పుట్టిముంచిన అప్పుల పుట్ట!
జగన్ ఘోర పరాజయానికి ఆయన చేసిన అప్పులు కూడా ప్రధాన కారణమయ్యాయి. అన్నపూర్ణ వంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏనాడూ ఒకటో తేదీన జీతాలు ఇచ్చిన పాపాన పోలేదు జగన్.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం
విలవిల్లాడిన సామాన్యుడు
ఓటు రూపంలోకి మారిన ఆగ్రహం
ఈనాడు, అమరావతి: జగన్ ఘోర పరాజయానికి ఆయన చేసిన అప్పులు కూడా ప్రధాన కారణమయ్యాయి. అన్నపూర్ణ వంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏనాడూ ఒకటో తేదీన జీతాలు ఇచ్చిన పాపాన పోలేదు జగన్. పింఛనర్లు పడిన కష్టాలైతే ఇన్నీఅన్నీ కావు. గుత్తేదారులకు బిల్లులు ఇవ్వలేదు. సరఫరాదారులకు సొమ్ములు చెల్లించకుండా మొండికేశారు. వెరసి.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతి దారుణంగా పట్టాలు తప్పించారన్న విషయం రాష్ట్రంలోని సామాన్య జనానికి అనుభవపూర్వకంగా అర్థమైపోయింది. ఆ ఆగ్రహాన్నే ఓటురూపంలో ప్రదర్శించాడు ఓటరు.
రాష్ట్రం మొత్తం అప్పులు ఈ ఏడాది మే ప్రారంభం నాటికే రూ.10,75,000 కోట్లకు మించిపోయాయి. తాజాగా రుణం రూ.11 లక్షల కోట్లకు చేరిపోయింది. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల పల్లెకు చెందిన కూలీ సైతం రాష్ట్ర అప్పులపై ఆందోళన వ్యక్తం చేశారంటే జగన్ సర్కారు ఆర్థిక దుస్థితి ఎంతటి దయనీయ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. తన ఇంటిని ఉద్యోగికి అద్దెకు ఇచ్చానని, పదో తేదీలోపు ఆయనకు జీతం రాక అద్దె చెల్లించడం లేదని, ఫలితంగా ఆ ఇంటి ఈఎంఐ చెల్లించడం కష్టంగా మారిందని ఓ సీనియర్ జర్నలిస్టు ఫేస్బుక్లో తన ఆవేదనను పోస్టు చేశారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఓ గుత్తేదారులు రోడ్డెక్కారు. మరో గుత్తేదారు దొంగతనానికి పాల్పడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం నుంచి వేతనాలు, బిల్లులు చెల్లించకపోవడంతో ఇలా అన్ని వర్గాలు నరకాన్ని చవిచూశాయి.
అంతటా మందగమనమే..
అసలే అంతంతమాత్రంగా ఉన్న రాబడిని జగన్.. అప్పులు తీర్చడం, రెవెన్యూ ఖర్చులకు మాత్రమే వెచ్చించారు. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేకుండా పోయింది. జీతాలు, బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంతో లక్షలాది సామాన్య కుటుంబాలు అతలాకుతలమయ్యాయి. నిర్మాణ రంగంతో సహా అనేక రంగాలు కుదేలయ్యాయి. ప్రభుత్వ పరంగా ప్రాజెక్టుల నిర్మాణాలు ముందుకు సాగలేదు. ఎస్టేట్ రంగం ఊపిరిపోసుకున్నదీ లేదు. డబ్బులు లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు మందగించాయి. ఫలితంగా ఉపాధి లేక ప్రజలు అల్లాడిపోయారు.
రూ.లక్షల కోట్ల అప్పులు తెచ్చినా..
అయిదేళ్ల తన ప్రభుత్వ హయాంలో రూ.లక్షల కోట్ల అప్పులు తెచ్చిన జగన్.. రాష్ట్రంలో ఎలాంటి ఆస్తులూ సృష్టించలేకపోయారు. ఆ నిధులతో మూలధన వ్యయం చేయకపోవడంతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనమూ చేకూరలేదు. తెచ్చిన అప్పులతో ఆస్తులు సృష్టించినా రాబడి మరికొంత పెరిగి రాష్ట్రానికి కాస్తోకూస్తో ప్రయోజనం కలిగేది. అలాంటి ప్రయత్నం చేయకపోవడంతో అప్పులు ఇంతింతై అన్నట్లు అమాంతంగా పెరిగాయి. వడ్డీలు మోయలేనంత భారంగా మారాయి. ఇలా.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా అంచులకు చేరింది. ఆంధ్రుడి జీవితం కష్టాల చక్రంలో చిక్కుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి