Home Loan: గృహ రుణం ముందే చెల్లించేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
Home Loan: ఒకవేళ మీకు ఏదైనా పెద్ద మొత్తంలో డబ్బు చేతికందినా లేదా ఆదాయం పెరిగినా, కొంత మొత్తాన్ని గృహ రుణ ముందస్తు చెల్లింపులకు ఉపయోగించడం వల్ల వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి సొంతిల్లు ఒక కల. మధ్యతరగతి వారు హోమ్లోన్ (Home Loan) ద్వారా దాన్ని సాకారం చేసుకుంటున్నారు. ఆర్థిక స్తోమతకు అనుగుణంగా ఈఎంఐలు చెల్లిస్తూ రుణం తీరుస్తున్నారు. కానీ, గృహరుణం దీర్ఘకాలంతో కూడుకొన్నది. రుణంగా ఎంత మొత్తం తీసుకున్నామో.. లోన్ తీరేనాటికి దాదాపు అంతే మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే కొంత మంది వడ్డీని ఆదా చేసుకోవడం కోసం ముందస్తు చెల్లింపులు (Home Loan Prepayment) చేస్తుంటారు. అలాంటి వారు ఈ కింది విషయాలు తెలుసుకోవాలి.
- గృహ రుణం (Home Loan)పై పన్ను ఆదా ప్రయోజనాలు ఉంటాయి. ఒకవేళ ప్రీ పేమెంట్ చేస్తే అసలు, వడ్డీ చెల్లింపులపై లభించే పన్ను ప్రయోజనాలను కోల్పోవచ్చు. అందువల్ల ప్రీ పేమెంట్ చేసే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించడం మేలు.
- ముందస్తు చెల్లింపుల ద్వారా ఈఎంఐ గానీ, చెల్లింపుల వ్యవధి గానీ తగ్గించుకోవచ్చు. ఒకవేళ కాలవ్యవధిని తగ్గించుకుంటే.. ఈఎంఐలో ఎలాంటి మార్పు ఉండదు. కానీ, చెల్లించాల్సిన అసలు మొత్తం తగ్గుతుంది. తద్వారా రుణం మొత్తాన్ని త్వరగా చెల్లించగలుగుతారు. ఒకవేళ ఈఎంఐ తగ్గించుకుంటే.. మీ చేతిలో ఎక్కువ మొత్తం మిగులుతుంది. కస్టమర్లు తమ అనుకూలతను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు.
- గృహ రుణం (Home Loan) ముందస్తు చెల్లింపులు.. రుణం తీసుకున్న కొత్తలో లాభదాయకంగా ఉంటాయి. రుణం తీసుకున్న తొలినాళ్లలో ఈఎంఐని పరిశీలిస్తే.. అసలు భాగం తక్కువగానూ, వడ్డీ భాగం ఎక్కువగానూ ఉంటుంది. రుణం తీసుకున్న కొత్తలో పాక్షిక చెల్లింపులు చేసి వడ్డీ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. కానీ, చివర్లో చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. పైగా పన్ను ప్రయోజనాలు కోల్పోతారు.
- గృహ రుణ (Home Loan) ముందస్తు చెల్లింపులకు ఇతర లక్ష్యాల కోసం దాచిన నిధులను ఉపయోగించడం సరికాదు. ఉదాహరణకు మీరు అత్యవసర నిధి కోసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టారు. రుణ భారం తగ్గించుకునే ఉద్దేశంతో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తే, అత్యవసర పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే, పదవీ విరమణ, పిల్లల చదువులు వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం చేసే పెట్టుబడులను మధ్యలోనే నిలిపివేసి ఆ మొత్తాన్ని గృహ రుణ ముందస్తు చెల్లింపుల కోసం ఖర్చుచేయడం కూడా మంచిది కాదు. ఇవి దీర్ఘకాలిక లక్ష్యాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
- ముందస్తు గృహ రుణ (Home Loan) చెల్లింపులు వడ్డీని తగ్గిస్తాయి. అయితే, వడ్డీ మొత్తాన్ని తగ్గించుకునేందుకు మరో ప్రత్నామ్నాయ మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. మీ బ్యాంకు వర్తింపజేసే వడ్డీ రేటు కంటే తక్కువ వడ్డీ రేటు అందిస్తున్న మరో బ్యాంకుకు రుణ మొత్తం బదిలీ చేయడం ద్వారా వడ్డీ తగ్గించుకోవచ్చు. అయితే, ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇతర హిడెన్ ఛార్జీల విషయంలో జాగ్రత్త వహించాలి. ఉదాహరణకు 20 సంవత్సరాల కాలవ్యవధితో రూ. 50 లక్షల రుణాన్ని (8.40 శాతంతో) తీసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు ఇదే రుణాన్ని 8 శాతం వడ్డీ రేటుతో ఇచ్చే బ్యాంకుకు బదిలీ చేస్తే, రూ.3 లక్షల వరకు వడ్డీ ఆదా చేసుకోవచ్చు.
- ఫ్లోటింగ్ రేటు ప్రాతిపదికన గృహరుణం (Home Loan) తీసుకున్న వారికి ముందుస్తు చెల్లింపులపై సాధారణంగా ఎలాంటి పెనాల్టీలూ వర్తించవు. అయితే, హిడెన్ ఛార్జీలు ఏమైనా వర్తిస్తున్నాయా తెలుసుకునేందుకు రుణ నిబంధనలు, షరతులను తెలుసుకోవడం ఉత్తమం.
