Kris city: కోడ్కు ముందు.. క్రిస్ సిటీ కట్టబెట్టేశారు!
‘ఎన్నికల సందట్లో సడేమియా’ అన్నట్లు.. ఎన్నికల విధుల్లో అధికార యంత్రాంగం బిజీగా ఉంటే అధికారపార్టీ పెద్దలు క్రిస్ సిటీ టెండర్లు కట్టబెట్టేశారు.
టెండరు విలువపై 15% అదనం
ఆ భారం రూ.153 కోట్లు
ఐదేళ్లు వేచి చూసి.. ఎన్నికల ముందు హడావుడిగా ఎల్ఓఏ
ఈనాడు, అమరావతి: ‘ఎన్నికల సందట్లో సడేమియా’ అన్నట్లు.. ఎన్నికల విధుల్లో అధికార యంత్రాంగం బిజీగా ఉంటే అధికారపార్టీ పెద్దలు క్రిస్ సిటీ టెండర్లు కట్టబెట్టేశారు. మూడేళ్లుగా నానబెట్టి.. ఎన్నికలకు మూడు నెలల ముందు గుట్టుగా పనికానిచ్చేశారు. గుత్తేదారు సంస్థను ఎంపిక చేసి లెటర్ ఆఫ్ అవార్డును (ఎల్ఓఏ) జగన్ ప్రభుత్వం ఇచ్చేసింది. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవాలో (సీబీఐసీ) భాగంగా రూ.1,021.41 కోట్లతో ప్రతిపాదించిన కృష్ణపట్నం సిటీ (క్రిస్ సిటీ) ప్రాజెక్టును చడీచప్పుడూ లేకుండా టెండరు ధరపై 15% అధిక మొత్తానికి బిడ్ వేసిన బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్కు కట్టబెట్టింది. రూ.153.21 కోట్లు నిర్మాణసంస్థకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో భవిష్యత్తులో వచ్చే ఎస్కలేషన్లు దీనికి అదనం. ప్రాజెక్టు అమలుకు నిధులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, ఇంప్లిమెంటేషన్ ట్రస్టు (నిక్డిక్ట్) అందిస్తుంది. టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి.. గుత్తేదారు సంస్థ ఎంపికకే జగన్ ప్రభుత్వానికి మూడేళ్లు పట్టింది.
అంచనాల్లో తగ్గించి.. అదనం పేరుతో ఇచ్చేసింది
క్రిస్ సిటీ టెండర్లలో ప్రభుత్వ పెద్దల మతలబు చూస్తే విస్తుపోవాల్సిందే. తొలుత రూ.1,190 కోట్లతో టెండర్లు పిలిస్తే.. మూడోసారి అవే పనులను రూ.1,021.41 కోట్లకు తగ్గించింది. ఇలా తగ్గించిన మొత్తానికి దాదాపు సమానంగా గుత్తేదారునికి మరో రూపంలో దోచిపెట్టింది. 15% అదనపు మొత్తానికి బిడ్ను ఖరారు చేయడంతో బీవీఎస్ఆర్ సంస్థకు నికరంగా రూ.1,174.62 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కన మూడేళ్లు జాప్యం చేసి జగన్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. ఆ మేరకు యువతకు ఉపాధి అవకాశాలను మాత్రం దూరం చేసింది.
హడావుడిలో మతలబు ఏంటో?
క్రిస్ సిటీ నిర్మాణ పనులకు జగన్ ప్రభుత్వం ఏటా ఒకటి చొప్పున 3 టెండరు ప్రకటనలిచ్చింది. గుత్తేదారుల నుంచి స్పందన లేకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చింది. పనులు కట్టబెట్టడంలో ప్రభుత్వ పెద్దల తీరుతో ప్రముఖ కంపెనీలు పలాయనం చిత్తగించాయి.
ఒకటో సారి: 2021-22లో తొలిసారి రూ.1,190 కోట్లతో జగన్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. నమూనా, నిర్మాణం, టెస్టింగ్, మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు.. నాలుగేళ్లు నిర్వహణ పనులను గుత్తేదారులకు అప్పగించేలా 2021 సెప్టెంబరు 20న టెండరు ప్రకటన ఇచ్చింది. నిర్దేశిత గడువు ముగిసినా గుత్తేదారుల నుంచి స్పందన రాలేదు. రెండుసార్లు గడువులు పెంచినా మార్పు లేక.. టెండరు ప్రక్రియను రద్దుచేశారు.
రెండో సారి: అవే పనులకు (2022-23లో) రూ.1,054.63 కోట్లకు అంచనాలను కుదించి.. రెండోసారి 2022 జూన్ 15న టెండరు ప్రకటన ఇచ్చింది. షాపూర్జీ పల్లోంజీ, ఎల్అండ్టీ, ఎన్సీసీ వంటి కంపెనీలు బిడ్లు వేశాయి. సంప్రదింపుల తర్వాత ప్రభుత్వ నిబంధనల మేరకు పనులు చేపట్టడానికి ఒక్క సంస్థా ముందుకు రాలేదు.
మూడో సారి: 2023-24లో అంచనాలను రూ.1,021.41 కోట్లకు తగ్గించి.. మూడోసారి 2023 సెప్టెంబరు 26న టెండరు ప్రకటన ఇచ్చింది. బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, మేఘా, ఎన్సీసీ సంస్థలు బిడ్లు వేశాయి. రివర్స్ టెండరింగ్ తర్వాత ఎల్1గా నిలిచిన బీవీఎస్ఆర్కు 2024 ఫిబ్రవరిలో ఎల్ఓఏ ఇచ్చింది. అంటే.. ఎన్నికల కోడ్కు కొద్దిరోజుల ముందు హడావుడిగా కట్టబెట్టారన్నమాట.
ఐదేళ్లూ.. అభూత కల్పనలతో కాలయాపన
సీబీఐసీ ప్రాజెక్టును గత ప్రభుత్వ హయాంలోనే కేంద్రం మంజూరుచేసింది. అందుకు అనుగుణంగా భూసేకరణ చేపట్టింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10,502 ఎకరాలు, చిత్తూరు పరిధిలో 1,587 ఎకరాల్లో ప్రాజెక్టును అభివృద్ధి చేయాలి. పర్యావరణ అనుకూల నయా నగరం నిర్మిస్తామంటూ ఐదేళ్లుగా ప్రభుత్వం చెబుతూనే ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ జోన్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, పని ప్రదేశంలో నివాసాలు, ఫుడ్ కోర్టు, అధునాతన బస్టాప్.. ఇవన్నీ కలిపి ఒక నగరాన్నే నిర్మిస్తామని ఊదరగొట్టింది. ఫుడ్ప్రాసెసింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, కెమికల్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్ యూనిట్లు వస్తాయంటూ విలువైన కాలాన్ని వృథా చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి