగ్ పరిశ్రమలున్నాయి. ఫార్మాసిటీ నుంచి పెద్ద ఎత్తున ఔషధాలు.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఆహార ఉత్పత్తులు, ఇతర జిల్లాల నుంచి సముద్ర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎయిర్కార్గో నిలిచిపోవడంతో ఆయా ఉత్పత్తులను రోడ్డు మార్గంలోనే హైదరాబాద్, చెన్నై, కోల్కతా తరలించి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలా వారానికి సుమారు 100కు పైగా ట్రక్కులు వెళ్తున్నట్లు సమాచారం. ఫార్మా సంస్థల నుంచి నెలకు కనీసం 20 టన్నులు, బ్రాండిక్స్ నుంచి 3 టన్నుల ఉత్పత్తులు విదేశాలకు వెళ్తున్నాయి. రోడ్డు మార్గంలో వీటిని తరలించడం ద్వారా.. సమయం వృథా, ఖర్చు పెరగడంతోపాటు నాణ్యత లేమితో నష్టాలు వస్తున్నాయని సంబంధిత యజమానులు ఆందోళన చెందుతున్నారు.
సూరత్ విమానం నిలిచిపోవడంతో
విశాఖ నుంచి ఏడాదికి కనీసం 2.6 లక్షల టన్నుల రొయ్యలు పొరుగు ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటికి సూరత్, కోల్కతాలో మంచి గిరాకీ ఉంది. దీంతో రైతులు మంచి లాభాల కోసం అక్కడికి ఎగుమతి చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. 2020లో విశాఖ విమానాశ్రయం నుంచి స్పైస్ జెట్ కార్గో విమాన సర్వీసు ప్రారంభం కాగా.. కొవిడ్ సమయంలో అది నిలిచిపోయింది. రాష్ట్రం నుంచి సూరత్కు రోడ్డు మార్గం ద్వారా రొయ్య పిల్లలు తీసుకెళ్లాలంటే కనీసం 18 నుంచి 24 గంటల సమయం పడుతుంది. దీంతో రొయ్య పిల్లలకు సరిపడా ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్నాయి.
కావాల్సిన సౌకర్యాలు
విశాఖ విమానాశ్రయంలో పేరుకు తగ్గట్టుగా.. కార్గో నిర్వహణకు అంతర్జాతీయస్థాయి సౌకర్యాలు లేవు. కస్టమ్స్ అధికారులు నిత్యం అందుబాటులో ఉండట్లేదు. వివిధ ఔషధాలు, ఆహార ఉత్పత్తులను వేర్వేరు ఉష్ణోగ్రతల్లో నిల్వచేసేందుకు మల్టిపుల్ టెంపరేచర్ కంట్రోల్డ్ స్టోరేజ్ కావాలి. ప్యాకింగ్, ఉత్పత్తులు లోడ్ చేసేందుకు సెక్యూరిటీ స్క్రీనింగ్ సామగ్రి, సిబ్బంది కొరత వేధిస్తోంది.
ఏఏఐ ముందుగానే సమాచారమిచ్చినా
గతంలో విమానయాన సంస్థలే కార్గో తనిఖీలు, స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టేవి. 2023 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. బీసీఏఎస్ నిబంధనల ప్రకారం ఏఏఐ ఆధ్వర్యంలోనే ఈ తనిఖీలు జరగాలని కేంద్రం ఆదేశించింది. దీనిపై ముందుగానే ఏఏఐ సమాచారమిచ్చినా.. విశాఖ విమానాశ్రయంలో తగిన ఏర్పాట్లు చేయలేదు. దీంతో గతేడాది అంతర్జాతీయ, దేశీయ కార్గో సేవలు నాలుగు నెలలపాటు పూర్తిగా నిలిచిపోయాయి. స్థానిక ఎంపీల కోరిక మేరకు కొత్త ఏజెంట్ను నియమించేవరకు ఇండిగో సంస్థకు అనుమతులిచ్చారు. ఆయా సర్వీసుల్లో దేశీయంగా చాలా తక్కువ మొత్తంలోనే సరకు తరలిస్తున్నారు. అంతర్జాతీయ కార్గో కాంప్లెక్స్ పూర్తిగా మూతపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జలగన్నలు జారిపోతున్నారు!
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై తీసుకొచ్చి.. అర్హత లేకపోయినా జగన్ ప్రభుత్వం అందలం ఎక్కించిన అధికారుల్లో చాలామంది నెమ్మదిగా జారుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
వైకాపా సోషల్ మీడియాలో ఉద్యోగం.. నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి జీతాలు
ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)లో వైకాపా ప్రభుత్వం సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. -
ఆకాంక్షల అమరావతి
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, సర్వతోముఖాభివృద్ధికి రాజధాని అనేది నిలువుటద్దం. అలాంటి కీలకమైన రాజధానిని వైకాపా సర్కారు అన్ని విధాలా నాశనం చేసింది. -
ఐదేళ్ల అగచాట్లకు చెల్లు
సీఎం ఇంటి పక్క నివాసమంటే గర్వపడాలి. కానీ మాకు రోజూ వేధింపులే! సీఎం భద్రత కోసమే అయితే.. ఆయన వచ్చీవెళ్లే టైంలో ఆ మార్గంలో ట్రాఫిక్ ఆపేయొచ్చు. -
ఈ నష్టానికి బాధ్యులెవరు?
‘పోలవరంలో ఇంత నష్టం జరగడానికి ఎవరు బాధ్యులు?’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. -
ఏపీ శాసనసభ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు
శాసనసభ సమావేశాలు ఈ నెల 21న ప్రారంభం కానున్నాయి. ఇవి రెండు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణస్వీకారం, సభాపతి, ఉపసభాపతి ఎన్నిక జరుగుతుంది. -
నేనూ ఓ కార్మికుడిగా పనిచేస్తా
ఎన్డీయే ప్రభుత్వంలో తానూ ఓ కార్మికుడిగా పని చేస్తానని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. -
గనుల శాఖ పర్మిట్ల జారీ నిలిపివేత
రాష్ట్రవ్యాప్తంగా గనుల శాఖకు చెందిన ఆన్లైన్ పర్మిట్ల జారీ ప్రక్రియను నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆదివారం రాత్రి నుంచి సర్వర్ను డౌన్ చేశారు. -
ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకున్న జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన భద్రత కోసం ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియమించుకున్న సుమారు 30 మంది సిబ్బంది సోమవారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. -
వళవన్.. వైకాపాకు తలాడించెన్!
ఆయన గతేడాది ప్రత్యేక ప్రధానకార్యదర్శి హోదాలో పదవీవిరమణ చేశారు. కానీ జగన్ ప్రభుత్వం మరో ఏడాది సర్వీసు పొడిగించి.. దేవాదాయశాఖలో పోస్టింగ్ ఇచ్చింది. -
ఇటు ఎండ.. అటు వానలు
నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకి 15 రోజులు దాటినా.. పలు ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతలు కొనసాగుతున్నాయి. సోమవారం తుని, నరసాపురం, ఉత్తరాంధ్రలో పలు చోట్ల వడగాలులు వీచాయి. -
ఎస్టీ ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకం
గిరిజన ప్రాంతాల్లోని 543 ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్మెట్రిక్ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు కొత్తగా ఏఎన్ఎంలను నియమించనున్నట్లు గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రకటించారు. -
గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. -
కూటమి విజయంపై అమెరికాలో సంబరాలు
ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం సాధించడం, సీఎంగా చంద్రబాబు...పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించడంపై అమెరికాలోని ప్రవాసాంధ్రులు వేడుకలు చేసుకున్నారు. -
గనుల శాఖకు మస్కా కొట్టారు!
గనుల శాఖ సాఫ్ట్వేర్ను కొందరు ‘ఘనులు’ ట్యాంపరింగ్ చేశారు. పర్మిట్లు పరిమితంగా తీసుకున్నా.. సాఫ్ట్వేర్లో భారీగా ఉన్నట్టు కనిపించేలా చేశారు. -
ఒత్తిడికి భత్యం.. వృత్తిపరమైన అభివృద్ధికీ భత్యం!
ఒత్తిడి ఎదుర్కొంటున్నందుకు నెలకు గరిష్ఠంగా రూ.8 వేల భత్యం.. వృత్తిపరమైన అభివృద్ధికి నెలకు రూ.గరిష్ఠంగా రూ.3,750 భత్యం.. అధికారులు రీఫ్రెష్మెంట్కు గరిష్ఠంగా నెలకు రూ.3,750 భత్యం.. అధికారులు బ్రీఫ్కేస్ కోసం రెండేళ్లకోసారి రూ.5 వేల భత్యం.. ఇదేమిటి చిత్రవిచిత్రమైన భత్యాలు ఉన్నాయని అనుకుంటున్నారా? ఆర్టీసీలో అంతే. -
రైలు ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : పవన్కల్యాణ్
పశ్చిమబెంగాల్లో చోటుచేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. -
పెద్దపులిని ఢీకొన్న కారు!
వేగంగా ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు దాటుతున్న పెద్దపులిని ఢీకొట్టిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. -
ఒక్కో కమోడ్ ఖర్చుతో ఆరుగురు పేదలకు ఇళ్లు!
విశాఖలోని రుషికొండపై జగన్ కట్టుకున్న ప్యాలెస్లో అమర్చిన టాయ్లెట్ కమోడ్కి పెట్టిన ఖర్చుతో కనీసం ఆరుగురు పేదలకు ఇళ్లు కట్టొచ్చు! -
వడివడిగా పర్యటన.. సమస్యలపైనే చర్చ
ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి పోలవరం పర్యటనకు వచ్చిన చంద్రబాబు.. ప్రాజెక్టులోని స్పిల్వే, కాఫర్ డ్యాంలు, ప్రధాన డ్యాం ప్రాంతం, డయాఫ్రం వాల్, విద్యుత్కేంద్రం పనులను పరిశీలించారు. -
గొప్ప దార్శనికుడు.. రామోజీరావు
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారత చలనచిత్ర రంగానికి రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు పెద్ద వరం అందించారని సినీ గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వయనాడ్ ఎంపీగా రాహుల్ గాంధీ రాజీనామా
-
ఇలాంటి వారు పైరసీ కంటే ప్రమాదకరం: విష్వక్ సేన్
-
ఎంపీగా.. ఎమ్మెల్యేగా కొనసాగితే తప్పేంటి? ఆర్ఎల్పీ నేత వాదన
-
తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
-
మా విషయంలో మీ జోక్యం ఎందుకు? చైనాపై తైవాన్ కీలక వ్యాఖ్యలు
-
పక్షుల్లా ప్రవర్తిస్తున్న చైనా యువత.. ఎందుకో తెలుసా?