Andhra Pradesh: కోడ్ అమల్లో ఉన్నా అదే పెత్తనమా!
అధికార పార్టీ నేతలకు నచ్చని అధికారిని ఎన్ని రకాలుగా వేధించొచ్చు.. అనుకూలమైన అధికారిని ఎలా అందలం ఎక్కించవచ్చో తెలుసుకోవాలంటే దేవాదాయ శాఖను చూస్తేనే అర్థమవుతుంది. కమిషనరేట్లో ఉండాల్సిన అదనపు కమిషనర్ను అక్కడి నుంచి వెళ్లగొట్టి, కనీసం ఆయనకు ఛాంబర్ కూడా లేకుండా చేశారు.
అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు
కమిషనరేట్కు దూరంగా అదనపు కమిషనర్
పోస్టే లేని జాయింట్ కమిషనర్కు పెత్తనం
ఈనాడు, అమరావతి: అధికార పార్టీ నేతలకు నచ్చని అధికారిని ఎన్ని రకాలుగా వేధించొచ్చు.. అనుకూలమైన అధికారిని ఎలా అందలం ఎక్కించవచ్చో తెలుసుకోవాలంటే దేవాదాయ శాఖను చూస్తేనే అర్థమవుతుంది. కమిషనరేట్లో ఉండాల్సిన అదనపు కమిషనర్ను అక్కడి నుంచి వెళ్లగొట్టి, కనీసం ఆయనకు ఛాంబర్ కూడా లేకుండా చేశారు. ఎందుకంటే అమాత్యునికి ఆయనంటే ఇష్టం ఉండదు మరి. మరోవైపు కమిషనరేట్లో ఎటువంటి పోస్టూ లేని జాయింట్ కమిషనర్ తీసుకొచ్చి కీలక నిర్ణయాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆయనంటే అమాత్యునికి వల్లమాలిన ఇష్టమే అందుకు కారణం. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు ఎవరూ తలొగ్గాల్సిన అవసరం లేదు. కోడ్ అమల్లోకి వచ్చి 40 రోజులైనా.. ఇప్పటికీ దేవాదాయ శాఖ అధికారులు జీహుజూర్ అంటున్నారు.
కమిషనరేట్ గడప తొక్కనివ్వకుండా..
జాయింట్ కమిషనర్ కేడర్ కలిగిన అన్నవరం ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో ఆయన్ను గతేడాది అక్టోబరులో బదిలీ చేశారు. ఆ సమయంలో దేవాదాయ శాఖ కమిషనరేట్లో అదనపు కమిషనర్గా ఉన్న రామచంద్రమోహన్ను అన్నవరం ఆలయ ఈవోగా బదిలీ చేశారు. వాస్తవానికి దేవాదాయ శాఖలో రెండు అదనపు కమిషనర్ పోస్టులూ కమిషనరేట్లోనే ఉన్నాయి. ఆ కేడర్ అధికారి అక్కడే పని చేయాలి. కానీ అన్నవరం ఆలయానికి బదిలీ చేశారు. అదేలా చేస్తారని విమర్శలు రావడంతో డిప్యుటేషన్పై పంపినట్లు సవరణ ఆదేశాలిచ్చారు. తర్వాత మళ్లీ బదిలీ ఆదేశాలిచ్చారు. దీనిపై రామచంద్రమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. బదిలీ చెల్లదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ఆయన్ను అదనపు కమిషనర్గా ఉంచుతూనే.. అన్నవరం ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చినట్లు మరో ఆర్డర్ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఆయనకు కమిషనరేట్లో అదనపు కమిషనర్గా విధుల్లేకుండా చేశారు. కేవలం అన్నవరం ఈవోగానే పనిచేసేలా చూస్తున్నారు. కీలక బాధ్యతలు చూడాల్సిన ఆయన్ను కమిషనరేట్ గడప తొక్కనివ్వకుండా, అసలు ఛాంబరే లేకుండా చేశారు. విచిత్రం ఏమిటంటే.. రామచంద్రమోహన్ అన్నవరం ఈవోగా 9 నెలల నుంచి విధులు నిర్వర్తిస్తుండగా, ఆయనకు కమిషనరేట్లో అదనపు కమిషనర్ పోస్టు పేరిట జీతమిస్తున్నారు.
విమర్శలొచ్చినా అందలం
అనేక విమర్శలతో అన్నవరం ఆలయ ఈవో పోస్టు నుంచి బదిలీ అయిన చంద్రశేఖర్ ఆజాద్కు మాత్రం దేవాదాయ శాఖ అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ప్రస్తుతం ఆయన్ను కమిషనరేట్లో అదనపు కమిషనర్ స్థాయిలో అన్ని బాధ్యతలు చూసేలా ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి కమిషనరేట్లో జాయింట్ కమిషనర్ (ఎస్టేట్స్) పోస్టు ఒక్కటే ఉంటుంది. ఆ పోస్టులో.. గతంలో దుర్గగుడి ఈవోగా పనిచేసిన భ్రమరాంబ ఉన్నారు. అయినప్పటికీ.. ఏ పోస్టు లేకుండా ఆజాద్ను కమిషనరేట్లో కూర్చోబెట్టారు. భూములు, పరిపాలన అంశాలు, పదోన్నతులు, బదిలీలు తదితర కీలక సబ్జెక్టులన్నీ ఆయనే చూస్తున్నారు. విచిత్రంగా ఈయనకు.. ఇప్పటికీ అన్నవరం ఆలయ ఈవో పేరిట జీతం చెల్లిస్తుండటం విశేషం.
అమాత్యుడి పెత్తనమే..
దేవాదాయ శాఖలో ఇంకా అమాత్యుని పెత్తనం నడుస్తోందనడానికి కమిషనరేట్లో పరిస్థితులే నిదర్శనం. ఓ కీలక ఉన్నతాధికారి.. అమాత్యుడు చెప్పినట్లే ఇప్పటికీ నడుచుకుంటున్నారనే విమర్శలున్నాయి. అందుకే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినాసరే.. అసలు పోస్టుల్లోని అధికారులకు విధులు అప్పగించకుండా చూస్తున్నారు. గతంలో రామచంద్రమోహన్పై సింహాచలం ఆలయ భూములు, మాన్సాస్ భూముల విషయంలో ఉద్దేశపూర్వక కేసులు పెట్టారు. విజిలెన్స్ విచారణ చేపట్టారు. ఇప్పటికీ ఆ విచారణ పూర్తికాలేదు. అయినాసరే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే వారం ముందు.. ఆయనపై శాఖాపరమైన విచారణకు కీలక ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేశారు. అభియోగాలు నమోదు చేయాలని అందులో పేర్కొన్నారు. విజిలెన్స్ విచారణ కొలిక్కి రాకుండా ఇలా శాఖాపరమైన విచారణకు ఆదేశాలివ్వడం వెనుక కూడా అమాత్యుడి ఒత్తిడి ఉందని దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!