Andhra Pradesh poll violence: శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది.
పల్నాడు హింసకు పాత డీజీపీ నుంచి డీఎస్పీల వరకూ బాధ్యులే
ఎస్పీ బిందుమాధవ్కు అన్ని వైపుల నుంచీ సహాయ నిరాకరణ
తప్పంతా ఆయనపైకి నెట్టి తప్పించుకున్న ఉన్నతాధికారులు
ఈనాడు - అమరావతి
అల్లరి మూకలు రోడ్డుమీదకు వచ్చి వీరంగం చేస్తున్నాయట. వెంటనే ఆ గుంపుల్ని చెదరగొట్టండి
పోలింగ్ రోజున ఫోన్లో పల్నాడు ఎస్పీ ఆదేశం.
అవసరం లేదు సార్... ఎమ్మెల్యే గారికి చెబుదాం, ఆయనే చూసుకుంటారు
సంఘటన స్థలంలో ఉన్న కిందిస్థాయి పోలీసు అధికారుల సమాధానం.
సార్.. అరాచక శక్తుల్ని బైండోవర్ చేయకుండా వదిలేశారు
ఎన్నికలకు కొన్నిరోజుల ముందు జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ... అప్పటి డీజీపీకి ఇచ్చిన రిపోర్టు.
అరే, ఎందుకు లేవయ్యా... ఇప్పటికి చేసింది చాలు. ఇక అవసరం లేదు
అప్పటి డీజీపీ సమాధానం
ఎమ్మెల్యేను గృహనిర్బంధంలో ఉంచండి. నా అనుమతి లేకుండా బయటకు పంపొద్దు
ఎస్పీ ఆదేశం
పది నిమిషాల్లోనే మున్సిపల్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే హల్చల్. అదేంటయ్యా... ఎందుకు వదిలేశారని ఎస్పీ అడిగితే, ఎమ్మెల్యే గారు ఓటేస్తానని చెప్పారు సార్... అందుకే వదిలేశామని కిందిస్థాయి పోలీసుల సమాధానం.
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. అయితే, ఆయన సస్పెన్షన్కు గురవడానికి వెనుక... అప్పటి డీజీపీ నుంచి, కిందిస్థాయి అధికారుల వరకు అందరూ సహాయనిరాకరణ చేయడం కూడా ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. తన కింద పనిచేసే అధికారులు, సిబ్బందిలో కొందరు వైకాపాకు కొమ్ముకాస్తూ, శాంతిభద్రతల నిర్వహణను గాలికొదిలేశారని... డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బందిలో 20 మందిని బదిలీ చేయాలని ఆయన కోరినా పాత డీజీపీ పెడచెవిన పెట్టారని సమాచారం. పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి ఆ పోలీసు అధికారులంతా... ఆయనకు సహాయ నిరాకరణ చేశారని తెలుస్తోంది. వైకాపా నాయకులు, కార్యకర్తలు గుంపులుగా రోడ్లపైకి వచ్చి రాళ్లు రువ్వుతున్నా, దాడులు చేస్తున్నా.. వారిని నియంత్రించాలన్న ఎస్పీ ఆదేశాల్ని ఎవరూ లెక్కచేసినట్లు కనిపించలేదు. పల్నాడు జిల్లాలో గొడవలు జరుగుతాయని ముందే తెలిసినా... అక్కడ పరిస్థితిని సమీక్షించి జాగ్రత్తలు తీసుకోవడంలో సీఎస్ జవహర్రెడ్డి, ప్రస్తుత డీజీపీ హరీష్కుమార్ గుప్తాల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పోలింగ్ రోజున ఐజీ శ్రీకాంత్ను మాచర్లకు ప్రత్యేక అధికారిగా పంపించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ కూడా పల్నాడు జిల్లాలోనే ఉన్నారు. వీరంతా ఎవరిదారిన వారు ఆదేశాలివ్వడంతో ఎస్పీ ఏమీ చేయలేకపోయారు. చివరకు ఈసీ మాత్రం బిందుమాధవ్ను సస్పెండ్చేసింది. శాంతిభద్రతల నిర్వహణలో వైఫల్యానికి జిల్లా ఎస్పీగా ప్రాథమిక బాధ్యత ఎస్పీదే అయినా, ఆయన ఎలాంటి నిస్సహాయ స్థితిని ఎదుర్కొన్నారో... అక్కడి పరిస్థితుల్ని తరచిచూస్తే అర్థమవుతుంది.
సీఎస్ నియమిస్తే బదిలీ... ఈసీ నియమిస్తే సస్పెన్షన్
ఎన్నికల సమయంలో పల్నాడులో చోటుచేసుకున్న పరిణామాల్ని, వాస్తవాల్ని లోతుగా పరిశీలిస్తే షాకింగ్ విషయాలు తెలిశాయి. పల్నాడులో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా... పాత డీజీపీ, కొత్త డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు.. చివరకు సీఎస్ ఏం చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హింసాకాండ విషయంలో సీఎస్ చేసిన సిఫార్సులపైనా విమర్శలు వస్తున్నాయి. సస్పెన్షన్కు సీఎస్ సిఫార్సు చేసిన పల్నాడు, అనంతపురం ఎస్పీలు ఇద్దరూ ఈసీ నియమించినవారే. బదిలీ చేయాలని సిఫార్సుచేసిన పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ మాత్రం రాష్ట్రప్రభుత్వ ఆదేశాలతో సీఎస్ నియమించినవారు. ఈసీ నియమించిందనే ఆ అధికారులిద్దరి సస్పెన్షన్కు సీఎస్ సిఫార్సు చేశారన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వినిపిస్తోంది. అలాగే.. బిందుమాధవ్ను అప్పటి డీజీపీ రాజేంద్రనాథరెడ్డి మొదటి నుంచీ శత్రువులా చూశారని, ఏ విషయంలోనూ సహకరించలేదని పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది.
పోలింగ్ రోజున వైకాపా నాయకుల అడుగులకు మడుగులు
అధికార పార్టీ కార్యకర్తల్లా పనిచేసిన కొందరు డీఎస్పీలు, సీఐలు, కిందిస్థాయి సిబ్బందిని కొనసాగిస్తే ఎన్నికల నిర్వహణ కష్టమని బిందుమాధవ్ నివేదిక సమర్పించినా... అప్పటి డీజీపీ వారిని బదిలీ చేయకపోవడంతో పోలింగ్ రోజున వారంతా చెలరేగిపోయారు. వారిలో ప్రధానంగా... తాజాగా ఈసీ సస్పెండ్ చేసిన గురజాల, నరసరావుపేట డీఎస్పీలు ఎ.పల్లంరాజు, వీఎస్ఎన్ వర్మ తదితరులున్నారు. తన కింద పనిచేసే సిబ్బంది మాట వినకపోతే... కొన్నిచోట్లకు ఎస్పీ వెళ్లి అల్లరిమూకల్ని చెదరగొట్టాల్సి వచ్చింది.
- పోలింగ్ రోజున నరసరావుపేటలో వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనుషులు.. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగారు. వారిని చెదరగొట్టాలని ఎస్పీ ఆదేశిస్తే... ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఆయనే పంపేస్తారని పోలీసులు బదులిచ్చారు.
- స్ట్రైకింగ్ ఫోర్స్... నరసరావుపేట ఎమ్మెల్యే వెంట తిరిగింది. ఎమ్మెల్యే కాన్వాయ్లో 10 వాహనాలతో... 70-80 మంది వెళ్తుండగా ఎస్పీకి తెలిసి అన్ని వాహనాల్ని ఎందుకు అనుమతించారని అడిగితే, రెండే వాహనాలున్నాయని అబద్ధం చెప్పారు.
- ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిని పోలింగ్ రోజు మధ్యాహ్నం గృహనిర్బంధం చేశారు. తన అనుమతి లేకుండా ఆయనను బయటకు వెళ్లనివ్వవద్దని ఎస్పీ ఆదేశించారు. కానీ కాసేపటికే ఎమ్మెల్యే మున్సిపల్ స్కూల్ దగ్గర కనపడటంతో ఎస్పీ అవాక్కయ్యారు. ఎందుకు విడిచిపెట్టారని పోలీసుల్ని అడిగితే... ఓటు వేస్తానంటే తీసుకొచ్చామని బదులిచ్చారు.
- పోలింగ్ రోజు కండ్ల[కుంటలో తెదేపా, ఇతర అభ్యర్థుల ఏజెంట్ల ఇళ్లకు వెళ్లి, వారి కుటుంబసభ్యులపై ఎమ్మెల్యే సోదరుడు వెంకట్రామిరెడ్డి దాడులు చేశారు. వారు భయంతో డీఎస్పీకి ఫోన్ చేసి సహాయం కోరితే... వారిని ఆదుకోవడానికి రాకపోగా.. ఆ విషయాన్ని ఎమ్మెల్యే సోదరుడికి డీఎస్పీ చెప్పారు. దాంతో వారిపై మళ్లీ దాడికి పాల్పడ్డారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
- పోలింగ్ మర్నాడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వందలమందితో కారంపూడి వెళ్లి తెదేపా కార్యాలయంపై దాడి చేసి, పలువుర్ని కొట్టారు. కారుకు నిప్పుపెట్టారు. అయినా డీఎస్పీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు.
