Air India: భారత విమానయాన రంగంలో పుష్కల అవకాశాలు
భారత్ను దిగ్గజ విమానయాన విపణిగా చెబుతూ... ఎయిరిండియా, లుఫ్తాన్సాల మధ్య బలమైన భాగస్వామ్యం ఉండటం మంచి పరిణామమని స్టార్ అలయన్స్ సీఈఓ థియో పానాజియోటౌలియాస్ అభిప్రాయపడ్డారు.
ఎయిరిండియా- లుఫ్తాన్సాల మధ్య బలమైన భాగస్వామ్యంతో మేలే
స్టార్ అలయన్స్ సీఈఓ
దిల్లీ: భారత్ను దిగ్గజ విమానయాన విపణిగా చెబుతూ... ఎయిరిండియా, లుఫ్తాన్సాల మధ్య బలమైన భాగస్వామ్యం ఉండటం మంచి పరిణామమని స్టార్ అలయన్స్ సీఈఓ థియో పానాజియోటౌలియాస్ అభిప్రాయపడ్డారు. భాగస్వాములను ఒక్కచోటకు చేర్చాలనే ప్రయత్నం ద్వారా ప్రయాణికులందరికీ ఏకరీతిలో ప్రయోజనం కలిగేలా చేయాలన్నదే స్టార్ అలయన్స్ ఉద్దేశమని తెలిపారు. 26 విమానయాన సంస్థలు సభ్యత్వం కలిగిన స్టార్ అలయన్స్లో ఎయిరిండియా, లుఫ్తాన్సా సంస్థలు కూడా భాగంగా ఉన్నాయి. ‘పుష్కల అవకాశాలు ఉన్న భారత్ విపణిపై సానుకూల ధృక్పథంతో ఉన్నామ’ని ఐఐటీఏ వార్షిక సాధారణ సమావేశం అనంతరం పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన తెలిపారు. భాగస్వామ్య సంస్థలను ఒక్క చోటకు తేవడం వల్ల ప్రయాణికులకు ఎంపిక విషయంలో మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయని, భారత విపణి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే అది ఎంతో మంచి విషయమని అన్నారు. ఎయిరిండియా, లుఫ్తాన్సాల మధ్య భాగస్వామ్యంపై స్పందిస్తూ.. అలయన్స్లోనే బలమైన భాగస్వామ్యాలు ఉండటం ప్రయోజనకరమేనని తెలిపారు. ఈ రెండు సంస్థల మధ్య బలమైన కోడ్షేర్ ఒప్పందాలు ఉండటం వల్ల ఇరు సంస్థల ప్రయాణికులకు గమ్యస్థానాల అనుసంధానత విషయంలో మరింత వెసులుబాటు లభిస్తుందని అన్నారు. మరోవైపు ఐఏటీఏ వార్షిక సాధారణ సమావేశం సమయంలో ఎయిరిండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టరు క్యాంప్బెల్ విల్సన్తో లుఫ్తాన్సా గ్రూపు ఛైర్మన్, సీఈఓ కార్స్టెన్ స్పోర్ భేటీ అయ్యారు. సమావేశం సుదీర్ఘ సమయం పాటు జరిగిందని చెబుతూ, సమావేశ వివరాల వెల్లడికి స్పోర్ నిరాకరించారు.
- లాభదాయకతను సాధించే దిశగా ఆకాశ ఎయిర్ అడుగులు వేయగలదని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు ఆదిత్య ఘోష్ ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియాలోని ప్రాంతాలకు సహా మరిన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు సర్వీసులను విస్తరిస్తామన్నారు.
- సామర్థ్యానికి తగ్గట్లుగా భారత విమానయాన రంగ వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఎమిరేట్స్ ఎయిర్లైన్ డిప్యూటీ ప్రెసిడెంట్ ఆద్నాన్ కఝీమ్ తెలిపారు. భారత్లో ప్రస్తుతం సీట్ల లభ్యత కంటే ప్రయాణికుల గిరాకీ ఎక్కువగా ఉందని అన్నారు. దుబాయ్, భారత్ల మధ్య ద్వైపాక్షిక విమానయాన హక్కులు పెరగాల్సి ఉందని కూడా తెలిపారు.
- విమానాల మరమ్మతు పనుల కోసం తమ గ్రూపు విమానయాన సంస్థల వద్ద అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్ నైపుణ్యాలను ఎయిరిండియా వినియోగించుకుంటుందని ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. విమానాలను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తి ఉన్నప్పటికీ.. మార్కెట్లో విమానాల లభ్యత క్లిషంగా ఉందని అన్నారు. ముఖ్యంగా వైడ్ బాడీ విమానాల విషయంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
ఈ రుసుములు గమనించారా?
క్రెడిట్ కార్డును వాడుతున్నారా? తాజాగా వచ్చిన మీ కార్డు బిల్లును పరిశీలనగా చూశారా? చాలామంది క్రెడిట్ కార్డు బిల్లును సరిగా చూడకుండానే చెల్లిస్తుంటారు. -
బ్యాంకు అప్పు ఇవ్వనంటే...
అత్యవసరంలో కొన్నిసార్లు అప్పు చేయడం తప్పనిసరి అవుతోంది. అన్ని సందర్భాల్లోనూ బ్యాంకులు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత రుణానికి సంబంధించి.. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
444 రోజుల అమృత్ వృష్టి
కొత్త పెట్టుబడి పథకాలు ఎన్ని వస్తున్నా, పెట్టుబడికీ, రాబడికీ హామీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) ప్రత్యేకతే వేరు. కాస్త అధిక రాబడినిచ్చే ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లతోపాటు, యువత సైతం ఆసక్తి చూపిస్తుంటారు. -
అమ్మాయి చదువుకు భరోసాగా
మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. ఇప్పటివరకూ ఎలాంటి బీమా పాలసీలు లేవు. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!