Pinnelli: పిన్నెల్లి పాస్పోర్ట్ కోర్టులో అప్పగింత
పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాస్పోర్ట్ను ఆయన న్యాయవాదులు గురజాల కోర్టులో బుధవారం అందజేశారు.
గురజాల, న్యూస్టుడే: పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాస్పోర్ట్ను ఆయన న్యాయవాదులు గురజాల కోర్టులో బుధవారం అందజేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు పాస్పోర్టు సమర్పించారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలో ఈవీఎంను ధ్వంసం చేసిన సమయంలో అడ్డుకోబోయిన నంబూరు శేషగిరిరావుపై హత్యాయత్నం, ఎమ్మెల్యేను నిలదీసిన మహిళ చెరుకూరి నాగశిరోమణిపై దుర్భాషలాడడం, పోలింగ్ మర్నాడు తన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించి, సీఐ నారాయణస్వామిపై దాడిచేసి గాయపరచడం వంటి ఘటనల్లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయా కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ క్రమంలో పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోనే ఉండాలని, రోజూ ఎస్పీ కార్యాలయంలో సంతకం చేయాలని, పాస్పోర్టును గురజాల కోర్టులో అప్పగించాలని ఎమ్మెల్యే పిన్నెల్లిని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పాస్పోర్టును ఎమ్మెల్యే తరఫు న్యాయవాదులు గురజాల కోర్టులో బుధవారం అప్పగించారు.
రెండో రోజు ఎస్పీ కార్యాలయంలో హాజరైన ఎమ్మెల్యే పిన్నెల్లి
నరసరావుపేట టౌన్, న్యూస్టుడే: రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా మాచర్ల వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుధవారం రెండో రోజు కూడా ఎస్పీ కార్యాలయంలో హాజరయ్యారు. రిజిష్టర్లో సంతకం చేసి వెళ్లిపోయారు. నరసరావుపేట పట్టణం వినుకొండ రోడ్డులోని ఓ ప్రైవేటు లాడ్జిలో మంగళవారం రాత్రి ఆయన బస చేసి తిరిగి అక్కడికి చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?