గనుల లీజుల దస్త్రాలు భద్రమేనా?
గనులశాఖలో గత ఐదేళ్లలో జరిగిన అరాచకం, అడ్డగోలు దోపిడీ, నిబంధనల ఉల్లంఘనలు మునుపెన్నడూ లేవు. ఓ మంత్రి, ఆయన కుమారుడు ఈ శాఖను శాసించారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే ముఖ్యమైన ఫైళ్లు తెప్పించుకున్న అధికారి?
అందులోని కీలక సమాచారం మాయం చేసినట్లు అనుమానాలు
ఈనాడు, అమరావతి: గనులశాఖలో గత ఐదేళ్లలో జరిగిన అరాచకం, అడ్డగోలు దోపిడీ, నిబంధనల ఉల్లంఘనలు మునుపెన్నడూ లేవు. ఓ మంత్రి, ఆయన కుమారుడు ఈ శాఖను శాసించారు. తమకు రబ్బరుస్టాంప్లా పనిచేసే అధికారిని నియమించుకొని దందా సాగించారు. ఇప్పుడు ఉల్లంఘనలేవీ బయటపడకుండా చూసేందుకు కొందరు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కీలక అధికారి పర్యవేక్షణలో కొన్ని దస్త్రాల్లో ముఖ్యమైన పత్రాలు మాయం చేసినట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని గనులశాఖ కీలక అధికారి ధీమాగా ఉండేవారు. కూటమి ప్రభంజనంతో ఆయన షాక్ తిన్నారు. వెంటనే మంగళవారం మధ్యాహ్నమే పలు దస్త్రాలను తన ఇంటివద్దకు తెప్పించుకొని అందులో నోట్ఫైల్ వివరాలను మాయం చేసినట్లు గనులశాఖలో చర్చ జరుగుతోంది. బుధవారం కూడా మరిన్ని ఫైళ్లు తెప్పించుకొని పరిశీలించారని సమాచారం. ఇందుకు గనులశాఖ సంచాలకుని కార్యాలయంలో విధులు నిర్వహించే కొందరు అధికారులు, ఉద్యోగులు సహకరించినట్లు తెలిసింది. కొత్త ప్రభుత్వం విచారణ చేపడితే.. దొరికిపోతామనే అనుమానం ఉన్న దస్త్రాల్లోని నోట్ ఫైళ్లలో వివరాలు మాయం చేశారని సమాచారం. ఏపీఎండీసీకి చెందిన పలు టెండర్ల దస్త్రాలనూ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.
పాత తేదీలతో లీజుల కేటాయింపు
గనులశాఖలో కీలక అధికారి.. మొన్నటి వరకు లీజుదారులకు చుక్కలు చూపించారు. కొత్త లీజుల మంజూరు, గడువు ముగిసినవాటికి రెన్యువల్స్ తదితరాల్లో చేతివాటం చూపారు. అధికారపార్టీ వర్గీయులకు ఇష్టానుసారం లీజులు కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. 2022 జూన్ నుంచి ఈ-వేలం విధానంలో లీజుల కేటాయింపు విధానం తీసుకొచ్చారు. అంతకుముందు తొలుత దరఖాస్తు చేసినవారికి మొదట లీజు కేటాయింపు అనే విధానం ఉండేది. ఈ-వేలం వచ్చాక, ప్రతి లీజుకూ ఆన్లైన్లో వేలం నిర్వహించాలి. కానీ వైకాపాకు చెందిన కొందరికి పాత తేదీలతో లీజులు కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. లీజులు పొందిన కొందరికి.. తుది అనుమతులు ఇవ్వకుండా వేధించారు. మైనింగ్ప్లాన్, పర్యావరణ అనుమతి (ఈసీ), కాలుష్య నియంత్రణ మండలి నుంచి కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఎఫ్ఈ) అనుమతులు తెచ్చుకున్నా.. వారికి అనుమతులు ఇవ్వలేదు. ఇలా దాదాపు వందకు పైగా లీజుల దస్త్రాలు పెండింగ్లో ఉంచారు. మంత్రిని ప్రసన్నం చేసుకుంటేనే తుది అనుమతులు ఇస్తామంటూ ఆ లీజులన్నీ ఆపేసినట్లు తెలిసింది. పాత లీజుల రెన్యువల్స్కూ ఇలాగే వేధించినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం వీటిపై సమగ్ర విచారణ జరిపితే.. లోగుట్టు అంతా బయటకు వస్తుందనే వాదన వినిపిస్తోంది.
సీనరేజి గుత్తేదారులు గప్చుప్
రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో సీనరేజి వసూలు చేస్తున్న గుత్తేదారులు సర్దుకుంటున్నారు. తెలంగాణకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉమ్మడి చిత్తూరు, విజయనగరం జిల్లాల సీనరేజి వసూళ్ల టెండరు గతంలో దక్కించుకుంది. అదే కుటుంబానికి చెందిన హిల్సైడ్ ఎస్టేట్స్ సంస్థ ఉమ్మడి కడప జిల్లా టెండరు దక్కించుకుంది. ఇందులో ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో సీనరేజి వసూళ్లను.. రాయలసీమలో చక్రం తప్పిన, గత ప్రభుత్వంలో నంబర్-2గా వ్యవహరించిన కీలక మంత్రే నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అమిగోస్ మినరల్స్ సంస్థ టెండరు దక్కించుకోగా, ఇది కూడా నంబర్-2 మంత్రికి సన్నిహితులదే. ఉమ్మడి గుంటూరు జిల్లా టెండరును తెలంగాణకు చెందిన ఏఎంఆర్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థలు లీజుదారులకు నకిలీ పర్మిట్లు జారీ చేశాయనే ఆరోపణలు ఉన్నాయి. గనులశాఖకు లెక్క చూపకుండా ఉండేందుకు నకిలీ పర్మిట్లు ఇచ్చారని తెలుస్తోంది. గతంలో గనులశాఖ ద్వారా లీజుదారులకు ఆన్లైన్లో పర్మిట్లు జారీచేస్తే.. సీనరేజి వసూళ్ల గుత్తేదారులు వచ్చాక ఆఫ్లైన్లో చేతిరాతతో పర్మిట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. నకిలీ పర్మిట్ల జారీకోసమే ఇలా వీలు కల్పించారని తెలుస్తోంది. ప్రతినెలా ప్రభుత్వానికి సొమ్ము చెల్లించకపోయినా, జారీచేసిన పర్మిట్ల వివరాలను గనులశాఖ అధికారులకు అందించకపోయినా ఎవరూ ప్రశ్నించలేదు. అనంతపురం జిల్లా గుత్తేదారు.. ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థుల తరఫున ఓటర్లకు డబ్బుల పంపిణీలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఆయా జిల్లాల్లో సీనరేజి వసూళ్ల గుత్తేదారులు పర్మిట్ల జారీ ఆపేశారు. దీంతో చాలాచోట్ల లీజుదారులు పర్మిట్లు తీసుకోకుండా రోడ్ మెటల్, మట్టి, కంకర తరలిస్తున్నారు. ఇలాంటిచోట వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన గనులశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