Andhra Pradesh: ఇసుక తవ్వకాలపై గనుల శాఖ పెద్దల దొంగాట
మూడేళ్లుగా ఇసుక గుత్తేదారు పేరిట వైకాపా పెద్దలు ఇష్టానుసారం దందా చేశారు. నదులను ఊడ్చేసి, ఇసుక దోచేశారు. అయినాసరే ఇంతకాలం తవ్వకాలు జరుగుతున్న రీచ్ల వైపు కూడా వెళ్లనివ్వకుండా గనుల శాఖ పెద్దలు జిల్లాల్లో అధికారులను కట్టడి చేశారు.
ఇంతకాలం అధికారుల చేతులు కట్టేశారు..
ఇప్పుడేమో చర్యలు తీసుకోలేదంటూ నోటీసులిస్తున్నారు
అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు చీవాట్లతో మైనింగ్ ఏడీలకు తాఖీదులు
ఈనాడు, అమరావతి: మూడేళ్లుగా ఇసుక గుత్తేదారు పేరిట వైకాపా పెద్దలు ఇష్టానుసారం దందా చేశారు. నదులను ఊడ్చేసి, ఇసుక దోచేశారు. అయినాసరే ఇంతకాలం తవ్వకాలు జరుగుతున్న రీచ్ల వైపు కూడా వెళ్లనివ్వకుండా గనుల శాఖ పెద్దలు జిల్లాల్లో అధికారులను కట్టడి చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వైకాపా ప్రభుత్వ తీరును ఎండగడుతుండటంతో ఇసుక అక్రమ తవ్వకాల నెపాన్ని జిల్లాల్లో గనులశాఖ అధికారులపైకి నెట్టి చేతులు దులిపేసుకునేందుకు చూస్తున్నారు. అక్రమంగా తవ్వకాలు జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేదో వివరణ ఇవ్వాలని, మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ కొన్ని జిల్లాల గనులశాఖ ఏడీలు, విజిలెన్స్ ఏడీలకు తాఖీదులు ఇవ్వడంతో ఆ అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఇదంతా గనులశాఖలోని ఇద్దరు కీలక అధికారులు ఆడుతున్న డ్రామా అంటూ మండిపడుతున్నారు.
ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలువురు గనులశాఖ సంచాలకులు (జిల్లా గనులశాఖ అధికారులు), జిల్లా విజిలెన్స్ స్క్వాడ్ ఏడీలకు.. ఆ శాఖ ఉన్నతాధికారులు తాజాగా నోటీసులిచ్చారు. మీ జిల్లాల్లోని కృష్ణా, గోదావరి నదుల్లో రీచ్ల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, యంత్రాల వినియోగం వంటివి జరిగినా ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలంటూ వాటిలో పేర్కొన్నారు. గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆ శాఖ సంచాలకులు ఈ తాఖీదులు ఇచ్చారు. ఏ జిల్లాలోనూ ఇసుక అక్రమ తవ్వకాలు లేవంటూ అన్ని జిల్లాల కలెక్టర్లు హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్కు (ఎన్జీటీకి) కొన్నాళ్ల కిందట నివేదిక ఇచ్చారు. గనులశాఖ ఉన్నతాధికారులు సూచించిన రీచ్ల్లో మాత్రమే తనిఖీలు చేసి, అక్కడ ఎటువంటి తవ్వకాల్లేవని నివేదికల్లో పేర్కొన్నారు. అయితే ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లోని పలు రీచ్ల్లో ఇసుక అక్రమంగా తవ్వేస్తున్నారని, కొన్ని రీచ్ల హద్దులు దాటి తవ్వకాలు సాగిస్తున్నారని, భారీ యంత్రాలను వినియోగిస్తున్నారని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇచ్చిన నివేదికలన్నీ తప్పేనని తేటతెల్లమైంది. ఈ విషయం తాజాగా సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగానూ ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. దీంతో గనుల శాఖ ఉన్నతాధికారులు అక్రమాలు చేసిన గుత్తేదారు సంస్థను, వైకాపా నేతలను వదిలేసి.. ఆఘమేఘాలపై ఆయా జిల్లాల మైనింగ్ ఏడీలకు తాఖీదులిచ్చి, వివరణ కోరారు.
ఇంతకాలం అంటకాగింది ఉన్నతాధికారులే!
2021 మే నుంచి జేపీ సంస్థ పేరిట, గత ఏడాది చివరి నుంచి జీసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా సంస్థల పేరిట రాష్ట్రమంతా ఇసుక తవ్వకాల్లో భారీ దోపిడీ సాగింది. ఎటువంటి నిబంధనలు పాటించలేదు. గనులశాఖకు తప్పుడు లెక్కలు చూపారు. లీజులతో పనిలేకుండా ఎక్కడపడితే అక్కడ తవ్వేశారు. ఇవన్నీ తెలిసినా సరే వాటి జోలికి వెళ్లొద్దంటూ అన్ని జిల్లాల్లో గనులశాఖ అధికారులను.. ఆ శాఖ ఉన్నతాధికారులు మొదట్లోనే గట్టిగా హెచ్చరించారు. ఎంత మంది ఫిర్యాదులు చేసినా పట్టించుకోవద్దని చెప్పారు. దీంతో జిల్లాల్లో అధికారులు నోరెత్తలేదు. అదే అదనుగా గుత్తేదారు సంస్థ ప్రతినిధులు, వైకాపా నేతలు చెలరేగిపోయారు. ఎక్కడైనా గనులశాఖ అధికారులు రీచ్ల్లో తనిఖీలు చేసినా, ఇసుక లారీలను ఆపి, వే బిల్లులు పరిశీలించినా ఎదురుతిరిగేవారు. వెంటనే సీఎంఓ నుంచి, గనులశాఖ ఉన్నతాధికారి నుంచి వారికి హెచ్చరికలు వచ్చేవి. గత ఏడాది ఓ ఇసుక రీచ్లో ఇష్టానుసారం తవ్వేస్తున్నారని ఫిర్యాదు రావడంతో కృష్ణా జిల్లా ఏడీ తన బృందంతో తనిఖీకి వెళ్లారు. అక్కడున్న ఇసుక గుత్తేదారు ప్రతినిధి.. ‘నువ్వెందుకు వచ్చావు? ఎవరు వెళ్లమన్నారు? ఈ రీచ్లో తవ్వకాలు చేస్తున్నది ఎవరో తెలుసా? అసలు నువ్వు తనిఖీకి వచ్చిన విషయం మీ డైరెక్టర్కు తెలుసా? మీ డైరెక్టర్కు ఫోన్ చెయ్’ అంటూ ఏడీపై విరుచుకుపడ్డాడు. దీంతో అధికారి బృందం అక్కడి నుంచి వెనుదిరిగింది. జరిగిన విషయాన్ని ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది.
జిల్లాల్లో అధికారులే బలిపశువులు?
ఇసుక తవ్వకాల విషయంలో సుప్రీంకోర్టు కఠినంగా ఉండటంతో గనులశాఖ ఉన్నతాధికారులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. తరచూ రీచ్ల్లో తనిఖీలు చేయాలని పేర్కొంటున్నారు. మూడేళ్లపాటు దందా జరిగినప్పుడు ఎటువంటి ఆదేశాలు ఇవ్వని ఉన్నతాధికారులు.. కేసు వారి మెడకు చుట్టుకోనుండటంతో జిల్లాల్లో అధికారులను బలిచేసే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన