శ్రీశైల మల్లన్న సేవలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి

నంద్యాల జిల్లా శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ దంపతులు శనివారం దర్శించుకున్నారు.

Published : 26 May 2024 05:12 IST

మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ దంపతులకు స్వామివార్ల జ్ఞాపిక అందజేస్తున్న అర్చకులు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ దంపతులు శనివారం దర్శించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు, వేదపండితులు వేదాశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు, జ్ఞాపిక బహూకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని