Infosys Ltd: ఆదాయ అంచనాలను మించిన ఇన్ఫీ
జనవరి-మార్చిలో 11.7% తగ్గిన లాభం
వరుసగా మూడో త్రైమాసికమూ పెరిగిన ఉద్యోగులు

‘‘మాపై నమ్మకం ఉంచుతున్న క్లయింట్ల కోసం ఒక బలమైన సంస్థను మేం నిర్మించాం. అంచనాలను మించి రాణిస్తున్న మా ఉద్యోగుల కర్తవ్యదీక్షకు కృతజ్ఞతలు. పూర్తి ఆర్థిక సంవత్సర ఆదాయాలు పెరిగాయి. ఆపరేటింగ్ మార్జిన్లూ పెంచుకున్నాం. ఏఐ, క్లౌడ్, డిజిటల్ విభాగాల్లో క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా పనిచేశాం.’’
ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్
దిల్లీ
దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్, 2024-25 జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.7,033 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2023-24 ఇదే కాల లాభం రూ.7,969 కోట్ల తో పోలిస్తే ఇది 11.7% తక్కువ. ఆదాయాలు మాత్రం రూ.37,923 కోట్ల నుంచి 7.9% పెరిగి రూ.40,925 కోట్లకు చేరాయి. డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే లాభం 3.3% పెరగ్గా.. ఆదాయాలు 2% తగ్గాయి. నిర్వహణ మార్జిన్ ఏడాది వారీగా 0.9% పెరగ్గా.. త్రైమాసికం వారీగా 0.3% తగ్గింది.
2024-25 ఆదాయం రూ.1,62,990 కోట్లు
గత ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయ అంచనాలను ఇన్ఫోసిస్ అధిగమించింది. 2023-24తో పోలిస్తే 2024-25లో ఆదాయం 4.5-5 శాతం పెరుగుతుందన్న సంస్థ సవరించిన అంచనాలను మించి, 6.06% వృద్ధితో రూ.1,62,990 కోట్లుగా నమోదైంది. 2024-25కు తొలి ఆదాయ వృద్ధి అంచనా 3.75-4.50 శాతమే. గత ఆర్థిక సంవత్సరంలో 11.6 బిలియన్ డాలర్ల విలువైన పెద్ద ఒప్పందం కుదరడం ఇందుకు ఉపకరించింది. నికర లాభం 1.8% వృద్ధితో రూ.26,713 కోట్లుగా నమోదైంది. 2024-25లో నిర్వహణ కార్యకలాపాల ద్వారా వచ్చిన నికర నగదు 4.1 బి. డాలర్లుగా ఉంది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధికమని సీఎఫ్ఓ జయేశ్ సంఘ్రాజ్కా పేర్కొన్నారు.
అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి స్థిర కరెన్సీ ప్రాతిపదికన 0-3% నమోదు కావొచ్చని ఇన్ఫోసిస్ అంచనా వేసింది.
పెరిగిన ఉద్యోగుల సంఖ్య
2025 మార్చి చివరకు కంపెనీ ఉద్యోగుల సంఖ్య 3,23,578గా నమోదైంది. 2024 ఇదే సమయంతో పోలిస్తే 6,388 మందిని జత చేసుకుంది. మార్చి త్రైమాసికంలో 199 మంది ఉద్యోగులను నికరంగా చేర్చుకుంది. అంతక్రితం రెండు త్రైమాసికాల్లో 5591 (క్యూ3), 2,456(క్యూ2) చొప్పున ఉద్యోగులను జత చేసుకున్న సంగతి విదితమే. వలసల రేటు డిసెంబరు త్రైమాసికంలో 13.7% కాగా, మార్చి త్రైమాసికంలో 14.1 శాతానికి పెరిగింది.
తుది డివిడెండు రూ.22: మధ్యంతర డివిడెండుతో కలిపి ఒక్కో షేరుకు రూ.22 చొప్పున తుది డివిడెండును బోర్డు ప్రతిపాదించింది. 2023-24తో పోలిస్తే ఇది 13.2% అధికం..
ఈ ఏడాదిలో 20,000 మంది తాజా ఉత్తీర్ణులను తీసుకుంటాం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది తాజా ఉత్తీర్ణులను నియమించుకునే దిశగా పయనిస్తున్నట్లు ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ స్పష్టం చేశారు. మా లక్ష్యానికి అనుగుణంగా 20,000 నియామకాలు చేపడతామని సీఎఫ్ఓ కూడా తెలిపారు. కంపెనీ ఇటీవలే తన మైసూరు క్యాంపస్లో 400 మంది ట్రైనీలను లేఆఫ్ చేసిన సంగతి తెలిసిందే.
సవాళ్లున్నా రాణించాం: ‘మా ఉద్యోగులకు అధిక వేరియబుల్ పే చెల్లించాం. కంపెనీల కొనుగోళ్ల ప్రభావమూ పడింది. ఇటువంటి సవాళ్లు ఎదురైనా మా మార్జిన్లు 50 బేసిస్ పాయింట్లు పెరిగాయ’ని సలీల్ పేర్కొన్నారు. బీఎస్ఈలో కంపెనీ షేరు 0.51% లాభంతో రూ.1420.20 వద్ద స్థిరపడింది. మార్కెట్ అనంతరం ఫలితాలు వెలువడ్డాయి.
రూ.840 కోట్లతో రెండు విదేశీ కంపెనీల కొనుగోలు!
ఆస్ట్రేలియాకు చెందిన సైబర్భద్రతా సేవల సంస్థ ద మిస్సింగ్ లింక్ను 98 మి. డాలర్లు (రూ.532 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇన్ఫీ తెలిపింది. ఇన్ఫోసిస్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ కొనుగోలు పూర్తి చేయనుంది. అమెరికాకు చెందిన టెక్నాలజీ, బిజినెస్ కన్సల్టింగ్ సంస్థ ఎమ్ఆర్ఈ కన్సల్టింగ్ను 36 మి. డాలర్ల(దాదాపు రూ.307.4 కోట్ల)తో తన అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్ నోవా హోల్డింగ్స్ ఎల్ఎల్సీ ద్వారా కొనుగోలు చేస్తామంది. పూర్తిగా నగదు రూపంలో జరిగే ఈ రెండు ఒప్పందాలు ప్రస్తుత త్రైమాసికంలో పూర్తికావొచ్చని అంచనా.
ఇన్ఫోసిస్ ఆధ్వర్యంలోని సంయుక్త సంస్థ వెంచర్ హైపస్లో మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ (ఎమ్హెచ్ఐ) 150 మిలియన్ జపనీస్ యెన్లు (దాదాపు రూ.8.9 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ఇన్ఫీ తెలిపింది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ సింగపూర్లో 2% వాటాను మిత్సుబిషి పొందనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

నెమ్మదించిన స్థిరాస్తి లావాదేవీలు
ఈ ఏడాది అక్టోబరు- డిసెంబరులో హైదరాబాద్లో ఇళ్ల/ఫ్లాట్ల విక్రయాలు 11,323లకు పరిమితమవుతున్నాయని స్థిరాస్తి విశ్లేషణా సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసిక అమ్మకాలు 13,902తో పోలిస్తే ఈసారి 19% తగ్గాయంది. -

పౌరవిమాన సేవల్లోకి మరో 4 సంస్థలు
దేశీయ విమాన ప్రయాణికుల విపణిలో అత్యధిక మార్కెట్వాటా ఉన్న ఇండిగో సేవల్లో ఇటీవల తలెత్తిన సమస్యల కారణంగా, లక్షలమంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడిన నేపథ్యంలో.. మరిన్ని విమానయాన సంస్థలను రంగంలోకి దింపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. -

ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలోకి సునీల్ మిత్తల్
భారతీ ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ మిత్తల్, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నారు. చైనా ఎలక్ట్రానిక్స్ సంస్థ హైయర్ గ్రూపు అనుబంధ కంపెనీ హైయర్ అప్లయన్సెస్ ఇండియాలో 49% వాటాను మిత్తల్ నేతృత్వంలోని భారతీ ఎంటర్ప్రైజెస్, అమెరికా ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్బర్గ్ పింకస్ సంయుక్తంగా కొనుగోలు చేయనున్నాయి. -

సూచీలకు కొనసాగిన నష్టాలు
సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఇంధనం, ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురవ్వడం, విదేశీ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, రూపాయి విలువ తగ్గడమూ మదుపర్ల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపాయి. -

కొత్త తరం కియా సెల్టోస్ తయారీ ప్రారంభం
మధ్యశ్రేణి ఎస్యూవీ (స్పోర్ట్స్ వినియోగ వాహన) విభాగంలో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకునేలా, కొత్త తరం సెల్టోస్ కారు వాణిజ్య తయారీని కియా ఇండియా ప్రారంభించింది. -

అపోలో హాస్పిటల్స్ వాటాదార్లకు అపోలో హెల్త్టెక్ షేర్లు
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ ప్రతిపాదించిన పునర్వ్యవస్థీరణ ప్రణాళికకు స్టాక్ ఎక్స్ఛేంజీలు అనుమతి ఇచ్చాయి. ఫార్మసీ వ్యాపారాన్ని, డిజిటల్ హెల్త్కేర్ వ్యాపారాన్ని విడదీయాలని; అనుబంధ కంపెనీలైన అపోలో హెల్త్కో, కీమెడ్ లను అపోలో హెల్త్టెక్లో కలపాలని సంస్థ ప్రతిపాదించింది. -

అనిల్ అంబానీకి ఊరట
అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) ఖాతాలను ‘మోసపూరితమైనవి’గా వర్గీకరించి, 3 బ్యాంకుల కన్సార్షియం చేపడుతున్న, చేపట్టబోయే అన్ని చర్యలపై బాంబే హైకోర్టు స్టే ఇచ్చింది. -

ఇండిగో టికెట్ల రద్దుపై కేంద్రానికి 100 ఫిర్యాదులు
ఇండిగో విమాన టికెట్ల రద్దుపై 100 వరకు ఫిర్యాదులను తమ శాఖ అందుకున్నట్లు, వాటిని విమాన నియంత్రణాధికార సంస్థకు పంపినట్లు వినియోగదారు వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే పేర్కొన్నారు. -

క్యాస్ట్రోల్లో 65% వాటా విక్రయం
లూబ్రికెంట్లు తయారు చేసే క్యాస్ట్రోల్ ఇండియా మాతృసంస్థ, బ్రిటన్కు చెందిన క్యాస్ట్రోల్లో 65% వాటా విక్రయించడానికి బ్రిటన్ ఇంధన సంస్థ బీపీ అంగీకరించింది. అంతర్జాతీయ ఆల్నర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ స్టోన్పీక్కు ఈ వాటా విక్రయిస్తామని తెలిపింది. -

రష్యా చమురు కొనుగోలు ఆంక్షల నుంచి రిలయన్స్కు ఒక నెల మినహాయింపు!
రష్యా చమురు ఉత్పత్తి సంస్థ రాస్నెఫ్ట్ నుంచి, ముడిచమురు దిగుమతి చేసుకోవడాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనసాగించనుంది. రష్యా సంస్థల నుంచి చమురు కొనుగోలు చేసేవారిపై విధించిన ఆంక్షల నుంచి ఒక నెల పాటు రిలయన్స్కు అమెరికా మినహాయింపు ఇవ్వడం ఇందుకు నేపథ్యం. -

జోస్ అలుక్కాస్ ప్రచారకర్త దుల్కర్ సల్మాన్
ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ను తమ ప్రచారకర్తగా నియమించుకున్నట్లు ఆభరణాల సంస్థ జోస్ అలుక్కాస్ వెల్లడించింది. -

సంక్షిప్త వార్తలు(5)
వేగవంతంగా చెక్కులను క్లియర్ చేసే వ్యవస్థ రెండో దశ అమలును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వాయిదా వేసింది. బ్యాంకులు తమ కార్యకలాపాలను క్రమబద్దీకరించుకోవడానికి మరింత సమయం ఇచ్చింది.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

అధికారం కంటే.. పార్టీ కార్యకర్తగా ఉండటమే ఇష్టం: డీకే శివకుమార్
-

సూర్యవంశీ విధ్వంసక శతకం.. రోహిత్, కోహ్లీ సూపర్ సెంచరీలను వీక్షించండి
-

భారత ట్రావెల్ వ్లాగర్ను నిర్బంధించిన చైనా..!
-

కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం.. డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడం వల్లే..!
-

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది సజీవ దహనం
-

రివ్యూ: శంబాల.. ఆది సాయికుమార్ ఖాతాలో హిట్ పడిందా?


