YSRCP: అయినవారికి భూముల పందేరం
వైకాపా నేతల జోక్యంతో భూముల రికార్డులు తారుమారవుతున్నాయి. రెవెన్యూ సిబ్బందిని బెదిరిస్తూ, ప్రలోభాలకు గురిచేస్తూ తమకు అనుకూలంగా రికార్డులను మార్చేసుకుంటున్నారు.
ఏకపక్షంగా భూ రికార్డుల్లో వివరాలు తారుమారు
‘రెవెన్యూ’ వ్యవహారాల్లో వైకాపా నేతల జోక్యం
అక్రమంగా.. ప్రభుత్వ భూముల కైంకర్యం
ఈనాడు - అమరావతి
వైకాపా నేతల జోక్యంతో భూముల రికార్డులు తారుమారవుతున్నాయి. రెవెన్యూ సిబ్బందిని బెదిరిస్తూ, ప్రలోభాలకు గురిచేస్తూ తమకు అనుకూలంగా రికార్డులను మార్చేసుకుంటున్నారు. ఇదే అదనుగా పలువురు రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు డీకే పట్టాల రూపంలో ధారదత్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులపేర్లతోనూ రాసేసుకుంటున్నారు. భూయజమానుల నిర్థారణ, విస్తీర్ణం, సర్వే నంబర్లకు ప్రామాణికంగా తీసుకునే ‘వెబ్ల్యాండ్’లో ఉండే వివరాలను బ్యాంకుల రుణాలు ఎక్కువ మొత్తంలో పొందేందుకు వీలుగా కూడా మార్చేస్తుండడం గమనార్హం. మ్యుటేషన్ విషయంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు. వెబ్ల్యాండ్కు సంబంధించిన డిజిటల్కీని తహసీల్దార్లకు తెలియకుండా కింది స్థాయి సిబ్బంది దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు వైకాపా ఐదేళ్ల పాలనలో భారీగా వెలుగులోకి వచ్చాయి. వీటిలో విచారణ వరకు వచ్చిన కేసులు కొన్ని మాత్రమే. ఏకపక్షంగా భూ రికార్డుల్లో పేర్లు మార్చడంపై ఇటీవల హైకోర్టు సైతం మండిపడింది. నెల్లూరు జిల్లా కలిగిరి మండల వాసి..తమ సొంత భూములను ప్రభుత్వానికి చెందినవిగా మార్చారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. పశ్చిమగోదావరి జిల్లా వాసి ఒకరు తమ పేరుమీద ఉన్న భూమిని ఇతరుల పేర్లతో మార్చారని హైకోర్టులో పిటిషన్ను వేశారు.
ఈ రెండు కేసుల్లో సంబంధితులకు నోటీసులు ఇచ్చి.. వారి వాదన వినకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని రెవెన్యూ సిబ్బందిపై హైకోర్టు మండిపడింది. రెవెన్యూశాఖలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది తహసీల్దార్లు, ఇతర సిబ్బంది ముడుపులు తీసుకొని వెబ్ల్యాండ్లోని వివరాలను మార్చేస్తున్నారు. భూ యజమానిగా నిర్థారించేందుకు అవసరమైన మ్యుటేషన్ల విషయంలో తూర్పుగోదావరి జిల్లాలో ఓ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, మరో ఉద్యోగి ఈ అక్రమాలకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లాలో బ్యాంక్ నుంచి రూ.5 లక్షల రుణం పొందేందుకు వీలుగా వెబ్ల్యాండ్లో తహసీల్దార్ ఒకరు తప్పుడు ఎంట్రీలు వేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి మండలంలో నిషిద్ధ జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని వారసత్వం కింద మార్చి..ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. శింగనమల మండల పరిధిలోని ఏడు గ్రామాల పరిధిలో ఉన్న 166 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో వెబ్ల్యాండ్లో నమోదు చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లా పెద్దపంజిని మండలంలో ఓ తహసీల్దారు 24 గంటల్లో రిలీవ్ కావాల్సి ఉండగా ముందురోజు అక్రమంగా.. వెబ్ల్యాండ్లో కొన్ని భూముల వివరాలను మార్చేశారు. ఈ వ్యవహారాలు చాలా మేరకు స్థానిక వైకాపా నాయకుల ఛత్రఛాయల్లో జరగడం గమనార్హం.
ప్రభుత్వ భూముల ధారదత్తం
ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేయాలంటే.. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పడే ఎసైన్మెంట్ కమిటీ సిఫార్సు చేయాలి. అయితే కొందరు వైకాపా నేతలు ఎసైన్మెంట్ కమిటీ సిఫార్సులతో నిమిత్తం లేకుండానే తమవారికి ప్రభుత్వ భూములను డీకే పట్టాల ద్వారా ఇప్పించేస్తున్నారు. ఇలా వైఎస్సార్ జిల్లాలో 162.06 ఎకరాలను 40 మందికి డీకే పట్టాల రూపంలో పంపిణీ చేసేశారు. చిత్తూరు జిల్లాలో నాలుగు గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. కె.వి.పల్లి మండలం నూతనకాల్వ గ్రామంలో ప్రభుత్వానికి చెందిన 7.04 ఎకరాల భూమి వివరాలను వెబ్ల్యాండ్లో ప్రైవేట్ క్యాటగిరీ కింద మార్చారు.
అనంతపురం జిల్లాలో తహసీల్దార్ ఒకరు.. ప్రజా ప్రయోజనాల కోసం పంచాయతీ కేటాయించిన భూమిని ఇళ్ల పట్టాల రూపంలో ఇతరులకు పంపిణీ చేశారు. ఇందుకు పంచాయతీకి సంబంధించిన తీర్మానం నకిలీది కావడం గమనార్హం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వీఆర్వో ఒకరు అటవీ భూమి కాజేసేందుకు వెబ్ల్యాండ్ను అనుకూలంగా మార్చుకున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో ఒక తహసీల్దారు ప్రభుత్వ భూమిని కుటుంబ సభ్యులకు చెందినదిగా చూపుతూ రికార్డులు సృష్టించారు. అలాగే ప్రభుత్వ భూమిని ఆక్రమించిన 66 మందికి మరో తహసీల్దారు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చేశారు. ఇదే అదునుగా కొందరు అధికారులు తమ వారికి ఈ భూములను కట్టబెడుతున్నారు. మరోవైపు మండల రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది తహసీల్దార్ వద్ద మాత్రమే ఉండే డిజిటల్కీని దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!