ఒంటరైన ఎస్పీ
అన్నివైపుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవడంతో ఎస్పీ బిందుమాధవ్ దాదాపు ఒంటరి అయ్యారు. కిందిస్థాయి పోలీసు అధికారులు మాట వినకుండా, వైకాపా ఎమ్మెల్యేల కనుసన్నల్లో పనిచేయడంతో మొత్తం గందరగోళమైంది. సిబ్బంది మీద నమ్మకం లేక... కేంద్ర బలగాల సహకారంతో ఈవీఎంలను స్ట్రాంగ్రూంకు తరలించి, తెల్లవారుజామున ఐదు గంటల వరకు అక్కడే ఉండి పర్యవేక్షించారు. పల్నాడు జిల్లాలో 86 శాతానికి పైగా పోలింగ్ జరిగిందంటే దానిలో ఎస్పీ కృషి చాలా ఉందని, ఎస్పీ బాగా పనిచేశారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా కూడా కొనియాడారు.
సీఎస్పై చర్యలుండవా?
సీఎస్ స్థాయిలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఒక్కసారీ సమీక్షించని జవహర్రెడ్డి... ఎస్పీలు, కలెక్టర్ల సస్పెన్షన్కు, బదిలీకి సిఫార్సు చేయడమేంటని కొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు. పల్నాడు జిల్లాలో సమస్యాత్మక ప్రదేశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నికల బందోబస్తుకు 34 కంపెనీల బలగాలు కావాలని కోరితే, 19 కంపెనీల బలగాల్నే ఇచ్చి సర్దుకోమన్నారని అధికారులు చెబుతున్నారు. తీరా అక్కడ శాంతిభద్రతల సమస్యల తలెత్తితే.. ఆ నెపాన్ని జిల్లా అధికారులపై వేసేసి, ఉన్నతాధికారులు తప్పించుకున్నారన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది.
అదనపు బలగాలు అడిగినా ఇవ్వలేదు
అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్కూ ఉన్నతాధికారుల నుంచి, కిందిస్థాయి సిబ్బంది నుంచి పూర్తి సహాయనిరాకరణ ఎదురైనట్లు ఆరోపణలు వచ్చాయి. స్పెషల్ బ్రాంచ్ సీఐ జకీర్ను బదిలీ చేయాలని అప్పటి డీఐజీ అమ్మిరెడ్డిని ఎస్పీ కోరినా పట్టించుకోలేదు. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణ ఎస్పీకి సహకరించకపోవడం, వైకాపా నాయకులతో కుమ్మక్కవడం వల్లే తెదేపా నాయకుడు జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటిపై దాడులు జరిగాయని సమాచారం. తాడిపత్రిలో ఘర్షణల నేపథ్యంలో అదనపు బలగాల్ని పంపాలని ఎస్పీ కోరినా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదని, చివరకు ఎస్పీయే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని, ఆ క్రమంలో ఆయనకూ గాయాలయ్యాయని పోలీసు వర్గాలు తెలిపాయి. వైకాపాకి కొమ్ముకాసే డీఎస్పీ వీఎన్కే చైతన్యను అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి కర్నూలు రేంజి డీఐజీ విజయారావు తాడిపత్రికి పిలిచించారని, ఆ విషయం ఎస్పీ అమిత్ బర్దర్కి తెలియదని సమాచారం.
వైకాపా నాయకులకు వేగుల్లా...
- పల్నాడు జిల్లాలో కొందరు పోలీసులు అధికారపార్టీకి వేగుల్లా పనిచేశారు. పోలింగ్ సందర్భంగా అల్లర్లు ప్రేరేపిస్తారని అనుమానం వచ్చినవారిని అరెస్టుచేయాలని ముందురోజు ఎస్పీ ఆదేశిస్తే.. వారిలో 30 మందిని వదిలేశారు.
- అంతకుముందు కూడా పలు సందర్భాల్లో ఎస్పీ టెలికాన్ఫరెన్స్లో ఇచ్చిన ఆదేశాల్ని ఎప్పటికప్పుడు అధికారపార్టీ నాయకులకు పోలీసులు చేరవేసేవారు.
- అభ్యర్థుల వాహనాల్ని ఆకస్మిక తనిఖీలు చేయాలని ఎస్పీ ఆదేశిస్తే... వారు చేయకపోగా, ఆ సమాచారాన్ని వారికి చేరవేశారు.
- హింసాత్మక సంఘటనలో, అల్లర్లో జరిగినప్పుడు ఫలానా వాళ్లను అరెస్టు చేయాలని ఎస్పీ ఆదేశిస్తే... వాళ్లు అధికారపార్టీకి చెందినవారైతే ఇదిగో చేసేస్తున్నాం అని అబద్ధం చెప్పి, చేయకుండా వదిలేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM