Adani Enterprises: బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలోకి అదానీ ఎంటర్ప్రైజెస్?
Adani Enterprises: అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు విలువ గత ఐదు నెలల్లో దాదాపు 10 శాతం పెరిగింది. ఈ క్రమంలో సెన్సెక్స్ సూచీలో ఇది చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex) సూచీలో అదానీ ఎంటర్ప్రైజెస్ (AEL) చోటు దక్కించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయని ఐఐఎఫ్ఎల్ ఆల్టర్నేటివ్ రీసెర్చ్ వెల్లడించింది. సూచీ అర్ధవార్షిక పునర్వ్యవస్థీకరణలో భాగంగా విప్రో స్థానంలో అదానీ కంపెనీ వచ్చి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. అదే జరిగితే సెన్సెక్స్ సూచీలో చేరిన తొలి అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీగా ఏఈఎల్ నిలుస్తుంది.
మే 24న సెన్సెక్స్ సూచీలోని కంపెనీలో పునర్వ్యవస్థీకరణపై అధికారిక నిర్ణయం వెలువడనుంది. జూన్ నుంచి ఈ మార్పులను అమలుచేస్తారు. వాస్తవానికి అదానీ ఎంటర్ప్రైజెస్ 2023లో సూచీలో చేరుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. కానీ, హిండెన్బర్గ్ నివేదిక దానికి గండి కొట్టింది. సెన్సెక్స్లో అదానీ చేరికతో ఈ ఇండెక్స్ను ట్రాక్ చేసే పాసివ్ ఫండ్స్ నుంచి దాదాపు రూ.1,000 కోట్ల వరకు వచ్చి చేరే అవకాశం ఉందని ఐఐఎఫ్ఎల్ రీసెర్చ్ అంచనా వేసింది. ఏఈఎల్ స్టాక్ జనవరి నుంచి 10 శాతానికి పైగా పుంజుకుంది. ఈరోజు దాదాపు ఆరు శాతానికి పైగా పెరగడం విశేషం.
(గమనిక: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి నష్టభయంతో కూడుకొన్న వ్యవహారం. స్టాక్స్లలో పెట్టుబడి పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం. పై వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే.)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి
ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్ రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి సారించింది. దీనికి తగ్గట్లుగా పెట్టుబడులు సిద్ధం చేస్తోంది. -
కొత్త వ్యాపారాల్లో అయిదింతల వృద్ధి లక్ష్యం
వ్యాపారాల విలువను గణనీయంగా పెంచుకోవడంపై మహీంద్రా గ్రూపు దృష్టి సారిస్తోందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టరు, సీఈఓ అనిశ్ షా తెలిపారు. -
నియంత్రణ పటిష్ఠమైనా మోసాలు తగ్గట్లేదు: కేపీఎంజీ సర్వే
నియంత్రణ చర్యల్లో పలు మార్పులు చేసినా, మోసాల సంఖ్య తగ్గడం లేదని తమ సర్వేలో పాల్గొన్న వాళ్లలో ఎక్కువ మంది వెల్లడించినట్లు కేపీఎంజీ వెల్లడించింది. -
తాజా ఉత్తీర్ణులకు హుషారే
గత ఆరు నెలల్లో తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్స్) నియామకాలు 5% పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. ఐటీ రంగ పరిస్థితి క్రమంగా మెరుగవుతుండటం ఇందుకు కారణమని పేర్కొంది. -
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్ యాంపీర్ నెక్సస్
గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్కు చెందిన ఇ-మొబిలిటీ విభాగం గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రై.లి. తన ఫ్యామిలీ విద్యుత్ స్కూటర్ యాంపీర్ నెక్సస్ను ఆవిష్కరించింది. -
అవిన్యా బ్రాండ్పై టాటా ప్రీమియం విద్యుత్తు కార్లు
టాటా మోటార్స్, ప్రీమియం విద్యుత్తు కార్లను అవిన్యా బ్రాండ్పై ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోందని సమాచారం. -
సంక్షిప్త వార్తలు(7)
ఈ ఏడాది, వచ్చే సంవత్సరానికి అంతర్జాతీయంగా ముడిచమురు వినియోగ అంచనాల్లో ఎటువంటి మార్పులు చేయడం లేదని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) తాజాగా వెల్లడించింది. 2024లో రోజుకు 2.25 మిలియన్ బ్యారెళ్లు, వచ్చే ఏడాదిలో రోజుకు 1.85 మిలియన్ బ్యారెళ్ల చొప్పున చమురుకు గిరాకీ పెరుగుతుందన్నది ఒపెక్ అంచనా. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్?
ఇంటిపై రుణం ఇచ్చే ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి?
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నేను రెండు దెబ్బలే కొట్టా.. పోలీసు విచారణలో నటుడు దర్శన్ వెల్లడి?
-
ఆగస్టు 1 నుంచి భూముల మార్కెట్ విలువ పెంపు
-
స్వీయ తప్పిదాలతోనే పాస్పోర్టు జారీలో ఆలస్యం
-
ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయం.. త్వరలో చెత్త పన్నుకు చెల్లు చీటీ!
-
అక్రమాలకు అడ్డాగా జగనన్న కాలనీలు.. అడ్డగోలుగా బిల్లులు విడుదల