NTR: ఎంగటేసర్లు.. ఎన్టీయారూ.. రెండు బస్తాల వడ్లు
‘వొడ్ల కుప్పని అట్టాగ ఎంతసేపు సూత్తవ్. నువ్వు సూత్తే వొడ్లు ఏమన్నా పెరుగుతయా ఏంది? దేవుడు ఎన్ని పండాలని రాసి పెడితే అన్నే పండుతాయి గదా’ అని మా అమ్మ, నాయనమ్మ, తాతయ్య... అప్పటికి ఐదోసారో ఆరోసారో మా నాన్నతో అనడం.
ఉమ్మడి గుంటూరు జిల్లా..
చల్లగుండ్ల గ్రామం
1982వ సంవత్సరం...
‘వొడ్ల కుప్పని అట్టాగ ఎంతసేపు సూత్తవ్. నువ్వు సూత్తే వొడ్లు ఏమన్నా పెరుగుతయా ఏంది? దేవుడు ఎన్ని పండాలని రాసి పెడితే అన్నే పండుతాయి గదా’ అని మా అమ్మ, నాయనమ్మ, తాతయ్య... అప్పటికి ఐదోసారో ఆరోసారో మా నాన్నతో అనడం. నాన్న మాత్రం గుండె పగిలిన మనిషిలా ఆ వడ్లని అలా చూస్తూనే ఉన్నాడు.
నాన్న బాధకు బలమైన కారణం లేకపోలేదు. ప్రతి ఏడాదీ చేలో కల్లం కొట్టి... వడ్లను ఎద్దుల బండ్లపై జల్లల్లో పోసుకుని ఇంటికి చేర్చి... ఆరు బయట పట్టలపై పోసి నాలుగైదు రోజులు ఎండకు ఆరబెట్టి, కుప్పగా చేసినప్పుడు చూడాలి.. నాన్న ముఖం దీపాల పండగ నాటి మతాబులా వెలిగిపోయేది. ఇంటిల్లిపాదీ పడిన కష్టానికి తగ్గట్లుగా వడ్లు పండాయని సంబరపడేవాడు. పనోళ్లకు అడిగిన దానికంటే రెండు మూడు మానికలు ఎక్కువ వడ్లు ఇచ్చేవాడు. (మానిక అంటే కొలిచే పాత్ర. అప్పట్లో ఒక బస్తా అంటే కొలతకు 54 మానికలు.. తూకానికి 76 కిలోలు). ఆ ఏడాది పంటకు తెగుళ్లు సోకి.. చేను చాలా తక్కువ పండింది. అందుకని నాన్న కుశాలగా లేడు. పెట్టిన పెట్టుబడి పోను.. మిగిలిన గింజలు ఏడాదంతా తిండికి సరిపోతాయా అని బాధపడుతున్నాడు.
ఆ రోజు వడ్లను గోతాల్లోకి ఎత్తబోతుండగా.. ఎలుకల బుట్టల ఎల్లన్న వచ్చాడు. చేలో వరి దుబ్బుల్ని ఎలుకలు కొట్టకుండా, గట్ల దగ్గర బుట్టలు పెట్టి, వాటిని పట్టి, పంటను కాపాడాడాయన. అందుకు వడ్లు ఇస్తామని నాన్న వాళ్లు ఒప్పుకొన్నారు. ఆ రోజుల్లో డబ్బులు చాలా తక్కువ ఉండేవి. ప్రతి పనికీ వడ్లనే ఇచ్చేవారు. ఎల్లన్న గోతం తెరిచి పట్టుకుంటే నాన్న మానికతో వడ్లను పోస్తున్నాడు. అలా ఎనిమిది మానికలు కొలిచి ఆపేశాడు. ‘అదేంది ఎంగటేసర్లు గోరూ... పది మానికలు కదా అనుకుంది. ఎనిమిదే పోశారేంది?’ అని ఎల్లన్న అడిగాడు. ‘ఈసారి పెద్దగా పండలేదు లేరా... ముందటేడుకు ఎక్కువ కొలుత్తాలే’ అని నాన్న చెప్పాడు. ‘ముందనుకున్నట్టు కొలవాల్సిందే.. మీలాగే మిగతా వాళ్లూ తగ్గిత్తే... నా పొట్ట గడిచేదెట్టా’ అని ఎల్లన్న దీనంగా అన్నాడు. ‘పనోళ్లకు తగ్గించి... మిగిలిచ్చిన వొడ్లు తిన్నా మనకు వొంటబట్టవు లేరా. వాడికి మొత్తం కొలిచి ఇచ్చెయ్యి’ అని తాతయ్య అనడంతో నాన్న అయిష్టంగానే మిగతా రెండు మానికల వడ్లనూ గోతంలో పోశాడు.
కాలువ నీటిని చేనికి రెండు తడులు ఎక్కువ పెట్టుకోనిచ్చిన లస్కరు సుబ్బయ్య, ఏడాదంతా క్షవరాలు, గడ్డాలు చేసిన నారాయణ, బట్టలు ఉతికిన గోవిందు, ఇంట్లో చిన్నోళ్లకు, పెద్దోళ్లకు చెప్పులు కుట్టిన యాకోబు, శుభకార్యాలకు అవసరమైన కుండలు ఇచ్చిన మల్లన్న, బర్రెలు.. దున్నల్ని మేపిన దావీదు, కర్రకు ముల్లు పెట్టడం నుంచి నాగలి చేయడం వరకూ చక్కబెట్టిన సూర్యనారాయణ... ఇలా అందరూ గోతాలు తీసుకుని ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. ఎలాంటి తగ్గింపులూ లేకుండా వాళ్లకు నాన్న వడ్లు కొలిచాడు. జ్వరాలూ, రోగాలూ, రొష్టులూ వస్తే... ఇంటికొచ్చి చూసి, బిళ్లలు రాసిచ్చి మా ఆరోగ్యాన్ని కాపాడిన ఆర్ఎంపీ డాక్టరు గారు పంపిన మనిషి చివర్లో వచ్చాడు. అందరికంటే ఎక్కువగా ఆయనకు 25 మానికల వడ్లు ఇచ్చి పంపాడు నాన్న.
మిగిలిన ధాన్యాన్ని గోతాల్లోకి ఎత్తి... మూతులను కుట్టి... ఆ బస్తాల్ని ఇంటి పంచలోకి చేరుస్తుండగా... చాటింపు కోటన్న తప్పెట శబ్దం మాకు దగ్గరవుతూ వస్తోంది.
‘ఇందుమూలంగా అందరికీ జెప్పేదేందంటే... ఎంటీ రామారావు గోరు తెలుగుదేశం పారిటీ బెట్టారంట. మనూరోల్లం గూడా ఆ పారిటీలో జేరాలని, పారిటీ జెండా కోసం నాలుగడుగుల ఎత్తున దిమ్మెను కట్టాలని, జెండా కట్టడానికి 40 అడుగుల పేద్ద ఇనప కడ్డీని కొనాలని పెద్దోల్లంతా అనుకుంటున్నారు. పారిటీ మీటింగులకు పోవడానికి డబ్బులు పోగుచేసుకోవాలంట. అందుకని ఎవురికి తోచినంత వారు డబ్బులుగానీ వొడ్లుగానీ ఇయ్యాలంట. ఈ రోజు మాపటేల ఇద్దరు మడుసులు ఈ బజారుకొచ్చి వసూలు జేత్తారహో’ అని కోటన్న గుక్క తిప్పుకోకుండా చాటింపేసి... మళ్లీ తప్పెట వాయించుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు.
ఎన్టీఆర్... ఈ పేరు వింటేనే ఏదో కొత్త బలం వచ్చినట్లు కనిపించేవాడు నాన్న. ఎప్పుడన్నా పేటకో, గుంటూరుకో పోయినప్పుడు హాల్లో ఎంతో కుశాలగా సినిమాలు చూసేవాడు. పండక్కో పబ్బానికో... ఊళ్లో బొడ్డురాయి కాడో, పంచాయతీ ఆఫీసు దగ్గరో తెర కట్టి... ప్రొజెక్టర్ పెట్టి వేసే ఎన్టీఆర్ సినిమాల్ని చూసేటప్పడు చాలా ముందుగానే వెళ్లి ముందు వరుసలో కూర్చునేవాడు.
దేశమ్ము మారిందోయ్... కాలమ్ము మారిందోయ్... ..
కష్టాలు తీరేనోయ్... సుఖాలు నీవేనోయ్...
‘రాముడు-భీముడు’ సినిమాలోని ఈ పాటంటే నాన్నకు ప్రాణం. తరచూ పాడుతుంటాడు కూడా. ఆ పాట రేడియోలో వస్తోందంటే పనులన్నీ ఆపేసి అయిపోయేదాకా వినాల్సిందే. నాన్నకు ఎంతో ఇష్టమైన రెండు సంగతులు అందులో ఉన్నాయి మరి. అందులో ఎన్టీఆర్ ఆడిపాడటం ఒక సంగతైతే... బ్యాక్గ్రౌండ్లో నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణ పనులు సాగుతుండటం మరొక సంగతి. పల్నాడులోని మా ఊరి మెట్ట, బీడు పొలాల్ని బంగారు మాగాణిలా మార్చింది... నాగార్జునసాగర్ కుడి కాలువ నీరే. నాన్న చదువుకోలేదు. అయినా ఎంతో కష్టమైన ఎన్టీఆర్ డైలాగుల్ని, కొన్ని సినిమాల్లో ఆయన పాడిన పద్యాలను తప్పుల్లేకుండా కంఠతా అప్పగించేసే వాడు.
అంతకుముందు రాజకీయాలంటే మా బజారులో ఎవరూ పెద్దగా పట్టించుకునే వారే కాదు. మా బజారుకు పెద్ద మనిషిగా ఉండే కోటిలింగం.. ఎవరి పేరు చెబితే వారికే జై కొట్టేవాళ్లు. కోటిలింగం పంపించాడంటూ గోతం తీసుకుని ఇద్దరు మనుషులు ఆ రోజు సాయంత్రం మా ఇంటికి వచ్చారు. నాన్న ఎన్ని మానికల వడ్లు కొలుస్తాడా అని అందరం చూస్తూ ఉన్నాం. వచ్చిన ఇద్దరికీ చెరో బస్తా వడ్లు ఎత్తి పంపించాడు నాన్న. అది చూసి.. అమ్మ, నాయనమ్మ, తాతయ్యలకు నోట మాట రాలేదు. ‘అదేందిరా... రెండు బత్తాలు ఇచ్చినవ్. 20 మానికలు ఇత్తే పొయ్యేదిగా. ఎన్టీయారంటే నీకు ఇట్టం కాబట్టి.. మహా అయితే ఇంకో పది మానికలు ఎక్కువ కొలవాల్సింది. అట్టా గాకుండా ఒక్కపాలే రెండు బత్తాలిత్తే ఎట్టా? తిండి సరుకులు అప్పిచ్చిన కోమటాయనకు, పురుగుల మందులు, ఎరువులు ఇచ్చిన మందుల కొట్టాయనకు ఇంకా వొడ్లు కొలవాలి. ఉన్నయి సరిపోతయ్యో లేదో! ఇంత కటకటలాడతన్నప్పుడు నువ్వు ఒక్కపాలే రెండు బత్తాలిచ్చినవేంది?’ అని తాతయ్య అడిగాడు. నాన్న ఏమీ మాట్లాడలేదు. ‘ఏందయ్యోయ్... సాచ్చాత్తూ ఎంటీ రామారావే సరాసరి మనూరుకు వచ్చి... ఎంగటేసర్లూ నువ్వు ఇత్తేనే గానీ నా పారిటీ నడిచేటట్టు లేదు... అని నిన్నేదో అడిగినట్లు రెండు బత్తాలిచ్చినవ్’ అని అమ్మ నిష్టూరమాడినా... నాన్న నవ్వుతూ నిలబడ్డాడే తప్ప బదులివ్వలేదు. ఆయన ముఖం చూసి...ఏమీ అనలేక అందరూ మిన్నకుండిపోయారు. వెంకటేశ్వర్లు రెండు బస్తాలిచ్చిండంట... అని బజారు మొత్తం ఉలిక్కిపడింది. ‘ఎంగటేసర్లు ఎచ్చులు పోతున్నాడు’ అని కొందరంటే. ‘ఎంటీయారంటే ఇట్టం కదా... అందుకే ఇచ్చుంటాడు’ అని మరికొందరన్నారు.
మరుసటి రోజు ఉదయాన్నే... కోటిలింగం తనతో పాటు ఇద్దరిని వెంట బెట్టుకుని మా ఇంటికి వచ్చాడు. ఆయనతో వచ్చిన ఇద్దరిలో ఒకరి తలపై బస్తా, ఇంకొకరి తలపై అరబస్తా వడ్లు ఉన్నాయి. వారిద్దరూ మా ఇంటి పంచలో ఆ వడ్లను దించారు. ‘ఏంది ఎంగటేసర్లూ... రెండు బత్తాల వొడ్లను సరదాగా ఇచ్చేంత మొగోడివా నువ్వు. తిక్కలోడా... అందరికంటే ముందుండి పారిటీలో తిరగాలనుకుంటున్న నేనే.. నాకు ఉన్నంతలో అర బత్తా ఇచ్చా. నీ దగ్గర రెండు బత్తాల వొడ్లు తీసుకుంటే నా పరువేంగావాల. వూళ్లో వాళ్లంతా ఎవురి తాహతుకు తగ్గట్లు వారు... 10 మానికలో, 20 మానికలో కొలిసినోళ్లే కానీ... నీలాగ రెండు బత్తాలిచ్చినోళ్లు లేరురా నాయనా. అందుకే అరబత్తా ఉంచుకుని, మిగతావి ఇచ్చేద్దామని వచ్చా’ అని చెప్పేసి కోటిలింగం వెళ్లిపోయాడు. ఆ బస్తాన్నర వడ్లను చూసి... మా అమ్మ, నాయనమ్మ, తాతయ్య... హమ్మయ్య అని నిట్టూరిస్తే... తాను ఇచ్చిన చందా తిరిగి వచ్చినందుకు మా నాన్న ముఖం మాత్రం చిన్నబోయింది.
-మేకల అమరబాబు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి