Arogya Sri: ఆరోగ్యశ్రీ రోగులకు ఏదీ సాంత్వన?
రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు ఆసుపత్రుల వైఖరితో ఆరోగ్యశ్రీ రోగులు నలిగిపోతున్నారు. చికిత్స అందించిన 45 రోజుల్లోగా ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది.
నిత్యం బకాయిల గొడవ
నిధులు విదల్చని వైకాపా సర్కారు
చికిత్సకు వచ్చే వారి నుంచి ఆసుపత్రుల వసూళ్లు
నిర్వహణ అస్తవ్యస్తం
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు ఆసుపత్రుల వైఖరితో ఆరోగ్యశ్రీ రోగులు నలిగిపోతున్నారు. చికిత్స అందించిన 45 రోజుల్లోగా ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. గ్రీన్ఛానల్ కింద బిల్లులు చెల్లిస్తామన్న హామీ అమలు కాలేదు. దీన్ని సాకుగా చూపుతూ రోగులను ఆందోళనకు గురిచేసేలా సేవల నిలిపివేతపై ప్రైవేటు ఆసుపత్రులు తరచూ ప్రకటనలిస్తున్నాయి. పలు ప్రైవేటు ఆసుపత్రులు వసూళ్లకు తెగబడుతున్నాయి. బిల్లులు ఇవ్వడం లేదంటూ ఈ నెల 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నట్లు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్య సంఘం ప్రకటించింది. చర్చల అనంతరం కొన్ని నిధులు విడుదలయ్యాయి. మిగిలిన నిధులపై ప్రభుత్వహామీతో సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్య సంఘం ప్రకటించింది. ఇలాంటి తంతు ఇటీవల సాధారణమైంది.
బకాయిలతో సంబంధం లేకుండా కొన్ని ఆసుపత్రులు రోగుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. చాలా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కేసులపైనే నడుస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద చేరినవారి నుంచి రూపాయి కూడా తీసుకోకూడదు. కొన్ని ఆసుపత్రులవారు రకరకాల పేర్లతో రోగుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. రోగుల సొంత డబ్బుతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాకే చేర్చుకుంటున్నారు. వీటిపై అందిన ఫిర్యాదుల ఆధారంగా అడపాదడపా ఆరోగ్యశ్రీ ట్రస్టు చర్యలు తీసుకుంటోంది. ఈహెచ్ఎస్ కింద చికిత్సల కోసం వేతనంలో ప్రతినెలా రూ.300 వరకు చెల్లించే ఉద్యోగులకూ ఆసుపత్రుల్లో నగదురహిత వైద్యసేవలు సక్రమంగా అందడం లేదు. సొంత డబ్బులతోనే వారు చికిత్స పొందుతున్నారు. వీరి క్లెయిమ్స్లో ప్రభుత్వం 40% వరకు కోత పెట్టడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందుతున్న వైద్యంపై పకడ్బందీ ఆడిటింగ్ వ్యవస్థ లేదు. దీన్ని ‘కాగ్’ ప్రశ్నించింది. బకాయిలను సకాలంలో చెల్లించనందున మెరుగైన వైద్యాన్ని అందించలేకపోతున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు బహిరంగంగా చెబుతున్నాయి.
బకాయిల చెల్లింపుల ప్రభావం
అనుబంధ ఆసుపత్రులకు రూ.1,500 కోట్ల వరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు బకాయిలున్నాయి. ప్రభుత్వాసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలే రూ.175 కోట్ల వరకు ఉన్నాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద గుర్తించిన లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఆసుపత్రులకు వచ్చే పేమెంట్ కేటగిరీలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఆసుపత్రులకు పేమెంట్ కేటగిరీ కింద వచ్చేవారి నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. వాటి బిల్లులను ఏడెనిమిది నెలల నుంచి చెల్లించకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో కొన్ని ఆసుపత్రులవారు పాత యంత్రాలు, పరికరాలతోనే పరీక్షలు చేస్తున్నారు. అత్యవసరమైతే సెకండ్ హ్యాండ్ యంత్రాలు కొంటున్నారు. యాంజియోగ్రామ్ కోసం వాడే వైర్ను ఆరోగ్యశ్రీ కింద చేరే రోగుల్లో ముగ్గురు, నలుగురికి వాడుతున్నారని సమాచారం. దీనివల్ల అది కొన్ని సందర్భాల్లో రోగి రక్తనాళాల్లో విరిగి ఉండిపోయే ప్రమాదముంది. ఆసుపత్రుల సిబ్బందికి వేతనాలూ చెల్లించలేని పరిస్థితుల్లో ఆసుపత్రులున్నాయి. పట్టణాలు/నగరాల్లోని ఆసుపత్రుల్లో వైద్యులకు యాజమాన్యాలు భారీగా వేతనాలిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టు రాబడి లేదన్న ఉద్దేశంతోనూ వసూళ్లకు ప్రాధాన్యమిస్తున్నాయి.
పొరుగు రాష్ట్రాల్లోనూ సమస్యలే
కొన్ని ప్రధాన ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ అనుబంధ గుర్తింపు వద్దనుకుంటున్నాయి. దీనివల్ల సీనియర్ వైద్యనిపుణుల సేవలు రోగులకు అందడం లేదు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఎంపికైన కొన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద ఉచిత చికిత్సను అందిస్తామని ఏపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా ప్రయోజనం పొందేవారు తక్కువ. బిల్లులు అందక అత్యవసర కేసులనే ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటున్నారని తెలిసింది.
ప్రభుత్వాసుపత్రులకూ కష్టాలే
ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పెంచేలా వైద్యులకు లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. కానీ ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి సకాలంలో సొమ్ములు రావట్లేదు. తాజా సమాచారం ప్రకారం.. రూ.175 కోట్ల వరకు ప్రభుత్వాసుపత్రులు, వాటిలో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బందికి ప్రోత్సాహాకాల కింద చెల్లించాల్సి ఉంది. ఇవి అందక ప్రభుత్వాసుపత్రుల నిర్వహణ కష్టమవుతోంది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న ప్రతి రోగి వివరాలను ట్రస్టుకు పంపేందుకు కొన్ని ఆసుపత్రుల్లో సిబ్బందీ లేరు. ఉన్నవారికీ వేతనాలను సక్రమంగా చెల్లించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి...!
ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వస్తానని ఐదేళ్ల క్రితం పంతం పట్టిన మహిళ విజయలక్ష్మి.. శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం వచ్చారు. -
పోలవరమే పెను సవాలు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అనేక సాంకేతిక సమస్యలతో ఒక పెను సవాలుగా మారింది. ఒక్క స్పిల్ వే నిర్మాణం తప్ప మిగిలిన కట్టడాల భవితవ్యం అంతా ప్రశ్నార్థకంగానే మిగిలింది. -
అధికారం వచ్చిందని.. కక్ష సాధింపులొద్దు
‘అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు.. విర్రవీగడం లాంటి చర్యలొద్దు.. ప్రజలు తప్పు పట్టేలా ఎలాంటి పనులూ చేయొద్దు’ అని తెదేపా నేతలు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. -
ఏడాదిలోగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు
ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను మానవ వనరుల అభివృద్ధి (విద్య), ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. -
మోసపోయాం.. మన్నించండి
వైకాపా కార్పొరేటర్లు మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఆ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. తటస్థంగా ఉందామన్నా తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. -
విద్యా, వసతి దీవెన బకాయిల వివరాలివ్వండి
రాష్ట్రవ్యాప్తంగా విద్యా, వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధ్యాపకుల ఖాళీల వివరాలివ్వాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. -
మాజీ ఏఏజీ పొన్నవోలుపై పోలీసులకు ఫిర్యాదు
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని తెదేపా పరిశోధన, సమాచార కమిటీ సభ్యుడు తోపూరి గంగాధర్ మంగళగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. -
ఏయూ విద్యార్థిని ఫిర్యాదు.. వెంటనే మంత్రి స్పందన
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజన ప్రియ వాట్సప్ ద్వారా చేసిన ఫిర్యాదుపై మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ స్పందించారు. -
రామోజీరావు.. ఒక విశ్వవిద్యాలయం
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఒక వ్యక్తి కాదని.. ఆయనొక విశ్వవిద్యాలయమని భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి స్మరించుకున్నారు. -
ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కసరత్తు
రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంపై కసరత్తు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
బోల్తాపడిన బోధనాసుపత్రులు
వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బోధనాసుపత్రుల అభివృద్ధి పడకేసింది. వాటిల్లో మౌలిక సదుపాయాల కల్పన హామీలను పాలకులు విస్మరించారు. -
ముఖ్యమంత్రి రేపు పోలవరం సందర్శన
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు. -
చంద్రబాబుకు కళ్లద్దాలిచ్చి.. మురిసిపోయిన మహిళ
మిమ్మల్ని సీఎంగా చూడాలని ఐదేళ్లుగా మేం చేయని పూజలు లేవని పలువురు మహిళలు చంద్రబాబుతో చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. -
సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తాం
అనుమతులు లేకుండా అవులపల్లె ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి.. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.600 కోట్ల బిల్లులు చేసుకున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నీరభ్కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్కుమార్ గుప్తా శనివారం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. -
ఇదీ సంగతి!
-
సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాదర్బార్
మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజల వినతులు స్వీకరించడానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’కు శ్రీకారం చుట్టారు. -
కిషన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్కల్యాణ్
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రధాని మోదీ నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకునేందుకు బొగ్గు, గనులశాఖ ఎంతో కీలకం. -
ప్రజలకూ నాకూ మధ్య అడ్డుగోడలుండవు
ప్రజలకు, తనకు మధ్య అడ్డుగోడలు ఏర్పాటు చేస్తే ఉపేక్షించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల నుంచి నేరుగా వినతుల స్వీకరణ, నిర్దేశిత సమయంలోగా పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. -
పౌరసరఫరాల శాఖలో భారీ దోపిడీ
రేషన్లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె.. ఏది చూసినా ప్యాకెట్కు 50-100 గ్రాములు తక్కువ బరువే. -
మహిళలకు రక్షణ కల్పిస్తాం.. రాష్ట్ర హోం మంత్రి అనిత
భూకబ్జాలు, దాడులు.. మహిళలపై అఘాయిత్యాలు, ఆడపిల్లల అపహరణలు జరక్కుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు పోలవరం సందర్శన .. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రామానాయుడు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
-
స్మృతి మంధాన సెంచరీ.. దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన భారత్
-
ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనపై తొలి ట్రయల్ రన్.. వీడియో
-
పేటీఎం - జొమాటో రూ.1,500 కోట్ల డీల్?