- ఒకవేళ మీకు ఏదైనా పెద్ద మొత్తంలో డబ్బు చేతికందినా లేదా ఆదాయం పెరిగినా, కొంత మొత్తాన్ని గృహ రుణ ముందస్తు చెల్లింపుల (Home Loan Prepayment)కు ఉపయోగించి మిగిలిన సొమ్మును మంచి రాబడి అందించే పథకాల్లో మదుపు చేయడం కూడా మేలైన మార్గం.
హోంలోన్ ముందుగా చెల్లించాలంటే ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించాలి. ఆదాయం, ఖర్చులు, బాధ్యతలు, పెట్టుబడులు, రుణ వాయిదాలు పోను మిగులు మొత్తం కనిపిస్తేనే.. దాన్ని రుణం తీర్చేందుకు వినియోగించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో.. 50శాతం మంది దేశీయ విమానాల్లోనే
మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ప్రస్తుతం విదేశీ విమానయాన సంస్థల విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఈ పరిస్థితి శరవేగంగా మారుతోందని, 2027-28 కల్లా మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 50% మంది దేశీయ సంస్థల విమానాల్లో ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. -
ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా.. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘ఆత్మనిర్భర్’ విధానానికి అనుగుణంగా, 4జీ సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది. -
పెద్ద షేర్లలో లాభాల స్వీకరణ
సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఎస్బీఐ, రిలయన్స్ వంటి షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో సోమవారం సూచీలు స్తబ్దుగా ముగిశాయి. కొన్ని ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, ఔషధ షేర్లు మాత్రం రాణించాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 83.52 వద్ద ముగిసింది. -
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో జీవనకాల గరిష్ఠానికి ఎంఎఫ్ల వాటా
ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్ల) వాటా జీవనకాల గరిష్ఠానికి చేరింది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో, ఆయా కంపెనీల్లో ఎంఎఫ్ల వాటా 8.92 శాతానికి చేరిందని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్నకు చెందిన ప్రైమ్ఇన్ఫోబేస్.కామ్ వెల్లడించింది. -
నరేశ్ గోయెల్కు మధ్యంతర బెయిలు
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్(75)కు వైద్య చికిత్స నిమిత్తం రెండు నెలల మధ్యంతర బెయిలును బాంబే హైకోర్టు సోమవారం మంజూరు చేసింది. -
అంతర్జాతీయ మొబైల్ నంబర్తోనూ యూపీఐ చెల్లింపులు: ఐసీఐసీఐ బ్యాంక్
భారత్లో ఉన్న ప్రవాసులు (ఎన్ఆర్ఐ), అంతర్జాతీయ మొబైల్ నంబర్లతో యూపీఐ సేవలను ఉపయోగించుకునే వీలు కల్పిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. -
సేవల రంగ వృద్ధి వేగవంతంగానే
దేశీయ సేవల రంగ వృద్ధి ఏప్రిల్లో కాస్త నెమ్మదించినప్పటికీ.. కొత్త వ్యాపారాలు, ఉత్పత్తిపరంగా మెరుగ్గానే ఉందని ఓ సర్వే వెల్లడించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ మార్చిలో 61.2 పాయింట్లుగా ఉండగా.. ఏప్రిల్లో 60.8 పాయింట్లకు దిగివచ్చింది. -
ఆంధ్ర, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో డ్రోన్లతో పురుగుమందులు, ఎరువుల పిచికారీ
30 లక్షల ఎకరాల సాగుభూముల్లో పురుగుమందులు, ఎరువుల పిచికారీకి ఇఫ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డ్రోన్ కంపెనీ డ్రోన్ డెస్టినేషన్ తెలిపింది. ఒప్పందం ప్రకారం ఎకరాకు రూ.400-800ను చొప్పున చెల్లిస్తారు. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు
ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తులు అందించే కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు అరుణాచలం వెల్లాయన్, నారాయణన్ వెల్లాయన్ నియమితులయ్యారు. -
జీఎస్టీఏటీ తొలి అధ్యక్షుడిగా మిశ్రా
జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (జీఎస్టీఏటీ)కు తొలి అధ్యక్షుడిగా జస్టిస్ (రిటైర్డ్) సంజయ్ కుమార్ మిశ్రాతో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే.. జీఎస్టీ సంబంధిత వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించనున్న జీఎస్టీఏటీ కార్యకలాపాలు ప్రారంభమైనట్లే లెక్క. -
ఫరూఖ్నగర్లో 48 ఎకరాలు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) హైదరాబాద్ సమీపంలో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఈ భూమిని తీసుకుంది. -
ఆఫ్లైన్లోనూ ఇ-రుపీ
ఇ-రుపీ లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని ఆఫ్లైన్ పద్ధతిలోనూ బదిలీ చేసేలా పనిచేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
మాస్చిప్ టెక్నాలజీస్ ఆదాయాల్లో వృద్ధి
సెమీకండక్టర్, సాఫ్ట్వేర్, సిస్టమ్ డిజైన్ సేవల సంస్థ మాస్చిప్ టెక్నాలజీస్ 2023-24 పూర్తి కాలానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.293.91 కోట్ల ఆదాయాన్ని, రూ.9.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
సంక్షిప్త వార్తలు(7)
సువెన్ లైఫ్సైన్సెస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి రూ.6.66 కోట్ల ఆదాయాన్ని, రూ.26.54 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం 8.21 కోట్లు, నష్టం రూ.27.64 కోట్లు ఉండటం గమనార్హం
తాజా వార్తలు (Latest News)
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!