అమరావతీ.. ఊపిరిపీల్చుకో!
వైకాపా పాలనలో అనేక నిర్బంధాలు, ఆంక్షలు, కేసులతో ఉక్కిరిబిక్కిరి అయిన రాజధాని రైతుల్లో కూటమి ఘన విజయంతో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆకాశమే హద్దు అన్నట్లుగా వారు మంగళవారం వీధుల్లోకి వచ్చి తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు.
రాజధానిలో అంబరాన్నంటిన సంబరాలు
కూటమి గెలుపుతో హర్షాతిరేకాలు
సంబరాలను అడ్డుకోబోయిన తుళ్లూరు డీఎస్పీ
ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, మహిళలు
మందడంలో అమరావతి, తెదేపా జెండాలతో నినాదాలు చేస్తున్న మహిళలు
ఈనాడు - అమరావతి, న్యూస్టుడే - తుళ్లూరు: వైకాపా పాలనలో అనేక నిర్బంధాలు, ఆంక్షలు, కేసులతో ఉక్కిరిబిక్కిరి అయిన రాజధాని రైతుల్లో కూటమి ఘన విజయంతో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆకాశమే హద్దు అన్నట్లుగా వారు మంగళవారం వీధుల్లోకి వచ్చి తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు. అమరావతి రూపశిల్పి చంద్రబాబు సీఎం కాబోతుండడంతో నినాదాలు చేస్తూ టపాసులు కాల్చుతూ మిఠాయిలు పంచుకున్నారు. ‘జై అమరావతి’, ‘ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని’ అమరావతీ ఊపిరి పోసుకో..’ అంటూ నినాదాలు చేశారు. అమరావతి ఉద్యమ గీతాలకు నృత్యం చేస్తూ ఆకుపచ్చ, పసుపు కండువాలను గాలిలో తిప్పుతూ కేరింతలు కొట్టారు. అమరావతి రూపకర్త చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారంటూ హర్షం వ్యక్తంచేశారు. ఐదేళ్లుగా పడుతున్న బాధలు తొలిగాయని తమకు మంచి రోజులు వచ్చాయన్న ఉత్సాహం రైతుల్లో కనిపించింది.
- తుళ్లూరు శిబిరంలో భారీ ఎల్ఈడీ తెర ఏర్పాటుచేసి రైతులు, మహిళలు ఫలితాలను మంగళవారం ఉదయం నుంచే ఉత్కంఠగా వీక్షించారు. ఫలితాల కోసం అందరూ టీవీలకు అతుక్కుపోవడంతో రాజధాని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి రెండు రౌండ్లలోనే ఓటింగ్ సరళి తెలిసిపోవడం... తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీ సాధిస్తుండడంతో ఒక్కసారిగా రోడ్లపైకి దూసుకొచ్చారు. ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది. జై అమరావతి. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. స్థానిక ఆలయాల్లో రైతులు, రైతుకూలీలు, మహిళలు పూజలు చేశారు.
- మందడం, వెలగపూడిలో మహిళలు పసుపు చీరలు ధరించి రోడ్లపైకి వచ్చి పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహాలను నీటితో శుద్ధి చేసిన అనంతరం క్షీరాభిషేకం నిర్వహించారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. వెలగపూడి శిబిరంలో అమరావతి గీతాలకు నృత్యాలు చేశారు. దొండపాడులో మహిళలు పెద్ద సంఖ్యలో శిబిరానికి చేరుకొని జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. తమ కష్టాలు తొలగిపోయాయంటూ మందడంలో మహిళలు మిద్దె సెంటర్లో కేకులు కోసి పంచారు. జై అమరావతి, చంద్రబాబునాయుడు వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. బోరుపాలెంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద తెదేపా, జనసేన నాయకులు జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ హర్షం వ్యక్తంచేశారు. వడ్డమాను గ్రామంలో మహిళలు పసుపు రంగును చల్లుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
- ఐనవోలు గ్రామంలో డీజేలతో తెదేపా, జనసేన యువత హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఉద్దండరాయునిపాలెంలో సైకిళ్లకు జెండాలు కట్టుకుని ర్యాలీగా గ్రామంలో తిరిగారు. పెదపరిమిలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు పుట్టి రామచంద్రరావుతో కలసి యువత టపాసులు కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమరావతికి అండగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు వందనాలంటూ తుళ్లూరు శిబిరంలో మహిళలు మోకాళ్లపై నిలుచొని చేతులు జోడించి వందనం చేశారు. వెలగపూడి, తుళ్లూరు శిబిరాలను ఇటీవల పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సతీమణి కవిత, కుమార్తె మానస సందర్శించారు. రైతుల పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఏబీవీని, రైతులను జగన్ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, అంతిమంగా న్యాయం జరిగిందన్నారు.
తుళ్లూరు డీఎస్పీ ఓవరాక్షన్
రాజధాని గ్రామాల్లో రోడ్లపై గస్తీ తిరుగుతున్న తుళ్లూరు డీఎస్పీ అశోక్కుమార్ గౌడ్.. తన సిబ్బందితో హడావుడి చేశారు. రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న రైతులు, మహిళల వద్దకు వచ్చి 144 సెక్షన్ అమల్లో ఉందని, అందరూ ఇళ్లకు వెళ్లిపోవాలని మైక్లో అల్టిమేటం జారీ చేశారు. అక్కడ గుమికూడిన వారిని పోలీసులు సెల్లో వీడియోలు, ఫొటోలు తీశారు. డీఎస్పీ ఓవరాక్షన్పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ ఐదేళ్లుగా మమ్మల్ని సీఎం జగన్, మీరు చాలా ఇబ్బందులు పెట్టారు. కూటమి గెలుపుతో అయినా మీరు మారరా? ఇంకా ఎన్నాళ్లు మమ్మల్ని కట్టడి చేస్తారు? ఇక ఎవరికీ తలవంచేది లేద’ని మండిపడ్డారు. దీంతో చేసేది లేక డీఎస్పీ వెనుదిరిగారు.
అమరావతి అగ్రపథాన నిలుస్తుంది
రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించడం, కేంద్రంలో మరోసారి మోదీ ప్రధానిగా కొలువుదీరనుండడం అమరావతికి శుభసూచకం. ఈ విజయం రాష్ట్ర ప్రజలు, రాజధాని రైతుల్లో ఆనందాన్ని నింపింది. కేంద్రం నుంచి అన్ని విధాలా తోడ్పాటు అందుతుందన్న నమ్మకం ఉంది. గ్రీన్ఫీల్డ్ రాజధానిగా ప్రపంచంలో అగ్రపథాన అమరావతి నిలుస్తుంది.
ఆరె శివారెడ్డి, కన్వీనర్, అమరావతి పరిరక్షణ సమితి
జగన్ దుష్ట పాలనకు చరమ గీతం
అమరావతిపై జగన్ కక్షగట్టి అరాచకం సాగించారు. దుష్టపాలనకు నేటితో ప్రజలు చరమగీతం పాడారు. కూటమి గెలుపు ప్రజలందరి విజయం. రాజధానిపై జగన్ సాగించిన దమనకాండకు వ్యతిరేకంగా పోరాడిన వీర మహిళల శపథం నెరవేరింది.
పువ్వాడ సుధాకర్, రాజధాని రైతు ఐకాస సమన్వయ కమిటీ సభ్యుడు
రాష్ట్రానికి, అమరావతికి చంద్రోదయం
రాష్ట్రంలో ఐదేళ్ల రాక్షస పాలనకు ఓటర్లు ముగింపు పలికారు. రాష్ట్రానికి, అమరావతికి చంద్రోదయం అయింది. రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అయింది. అమరావతికి ఇక అన్నీ మంచి రోజులే.
పోతుల బాలకోటయ్య, అధ్యక్షుడు, అమరావతి బహుజన ఐకాస
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM